breaking news
state committe meeting
-
ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టాలి: పార్టీ నేతలతో సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టాలని.. దళిత బంధు అమలుపై పార్టీ శ్రేణులందరికీ అవగాహన కల్పించాలని టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) పార్టీ ప్రతినిధులకు చెప్పారు. తెలంగాణ భవన్లో మంగళవారం తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు కమిటీల పునర్నిర్మాణంపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దళితబంధు అమలులో పార్టీ శ్రేణులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. నవంబర్ మొదటివారంలో టీఆర్ఎస్ ప్లీనరీ నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు సమాచారం. ప్రతిపక్షాల తప్పుడు విమర్శల్ని తిప్పికొట్టాలని సమావేశంలో సీఎం కేసీఆర్ పార్టీ ప్రతినిధులకు ఆదేశించినట్లు తెలిసింది. దేశ రాజధానిలో కేటాయించిన స్థలంలో పార్టీ కార్యాలయ నిర్మాణ పనులకు సెప్టెంబర్ 2వ తేదీన శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు. కొన్ని గంటల పాటు సాగిన సమావేశం అనంతరం కేటీఆర్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించినట్లు కేటీఆర్ తెలిపారు. ‘క్షేత్రస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పార్టీని బలోపేతం చేసే జిల్లాల్లో పార్టీల కార్యాలయాల ప్రారంభోత్సవం అక్టోబర్లో చేసే అవకాశాలు ఉన్నాయి. ద్విదశాబ్ది ఉత్సవాలు ఘనంగా చేస్తాం. నవంబర్ మొదటివారంలో టీఆర్ఎస్ ప్లీనరీ నిర్వహణకు సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ నెలాఖరులోపు సభ్యత్వం పూర్తి చేయాలి. సెప్టెంబర్ మొదటివారంలో గ్రామ కమిటీలు పూర్తి చేయాలి. సెప్టెంబర్ రెండోవారంలో మండల కమిటీలు, సెప్టెంబర్ మూడో వారంలో జిల్లా కమిటీలు పూర్తికి చర్యలు’ అని తెలిపారు. చదవండి: చీరకట్టులో కుందనపు బొమ్మలా ‘పీవీ సింధు’ పార్టీ రాష్ట్ర కమిటీ నిర్ణయాలు ఇవి 20 ఏళ్లుగా విజయవంతవంగా రెండు దశాబ్దాలు పార్టీని నడిపడంతో త్వరలోనే ద్విదశాబ్ది ఉత్సవాలు నిర్వహణకు రాష్ట్ర కార్యవర్గం తీర్మానం. హైదరాబాద్, వరంగల్ మినహా జిల్లాలోని పార్టీ కార్యాలయాలు దసరా తర్వాత అక్టోబర్లో ప్రారంభం. ఢిల్లీలో పార్టీ కార్యాలయ నిర్మాణ పనుల శంకుస్థాపన సీఎం కేసీఆర్ చేయనున్నారు. సెప్టెంబర్ 2వ తేదీన 12,769 పార్టీ పంచాయతీ కమిటీల ప్రకటన. మండల, మున్సిపల్, జిల్లా కమిటీలు కూడా సెప్టెంబర్లో ఏర్పాటు సంస్థాగత నిర్మాణం మొత్తం సెప్టెంబర్లో పూర్తి చేయాలని తీర్మానం కే కేశవరావు నేతృత్వంలో ఈ కమిటీలపై సంస్థాగత నిర్మాణం ప్లీనరీ సమావేశం కరోనా పరిస్థితులు చూసుకొని నవంబర్, డిసెంబర్లో నిర్వహించాలని యోచన. చదవండి: అచ్చం సినిమాలా? వ్యాపారి కుమారుడు కిడ్నాప్.. -
ఏపీటీడీసీని ప్రైవేటికరించే ఆలోచనను విరమించుకోవాలి
విజయవాడ(గాంధీనగర్) ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీటీడీసీ)ను ప్రైవేటీకరణ చేసే ఆలోచనను టీడీపీ ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి జి ఓబులేసు హెచ్చరించారు. ఏపీ టూరిజం కాంట్రాక్ట్ అండ్ మ్యాన్పవర్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర సమితి సమావేశం హనుమాన్పేటలోని దాసరి భవన్లో గురువారం జరిగింది. ఆయన మాట్లాడుతూ ఇప్పటికే రాష్ట్రంలోని 38 టూరిజం హోటల్స్ను లీజు పేరుతో పచ్చచొక్కాల వ్యక్తులకు ధారాదత్తం చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందన్నారు. తిరుపతి , అలిపిరి టూరిజంను సైతం ప్రైవేటుపరం చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయన్నారు. యాత్రికుల రద్దీ ఎక్కువగా ఉండే తిరుపతి లాంటి ప్రదేశాల్లో టూరిజం ప్రైవేటుకు అప్పగించడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమన్నారు. టూరిజం హోటల్స్లో వంట మనుషుల కొరత ఉన్నా భర్తీ చేయడం లేదన్నారు. ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవో 151 ప్రకారం టూరిజంలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ కార్మికులకు అరియర్స్తో సహా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, కార్మికుల సమస్యల పరిష్కారానికై ఈనెల 25వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరాహారదీక్షలు నిర్వహిస్తామన్నారు. అప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోతే డిసెంబర్ 3న చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. సమావేశం అనంతరం కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గిరిజా శంకర్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. గిరిజా శంకర్ స్పందిస్తూ 4–5 రోజుల్లో కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషిచేస్తామన్నారు. సమావేశంలో ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఆర్.రవీంద్రనాథ్, యూనియన్ అ«ధ్యక్ష, కార్యదర్శులు సి రామకృష్ణ, టీడీ ప్రసాద్ పాల్గొన్నారు.