-
ఆర్కియన్ కెమ్ ఐపీవో సక్సెస్
న్యూఢిల్లీ: స్పెషాలిటీ మెరైన్ రసాయనాల తయారీ కంపెనీ ఆర్కియన్ కెమికల్స్ పబ్లిక్ ఇష్యూ విజయవంతమైంది. రూ. 386–407 ధరల శ్రేణిలో చేపట్టిన ఇష్యూకి 32 రెట్లు అధిక స్పందన లభించింది. కంపెనీ 1.99 కోట్లకుపైగా షేర్లను విక్రయానికి ఉంచగా.. 64.31 కోట్లకుపైగా షేర్ల కోసం బిడ్స్ దాఖలయ్యాయి. అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల నుంచి 49 రెట్లు, సంపన్న వర్గాల నుంచి 15 రెట్లు అధికంగా బిడ్స్ లభించగా.. రిటైల్ ఇన్వెస్టర్లు సైతం 10 రెట్లు అధికంగా దరఖాస్తు చేశారు. 11న ముగిసిన ఇష్యూ ద్వారా రూ. 1,462 కోట్లకుపైగా సమకూర్చుకుంది. సోమవారం యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 658 కోట్లు సమీకరించిన విషయం విదితమే. ఐపీవోలో భాగంగా కంపెనీ రూ. 805 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 1.61 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ఇన్వెస్టర్లు విక్రయించారు. తాజా ఈక్విటీ నిధులను కంపెనీ జారీ ఎన్సీడీల చెల్లింపునకు వినియోగించనుంది. కంపెనీ ప్రధానంగా బ్రోమైన్, ఇండస్ట్రియల్ సాల్ట్, పొటాష్ సల్ఫేట్ తయారీతోపాటు, ఎగుమతులను సైతం చేపడుతోంది. -
డీసీఎక్స్ సిస్టమ్స్ ఐపీవో అదిరింది
న్యూఢిల్లీ: కేబుళ్లు, వైర్ హార్నెస్ అసెంబ్లీల తయారీ కంపెనీ డీసీఎక్స్ సిస్టమ్స్ పబ్లిక్ ఇష్యూ విజయవంతమైంది. ఇష్యూ చివరి రోజు బుధవారానికల్లా దాదాపు 70 రెట్లు అధికంగా సబ్స్క్రయిబ్ అయ్యింది. ఇష్యూలో భాగంగా 1.45 కోట్ల షేర్లను ఆఫర్ చేయగా.. 101.27 కోట్ల షేర్లకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. వెరసి షేరుకి రూ.197-207 ధరలో చేపట్టిన ఇష్యూ ద్వారా రూ.500 కోట్లు సమీకరించింది. రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి 61.8 రెట్ల అధిక స్పందన లభించింది. -
1.46 రెట్లు ఓవర్ సబ్స్క్రైబయిన ఎమ్ఎస్టీసీ ఐపీఓ
న్యూఢిల్లీ: ఎమ్ఎస్టీసీ కంపెనీ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్(ఐపీఓ) 1.46 రెట్లు ఓవర్ సబ్స్క్రైబయింది. ఈ ఐపీఓలో భాగంగా ఈ కంపెనీ 1.76 కోట్ల షేర్లను జారీ చేస్తోంది. దీనికి గాను 2.58 కోట్ల షేర్లకు బిడ్లు వచ్చాయి. ఈ నెల 13న ప్రారంభమైన ఈ ఐపీఓ గత శుక్రవారమే ముగియాల్సి ఉంది. స్పందన పెద్దగా లేకపోవడంతో ఈ ఐపీఓను బుధవారం వరకూ పొడిగించారు. ప్రైస్బ్యాండ్ను కూడా రూ.121–128 నుంచి రూ.120–128కు సవరించారు. అయినా అంతంత మాత్రం స్పందన మాత్రమే లభించింది. ఈ కంపెనీ షేర్లు ఈ నెల 29న తేదీన స్టాక్ మార్కెట్లో లిస్టయ్యే అవకాశాలున్నాయి. ట్రేడింగ్ కంపెనీగా 1964లో ఏర్పాటైన ఈ కంపెనీ ప్రస్తుతం మూడు విభాగాల్లో–ఈ కామర్స్, ట్రేడింగ్, రీసైక్లింగ్ల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. -
