breaking news
srisailam highway
-
హైదరాబాద్ టు శ్రీశైలం నాన్ స్టాప్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నుంచి శ్రీశైలం వరకు ఎలాంటి అవాంతరాలు లేకుండా నాన్ స్టాప్ ప్రయాణం వీలుకానుంది. 147 కిలోమీటర్ల గ్రీన్ఫీల్డ్ రహదారి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ ఆమోదం తెలిపింది. రావిర్యాల నుంచి ఆమన్గల్, ఆమన్గల్ నుంచి మన్ననూరు వరకు గ్రీన్ఫీల్డ్ రహదారి నిర్మించి అక్కడి నుంచి శ్రీశైలం వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం చేపట్టనున్నారు.ఫ్యూచర్ సిటీలో భాగంగా ఇప్పటికే హెచ్ఎండీఏ నిర్మిస్తున్న రావిర్యాల (ఓఆర్ఆర్) నుంచి ఆమన్గల్ వరకు కొత్త రహదారిని ఈ గ్రీన్ఫీల్డ్ రహదారితో అనుసంధానించనున్నారు. ఆమన్గల్ నుంచి మన్ననూరు వరకు 52.2 కి.మీ. గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే... మన్ననూరు నుంచి శ్రీశైలం 54 కి.మీ. మేర ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం జరగనుంది.రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు రూ. 7,500 కోట్ల వ్యయ ప్రతిపాదనకు ఆమోదం తెలపడం తెలి సిందే. ఈ ఎలివేటెడ్ కారిడార్ కోసం కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను సమర్పించనుంది. నిర్మాణ భారాన్ని తగ్గించుకోవడానికి.. తుక్కుగూడ నుంచి దిండి వరకు 85.8 కి.మీ. మేర నాలుగు వరుసలుగా రహదారి విస్తరణ.. మన్ననూరు నుంచి శ్రీశైలం వరకు 54 కి.మీ. వరకు ఎలివేటెడ్ కారిడార్ను నిర్మించాలని ఎన్హెచ్ఏఐ నిర్ణయించింది. ఈ మేరకు దిండి నుంచి మన్ననూరు వరకు ఉన్న ప్రాంతాన్ని ఎన్హెచ్ఏఐకు బదిలీ చేయాలని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు.అయితే భూసేకరణ, ప్రస్తుతం రహదారి వెంబడి యుటిలిటీ షిఫ్టింగ్కు భారీ వ్యయం అవుతుండటంతో ప్రత్యామ్నాయ మార్గాలపై ప్రభుత్వం దృష్టిసారించింది. ఇప్పటికే ఫ్యూచర్ సిటీలో భాగంగా రంగారెడ్డి జిల్లాలోని రావిర్యాల (ఓఆర్ఆర్ జంక్షన్) నుంచి ఆమన్గల్ వరకు 41.5 కి.మీ. వరకు గ్రీన్ఫీల్డ్ రహదారిని నిర్మిస్తున్న ప్రభుత్వం.. ఇందుకోసం రోడ్లతోపాటు ఫుట్పాత్లు, డ్రైనేజీలు, యుటిలిటీల వంటి అన్ని రకాల అవసరాల కోసం 100 మీటర్ల వరకు భూములను సమీకరిస్తోంది.రావిర్యాల నుంచి ఆమన్గల్ వరకు నిర్మించనున్న రోడ్డు ముగింపు తర్వాత అక్కడి నుంచే ఆమన్గల్–మన్ననూరు వరకు 52.2 కి.మీ. గ్రీన్ఫీల్డ్ రహదారిని విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ఈ రహదారి అలైన్మెంట్కు కల్వకుర్తి బైపాస్లోని ప్రస్తుత ఎన్హెచ్–765, ఎన్హెచ్–167లను అనుసంధానించనుంది. ఈ కొత్త రహదారి పొడవు 11 కి.మీ. ఉంటుంది. దీని డీపీఆర్ను ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ (ఏఏసీ) ఆమోదం కోసం పంపింది. -
శ్రీశైలం హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్.. సలేశ్వరంలో భక్తుల సందడి
అమ్రాబాద్: వరుస సెలవుల కారణంగా శ్రీశైలం ప్రధాన రహదారి భక్తులతో రద్దీగా మారింది. సలేశ్వరానికి వెళ్లేందుకు భక్తులు బారులు తీరారు. దీంతో, సలేశ్వరానికి వెళ్లే మన్ననూర్ చెక్పోస్టు వద్ద వాహనాల తాకిడి ఎక్కువైంది. టోల్గేట్ వద్ద ఛార్జీల చెల్లింపు ప్రక్రియ ఆలస్యం కావడంతో చెక్పోస్టు నుంచి సుమారు 6 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.వివరాల ప్రకారం.. నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని సలేశ్వరానికి వెళ్లేందుకు భక్తులు భారీ సంఖ్యలో బయలుదేరారు. ఒక్కసారిగా వాహనాల సంఖ్య పెరగడంతో మన్ననూర్ చెక్పోస్టు వద్ద చార్జీల చెల్లింపు ప్రక్రియ ఆలస్యమవుతోంది. దీంతో, 6 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సిద్ధాపూర్ క్రాస్ వరకు రద్దీ నెలకొంది. దీంతో ప్రయాణికులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు.Situation at saleshwaram jathara pic.twitter.com/37j3IcqLjf— 🚘 𝐊𝐂𝐑_𝐒𝐭𝐚𝐥𝐰𝐚𝐫𝐭 🌈™🚘 (@KCR_Vidheyudu) April 13, 2025ఇదిలా ఉండగా.. ఏటా చైత్రపౌర్ణమి సందర్భంగా మూడు రోజుల పాటు సలేశ్వరం లింగమయ్య స్వామి జాతర నిర్వహిస్తుంటారు. ఈ ఉత్సవానికి తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. వరుస సెలవుల నేపథ్యంలో శ్రీశైలానికి కూడా భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలను భక్తులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. Yesterday #Saleshwaram was crowded with devotees. If you’re planning to visit, please plan accordingly. I’d suggest avoiding taking kids along, if possible. https://t.co/QckyDl4udO pic.twitter.com/TWHB1i9Wqo— Rudra🚩 (@Mee_Rudra) April 13, 2025 -
కుటుంబ సభ్యులకు మృతదేహాలు అప్పగింత
అచ్చంపేట/ఉప్పునుంతల: హైదరాబాద్–శ్రీశైలం జాతీయ రహదారిపై పిరట్వాన్పల్లి వద్ద శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఏడుగురి మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. శనివారం ఉదయం 8 గంటలకు మృతుల కుటుంబ సభ్యులు అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆస్పత్రి ప్రాంగణంలో మృతుల కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. కాగా, కార్తీక్ అలియాస్ సంపత్ కుటుంబసభ్యులకు సమాచారం అలస్యంగా చేరడంతో వారు ఉదయం 11.45 గంటలకు వచ్చారు. ఇతని పేరు, అడ్రస్ సరిగా లేకపోవడంతో గుర్తించడంలో జాప్యం జరిగింది. పోలీసులు కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించి, అనంతరం మృతదేహాలను అప్పగించారు. ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడ్డ క్షతగాత్రుడు నరేశ్ తనతో పాటు వచ్చిన స్నేహితులు లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. ప్రమాదంపై నరేశ్ ఫిర్యాదు మేరకు ఎస్ఐ అజ్మీర రమేశ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సంఘటన దురదృష్టకరం: ఎంపీ రాములు రోడ్డు ప్రమాదంలో ఏడుగురు చనిపోవడం దురదృష్టకరమని నాగర్కర్నూల్ ఎంపీ పి.రాములు అన్నారు. ఆయన అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. శ్రీశైలం హైవేపై ట్రామా సెంటర్ ఏర్పాటుతో పాటు ప్రస్తుతం ఉన్న రెండు వరుసల రోడ్డును నాలుగు లైన్లుగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని తెలిపారు. దీన్ని పార్లమెంట్లో ప్రస్తావించగా.. సర్వే చేయించి చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి గడ్కారీ హామీ ఇచ్చారని తెలిపారు. కాగా, సకాలంలో వైద్యులు ఆస్పత్రికి రాకపోవడంతో అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
శ్రీశైలంలో చిరుతల సంచారం
