breaking news
Sub committee meeting
-
రైతు భరోసా వారికి మాత్రమేనా?
-
ప్రాజెక్టుల అప్పగింతపై హామీ ఇవ్వలేం..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఒక్క పెద్దవాగు మినహా ఇతర సాగునీటి ప్రాజెక్టుల అప్పగింతపై ఎలాంటి హామీ ఇవ్వలేమని గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ)కి తెలంగాణ నీటిపారుదల శాఖ మరోసారి స్పష్టం చేసింది. ప్రాజెక్టుల డీపీఆర్లు, ప్లాంట్లు, యంత్రాలు, పరికరాలు, కార్యాలయాలు, ఫర్నిచర్, వాహనాలు, మంజూరైన పోస్టులు, ఇతర రికార్డులను బోర్డులకు అప్పగించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ఆదేశాల్లేవని పేర్కొంది. తెలంగాణలోని రెండు, ఏపీలోని రెండు నీటి విడుదల పాయింట్లను బోర్డుల చేతికి అప్పగించే అంశంపై గోదావరి బోర్డు సబ్ కమిటీ బుధవారం జలసౌధలో సమావేశమై చర్చించింది. ఈ సందర్భంగా తెలంగాణ అధికారులు రాష్ట్ర వాదనను వినిపించారు. దేవాదుల పథకానికి సంబంధించిన ఇన్టెక్ పంపుహౌజ్ వద్ద గోదావరి బోర్డు జరిపిన క్షేత్రస్థాయి పర్యటనలో సబ్కమిటీని దూరంగా ఉంచిన నేపథ్యంలో.. ఆ ప్రాజెక్టు అప్పగింతకు సంబంధించిన నివేదికను తెలంగాణ అధికారులు వ్యతిరేకించారు. గోదావరిపై రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టులేవీ లేనందున.. ప్రాజెక్టుల వద్ద కేంద్ర బలగాల(సీఐఎస్ఎఫ్)ను మోహరించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. దానివల్ల రాష్ట్ర ఖజానాపై అనవసర భారం పడుతుందని వివరించారు. ‘‘గోదావరి ట్రిబ్యునల్ తీర్పులోని క్లాజ్–4 ప్రకారం.. తమ వాటాలోని ఏదైన భాగాన్ని ఇతర బేసిన్లకు బదిలీ చేసుకునే స్వేచ్ఛ రాష్ట్రాలకు ఉంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, దేవాదుల పథకాలు ఉమ్మడి రాష్ట్రంలో కట్టినవే. గోదావరి నీటిని కృష్ణాబేసిన్ ప్రాంతాలకు తరలించడంపై అప్పట్లో ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరాలు లేవు. రాష్ట్ర విభజన అనంతరం ఏపీ లేవనెత్తుతున్న అభ్యంతరాలు తెలంగాణకు ఏమాత్రం ఆమోదయోగ్యం కావు. గోదావరి ట్రిబ్యునల్ తీర్పుకు సైతం అది వ్యతిరేకం’’ అని వివరించారు. ఇక ప్రాజెక్టుల అప్పగింతపై గోదావరి బోర్డు రూపొందించిన నివేదికపై అధ్యయనం కోసం కొంత సమయం కావాలని రాష్ట్ర అధికారులు కోరగా.. ఇందుకు బోర్డు చైర్మన్ సానుకూలంగా స్పందించారు. అప్పగింత నివేదికపై చర్చను తదుపరి సమావేశానికి వాయిదా వేశారు. సమావేశంలో తెలంగాణ తరఫున సీఎం ఓఎస్డీ శ్రీధర్రావు దేశ్పాండే, ఇంటర్స్టేట్ విభాగం ఎస్ఈ కోటేశ్వరరావు, ఈఈ సుబ్రమణ్య ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ఇక బోర్డుల వంతు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి బేసిన్లోని ప్రాజెక్టుల పరిధిపై సబ్కమిటీ స్థాయి భేటీలో ఏమీ తేలలేదు. బోర్డు పరిధిలో ఉండాల్సిన ప్రాజెక్టులపై ఒక్కొక్కరిది ఒక్కో అభిప్రాయం ఉంది. దీంతో తదుపరి నిర్ణయాలు పూర్తిస్థాయి బోర్డుల్లోనే తీసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సోమవారం జరిగే గోదావరి బోర్డు, మంగళవారం జరిగే కృష్ణా బోర్డు భేటీలు కీలకంగా మారాయి. ప్రాజెక్టుల అంశంతో పాటు సిబ్బంది నియామకం, నిధుల చెల్లింపు అం శాలపై వరుసగా జరగనున్న భేటీల్లోనే స్పష్టత రా నుంది. ఇక్కడ తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగానే అక్టోబర్ 14 నుంచి గెజిట్ అమలు జరగనుంది. గెజిట్ అమలుపై చర్చించేందుకు ఆదివారం ఉదయం జలసౌధలో గోదావరి బోర్డు సభ్య కార్యదర్శి బీపీ పాండే అధ్యక్షతన, మధ్యాహ్నం కృష్ణా బోర్డు తరఫున రవికుమార్ పిళ్లై అధ్యక్షతన భేటీలు