breaking news
Srinubabu
-
TPCC ప్రధాన కార్యదర్శిగా శ్రీనుబాబు
-
ఐటీ హబ్గా విశాఖ
సాక్షి, అమరావతి: రానున్న కాలంలో విశాఖ నగరం ఐటీ ఉద్యోగాలకు కేంద్రంగా మారనుంది. ఈ రంగంలో కొత్తగా కెరీర్ ప్రారంభించే వారికి అది అవకాశాల గని కానుంది. ముఖ్యంగా ఐటీ, ఐటీ ఆధారిత రంగంలో ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరగనున్నాయి. వచ్చే ఐదేళ్ల కాలంలో ఐటీ రంగంలో ఒక్క విశాఖపట్నంలోనే ఐదులక్షలకు పైగా ఉపాధి అవకాశాలు వస్తాయని పల్సస్ గ్రూపు తన అధ్యయన నివేదికలో వెల్లడించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం విశాఖపట్టణాన్ని పరిపాలన రాజధానిగా ప్రకటించడంతో పాటు ఇక్కడ ఉపాధి అవకాశాలపై అంతర్జాతీయంగా ప్రాచుర్యం కల్పించడంతో ఐటీ హబ్గా విశాఖ వేగంగా ఎదుగుతోందని పల్సస్ గ్రూపు సీఈఓ శ్రీనుబాబు గేదెల తెలిపారు. ఇప్పటికే ఇన్ఫోసిస్, రాండ్స్టాండ్, అమెజాన్, అదానీ డేటాసెంటర్ వంటివి రావడంతో పాటు ఆంధ్రయూనివర్సిటీలో ఆర్టీఫిన్ యల్ ఇంటెలిజెన్స్పై సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్సీ, పారిశ్రామిక రంగంలో నాలుగో తరం టెక్నాలజీని ప్రోత్సహించేందుకు కల్పతరువు పేరుతో సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్సీలు ఇక్కడ ఏర్పాటుకావడంతో అంతులేని ఉపాధి అవకాశాల నిధిగా విశాఖ ఎదుగుతోందన్నారు. ఈ ఏడాది భారతదేశం జీ20 సమావేశాలకు వేదికగా ఎంపిక కావడంతో ఆ అవకాశాన్ని చక్కగా వినియోగించుకుని ఫార్మాస్యూటికల్, హెల్త్కేర్, ఐటీ, ఐటీ ఆధారిత సేవల్లో విశాఖపట్ననికి ఉన్న అవకాశాలు, అందుబాటులో ఉన్న మానవ వనరులను ప్రపంచ దేశాలకు వివరించినట్లు తెలిపారు. రాష్ట్రం నుంచి ఏటా మూడు లక్షలకు పైగా విద్యార్థులు డిగ్రీ పట్టాలను అందుకుంటుంటే అందులో ఒక్క విశాఖ చుట్టుపక్కల నుంచే 1.5 లక్షల మంది వస్తున్నారు. ఉపాధి అవకాశాలు కల్పించడంలో విశాఖకు ఇది కలిసొచ్చే అతిపెద్ద అంశమని ఆ నివేదికలో పేర్కొన్నారు. వచ్చే ఐదేళ్లలో కొలువుల పండగ.. ఇక రాష్ట్రవ్యాప్తంగా వచ్చే ఐదేళ్లలో 10 లక్షల ఉద్యోగాలు రానుండగా అందులో ఒక్క విశాఖలోనే 5 లక్షల ఉద్యోగాలు రానున్నట్లు పల్సస్ గ్రూపు అంచనా వేసింది. ఇందులో ఒక్క ఆర్టీఫిన్ యల్ ఇంటెలిజెన్స్ రంగంలోనే విశాఖలో 50,000 ఉద్యోగాలు వస్తాయని ఆ నివేదిక పేర్కొంది. ప్రస్తుతం విశాఖలోని ఐటీ రంగం 25,000 మందికి ఉపాధి కల్పిస్తుంటే హెల్త్కేర్, ఫార్మా, మెరైన్ ఇండస్ట్రీస్, పర్యాటకం, రక్షణ, విద్య వంటి రంగాలు లక్ష మందికి పైగా ఉపాధి కల్పిస్తున్నాయి. ఈ సంఖ్య ఐదేళ్లలో ఐదు లక్షలకు చేరుతుందని శ్రీనుబాబు వివరించారు. -