చిన్మయి మరోసారి సంచలన ఆరోపణలు
మీటూ అంటూ ఉద్యమించిన ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద ఇపుడు మరో పోరాటానికి సిద్ధమయ్యారు. తమిళ డబ్బింగ్ యూనియన్ నుంచి తొలగించిన రెండు వారాల అనంతరం ఆమె తన అధికారిక యూట్యూబ్ చానల్లో 19నిమిషాల వీడియోను పోస్ట్ చేశారు. అలాగే ట్విటర్లో వరుస ట్విట్లతో అనేక ప్రశ్నల్ని, విమర్శల్ని లేవనెత్తారు. ముఖ్యంగా డబ్బింగ్ యూనియన్ అక్రమాలు, డబ్బింగ్ ఫీజులో 10శాతం వసూలు తదితర విషయాలపై ఆమె స్పందించారు. ఈ వ్యవహారంపై స్పందిస్తూ పలు సంచలన విషయాలను ఆమె వెల్లడించారు. ఫీజు చెల్లించినా తప్పుడు ఆరోపణలతో తనను అక్రమంగా తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళ డబ్బింగ్ యూనియన్కు సంబంధించిన లైఫ్ మెంబర్షిప్ (జీవితకాల సభ్యత్వం) చెల్లించినట్టు వెల్లడించారు. 2016, ఫిబ్రవరి 11న బ్యాంక్ ద్వారా ఈ చెల్లింపు చేశానని తెలిపారు. అయితే ఆ సమయంలో యూనియన్వాళ్లు తనకు రసీదును ఇవ్వలేదని చెప్పారు. రిసీట్ చూపించని కారణంగా డబ్బింగ్ యూనియన్ గత ఎన్నికల్లో ఓటు వేసే అవకాశాన్ని నిరాకరించారని తెలిపారు. అయితే అప్పట్లో ఈ విషయాన్ని తాను పెద్దగా పట్టించకోలేదన్నారు. తాను లైఫ్మెంబర్షిప్ చెల్లించినా, తనను యూనియన్ సభ్యురాలిగా తొలగించడంపైనా, అసలు ఎలాంటి నోటీసులు, హెచ్చరికలు లేకుండా తన సభ్యత్వాన్ని ఎలా రద్దు చేస్తారని ఆమె మరోసారి ప్రశ్నించారు. ఈ మేరకు ట్విట్టర్లో బ్యాంకు స్టేట్మెంట్ను పోస్ట్ చేశారు. కేవలం రాధా రవి వేధింపులకు గురైన కొంతమంది బాధిత మహిళలకు మద్దతుగా ఉన్నందుకు ప్రతీకారంగానే ఇదంతా జరిగిందని ఆరోపించారు. అలాగే తమిళ డబ్బింగ్ యూనియన్కు సంబంధించి తనతో కలిసి మొత్తం 97మంది సభ్యులు గత రెండేళ్లుగా ఎలాంటి సభ్యత్వ రుసుమును చెల్లించలేదని యూనియన్ చెబుతోందన్నారు. యూనియన్కు వ్యతిరేకంగా మాట్లాడిన వారి సభ్యత్వాన్ని తొలగించారని, అయితే వారు కోర్టుద్వారా కొంతమంది సభ్యత్వాన్ని తిరిగి తెచ్చుకున్నట్టు వెల్లడించారు. అంతేకాదు డబ్బింగ్ యూనియన్పై భూమా సుబ్బారావు అనే ఆర్టిస్టు చేస్తున్న పోరాటాన్ని కూడా ఆమె ప్రస్తావించారు. దాదాపు 16 ఫిర్యాదులు నమోదైనట్టు తెలిపారు. దీంతోపాటు గత నెలలో నమోదైన ఎఫ్ఐఆర్, చార్జిషీటు వివరాలను కూడా చిన్మయి ట్వీట్ చేశారు. తమిళ సినీపరిశ్రమతో పాటు డబ్బింగ్ యూనియన్లో లైంగిక వేధింపులపై గాయని చిన్మయి శ్రీపాద ఆరోపణలు చేశారు. ముఖ్యంగా గీత రచయిత వైరముత్తుతో పాటు డబ్బింగ్ యూనియన్ అధ్యక్షుడు రాధారవిలపై పలు ఆరోపణలను వెలుగులోకి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో రెండు సంవత్సరాలుగా సభ్యత్వ రుసుము చెల్లించలేదంటూ యూనియన్ నుంచి తొలగించినట్టు అసోసియేషన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. Here is the video. The statement that I didn’t pay the dubbing union subscription fee is false. 👇🏼https://t.co/1TVsdgeasM — Chinmayi Sripaada (@Chinmayi) November 23, 2018 These are the list of writ petitions/ cases filed against the Dubbing Union. Plus there is an FIR and a chargesheet filed as well a few months ago. pic.twitter.com/HurRFhd4zo — Chinmayi Sripaada (@Chinmayi) November 24, 2018 -
షాల్బీ ఐపీవో: మొదటిరోజు 4శాతం
సాక్షి, ముంబై: అహ్మదాబాద్ కేంద్రంగా సేవలు అందిస్తున్న షాల్బీ హాస్సిటల్ పబ్లిక్ ఇష్యూ నేడు(డిసెంబర్ 5)న ప్రారంభమైంది. మూడు రోజులు కొనసాగనున్న ఈ ఐపీవోలో 4శాతం సబ్స్క్రిప్షన్ను సాధించింది. డిసెంబర్ 7న ముగియనున్న ఇష్యూ ద్వారా కంపెనీ దాదాపు రూ. 505 కోట్లను సమీకరించాలని భావిస్తోంది. ఇష్యూలో భాగంగా సోమవారం యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 150 కోట్లను సమీకరించింది. యాంకర్ ఇన్వెస్టర్లలో గోల్డ్మన్ శాక్స్, సిటీగ్రూప్, యాక్సిస్ ఎంఎఫ్ తదితర సంస్థలున్నాయి. ఇష్యూకి కంపెనీ ఇప్పటికే రూ. 245-248 ధరల శ్రేణిని ప్రకటించింది. ఆఫర్లో భాగంగా సంస్థ రూ. 480 కోట్ల విలువైన షేర్లను తాజాగా జారీ చేయనుంది. వీటితోపాటు ప్రమోటర్ విక్రమ్ షా రూ. 25 కోట్ల విలువైన షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. మధ్యాహ్నానికి 1,45,21,686 షేర్లకు గాను 5,80,320 షేర్లు బిడ్లు పొందింది. ఈ రంగం సంవత్సరానికి 17-18 శాతం పెరుగుతోంది. తాము గత మూడు, నాలుగు సంవత్సరాల్లో మా విస్తరణ ప్రణాళికలను సాధించగలిగామని షాల్బీ సీఈవో రవి భండారీ పేర్కొన్నారు. ఆర్ధిక కొలమానాలు, కార్యాచరణ పారామితుల నేపథ్యంలో తాము గణనీయమ వృద్ధినా సాధిస్తామనే ధీమావ్యక్తం చేశారు. కాగా ఐపీవో నిధులను రుణాల చెల్లింపు, సాధారణ కార్పొరేట్ కార్యకలాపాలకు వెచ్చించనున్నట్లు షాల్బీ ప్రాస్పెక్టస్లో పేర్కొంది. సంస్థకు రూ. 320 కోట్లమేర రుణభారముంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
విశ్వసనీయతే విజయానికి మెట్టు
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- ‘గంట’కు రూ.100.!
- రియల్ ఎస్టేట్ వ్యాపారిని చితకబాదిన నటి రాధ
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
Advertisement