breaking news
Sushma Singh
-
కొత్త సీఐసీగా సుష్మాసింగ్
న్యూఢిల్లీ: కొత్త ప్రధాన సమాచార కమిషనర్(సీఐసీ)గా సీనియర్ సమాచార కమిషనర్, మాజీ ఐఏఎస్ అధికారి సుష్మాసింగ్ బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత సీఐసీ దీపక్ సంధు పదవీకాలం త్వరలో ముగియనున్న నేపథ్యంలో తదుపరి సీఐసీగా సుష్మాసింగ్ ఎంపికయ్యారు. ప్రధానమంత్రి మన్మోహన్సింగ్, లోక్సభలో విపక్షనేత సుష్మాస్వరాజ్, కేంద్ర న్యాయశాఖ మంత్రి కపిల్ సిబల్లతో కూడిన ప్యానెల్ ఆమెను ఏకగ్రీవంగా ఎంపిక చేసింది. సంధు తర్వాత సీఐసీగా బాధ్యతలు చేపట్టనున్న రెండో మహిళ సుష్మాసింగ్ కావడం గమనార్హం. ఐఏఎస్ అధికారిగా 2009 మే 31న ఉద్యోగ విరమణ చేసిన సింగ్.. కేంద్ర సమాచార కమిషన్లో సమాచార కమిషర్గా 2009 సెప్టెంబర్ 23న నియమితులయ్యారు. జార్ఖండ్ కేడర్కు చెందిన ఆమె భారత ప్రభుత్వ కార్యదర్శిగా పనిచేశారు. -
కేంద్ర సమాచార చీఫ్ కమిషనర్గా సుష్మా సింగ్
కేంద్ర సమాచార చీఫ్ కమిషనర్ (సీఐసీ)గా సీనియర్ అధికారిణి సుష్మా సింగ్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నెలలో పదవీ విరమణ పొందనున్న దీపక్ సంధు స్థానంలో నియమితులయ్యారు. ప్రధాని మన్మోహన్ సింగ్, లోక్సభలో ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్, న్యాయ శాఖ మంత్రి కపిల్ సిబల్తో కూడిన ప్యానెల్ సుష్మా సింగ్ నియామకంపై ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. సంధు తర్వాత సీఐసీగా బాధ్యతలు చేపడుతున్న రెండో మహిళ సుష్మానే. ఐఏఎస్ అధికారిణిగా రిటైరయ్యాక 2009లో సమాచార కమిషనర్గా ఆమె నియమితురాలయ్యారు. కేంద్ర సమాచార కమిషన్లో అందరికంటే ఆమే సీనియర్.