మావోయిస్టు కీలకనేత రైనో అరెస్ట్
సాక్షి, పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా): మావోయిస్టు పార్టీ ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు (డీసీఎం) జనుమూరి శ్రీనుబాబు అలియాస్ సునీల్ అలియాస్ రైనోను ఏవోబీలో అరెస్ట్ చేశామని జిల్లా ఎస్పీ సతీష్కుమార్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. సీలేరు పోలీసు స్టేషన్ పరిధి, ఆంధ్ర, ఒడిశా సరిహద్దు అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు, పోలీసులకు జరిగిన ఎదురుకాల్పుల సమయంలో రైనోను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. రైనో ఏవోబీ టెక్నికల్ టీమ్లో, సీఆర్సీ 3వ కంపెనీలో కమాండర్గా, మావోయిస్టు నేత ఆర్కేకు ప్రొటెక్షన్ స్క్వాడ్ కమాండర్గా, ఏవోబీలో మిలిటరీ ప్లటూన్ కమాండర్గా వివిధ హోదాల్లో పనిచేశాడని తెలిపారు. 2018లో అప్పటి అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేల హత్యకేసులోనూ రైనో ప్రధాన నిందితుడని పేర్కొన్నారు. ఆంధ్రా, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టుగా పోలీసుశాఖ రికార్డుల్లో ఉన్నాడని తెలిపారు. అరెస్టయిన శ్రీనుబాబు అలియాస్ రైనోపై ప్రభుత్వం రూ.5 లక్షల రివార్డును గతంలో ప్రకటించిందని పేర్కొన్నారు. రైనోను న్యాయస్థానంలో హాజరుపరిచామని ఎస్పీ తెలిపారు. -
కుర్రాళ్లోయ్! గుర్రాలోయ్!!
బిన్నీ, సచిన్... అంతర్జాతీయ కంపెనీకి గుడ్బై చెప్పి... ఆ కంపెనీకే పోటీ అయ్యారు. భారీ ఈ–కామర్స్ సామ్రాజ్యాన్ని నిర్మించారు. భవీష్... పనితో ప్రేమలో పడిపోయాడు. రోజుకు పద్దెనిమిది గంటలు దాంతోనే!! రొమన్ సైనీ... 21 ఏళ్లకే మెడిసిన్... తర్వాత ఏడాదికే సివిల్స్... అసిస్టెంట్ కలెక్టర్గా ఉద్యోగం!. అయినా... కిక్కు లేదని ఉద్యోగానికి గుడ్బై చెప్పేశాడు.!!రితేష్... కాలేజీ చదువు మధ్యలో వదిలేసి... దేశ మంతా తిరిగాడు. ఆ అనుభవాలతో.. 18 ఏళ్లకే కంపెనీ పెట్టేశాడు. నందన్... ఓ అద్భుతమైన ఐడియాతో ఫెయిలయ్యాడు. అక్కడ నేర్చుకున్న పాఠాలతో మరో అద్భుతాన్ని ఆవిష్కరించాడు. విజయం సాధించాడు. అభిరాజ్ భాల్, వరుణ ఖైతాన్... చక్కని విదేశీ ఉద్యోగాన్ని వదిలేశారు. ఏం చేయాలో తేల్చుకోకుండానే ఇండియాకు తిరిగొచ్చేశారు. వచ్చాక తొలి ప్రయత్నం ఫెయిల్యూరే. మరో ప్రయత్నం భారీ సక్సెస్ ఇచ్చింది. ఇక శ్రీనుబాబు ఫ్రమ్ శ్రీకాకుళం... పాతికేళ్లకే యంగ్ సైంటిస్ట్. అది అందుకునేటపుడు పుట్టిన ప్రశ్న... కంపెనీగా పరిష్కారమయింది. కనిక... ఆలోచనలెప్పుడూ నింగిలోనే. 