breaking news
Steve Ballmer
-
పనిచేయకుండా రూ.830 కోట్ల సంపాదిస్తున్నాడు - ఎలా అంటే?
'కష్టే ఫలి' అన్నారు పెద్దలు.. కష్టపడకుండానే ఫలితం వచ్చేస్తే..! ఈ మాటలు వినటానికి వింపుగా ఉంటాయి, కానీ కొందరి జీవితంలోనే ఇలాంటి అద్భుతాలు జరుగుతాయి. అలాంటి కోవకు చెందిన వారిలో ఒకరు ప్రపంచ కుబేరులలో ఒకరైన మైక్రోసాఫ్ట్ మాజీ సీఈఓ 'స్టీవ్ బాల్మెర్' (Steve Ballmer). ఇంతకీ ఈయన కష్టపడకుండా ఎలా సంపాదించాడు, దాని వెనుక ఉన్న అసలు విషయం ఏమిటనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మైక్రోసాఫ్ట్లో అతిపెద్ద వాటాదారు అయిన బాల్మెర్ కంపెనీలో దాదాపు 4 శాతం వాటాను కలిగి ఉన్నారు. ఇది దాదాపు 333.2 మిలియన్ షేర్లకు సమానమని సీఎన్ఎన్ నివేదించింది. ఈ వాటా విలువ ఇప్పుడు ఏకంగా 130 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఒక్క ఈ ఏడాది మాత్రమే ఆయన సంపద 44 బిలియన్ డాలర్లు పెరిగినట్లు సమాచారం. ఈ ఏడాది మైక్రోసాఫ్ట్ షేర్ ధర ఏకంగా 56 శాతం పెరగడంతో బార్మర్ సంపాదన కూడా పెరిగింది. మొత్తానికి స్టీవ్ బాల్మెర్ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ నుంచి వార్షిక డివిడెండ్ చెల్లింపులలో 1 బిలియన్లను అందుకోబోతున్నారు. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం దీని విలువ ఏకంగా రూ. 830 కోట్లకంటే ఎక్కువ. ఇదీ చదవండి: ఇషితా సల్గావ్కర్ ఎవరు.. అంబానీతో సంబంధం ఏంటి? 1980లో 30వ ఉద్యోగిగా చేరిన స్టీవ్ బాల్మెర్ అతి తక్కువ కాలంలోనే గణనీయమైన వాటాను సంపాదించాడు. అంతే కాకుండా 2000లో మైక్రోసాఫ్ట్ సీఈఓగా ఎంపికై 2014లో పదవీవిరమణ చేశాడు. వాటా యాజమాన్యం కారణంగా, స్టీవ్ బాల్మెర్ ప్రపంచ ధనవంతుల జాబితాలో నాల్గవ స్థానంలో చేరటానికి అవకాశం ఉందని తెలుస్తోంది. -
బిల్ గేట్స్ తో విడిపోవడానికి కారణం అదే
హార్డ్ వేర్ రంగంలోకి ప్రవేశించాలని తాను సూచించిన ఆలోచన కారణంగానే మైక్రోసాఫ్ట్ సహవ్యవస్ధాపకుడు బిల్ గేట్స్ తో సహచర్యాన్ని వదులుకోవాల్సివచ్చిందని మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో స్టీవ్ బాల్మర్ వెల్లడించారు. బ్లూమ్ బర్గ్ టెలివిజన్ కు ఇచ్చిన ఓ ఇంటర్వూలో ఆయన మనసు విప్పి మాట్లాడారు. తన ఆలోచనే అమల్లోకి వచ్చి ఉంటే ఇప్పటికి కొన్ని ఏళ్ల క్రితమే మొబైల్ మార్కెట్లోకి మైక్రోసాఫ్ట్ ప్రవేశించి ఉండేదని అన్నారు. మొబైల్ మార్కెట్లోకి అడుగుపెట్టాలనే ఆలోచనను బోర్డు సభ్యులకు చెప్పినప్పుడు గేట్స్ తో పాటు ఇతరులెవ్వరూ అందుకు అంగీకరించలేదని తెలిపారు. ఆ తర్వాత సొంతంగా మొబైల్స్, ట్యాబ్లెట్ల తయారీపై తలెత్తిన మనస్పర్దల కారణంగానే మైక్రోసాఫ్ట్ నుంచి తాను తప్పుకున్నట్లు చెప్పారు. 2012లో ట్యాబ్లెట్ల మార్కెట్లోకి ప్రవేశించిన మైక్రోసాఫ్ట్ ఘోరంగా విఫలం చెందిందని అన్నారు. దాదాపు 900 మిలియన్ల డాలర్లను హార్డ్ వేర్ మార్కెట్ పై మైక్రోసాఫ్ట్ వెచ్చించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఎన్బీఏ లాస్ ఏంజిల్స్ క్లిప్పర్స్ కంపెనీని రన్ చేస్తున్న ఆయన హార్డ్ వేర్ మార్కెట్లో నాలుగు బిలియన్ డాలర్ల లాభాలను ఆర్జించినట్లు పేర్కొన్నారు. -
ఏడాదికి రూ.112 కోట్లు!
న్యూయార్క్: అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈఓగా పగ్గాలు చేపట్టిన తెలుగు తేజం సత్య నాదెళ్ల... అదిరిపోయే వేతన ప్యాకేజీ అందుకోనున్నారు. జీతం, బోనస్, స్టాక్ ఆప్షన్స్ ఇతరత్రా ప్రోత్సాహకాలన్నీ కలిపితే ఏడాదికి ఆయనకు 1.8 కోట్ల డాలర్లు(దాదాపు రూ.112 కోట్లు) లభించనున్నాయి. క్రికెట్ అంటే అమితంగా ఇష్టపడే సారథి సత్యతో మైక్రోసాఫ్ట్ కుదుర్చుకున్న కొత్త ఉద్యోగ ఒప్పందం ప్రకారం... జీతం ఏడాదికి 12 లక్షల డాలర్లు(రూ.7.5 కోట్లు) కావడం గమనార్హం. కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్(ఈఐపీ) ప్రకారం నాదెళ్లకు ప్యాకేజీని నిర్ణయించారు. 1992లో మైక్రోసాఫ్ట్లో ఉద్యోగిగా చేరిన 47 ఏళ్ల సత్య... సర్వర్ అండ్ టూల్స్, క్లౌడ్ అండ్ ఎంటర్ప్రైజ్, ఆన్లైన్ సర్వీసెస్, అడ్వర్టైజింగ్ ప్లాట్ఫామ్ విభాగాల్లో బాధ్యతలను నిర్వర్తించారు. 1.32 కోట్ల డాలర్ల షేర్లు... వార్షిక ఈఐపీలో భాగంగా 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి 1.32 కోట్ల డాలర్ల విలువైన షేర్లు సత్య అందుకోనున్నారు. ఆర్థిక సంవత్సరాన్ని జూలై 1 నుంచి జూన్ 30గా లెక్కిస్తారు. 2014, 2015 సంవత్సరాల్లో సీఈఓగా అందుకునే వార్షిక వేతనానికి తోడు 0-300 శాతం వరకూ నగదు ప్రోత్సాహకం(అవార్డు)ను కూడా సత్యకు ఇస్తున్నట్లు ఆఫర్ లేఖలో మైక్రోసాఫ్ట్ పేర్కొంది. దీన్ని పనితీరు ఆధారంగా కంపెనీ బోర్డు నిర్ణయిస్తుంది. గరిష్టంగా చూస్తే ఈ మొత్తం 36 లక్షల డాలర్లుగా ఉండొచ్చు. మొత్తంమీద ప్యాకేజీ 1.8 కోట్ల డాలర్లగా లెక్కతేలుతోంది. సత్యకు ఆఫర్ చేసిన వేతన ప్యాకేజీ వివరాలను కంపెనీ అమెరికా స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ ఎస్ఈసీకి కూడా తెలియజేసింది. సత్య సారథ్యంలో మైక్రోసాఫ్ట్ దీర్ఘకాలిక పనితీరు ఆధారంగా ఆయనకు లాంగ్టర్మ్ పర్ఫార్మెన్స్ స్టాక్ అవార్డ్స్ కూడా లభించనున్నాయి. 39 ఏళ్ల కంపెనీ చరిత్రలో బిల్గేట్స్, స్టీవ్ బామర్ల తర్వాత మూడో సీఈఓగా బాధ్యతలు స్వీకచించిన సత్య... 2013 ఆర్థిక సంవత్సరంలో 6.75 లక్షల డాలర్ల జీతాన్ని అందుకున్నారు. ఇక 16 లక్షల డాలర్ల విలువైన నగదు బోనస్ లభించినట్లు సమాచారం. స్వాగతించిన అమెరికా మీడియా.. మైక్రోసాఫ్ట్ సీఈఓగా సత్య నాదెళ్ల నియామకాన్ని అమెరికా మీడియా మొత్తం స్వాగతించింది. ఈ టెక్నోక్రాట్కు మున్ముందు ఎన్నో సవాళ్లు ఎదురుచూస్తున్నాయని కూడా తమ కథనాల్లో గుర్తుచేసాయి. కార్పొరేట్ కంప్యూటర్ సర్వర్లు, ఇతర బ్యాకెండ్ టెక్నాలజీ విభాగానికి నేతృత్వం వహిస్తున్న ఈ టెక్నాలజీ నిపుణుడే తమకు తగిన సారథి అని మైక్రోసాఫ్ట్ తేల్చు కుంది. ఇంటాబయటా బోలెడంత మంది జాబితాను మదించి... చివరకు సత్య నాదెళ్లకు ఓటేసింది. - వాల్స్ట్రీట్ జనరల్ భారత్ అర్థిక వ్యవస్థ సృష్టిస్తున్న అవకాశాలతో ప్రవాసీయులు మాతృదేశంవైపు చూస్తున్న తరుణంలో అమెరికాలో ఒక భారతీయుడు(సత్య) మైక్రోసాఫ్ట్కి సారథిగా రావడం గొప్పవిషయమే. - టైమ్ మ్యాగజీన్ బయటి వ్యక్తికోసం తీవ్రంగా వేటసాగించినా.. కంపెనీలోని వ్యక్తివైపే మైక్రోసాఫ్ట్ మొగ్గుచూపింది. తమ కస్టమర్లు క్లౌడ్వైపు దృష్టిసారించడంలో విజయంసాధించిన సత్య నాదెళ్లను ఎంచుకుంది. - వాషింగ్టన్ పోస్ట్ ప్రపంచ దిగ్గజ కంపెనీలకు అధిపతులుగా ఉన్న భారతీయుల శక్తిసామర్థ్యాలు సత్య నాదెళ్ల ఘనతతో మరోసారి నిరూపితమయ్యాయి. 10 మంది భారతీయులు సారథ్యం వహిస్తున్న అంతర్జాతీయ కంపెనీల వ్యాపార విలువ దాదాపు 35,000 కోట్ల డాలర్లు కావడం గమనార్హం. ఇది గతేడాది భారత్ ఎగుమతులకంటే కూడా ఎక్కువ కావడం విశేషం. ఐటీ రంగంతోపాటు విదేశాల్లో ఇతరత్రా కంపెనీలకు చాలా మంది భారతీయులు అధిపతులుగా ఉన్నప్పటికీ.. కనీసం 12 అతిపెద్ద సంస్థలకు మనోళ్లు చీఫ్ ఎగ్జిక్యూటివ్లుగా కొనసాగుతున్నారు. కాగా, గతంలో కూడా సిటీ గ్రూప్(విక్రం పండిట్), మోటరోలా(సంజయ్ ఝా) లకు మనోళ్లు సీఈఓలుగా చేశారు. భారతీయులు.. భారీ జీతాలు పేరు కంపెనీ(సీఈఓ) వార్షిక ప్యాకేజీ సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ 1.8 కోట్ల డాలర్లు సంజయ్ ఝా గ్లోబల్ ఫౌండ్రీస్ 4.7 కోట్ల డాలర్లు (2013లో మోటొరోలాతో ఉన్నపుడు) ఇవాన్ మెండిస్ డియాజియో 1.7 కోట్ల డాలర్లు(2012) ఇంద్రా నూయి పెప్సీకో 1.26 కోట్ల డాలర్లు(2013) శాంతను నారాయణ్ అడోబ్ సిస్టమ్స్ 1.20 కోట్ల డాలర్లు (2012) అజయ్ బంగా మాస్టర్ కార్డ్ 1.13 కోట్ల డాలర్లు (2013) పియూష్ గుప్తా డీబీఎస్ గ్రూప్ హోల్డింగ్స్ 93.31 లక్షల డాలర్లు (2012) అన్షు జైన్ డాయిష్ బ్యాంక్(కో-సీఈఓ) 79.52 లక్షల డాలర్లు (2013) సంజయ్ మెహరోత్రా శాన్డిస్క్ 66.66 లక్షల డాలర్లు (2012) రాకేశ్ కపూర్ రెకిట్ బెన్కిసర్ 47.01 లక్షల డాలర్లు (2012) టాప్ సెర్చ్... సత్య మైక్రోసాఫ్ట్ సారథిగా సత్య పేరు వెల్లడికావడంతో సైబర్ ప్రపంచంలో