-
చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా ఆర్ఎం భాషా.. సీఎం జగన్ నేతృత్వంలో..
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా ఆర్ఎం భాషా ఎంపికయ్యారు. స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా పత్తిపాటి శామ్యూల్ను ఎంపిక చేశారు. మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో ఎంపిక కమిటీ భేటీ అయి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. చదవండి: (దేశంలో ఇలాంటి పథకం ఎక్కడా కూడా లేదు: సీఎం జగన్) -
సమాచార కమిషనర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
సాక్షి, అమరావతి: ఖాళీగా ఉన్న రాష్ట్ర సమాచార కమిషనర్ పోస్టులు రెండింటిని భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి(జీపీఎం అండ్ ఏఆర్)కె.ప్రవీణ్ కుమార్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులను ఈనెల 23వ తేదీ సాయంత్రం 5గంటలలోగా వ్యక్తిగతంగా గానీ.. రిజిస్టర్ పోస్టులో గానీ పంపించాలని సూచించారు. సెక్రటరీ, ఏపీఐసీ, మొదటి అంతస్తు, ఎంజీఎం క్యాపిటల్ వద్ద, ఎన్ఆర్ఐ వై జంక్షన్, చినకాకాని గ్రామం, మంగళగిరి–522508, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ అనే చిరునామాకు చేరేలాగా రిజిస్టర్ పోస్టు పంపాలని కోరారు. మరిన్ని వివరాలకు 8639376125 నంబర్ను సంప్రదించాలని సూచించారు. (చదవండి: 32.70 లక్షల మందికి వ్యాక్సిన్) -
మా ఆదేశాలే పట్టించుకోవడం లేదు
రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై సమాచార కమిషనర్ల అసంతృప్తి హైదరాబాద్: చట్టాలను అమలు చేయాల్సిన ప్రభుత్వ యంత్రాంగమే తీవ్ర నిర ్లక్ష్యం ప్రదర్శిస్తోందంటూ సాక్షాత్తూ రాష్ట్ర సమాచార కమిషనర్లే అసంతృప్తి వ్యక్తంచేశారు. సమాచార హక్కు చట్టం అమలుకు సంబంధించి తామిచ్చే ఆదేశాలకు ఇరు రాష్ట్రాల అధికారులెవరూ వీసమెత్తు విలువ కూడా ఇవ్వడం లేదని ఏపీ సమాచార కమిషన్లోని 8 మంది క మిషనర్లు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం రవీంద్రభారతిలో కమిషన్ ఆధ్వర్యంలో సమాచార హక్కు వారోత్సవాలను నిర్వహించారు. తమ ఆదేశాలనే పట్టించుకోవడం లేదని కమిషనర్లు అసంతృప్తి వ్యక్తంచేయడంతో.. కార్యక్రమానికి వచ్చిన ఆర్టీఐ ఉద్యమకారులు కంగుతిన్నారు. తమ ఆవేదన లను వెళ్లబోసుకునేందుకు కూడా కమిషనర్లు సమయం ఇవ్వకపోవడంతో ఉద్యమకారులు కాసేపు ఆందోళనకు దిగారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాలనలో జవాబుదారీతనం ఆర్టీఐ ఆమలు ద్వారానే సాధ్యమవుతుందన్నారు. ఈ చట్టంతో పలువురు అధికారులు స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నారని చెప్పారు. కార్యక్రమంలో ప్రధాన సమాచార కమిషనర్ జన్నత్హుస్సేన్, స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ లింగరాజు పాణిగ్రాహి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమాచార కమిషనర్ ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ.. ఆర్టీఐ కింద దరఖాస్తు చేసిన వారికి సమాచారం ఇచ్చేందుకు పలు ప్రభుత్వ విభాగాలు ఇష్టపడడం లేదని, అప్పిలేట్ అథారిటీలు పట్టించుకోవడం లేదన్నారు. విభాగాధిపతులు కనీసం స్పందించడం లేదన్నారు. మరో కమిషనర్ విజయబాబు మాట్లాడుతూ.. సమాచార కమిషన్ నిర్వహిస్తున్న వారోత్సవాలకు ప్రభుత్వ విభాగాలకు చెందిన పీఐవోలు, అప్పిలేట్ అథారిటీలు, విభాగాధిపతులు ఎక్కువ మంది రాకపోవడాన్ని ప్రస్తావించారు. ఆర్టీఐ అమలు మొక్కుబడి కార్యక్రమంగానే ఉందనడానికి ఇంతకంటే నిదర్శనం అక్కర్లేదన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) హోదా కలిగిన కమిషనర్ల పట్ల పలువురు ఐఏఎస్ అధికారులు అనుచితంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చంద్రబాబు చేసిన మోసాలు లైవ్ లో వినిపించిన సీఎం జగన్
పెళ్లి ఫొటోలు డిలీట్ చేసిన స్టార్ హీరో.. కారణమేంటి?
సోమవారాల్లో నలిగిన బట్టలే ధరించండి! సీఎస్ఐఆర్ పరిశోధన సంస్థ
బాబును చీల్చి చెండాడిన మహిళలు
కేరళలో ‘వెస్ట్ నైల్’ వైరస్ కేసులు
ఓటు తో కొట్టే దెబ్బకు ఢిల్లీ పీఠం కదలాలి..
యధార్థ సంఘటనల ఆధారంగా ‘100 క్రోర్స్’
సీఎం జగన్ ప్రభుత్వంలో ఉత్తరాంధ్రకు చేసిన అభివృద్ధి ఇదే
పథకాలు ఆపగలరు కానీ.. మా విజయాన్ని ఆపలేరు: సీఎం జగన్
మీ జగన్ మార్క్ పథకాలు ఇవి...!
తప్పక చదవండి
- అమ్మానాన్న, ధర చెక్ చేయకుండానే కొనుక్కోవాలి : ఆటో డ్రైవర్ కుమార్తె ఘనత
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ‘ఒకవేళ బెయిల్ ఇస్తే’.. కేజ్రీవాల్కు కండీషన్ పెట్టిన సుప్రీంకోర్టు
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
- మెట్ గాలా 2024: అలియా టూ అంబికా మోదీ మెరిసిన బ్యూటీస్ (పోటోలు)
- LS Elections 3rd Phase: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్
Advertisement