శ్రీశైలం: శ్రీశైలం క్షేత్ర పరిధిలోని సాక్షిగణపతి, హఠకేశ్వరం రోడ్డు మార్గంలో రెండు చిరుతలు సంచరిస్తున్నాయి. దీంతో దేవస్థానం మైకుల ద్వారా స్థానికులకు తగు జాగ్రత్తలు సూచిస్తున్నారు. లాక్డౌన్ వల్ల శ్రీశైలానికి ఎలాంటి రాకపోకలూ లేవు. సున్నిపెంట– శ్రీశైలం మధ్య కూడా రాకపోకలపై నిషేధం ఉంది. అయితే.. సాక్షి గణపతి, హఠకేశ్వరం, చెక్పోస్ట్ తదితర ప్రదేశాల వద్ద విధులు నిర్వహించే సిబ్బంది శనివారం రాత్రి చిరుతల సంచారం గురించి తెలియజేశారు. దీంతో దేవస్థానం అధికారులు మైకుల ద్వారా స్థానికులను అప్రమత్తం చేస్తున్నారు. సాధారణంగా వేసవిలో చిరుతలతో పాటు ఇతర వన్యప్రాణులు నీటి కోసం రహదారులను దాటుకుని వెళ్తుంటాయి. లాక్డౌన్ సందర్భంగా వాహన రాకపోకలు, జనసంచారం లేకపోవడంతో చిరుతలు, జింకలు, అడవి పందులు వంటి వన్యప్రాణులు ఘాట్రోడ్లపై కనిపిస్తున్నట్లు అటవీ అధికారులు తెలిపారు. -
శ్రీశైలం హైవేపై రోడ్డు ప్రమాదం
-
విగ్రహాలు తొలగించాలంటూ ఆందోళన
కందుకూరు: కందుకూరు చౌరస్తా శ్రీశైలం రహదారిపై రాకపోకలకు అడ్డుగా ఉన్న అన్ని విగ్రహాలను తొలగించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం వ్యాపార సంఘం ఆధ్వర్యంలో షాపులను మూసేసి నిరసన తెలిపారు. అనంతరం ర్యాలీగా వెళ్లి మండల సర్వసభ్య సమావేశం కొనసాగుతున్న హాల్ ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..రహదారిపై ఉన్న విగ్రహాలతో రోడ్డు విస్తరణ పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయని, దీంతో డ్రైనేజీ నిర్మాణం లేక మురుగు నీటితో పాటు వర్షం నీరు వెళ్లడం లేదని చెప్పారు. దీంతోపాటు తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు విన్నవించినా ప్రయోజనం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం రహదారులపై విగ్రహాలు తొలగించాలని స్పష్టంగా ఎందుకు పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. అన్ని విగ్రహాలను వదిలేసి తెలంగాణ తల్లి విగ్రహం పెట్టిన వారిపై కేసులు నమోదు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఆందోళనకారులతో తహసీల్దార్ సుశీల, సీఐ విజయ్కుమార్ మాట్లాడారు. నెల రోజుల్లో విగ్రహాలు తొలగిస్తామని హామీ ఇవ్వడంతో వారు శాంతించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
నీటి కోసం జల్పల్లి వాసుల నిరసన
జల్పల్లిలో తీవ్రమైన మంచినీటి ఎద్దడిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం మధ్యాహ్నం షాహిన్నగర్ వద్ద శ్రీశైలం రహదారిపై రాస్తారోకోకు దిగారు. మంచినీటి సమస్యను వెంటనే తీర్చాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేల తీగల కృష్ణారెడ్డి, మున్సిపల్ కమిషనర్ మహ్మద్ సాబెర్ అలీకి తమ ఇబ్బందులను విన్నవించినా స్పందన కరువైందని ఆరోపించారు. పోలీసులు నచ్చజెప్పినా వారు వినలేదు. ఆందోళన కారణంగా ప్రధాన రహదారిపై భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. వెంకటాపూర్ మీదుగా వాహనాలను పోలీసులు దారి మళ్లించారు. నిరసన ఇంకా కొనసాగుతోంది. -
కారు, ఆర్టీసీ బస్సు ఢీ..చిన్నారి మృతి
రంగారెడ్డి(మహేశ్వరం): మహేశ్వరం గేటు వద్ద శ్రీశైలం జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు, స్విఫ్ట్ కారు ఢీకొన్నాయి. ఆదివారం సాయంత్రం 5 గంటలకు జరిగిన ఈ ప్రమాదంలో స్విఫ్ట్కారులో ప్రయాణిస్తున్న ఎనిమిదేళ్ల చిన్నారి మృతిచెందగా, మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. బాధితులంతా హైదరాబాద్ నగరవాసులని సమాచారం.