18 ఏళ్లకే విమాన సంస్థలో ఉద్యోగం. కానీ 22 ఏళ్లకే క్యాన్సర్. డాక్టర్లు కష్టమన్నారు. ఆమె ధైర్యం వదల్లేదు. శరీరం కీమోథెరపీని తట్టుకుంది. మనసు మాత్రం ఓ ఐడియాతో ఆకాశాన్ని అందుకుంది. ఇంతకీ ఎవరు వీళ్లంతా..? ఫ్లిప్కార్ట్... ఓలా... అన్అకాడెమీ... ఓయో... స్విగ్గీ... అర్బన్ క్లాప్... పల్సస్... జెట్ సెట్ గో... వంటి దిగ్గజాల ఆవిష్కర్తలు. ‘చేయకుండా ఉండటం కంటే... నచ్చింది చేసి ఫెయిలయినా ఓకే’ అనే సిద్ధాంతాన్ని మనసా వాచా నమ్మిన ఈ నాటి యువతకు ప్రతినిధులు. వీళ్లేకాదు!! పెద్దగా పెట్టుబడి లేకపోయినా.. స్నేహితులే సహోద్యోగులుగా స్టార్టప్లు పెట్టి విజయం సాధించిన యువతే నేటి భారత బ్రాండ్ అంబాసిడర్లు. చేసే పనేదో సీరియస్గా చెయ్యాలన్నదే వీరి సూత్రం. కాకపోతే వీరికి కలిసొస్తున్నదల్లా... రోజురోజుకూ మారిపోతున్న టెక్నాలజీ. దాని సాయంతోనే వీరు కొత్త సామ్రాజ్యాలు నిర్మిస్తున్నారు. తమ జీవితాన్ని మార్చుకోవటమే కాదు... భారత ముఖచిత్రాన్నే మారుస్తున్నారు. అయితే పైన ప్రస్తావించిన కంపెనీలన్నిటికీ ఒక ప్రత్యేకత ఉంది. అవన్నీ అగ్రిగేటర్లు. అంటే... అవసరం తీర్చేవారిని– అవసరం ఉన్నవారిని కలిపే మధ్యవర్తులన్న మాట. వీటికంటూ సొంత ఉత్పత్తులు, తయారీ కేంద్రాలు వంటివేవీ ఉండవు. ఉన్నదల్లా టెక్నాలజీయే. దాంతోనే ఇవి కొనుగోలుదార్లకు ఎలాంటి బాదరబందీ లేకుండా చేస్తున్నాయి. వారికీ, విక్రయదార్లకు మధ్య తాము ఉంటూ... అమ్మేవారికి సొమ్ము, కొనేవారికి సేవలు సరిగా దక్కేలా చేస్తున్నాయి. మొత్తంగా... ఓ అద్భుతమైన వ్యాపారాన్ని సృష్టిస్తున్నాయి. అలాంటి కొన్ని కంపెనీల సారథుల కథలే ఇవి... పదేళ్లు... 1.4 లక్షల కోట్లు!! పనిచేస్తున్న కంపెనీ... ఓ అంతర్జాతీయ దిగ్గజం. చేతిలో పెట్టుబడేదీ లేకుండా ఆ దిగ్గజాన్ని ఢీకొట్టాలంటే!!. ఎవరైనా నవ్విపోతారు.!!. సచిన్ బన్సల్– బిన్నీ బన్సల్ ఊరూ, పేరూ కలిసినా... ఎలాంటి బంధుత్వమూ లేదు. చండీగఢ్లో పుట్టి ఇద్దరూ అక్కడే చదువుకున్నారు. ఐఐటీ ఢిల్లీలో కలిశారు. ఇంజినీరింగ్ పూర్తయ్యాక ఐటీ రాజధాని బెంగళూరుకొచ్చారు. సచిన్ అమెజాన్లో చేరాడు. బిన్నీ బన్సల్ మాత్రం గూగుల్లో ఉద్యోగానికి రెండుసార్లు దరఖాస్తు చేసి ఫెయిలయ్యాడు. చివరకు తానూ అమెజాన్లోనే చేరాడు. కొన్నాళ్లు పనిచేశాక ఇద్దరికీ ఒకటే అనిపించింది. తాము పనిచేస్తున్న అమెజాన్ స్థాయిలో దేశీ ఈ–కామర్స్ కంపెనీలేవీ సేవలందించటం లేదని!!. అంతే... సేవింగ్స్గా దాచుకున్న రూ.2 లక్షలూ పెట్టి... తమ ఫ్లాట్లోనే 2007లో ‘ఫ్లిప్కార్ట్’ను ఆరంభించారు. పుస్తకాలు విక్రయించేవారిని లిస్ట్ చేసి... అమెజాన్ మాదిరే ఆరంభంలో తామూ ఆన్లైన్లో పుస్తకాలు విక్రయించారు. దాదాపు ఏడాదిన్నర పాటు ఇరువురి తల్లిదండ్రులూ నెలకు రూ.10 వేల చొప్పున ఇచ్చి ఆదుకున్నారు. అది ఆరంభం. తరవాత బుక్స్ నుంచి ఇతరత్రా వస్తువులమ్మే సెల్లర్లను తమ సైట్లో లిస్ట్ చేయటం మొదలెట్టారు. అమెజాన్కు పోటీగా దేశీ ఈ–కామర్స్ సంస్థ ఒకటి రూపుదిద్దుకుంటున్నది తెలిసి... విదేశీ ఇన్వెస్టర్లు ముందుకొచ్చారు. వరసగా ఇన్వెస్ట్ చేయటం మొదలెట్టారు. కంపెనీ విలువ పెరిగింది. ఇద్దరూ బిలియనీర్లయ్యారు. ఈ మధ్యే ఫ్లిప్కార్ట్ను రూ.1.4 లక్షల కోట్ల విలువతో అమెరికన్ దిగ్గజం వాల్మార్ట్ సొంతం చేసుకుంది. ‘‘మా కాన్సెప్ట్ కొత్తదేమీ కాదు. కాకపోతే ఈ–కామర్స్లో నాణ్యమైన సేవలందించటమే మా ప్రత్యేకతగా పనిచేశాం. దానిపైనే దృష్టిపెట్టాం. అందుకే నిలబడ్డాం’’ అంటారు బన్సల్ ద్వయం. క్యాబ్ డ్రైర్తో గొడవొస్తే...? ఉదయం ఏడుకు లేస్తే రాత్రి ఒంటి గంట వరకూ ఏదో ఒక పనిచేస్తూనే ఉంటాడు భవీష్ అగర్వాల్. ఖాళీ దొరికితే సైక్లింగ్ చేస్తాడు. స్క్వాష్ ఆడతాడు. సినిమాలకు, మొబైల్ గేమ్స్కు మాత్రం చాలా దూరం. పుట్టింది లుథియానాలో. 2008లో ఐఐటీ బోంబే నుంచి పట్టా అందుకున్నాక మైక్రోసాఫ్ట్లో మంచి ఉద్యోగమొచ్చింది. రెండేళ్లే పని చేశాడు. కంప్యూటర్కు అతక్కుపోయే ఆ ఉద్యోగంలో కిక్కు లేదనిపించింది. రాజీనామా చేసేశాడు. ముంబయిలో వెబ్సైట్ పెట్టి... ఆన్లైన్లో వివిధ ట్రావెల్ కంపెనీల టూర్ ప్యాకేజీలను విక్రయించటం మొదలెట్టాడు. ‘ట్రావెల్ ఏజెంటుగా మిగిలిపోతావేమో’ అన్నారు అమ్మానాన్నా. ‘పర్వాలేదు కదా!!’ అనుకున్నాడు. ఓసారి బెంగళూరు నుంచి క్యాబ్లో బండిపురా నేషనల్ పార్క్కు వెళుతున్నాడు భవీష్. దార్లో ఆపేసిన క్యాబ్ డ్రైవర్... ముందు మాట్లాడింది తక్కువని, కాస్త ఎక్కువివ్వాలని పేచీ పెట్టాడు. అలా దార్లో బేరమాడటం భవీష్కు నచ్చలేదు. కుదరదన్నాడు. దీంతో డ్రైవరు దార్లోనే భవీష్ను వదిలేసి వెళ్లిపోయాడు. ఆ క్యాబ్ డ్రైవరుపై ఫిర్యాదు చేసి, పోరాడమని సలహా ఇచ్చారు కొందరు. దాంతో లాభం లేదని గ్రహించాడు. ఇంకెవరికీ ఇలాంటివి జరగకుండా టెక్నాలజీతో పరిష్కారం చూపించాలనుకున్నాడు. అలా పుట్టిందే... ఓలా!!. 