breaking news
surat diamond merchant
-
జీఎస్టీ ఎఫెక్ట్: ఉద్యోగులకు బోనస్లు, గిఫ్ట్లు కట్
సాక్షి, ముంబై: ఉద్యోగులకు 400 అపార్ట్మెంట్లు, వెయ్యి కార్లు, బంగారు నగలు దీపావళి బహుమతి గా ప్రకటించి అందరి దృష్టిని ఆకర్షించిన సూరత్ వజ్రాల వ్యాపారి ఈ ఏడాది జీఎస్టీ షాక్ తగిలింది. అందుకే దీపావళి వచ్చిందంటే విలువైన బహుమతులతో ఉద్యోగులకు బంపర్ ఆఫర్లు ప్రకటించే ఆయన ఈసారి మిన్నకుండిపోయారు. అవును ‘బాస్ అంటే ఈయనే’ అనే రీతిలో సిబ్బందిపై కానుకల వర్షం కురిపించి అందరి ప్రశంసలు అందుకున్న సూరత్ వజ్రాల వ్యాపారి, హరే కృష్ణ ఎక్స్పోర్ట్స్ యజమాని సావ్జీ ధోలాకియా ఈ దీవపావళికి మాత్రం ఎలాంటి కానుకలు ఇవ్వకుండా అందరినీ ఆశ్చర్యపరిచారు. ఒకే దేశం-ఒకే పన్ను అంటూ బీజీపీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన జీఎస్టీ ఎఫెక్ట్ సూరత్ వజ్రాల వ్యాపారాలపై బాగా పడిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది చాలా మంది వ్యాపారులు ఇబ్బందుల్లోని నెట్టిందని చెబుతున్నారు. నల్లధనాన్ని నిరోధించే ప్రయత్నంలో ప్రభుత్వం చేపట్టిన చర్యలు డైమండ్ , ఆభరణాల చిన్న వ్యాపారస్తులను దెబ్బకొట్టిందని టాక్స్ నిపుణులు చెప్పారు. ఈ కారణంతోనే సావ్జీ ధోలాకియా ఎలాంటి కానుకలు ప్రకటించలేదని అంటున్నారు. నోట్ల రద్దు, అనంతరం తీసుకొచ్చి జీఎస్టీ చట్టం తమ వ్యాపారాన్ని బాగా దెబ్బతీసిందని సూరత్ డైమండ్ వ్యాపారులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా పూర్తిగా నగదు లావాదేవీలపైననే ఆధారపడి ఉండే డైమండ్ వ్యాపారాన్ని నగదుకొరత, డిజిటల్ లావాదేవీలు ప్రభావాన్ని చూపుతున్నాయని సూరత్ పెట్టుబడిదారుడు మస్రాని వ్యాఖ్యానించారు. సాధారణంగా ఒక్క సావ్జీ నేకాకుండా చాలామంది ఉద్యోగులు భారీ బహుమతులు, పండుగ బోనస్లు ఇవ్వడం ఆనవాయితీ అని కానీ.. ఈ దీపావళికి చాలామంది టాప్ డైమండ్ వ్యాపారులు కూడా అలా ఇవ్వలేకపోయారని వివరించారు. బంగారంపై 3 శాతం జిఎస్టీ, పీఎంఎల్ఏ నిబంధనలు ఈ సెక్టార్ను వ్యవస్థీకృతం చేసి, పారదర్శకతను తీసుకొచ్చినప్పటికీ, నిజమైన కొనుగోలుదారులకు, అమ్మకందారులతోపాటు మరికొంతమందికిఇబ్బందులను తెచ్చిపెట్టిందని మరో వ్యాపారి మణి పేర్కొన్నారు. కాగా ఏడాదికి రూ. 6వేల కోట్ల టర్నోవర్ ఉన్న సావ్జీ తన ఉద్యోగులు భారీ గిఫ్ట్లు, బోనస్లు ఆఫర్ల చేయడం తెలిసిందే. ముఖ్యంగా 2015లో 1200 మందికి నగలు, 491 ఫీయట్ పుంటో కార్లు, 200 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కానుకలుగా ఇచ్చారు. 2016లో 2 వేలమంది ఉద్యోగులకు డస్టన్ రడో గో, మారుతీ ఆల్టో కార్లు, నగలు కానుకగా ఇచ్చారు. అయితే వచ్చే ఏడాది దీపావళికి ఇద్దామనే ఆలోచనతోనే ఈసారి కానుకలను వాయిదావేసనంటూ ఈ అంచనాలను సావ్జీ తోసిపుచ్చడం విశేషం. -
ఉద్యోగులకు దీపావళి గిఫ్టుగా 400 ఫ్లాట్లు, 1200 కార్లు!
కష్టం విలువ తెలియడం కోసం తన కొడుకును నెల రోజుల పాటు సామాన్యుడిలా కష్టపడి పనిచేసి రావాలని బయటకు పంపేసిన సూరత్ కోటీశ్వరుడు గుర్తున్నాడు కదూ. మూడు జతల దుస్తులు, రూ. 7వేలు మాత్రమే ఇచ్చి, నెల రోజుల పాటు కష్టపడి సొంతంగా సంపాదించి బతకమని.. జీవితం విలువ నేర్పించడానికి పంపేసిన ఆ కోటీశ్వరుడిపేరు సావ్జీ ఢోలకియా. ఆయన ఇప్పుడు తన దగ్గర పనిచేసే ఉద్యోగులకు దీపావళి బహుమతిగా 400 ఫ్లాట్లు, 1200 కార్లు ఇచ్చాడు! హరేకృష్ణ ఎక్స్పోర్ట్స్ అనే పేరుతో వజ్రాల వ్యాపారం చేస్తున్న ఢోలకియా.. ఈ ఏడాది తన వ్యాపార స్వర్ణోత్సవం సందర్భంగా దీపావళి బోనస్ల కోసం రూ. 51 కోట్లు వెచ్చించారు. కంపెనీలో ఉత్తమ పనితీరు కనబరుస్తున్న 1,716 మందికి ఈ బహుమతులు అందించారు. ఈ ఒక్క సంవత్సరమే కాదు.. 2011 నుంచి ఇప్పటివరకు ప్రతియేటా ఇలాగే దీపావళి సందర్భంగా ఈ వజ్రాల వ్యాపారి చాలా ఘనంగానే బహుమతులు అందిస్తున్నాడు. గత సంవత్సరం ఈయన 491 కార్లు, 200 ఫ్లాట్లను ఉద్యోగులకు కానుకగా అందించాడు. అంతకుముందు సంవత్సరం కూడా 50 కోట్ల రూపాయల విలువైన బహుమతులు చదివించాడు. (కొడుక్కి వింత పరీక్ష పెట్టిన బిలియనీర్!) గుజరాత్లోని అమ్రేలీ జిల్లాలోగల దుఢాలా అనే కుగ్రామం నుంచి వచ్చిన ఢోలకియా.. తన మామ దగ్గర నుంచి కొంత అప్పు తీసుకుని చిన్నగా వ్యాపారం మొదలుపెట్టి, చివరకు వజ్రాల వ్యాపారంలో చాలా ఎత్తుకు ఎదిగాడు. రాత్రికి రాత్రే డబ్బు సంపాదించడం ఎవరికీ సాధ్యం కాదని, అలా వచ్చిన డబ్బు నిలవదని చెప్పడానికి, డబ్బు విలువ తెలియజెప్పడానికి తన కొడుకు ద్రావ్యను సొంతంగా బతకమని బయటకు పంపేశాడు.