breaking news
State Electricity Regulatory Council
-
విద్యుదాఘాతాలకు 814 మంది బలి
⇒ రాష్ట్ర విద్యుత్ సలహా సంఘం ఆందోళన ⇒ చార్జీల పెంపుపై టీఎస్ఈఆర్సీ సమావేశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఏటేటా విద్యుత్ ప్రమాద మరణాలు పెరుగుతు న్నాయని రాష్ట్ర విద్యుత్ సలహా సంఘం (ఎస్ఏసీ) ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్రంలో విద్యుత్ ప్రమాదాలతో 2015– 16లో 522 మంది, 2016–17 తొలి అర్ధ వార్షికంలో 292 మంది మృత్యువాత పడ్డారని తెలిపింది. విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల నిర్వహణ లోపాలతోనే అత్యధిక ప్రమాదాలు జరుగుతున్నాయని అభిప్రాయ పడింది. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ఈఆర్సీ) కార్యాలయంలో మంగళ వారం ఎస్ఏసీ మూడో సమావేశం జరిగింది. ఈఆర్సీ చైర్మన్ ఇస్మాయిల్ అలీఖాన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఉత్తర, దక్షిణ డిస్కంల సీఎండీలు జి.రఘుమారెడ్డి, ఎ.గోపాల్రావు, ట్రాన్స్కో జేఎండీ సి.శ్రీని వాస రావు, ఎస్ఏసీ సభ్యుడు, ఫ్యాప్సీ అధ్యక్షుడు వెన్నెం అనిల్రెడ్డి, ప్రయాస్ ఎనర్జీ ç సభ్యుడు ఎన్.శ్రీకుమార్ తదితరులు పాల్గొన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపుపై అభిప్రాయ సేకరణ కోసం ఈఆర్సీ ఈ సమావేశం నిర్వహించినప్పటికీ విద్యుదాఘాత మరణాలపై ప్రధానంగా చర్చ జరిగింది. మానవ తప్పిదాలు, శాఖాపర లోపాలతో అత్యధిక విద్యుత్ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని విద్యుత్ రంగ నిపుణులు ఎన్.శ్రీకుమార్తో పాటు పలువురు వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. డిస్కంలు ఇంకా టారీఫ్ ప్రతిపాదనలు సమర్పించని నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రస్తుత టారిఫ్ను యథాతథంగా కొనసాగించడం లేదా ఫుల్ కాస్ట్ టారిఫ్ ఉత్తర్వులు జారీ చేయడం అంశాలపై సుమోటోగా నిర్ణయం తీసుకునే అధికారం ఈఆర్సీకి ఉందన్నారు.రాష్ట్రంలో పరిశ్రమలకు విద్యుత్ చార్జీల పెంపు హేతబద్ధంగా ఉండాలని ఫ్యాప్సీ అధ్యక్షుడు వెన్నం అనిల్రెడ్డి కోరారు. -
‘ప్రైవేటు’ కొనుగోళ్లకు ఈఆర్సీ నో!
♦ విద్యుత్ అవసరాలపై డిస్కంలు సమర్పించిన లెక్కలపై అసంతృప్తి ♦ 2 వేల మెగావాట్ల ప్రైవేటు విద్యుత్ కొనుగోళ్లకు యత్నం ♦ మార్చిలోగా కొత్త ప్లాంట్ల నుంచి 1,800 మెగావాట్ల ఉత్పత్తి ♦ ఈ నేపథ్యంలో ‘ప్రైవేటు’ కొనుగోళ్లను ప్రశ్నించిన ఈఆర్సీ! ♦ విద్యుత్ అవసరాలపై సమగ్ర వివరాలతో రావాలని సూచన సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు సంస్థల నుంచి 2,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు విద్యుత్ సంస్థలు చేస్తున్న ప్రయత్నాలకు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) నుంచి అనుమతి లభించలేదు. విద్యుత్ సంస్థలు సమర్పించిన లెక్కలపై ఈఆర్సీ అసంతృప్తి వ్యక్తం చేసింది. వచ్చే ఏడాది రాష్ట్రంలో పెరగనున్న డిమాండ్కు తగ్గట్లు సరఫరా కోసం విద్యుత్ కొనుగోలు చేసేందుకు నెల రోజులుగా విద్యుత్ సంస్థలు అనుమతి కోసం ప్రయత్నిస్తున్నాయి. దీనిపై గత గురువారమే ఈఆర్సీకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాయి. దానిని పరిశీలించిన ఈఆర్సీ... ఆ విద్యుత్ కొనుగోళ్లు న్యాయోచితమైనవేనని రుజువు చేసే వివరాలతో మళ్లీ రావాలని సూచించింది. దీంతో 2016 మే 27 నుంచి 2017 మే 25 వరకు ఏడాది కాలానికి 2,000 మెగావాట్ల తాత్కాలిక విద్యుత్ కొనుగోళ్ల కోసం పిలిచిన టెండర్లపై నీలినీడలు కమ్ముకున్నాయి. అంచనాలపై అనుమానం! ప్రస్తుతం జెన్కో, కేంద్ర విద్యుత్ కేంద్రాలు(సీజీఎస్), తాత్కాలిక