2010లో మిత్రుడు అంకిత్ భాటి తోడవటంతో... ఓలా కొత్త మలుపు తిరిగింది. భారీ పెట్టుబడులొచ్చాయి. ఈ కంపెనీ విలువ... దాదాపు రూ.50 వేల కోట్లు!!. క్యాన్సర్ ఇచ్చిన ధైర్యం... ‘జెట్ సెట్ గో’ ఏ విమానంలోనైనా చూడండి! ఎక్కువ మంది అమ్మాయిలే ఉంటారు. గ్రౌండ్ స్టాఫ్లోనూ ఆడవాళ్లే. కానీ ఆ విమాన సంస్థల అధిపతులో? అంతా మగవారే. అదీ పరిస్థితి. అలాంటి రంగంలో స్థిరపడాలనుకుంది కనిక టేక్రీవాల్. 18 ఏళ్లకు ఎయిర్వేస్లో ఉద్యోగం వచ్చింది. కొన్నాళ్లు చేశాక ఎంబీఏ కోసం యూకే వెళ్లింది. కానీ ఎంబీఏ పూర్తవుతూనే 2011లో ఆమెకు క్యాన్సర్ అని తేలింది. ఓ డాక్టర్ను కలిసింది. ‘నీకింకా కొన్నిరోజులే మిగిలున్నాయి’ అన్నాడాయన. కానీ ఆమె ముందు ఆ క్యాన్సరే ఓడిపోయింది.‘‘అది వరమో, శాపమో అని చెప్పను. నా జీవితంలో అదో క్లిష్టమైన దశ. చాలా ధైర్యాన్ని, ఖాళీ సమయాన్ని ఇచ్చిన దశ’’ అంటారు కనిక. అప్పట్లో దొరికిన ఖాళీ సమయాన్ని పూర్తిగా భవిష్యత్ ప్రణాళిక కోసం కేటాయించింది. అక్కడే.. ఛార్టర్డ్ విమానాలను, హెలికాప్టర్లను అద్దెకిచ్చే ‘జెట్సెట్గో’ రూపుదిద్దుకుంది. సొంత విమానాలు, హెలికాప్టర్లు ఉన్న వారితో ఓ నెట్వర్క్ను రూపొందించి... అద్దెకు కావాలనుకున్న వారితో సంధానించటమే ఈ సంస్థ పని. అంటే.. ‘గగనతల ఓలా’ అన్నమాట. తల్లిదండ్రులు ఈ ఆలోచనకు ససేమిరా అన్నారు. విమానయాన రంగంలో మహిళలు రాణించలేరన్నారు. కానీ క్యాన్సర్ను గెలిచిన ఈ మొండిఘటం వినలేదు. పునీత్ దాల్మియా, యువరాజ్ సింగ్ వంటి వారిని కలిసింది. 2014లో ఆరంభించిన కొన్నాళ్లకే వారు పెట్టుబడులు పెట్టడంతో జెట్ సెట్గో నిలదొక్కుకుంది. రెండేళ్లు తిరక్కుండానే లాభాల్లోకీ వచ్చింది. కాలేజీ చదువు మధ్యలో ఆపేసి... రితేష్ అగర్వాల్ పుట్టింది ఒడిశాలోని కటక్లో. స్కూల్ చదువు అక్కడే సాగింది. కాలేజీలో అడుగు పెట్టాడు కానీ... అక్కడ ఇమడలేకపోయాడు. క్లాసురూమ్లో కన్నా బయటే నేర్చుకోవాల్సింది చాలా ఉందనుకున్నాడు. చదువు మానేశాడు. గెస్ట్హౌస్లు, టూరిస్ట్ లాడ్జ్లు, బడ్జెట్ హాస్టళ్లను ఆన్లైన్లో లిస్ట్ చేయడానికి ‘ఓరావెల్’ పేరిట ఓ వెబ్సైట్ ఆరంభించాడు. దానికోసం దేశమంతా తిరిగాడు. చాలాచోట్ల బసచేశాడు. ఆయా హోటల్స్ లిస్ట్ చేస్తున్నపుడు... అక్కడ తను ఉండటానికి ఫ్రీగా గది ఇవ్వాలని అడిగేవాడు. ‘‘ఎవ్వరూ ఇవ్వలేదు. నేను వాళ్ల వ్యాపారాల్ని లిస్ట్ చేస్తున్నందుకు వాళ్లు ఆ మాత్రం కూడా ఇవ్వకపోవటం ఆశ్చర్యమనిపించింది’’ అంటాడు రితేష్. అయితే ఇలా దేశమంతా తిరగటంలో రితేష్కు పలు విషయాలు తెలిసొచ్చాయి. వాటిలో మొదటిది... చిన్న హోటళ్లు, బడ్జెట్ హోటళ్లలో గదులు ఏమాత్రం బాగులేవని.! ‘‘ఆన్లైన్లో హోటల్ గదిని ముందుగా బుక్ చేసుకోవాలనుకుంటే అది ఎలా ఉంటుందో తెలీదు. సిబ్బంది ఎలాంటివారో, భోజనం