-
గ్రామ పంచాయతీగా సున్నిపెంట
కర్నూలు(అర్బన్): రెవెన్యూ గ్రామంగా ఉన్న సున్నిపెంట ఇక గ్రామ పంచాయతీగా మారనుంది. మంగళవారం రాజధాని అమరావతిలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన హై లెవెల్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర పంచాయతీరాజ్, నీటి పారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీలు గోపాలక్రిష్ణ ద్వివేది, ఆదిత్యనాథ్ దాస్, పీఆర్ కమిషనర్ గిరిజాశంకర్, జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి కేఎల్ ప్రభాకర్రావు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ జె. హరిబాబుతో పాటు అటవీ శాఖ అధికారులు హాజరయ్యారు. ముందుగా నీటి పారుదల, అటవీ, పంచాయతీకి సంబంధించిన పలు అంశాలపై సమావేశంలో చర్చించారు. ముఖ్యంగా సున్నిపెంటను గ్రామ పంచాయతీగా గుర్తించేందుకు అడ్డంకిగా ఉన్న స్టేను ఎత్తివేసేందుకు నిర్ణయం తీసుకున్నారని జిల్లా పంచాయితీ అధికారి కేఎల్ ప్రభాకర్రావు చెప్పారు. అలాగే ప్రాజెక్టు పరిధిలో ప్రస్తుతం ఉన్న జనవాసాలు 1468 ఎకరాలకు మించకుండా రెవెన్యూ, అటవీ శాఖలకు చెందిన అధికారులు సంయుక్తంగా సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేసుకోవాలని సమావేశంలో నిర్ణయించారన్నారు. గ్రామ పంచాయతీ ఏర్పాటుకు సంబంధించి ఇంకా ఏవైనా సమస్యలు ఉంటే ప్రతిపాదనల రూపంలో పంపాలని జిల్లా కలెక్టర్ను కోరారన్నారు. త్వరలోనే సున్నిపెంటను గ్రామ పంచాయతీగా గుర్తిస్తూ ఉత్తర్వులు వెలువడే అవకాశాలు ఉన్నట్లు డీపీఓ తెలిపారు. నాడు వైఎస్ఆర్ ప్రకటించారు 2006 వ సంవత్సరంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి జీఓ నంబర్ 2 జారీ చేస్తూ సున్నిపెంటను గ్రామ పంచాయతీగా ప్రకటించారు. ఈ విషయాన్ని శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పాచక్రపాణిరెడ్డి కమిటీ ముందు పెట్టారు. రిజర్వ్ ఫారెస్ట్లో సున్నిపెంట గ్రామం ఉందని పంచాయతీగా మారిస్తే అటవీ శాఖ భూములు అన్యాక్రాంతమవుతాయని అభ్యంతరం తెలపగా అందుకు శిల్పా అటవీభూముల సరిహద్దుల వద్ద ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకునేందుకు రూ. 25 లక్షల నిధుల మంజూరుకు హామీ ఇచ్చారు. ఇందుకు అటవీ అధికారులు సమ్మతించడంతో గ్రామ పంచాయతీ ప్రకటనకు లైన్ క్లియర్ అయింది. ఈ విషయం తెలియగానే సున్నిపెంటలోని పార్టీ కార్యాలయలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు శిల్పాభువనేశ్వరరెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వట్టి వెంకటరెడ్డి , ముస్లిం మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఎంఏ రజాక్, మండల నాయకులు భరత్రెడ్డి, పార్టీ కార్యకర్తలు బాణ సంచాపేల్చి సంబరాలు చేసుకున్నారు. ఇచ్చిన హామీ నెరవేర్చా సున్నిపెంటను గ్రామపంచాయతీ చేయిస్తానని ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాన్ని నిలబెట్టుకున్నాను. ఇందు కోసం ముఖ్యమంత్రిని పలుమార్లు కలిశాను. ఎల్టకేలకు గ్రామ పంచాయతీ కావడంతో గ్రామవలంటీర్ల నియామకాలతో పాటు గ్రామ సచివాలయం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. స్థానికులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇక నుంచి సున్నిపెంట అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారిస్తా. భవిష్యత్లో నగర పంచాయతీగా మార్చేందుకు నా వంతు కృషి చేస్తా. – ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి -
వణికిస్తున్న జ్వరాలు
శ్రీశైలం ప్రాజెక్టు : సున్నిపెంట గ్రామంలో జ్వర పీడితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. ఆసుపత్రులలో ఎక్కడ చూసినా జ్వరం బారిన పడిన రోగులే కనిపిస్తున్నారు. మలేరియా, టైఫాయిడ్ జ్వరాలతో దాదాపుగా ప్రతి ఇంటిలో ఒకరు బాధపడుతున్నారు. ఫ్రభుత్వాసుపత్రులే కాకుండా ప్రైవేటు ఆసుపత్రులు కూడా కిటకిటలాడుతున్నాయి. ప్రభుత్వ వైద్యశాలలో, మలేరియా కార్యాలయంలో మలేరియా రక్త పరీక్షలు నిర్వహిస్తున్నారు. టైఫాయిడ్ నిర్థారణ కోసం జ్వర పీడితులు ప్రైవేటు ల్యాబోరేటరీలను ఆశ్రయించక తప్పడం లేదు. జిల్లా మలేరియా అధికారి ఆదేశాల మేరకు సున్నిపెంటలో రెండవ విడత డీడీటీ స్ప్రేయింగ్ను చేస్తున్నారు. మలేరియా అధికారిణి ఇ హుసేనమ్మ పర్యవేక్షణలో ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి జ్వరపీడితుల రక్తనమూనాలను సేకరించి పరీక్షలు చేస్తున్నారు. నిరుపేదలు టైఫాయిడ్ టెస్ట్ల కోసం ప్రైవేటు ల్యాబ్లను ఆశ్రయించలేక ఇబ్బందులు పడుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ జిల్లా సభ్యులు ఎన్ ఎస్ వకీల్ ఈ మేరకు టైఫాయిడ్ టెస్ట్లను కూడా ఉచితంగా ప్రభుత్వ వైద్యశాలలో చేయాలని, కాలనీలో వ్యాధులను నివారించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాలనీ అంతటా హెల్త్ ఇన్స్పెక్టర్ టి నాగరాజు, మలేరియా సర్వేలైన్ ఇన్స్పెక్టర్లు పి వీరన్న, నరసింహరావు, హెల్త్ అసిస్టెంట్లు బాలనరసయ్య రాములు నాయక్ తదితరులు ఇంటింటికీ వెళ్లి రక్త నమూనాలు సేకరిస్తున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అడవిమామిడిపల్లిలో అగ్నిప్రమాదం
Lok Sabha Election 2024: పోలింగ్ బూత్ గుర్తింపు...మొబైల్ నంబర్తో
మంటలు అంటుకొని రైతు మృతి
బాధిత జర్నలిస్టుకు ఆర్థికసాయం
కడియం ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి
రగులుతున్న క్యాంపస్లు!
మహిళలు వ్యాపారాల్లో రాణించాలి
అభివృద్ధే ప్రధాని మోదీ లక్ష్యం
కాంగ్రెస్ పార్టీలో చేరికలు
సీత్యతండాలో అగ్ని ప్రమాదం
తప్పక చదవండి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
Advertisement