కొనుగోలు ఒప్పందాల ద్వారా రాష్ట్రంలో 6,500 మెగావాట్ల విద్యుత్ లభ్యత ఉంది. కానీ డిమాండ్ తక్కువగా ఉండడంతో తరచూ జెన్కో ప్లాంట్లలో ఉత్పత్తి తగ్గించి ప్రైవేటు విద్యుత్ కొనుగోళ్లను కొనసాగిస్తున్నారు. వచ్చే మే నెలతో 2,000 మెగావాట్ల ప్రైవేటు కొనుగోళ్ల ఒప్పందాలు ముగిసిపోనున్నాయి. ఆలోపే సింగరేణి, భూపాలపల్లిలోని కొత్త విద్యుత్ ప్లాంట్ల నుంచి 1,800 మెగావాట్ల ఉత్పత్తి ప్రారంభం కానుంది. అయితే వచ్చే ఖరీఫ్ నుంచి వ్యవసాయానికి పగలే 9 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వ హామీ అమలు కోసం 10,500 మెగావాట్ల విద్యుత్ అవసరమని విద్యుత్ సంస్థలు అంచనా వేశాయి. ‘పగటి పూట విద్యుత్’కు 6,500 మెగావాట్లు కావాలని గుడ్డిగా లెక్కలు వేశాయి. వచ్చే మార్చిలోగా ప్రైవేటు సౌర విద్యుత్ కేంద్రాల నుంచి 2,500 మెగావాట్లు అందుబాటులోకి వస్తాయని, అదనంగా 2,000 మెగావాట్లు కొనుగోలు చేస్తే 10,500 మెగావాట్ల డిమాండ్ను తీర్చుతామని ఈఆర్సీకి చెప్పాయి. కానీ ఈ అంచనాల్లో శాస్త్రీయత లోపించిందని ఈఆర్సీ అభిప్రాయపడింది. 9 గంటల సరఫరా కోసం.. 24 గంటల కొనుగోళ్లు! వ్యవసాయానికి పగలే 9 గంటలు విద్యుత్ సరఫరా చేస్తే కేవలం ‘పీక్లోడ్ (విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉండే సమయంలో వినియోగం)’ మాత్రమే పెరుగుతుంది. విద్యుత్ డిమాండ్ గరిష్టంగా ఉండే పగటి వేళలోనే 6,500 మెగావాట్లు సరఫరా చేస్తారు. దీంతో సాధారణంగానే డిమాండ్ తక్కువగా ఉండే రాత్రివేళ (బేస్లోడ్) విద్యుత్ వినియోగం 4,000 మెగావాట్లకు పడిపోతుంది. కానీ జెన్కో, సీజీఎస్, తాత్కాలిక కొనుగోలు ఒప్పందాల నుంచి 8,000 మెగావాట్ల లభ్యత ఉంటుంది. అంటే రాత్రివేళ 4,000 మెగావాట్లను వదులుకోక తప్పదు. ‘ప్రైవేటు’ విద్యుత్ను వదులుకునే అవకాశం లేకపోవడంతో రాత్రిళ్లు జెన్కో ప్లాంట్లను నిలిపేసి ఉత్పత్తిని తగ్గించే అవకాశాలున్నాయి. గత ఏడాదికాలంగా రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ తగ్గడంతో.. ‘ప్రైవేటు’ కొనుగోళ్లను కొనసాగిస్తూ జెన్కో ప్లాంట్లను తరచూ ‘బ్యాక్డౌన్’ చేయడంతో సంస్థ ఉత్పత్తి సామర్థ్యం (పీఎల్ఎఫ్) 74 శాతానికి పడిపోయింది. ఇప్పుడు మళ్లీ ప్రైవేటు కొనుగోళ్లకు అనుమతిస్తే జెన్కో మరింతగా నష్టపోతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో 2 వేల మెగావాట్ల తాత్కాలిక విద్యుత్ కొనుగోళ్లకు ఈఆర్సీ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. -
ప్రస్తుత చార్జీలనే కొనసాగించండి!
ఈఆర్సీకి ఇంధన శాఖ లేఖ సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతమున్న విద్యుత్ చార్జీలనే కొనసాగించాలని రాష్ర్ట విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ)ని ఇంధన శాఖ కోరింది. ఈ మేరకు ఆ శాఖ ప్రత్యేక కార్యదర్శి మంగళవారం లేఖ రాశారు. రాష్ట్ర విభజన, రాష్ర్టపతి పాలన నేపథ్యంలో కొత్త విద్యుత్ చార్జీలపై తాము నిర్ణయం ప్రకటించలేమని ఆయన పేర్కొన్నట్టు తెలిసింది. జూన్ 2 తర్వాత కొత్త ప్రభుత్వాలు ఏర్పాటయ్యాకే నిర్ణయం తీసుకోవాలని కూడా సూచించినట్టు సమాచారం. వాస్తవానికి ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చేలా 2014-15 ఆర్థిక సంవత్సరానికి విద్యుత్ చార్జీలను మార్చి చివరి వారంలోనే ఈఆర్సీ నిర్ణయించాల్సి ఉంది. అయితే, కోడ్ నేపథ్యంలో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. ఎన్నికల తర్వాత చార్జీలపై నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది. దీంతో తదుపరి నిర్ణయం ప్రకటించే వరకూ ప్రస్తుత చార్జీలే కొనసాగుతాయని ఈఆర్సీ ప్రకటించింది.