ఆయన పేరు మార్మోగిపోయింది. ఫేస్బుక్, ట్విటర్ వంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్లలోనూ హాట్టాపిక్ ఆయనే. కేవలం అరనిమిషంలోనే గూగుల్ సెర్చ్ బాక్స్లో ‘సత్య నాదెళ్ల’ పేరుతో 44 కోట్ల సెర్చ్ రిజల్ట్స్ ప్రత్యక్షం కావడం దీనికి నిదర్శనం. అంతేకాదు ఆయన పేరుతో 0.14 సెకండ్లో 1.28 కోట్ల వార్తా కథనాలు గూగుల్ న్యూస్లో పోస్ట్కావడం విశేషం. సైబర్ జగత్తులో ఇప్పటిదాకా నమోదైన అత్యధిక సెర్చ్ల రికార్డులో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా(65 కోట్లు), బిల్ గేట్స్(48 కోట్లు) తర్వాత మూడోవ్యక్తిగా సత్య నిలవడం గమనార్హం. ఇదే టాప్ సెర్చ్ జాబితాలో రతన్ టాటా(40 లక్షలు), పెప్సీకో చైర్పర్సన్ ఇంద్రా నూయి(10 లక్షల కంటే తక్కువ)... సత్యకంటే ఆమడ దూరంలో ఉన్నారు. సత్య నాదెళ్ల సీఈఓగా ఎంపికైన తర్వాత ఆయన పేరుమీద ఫేస్బుక్లో ఒక పేజ్ ఒపెన్ కావడం... దీనికి కొద్దిగంటల్లోనే 30 వేలకు పైచిలుకు ‘లైక్స్’ వెల్లువెత్తడం విశేషం. -
మైక్రోసాఫ్ట్ సీఈవోగా సత్య నాదెళ్ల
-
మైక్రోసాఫ్ట్ సీఈవోగా సత్య నాదెళ్ల?
న్యూయార్క్: సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్లో సీఈవో పదవి తెలుగు వ్యక్తికి దక్కనుంది. మైక్రోసాఫ్ట్ కొత్త సీఈవోగా మన హైదరాబాదీ సత్య నాదెళ్ల(46) నియమితులయ్యే అవకాశముందని స్థానిక మీడియా పేర్కొంది. ఆయన నియామకం దాదాపు ఖాయమయిందని తెలిపాయి. సీఈవో ఎంపిక కోసం ఐదు నెలల పాటు సాగించిన కసరత్తు ముగిసిందని వెల్లడించాయి. సుదీర్ఘ కాలంగా సీఈవోగా స్టీవ్ బామర్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టే అవకాశముంది. సత్య నాదెళ్ల నియామకం ఖరారయితే మైక్రోసాఫ్ట్కు ఆయన మూడో సీఈవో అవుతారు. హైదరాబాద్కి చెందిన సత్య.. మంగళూరు యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో డిగ్రీ చేశారు. అటుపైనా అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్ నుంచి కంప్యూటర్ సైన్స్లో మాస్టర్స్ డిగ్రీ, యూనివర్సిటీ ఆఫ్ షికాగో నుంచి ఎంబీయే చేశారు. ప్రస్తుతం ఆయన మైక్రోసాఫ్ట్లో క్లౌడ్ అండ్ ఎంటర్ప్రైజెస్ విభాగానికి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. మైక్రోసాఫ్ట్ ప్రస్తుత సీఈవో బామర్ వచ్చే ఏడాదిలోగా రిటైర్ కావాలనుకుంటున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో వారసుడి అన్వేషణ అనివార్యమైంది.