-
టెన్త్లోనే స్టార్టప్
- 3 కోట్ల నిధులు సాధించిన చిచ్చరపిడుగులు పదోతరగతి విద్యార్థులంటే.. పాఠాలకు ప్రాధాన్యం ఇస్తారు. మార్కులపై దృష్టి పెడతారు. ర్యాంకులు సాధించాలని తపిస్తారు. ఇవన్నీ ఒకప్పుడు. ఇప్పుడు కాలం మారింది. చదివే చదువుతో, ఎదిగే వయసుతో సంబంధం లేకుండా కుర్రాళ్లు దూసుకుపోతున్నారు. మైనార్టీ కూడా తీరని ముగ్గురు విద్యార్థులు.. స్టార్టప్ ఫండ్ కింద ఇప్పటికే రూ.3 కోట్లను ఆకర్షించారు. వివరాల్లోకెళ్తే.... ‘మార్కెట్లో దొరికే శీతల పానీయాలు ఎంతవరకు సేఫ్? కూల్ డ్రింక్స్లో హానికారక క్రిమిసంహారాలున్నట్లు ఇప్పటికే రుజువు కాలేదా? అయినా జనాలు వాటినే తాగేస్తూ ఆరోగ్యం పాడుచేసుకుంటున్నారెందుకు? ఎందుకంటే... సురక్షితమైన శీతల పానీయాలు మార్కెట్లో అందుబాటులో లేకే ఈ పరిస్థితి. మంచి ఫ్లేవర్తో సురక్షితమైన కూల్డ్రింక్ దొరికితే జనాలు ఎందుకు తాగరు? అలాంటిదేదైనా తయారు చేయడం గురించి ఆలోచిస్తే ఎలా ఉంటుంది? తాగే నీటికే కమ్మని ఫ్లేవర్ ఇస్తే ఎలా ఉంటుంది..?’ అని ఆలోచించిన ముగ్గురు విద్యార్థుల జీవితాలు ఇప్పుడు ఒక్కసారిగా మారిపోయాయి. మొదట్లో తిరస్కరణ.. జైపూర్లోని నీరజ మోదీ స్కూల్లో పదో తరగతి చదువుతున్న చైతన్య, మృగాంక్, ఉత్సవ్లు ..తాగునీటికి మంచి ఫ్లేవర్ ఇచ్చి, సురక్షితమైన శీతల పానీయాన్ని తయారు చేయాలనే ఆలోచన చేశారు. అనుకున్న విధంగా ఫ్లేవర్డ్ వాటర్ను రూపొందిం చి.. ‘ఎంటర్ప్రిన్యూర్షిప్ ఫెస్ట్’లో ప్రదర్శించారు. అయితే మొదటి రౌండ్లోనే వీరి కాన్సెప్ట్ను తిరస్కరించారు. దీంతో నిరాశగా వెనుదిరిగిన ఈ ముగ్గురికి.. ఫెస్టివల్ నిర్వాహకులకే నీటిని సరఫరా చేసే ఆర్డర్ దక్కింది. దీంతో తాము రూపొందిం చిన ఫ్లేవర్డ్ వాటర్నే సరఫరా చేశారు. దీంతో వారి దశ మారిపోయింది. అందులో పాల్గొన్న బడా వ్యాపారవేత్తలంతా కాన్సెప్ట్ గురించి తెలుసుకునేందుకు ఆసక్తి కనబర్చారు. ఇప్పుడెలా....? ఆలోచన బాగుందంటున్నారు... మరి వీటిని తయారు చేయాంటే ముందు లైసెన్స్ తీసుకోవాలి. ఇదంతా పెద్ద తతంగం. మనమంతా మైనర్లమే. మన వయసుకు లైసెన్స్ కూడా ఇవ్వరు. మరేం చేయాలి? ...అని ఆలోచిస్తున్న ఈ ముగ్గురికి స్టార్టప్ ఐడియా వచ్చింది. ముందుగా ఓ స్టార్టప్ను ఏర్పాటు చేసి, ఐడియాను పారిశ్రామికవేత్తల వద్దకు తీసుకెళ్లగలిగితే.. ఆ తర్వాత ఎటువంటి ఇబ్బంది ఉండదనుకున్నారు. ఐఐటీ కాన్పూర్, ఐఐఎం ఇండోర్లో కాంపిటీషన్లలో కాన్సెప్ట్ను ప్రదర్శించా రు. దీంతో మాలవీయ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీముందుకొచ్చింది. వెంటనే స్టార్టప్ను ప్రారంభించాలని, అవసరమైన రూ.3 కోట్లను తాము సమకూరుస్తామని ప్రకటించింది. పేటెంట్ హక్కుల కోసం కూడా సాయం చేస్తామని హామీ ఇచ్చింది. -
స్టార్టప్ల కోసం స్టార్టప్ఎక్సీడ్ వెంచర్స్
న్యూఢిల్లీ: దిగ్గజ ఐటీ పారిశ్రామికవేత్తలు స్టార్టప్ ఫండ్ కోసం చేతులు కలిపారు. మోహన్దాస్ పాయ్. బి.వి.నాయుడు, జె.ఎ. చౌధురి కలిసి స్టార్టప్ఎక్సీడ్ వెంచర్స్పేరుతో సీడ్ ఫండింగ్ కంపెనీని ప్రారంభించారు. సెక్యూరిటీ, సెమి కండక్టర్స్, ఎంబెడ్డెడ్ డివైస్లకు సంబంధించిన స్టార్టప్లో ఈ సీడ్ ఫండింగ్ కంపెనీ పెట్టుబడులు పెడుతుంది. స్టార్టప్ఎక్సీడ్ వెంచర్స్ రూ.30 కోట్ల అరుహ టెక్నాలజీ ఫండ్(ఏటీఎఫ్)ను ప్రారంభించిందని స్టార్టప్ఎక్సీడ్ మేనేజింగ్ పార్ట్నర్ బి. వి. నాయుడు చెప్పారు. ఈ ఫండ్ సీడ్ లెవల్ కంపెనీలకు ఎండ్-టు-ఎండ్ సపోర్ట్ని ఇస్తుందని వివరించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మేమంతా సీఎం వైఎస్ జగన్ వెంటే
టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరిక
సుండుపల్లెలో టీడీపీకి షాక్
సింహ వాహనంపై దేవదేవుడు
టీడీపీ ప్రచారంలో రాష్ట్రీయ సమాజ్ దళ్(ఆర్) అభ్యర్థి
రైతన్నలకు విత్తన రాయితీ
ప్రధాని పదవికి విలువ లేకుండా చేశారు
794 ఫిర్యాదులకు పరిష్కారం
పథకాలు కొనసాగాలంటే జగనన్న రావాలి
●కమలాపురంలో గణనీయమైన మార్పు..
తప్పక చదవండి
- మహామహులకూ తప్పని... ఓటమి
- 22 మంది బిలియనీర్లయ్యారు
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement