breaking news
sundara
-
శవ రాజకీయాలకు చంద్రబాబు కేరాఫ్ అడ్రస్: సుందరరామశర్మ
సాక్షి, అమరావతి: ఏపీలో శవ రాజకీయాలు చేసే వ్యక్తి చంద్రబాబు అంటూ వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి సుందరరామ శర్మ దుయ్యబట్టారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ‘‘శవ రాజకీయాలు చేయడమే చంద్రబాబుకి తెలుసు. చంద్రబాబు లాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండడం మన దురదృష్టం. వ్యవస్థల మీద చంద్రబాబుకు గౌరవం లేదు. ఏ రోజైనా చంద్రబాబు బీసీలకు మంత్రి పదవులు ఇచ్చారా?’’ అని ప్రశ్నించారు. ‘‘కోర్టులను కూడా మేనేజ్ చేయొచ్చంటూ మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు. న్యాయ వ్యవస్థ గురించి ఇంత చులకనగా మాట్లాడతారా?. న్యాయ వ్యవస్థకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి. ఎన్టీఆర్ చివరి రోజుల్లో మీ గురించి చెప్పిన మాటలకు సమాధానం చెప్పే దమ్ముందా ’’ అంటూ చంద్రబాబుపై సుందరరామ శర్మ మండిపడ్డారు. లోకేష్ చేసేది పాదయాత్ర కాదు అదొక బూతుయాత్ర. లోకేష్ బూతులు నేర్చుకున్నాడు కానీ... తెలుగు నేర్చుకోలేదని ఆయన ఎద్దేవా చేశారు. చదవండి: చంద్రబాబు ఓ పిరికిపంద: పేర్ని నాని -
శవరాజకీయాలు చేయడమే చంద్రబాబుకి తెలుసు: సుందరరామ శర్మ
-
సుందర సత్సంగం సభ్యుల రక్తదానం
శ్రీకాకుళం కల్చరల్: నగరంలో కొన్నేళ్లుగా వేద విద్య, పూజాదికాలు నేర్పుతున్న గురువుకు నేటి సమాజానికి ఉపయోగపడే విధంగా గురుదక్షిణగా పురుపౌర్ణమిని పురస్కరించుకొని ఆదివారం రెడ్క్రాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. స్థానిక వైశ్యాబ్యాంకు కాలనీలోని సుందర సత్సంగం ఆధ్వర్యంలో 170 మంది శిషు్యలు రక్తదానం చేశారు. ఇందులో మహిళలే అధికంగా ఉన్నారు. మొదటిగా గురువైన శ్రీపెరుంబుదూరు సూరిబాబు రక్తదానం చేశారు. ఎనిమిదేళ్లుగా శిషు్యలు గురుదక్షిణగా రక్తదానం చేస్తున్నారు. శిబిరాన్ని కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మీనసింహం సందర్శించి మంచి కార్యక్రమం చేస్తున్నారని అభినందించారు. ఈ సందర్భ ంగా సూరిబాబు మాట్లాడుతూ మానవసేవే మాధవ సేవగా తమ శిషు్యలు చేపట్టిన కార్యక్రమం ఎంతో గొప్పదన్నారు. ఎక్కువగా మహిళలు ముందుకు వచ్చి రక్తదానం చేయడం ఆనందకరమైన విషయమని చెప్పారు. సామాజిక సేవే పరమావధిగా శిషు్యలు ఎదగాలని కోరారు. అంతకుముందు సూరిబాబుకు శిషు్యలు పాద పూజ చేశారు. కార్యక్రమంలో రెడ్క్రాస్ చైర్మన్ పి.జగన్మోçßæనరావు, వైద్యాధికారి సత్యవతి, సుందర సత్సంగం సభ్యులు కేవీ అప్పలనాయుడు, కె.లక్షీ్మనారాయణ, పి.అప్పలరాజు, ప్రసాద్, డాక్టర్ రవికుమార్, విజయలక్ష్మీ, యామిని, పి.చైతన్యకుమార్, డాక్టర్ ఎన్.అప్పన్న, నిక్కు హరిసత్యనారాయణ, అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.