జరగ్గా, తెలంగాణ తరఫున సీనియర్ ఇంజనీర్లు సుబ్రహ్మణ్య ప్రసాద్, విజయ్కుమార్, శ్రీధర్ తదితరులు హాజరయ్యారు. ఒక్కో భేటీ సుమారు మూడు గంటలకుపైగా జరగ్గా, బోర్డు అధీనంలో ఉండాల్సిన ప్రాజెక్టులు, సిబ్బంది, ఇతర రాష్ట్రాల అభ్యంతరాలు, బోర్డు అభిప్రాయాలు, నిధుల చెల్లింపు తదితర అంశాలపై చర్చలు జరిగాయి. గోదావరి ఒక్కటే.. మిగతా వాటికి ఒప్పుకోం.. ఇక గోదావరి బోర్డు భేటీలో ప్రధానంగా ప్రాజెక్టుల పరిధిపై చర్చ జరిగింది. తెలంగాణ ముందు నుంచి చెబుతున్నట్లుగా రెండు రాష్ట్రాలకు ఉమ్మడిగా ఉన్న పెద్దవాగును మాత్రమే బోర్డు పరిధిలో ఉంచాలని కోరింది. అయితే ఏపీ మాత్రం శ్రీరాంసాగర్ నుంచి సీతమ్మసాగర్ బ్యారేజీ వరకు ఉన్న అన్ని ప్రాజెక్టులను బోర్డు పరిధిలోనే ఉంచాలని విన్నవించింది. దీనికి తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై పూర్తిస్థాయి భేటీలో చర్చిద్దామంటూ బోర్డు సర్దిచెప్పింది. ఇక పెద్దవాగు కింద 80% ఆయకట్టు ఏపీ పరిధిలో ఉన్నందున దాని నిర్వహణకయ్యే వ్యయంలో 80% ఏపీనే భరించాలని కోరగా, దీనికి సానుకూలత లభించినట్లు తెలిసింది. మిగతా నిధు లు, సిబ్బంది, వాటికిచ్చే ప్రత్యేక ప్రోత్సాహకాలపై సోమవారం జరిగే బోర్డు భేటీలో స్పష్టత రానుంది. విద్యుదుత్పత్తి కేంద్రాలపై తెలంగాణ అభ్యంతరం కృష్ణా బేసిన్లో జూరాల నుంచి పులిచింతల వరకు ఉన్న అన్ని ప్రాజెక్టులను బోర్డు పరిధిలో ఉంచాలన్న ప్రతిపాదనలపై ఇరురాష్ట్రాల నుంచి అభ్యంతరాలు వచ్చినట్లు తెలుస్తోంది. శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రం, సాగర్, పులిచింతల విద్యుత్కేంద్రాలు బోర్డుల పరిధిలో అక్కర్లే దని తెలంగాణ చెప్పినట్లు సమాచారం. జూరాల ప్రాజెక్టును సైతం బోర్డు పరిధిలోకి తేవడాన్ని తెలంగాణ తప్పుపట్టింది. శ్రీశైలం మీద ఆధార పడి ఉండే కల్వకుర్తి, నాగార్జునసాగర్ హెడ్ రెగ్యులేటర్, ఎడమ కాల్వ హెడ్రెగ్యులేటర్, సాగర్ పరిధిలోని వరద కాల్వ, ఆర్డీఎస్, దాని పరిధిలోని తుమ్మిళ్ల, సిద్ధనాపూర్ కాల్వ, ఆర్డీఎస్ హెడ్రెగ్యులేటర్లనే బోర్డు ఆధీనంలో ఉంచేందుకు సంసిద్ధత తెలిపినట్లు సమాచారం. ఇక ఏపీ బనకచర్లతోపాటు దానికింద ఉన్న ఔట్లెట్లు మినహా శ్రీశైలం పరిధిలోని హెచ్ఎన్ఎస్ఎస్, ముచ్చుమర్రి, హెడ్ రెగ్యులేటర్లు, పవర్హౌస్, పోతిరెడ్డిపాడు, సాగర్ కింది కుడి కాల్వ, పులిచింతలను బోర్డు పరిధిలో ఉంచేందుకు సానుకూలత వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే ఏపీ అధికారులు తెలంగాణ పవర్హౌస్లు తీసుకోవాల్సిందేనని గట్టిగా పట్టు బట్టినట్లు తెలిసింది. ప్రాజెక్టులపై ఒక్కో రాష్ట్రానిది ఒక్కో అభిప్రాయం కావడంతో బోర్డుల భేటీల్లో ఖరారు చేయాలని నిర్ణయించారు. -
నేడు కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డు సబ్కమిటీల సమావేశం
-
సంస్ధలపై సమీక్ష చేయనున్న కేబినెట్ సబ్కమిటీ
-
ముగిసిన సబ్ కమిటీ భేటీ
హైదరాబాద్ : ఏపీ సచివాలయంలో శనివారం ఆర్థికమంత్రి యనమల అధ్యక్షతన సమావేశమైన సబ్ కమిటీ భేటీ ముగిసింది. అనంతరం మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. భేటీలో కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై చర్చ జరిగినట్లు వివరించారు.1994 కు ముందు కాంట్రాక్ట్ ఉద్యోగులుగా చేరినవారిని క్రమబద్ధీకరించే ఆలోచన చేస్తున్నామని మంత్రి చెప్పారు. అలాగే ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పెంచుతామని, వారికి గౌరవప్రదమైన జీతం ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని గంటా వివరించారు. తిరిగి ఈ నెల 30వ తేదీన మరోసారి సమావేశం అవుతామని చెప్పారు.