ఎలా ఉంటుందో... ఏమీ తెలీదు. ఇవన్నీ చూశాక... బడ్జెట్ హోటల్స్లో స్టార్ హోటల్ అనుభవాన్నిస్తే విజయం తథ్యమనిపించింది. ఇదే ఓయోకు బీజం వేసింది’’ అంటారు రితేష్. చిన్న బడ్జెట్ హోటల్స్తో ఒప్పందం చేసుకొని... వాటిలో కొన్ని గదుల్ని ఏసీతో, అందంగా, ఆరోగ్యకరంగా మార్చడం చేశాడు. ఫ్రీ వై–ఫై, టీవీ, బ్రేక్ ఫాస్ట్ ఏర్పాట్లు చేశాడు. ఆన్లైన్లో ఫోటోలు కూడా ఉండటంతో... వాటికి ఆదరణ పెరిగింది. ఓయో రూమ్స్తో మొదలై... ఐదేళ్లలో ఓయో టౌన్హౌస్, ఓయో హోమ్స్, ఓయో సిల్వర్ కీ వంటి పలు విభాగాల్లోకి విస్తరించారు. ప్రస్తుతం చైనా, మలేషియా, నేపాల్లోనూ ఓయో సేవలు అందిస్తోంది. అంతర్జాతీయ హోటల్ కంపెనీలతో సహా పలు ఇన్వెస్ట్మెంట్ సంస్థలు ఓయోలో పెట్టుబడులు పెట్టాయి. ఇపుడు ఓయో విలువ... బిలియన్ డాలర్లపైనే! అంటే రూ.6,800 కోట్లపైమాటే. ఆ ఓటమి... చాలా నేర్పింది! నందన్ రెడ్డిది కడప. శ్రీహర్ష మాజేటిది విజయవాడ. ఒకరు ఎమ్మెస్సీ.. మరొకరు ఇంజినీరింగ్. కాకపోతే ఇద్దరూ చదివింది మాత్రం బిట్స్ పిలానీలోనే. శ్రీహర్ష ఇంజినీరింగ్ చదువుతుండగానే క్యాంపస్ ఇంటర్వ్యూలో మంచి ఉద్యోగానికి సెలక్ట్ అయ్యాడు. ఎవరైనా చేరేవారేమో!! కానీ శ్రీహర్ష వద్దనుకున్నాడు. క్యాట్ రాసి ఐఐఎం కోల్కతాలో చేరాడు. పూర్తవుతూనే లండన్లోని ఓ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ పిలిచింది. లండన్ బాగుంటుందని వెళ్ళాడు. సిటీ నచ్చింది కానీ అక్కడి ఉద్యోగం నచ్చలేదు. రెండేళ్లు చేసి వెనక్కి వచ్చేశాడు. స్నేహితుడు నందన్ కలిశాడు. నందన్ అప్పటికే చిన్న వ్యాపారాల్లో ప్రయత్నాలు చేస్తున్నాడు. ‘టెక్నాలజీ, ఉద్యోగాలు, లాజిస్టిక్స్’ మూడూ కలిసి ఉండే కంపెనీని పెడదామనుకున్నారు. సొంత వెబ్సైట్లున్న వ్యాపారులు... డెలివరీ చేయలేక ఈ–కామర్స్ సంస్థల్లో నమోదు చేసుకుంటున్నారని గ్రహించి... వారిని, డీటీడీసీ– ఫెడెక్స్– తదితర కొరియర్ సంస్థలను కలిపేలా ‘డెమొక్రటిక్ షిప్పింగ్’కు రూపకల్పన చేశారు. దీనికోసమే 2013లో ‘బండిల్’ను ఆరంభించారు. కాకపోతే దీనికి తగ్గ టెక్నాలజీని అభివృద్ధి చేయటం వారి వల్ల కాలేదు. ఆ పనిని ఓ కంపెనీకి అప్పగించారు. అది పూర్తయ్యేసరికి ఏడాదిపైనే పట్టింది. తాము తయారు చేయదలచుకున్న ఉత్పత్తి బయటికొచ్చేసరికి మార్కెట్ పరిస్థితులు మారిపోయాయి. అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఈ–కామర్స్ కంపెనీలు సొంత డెలివరీ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. ‘‘మార్కెట్కు మా ఉత్పత్తి పనికిరాదని అర్థమైపోయింది. అదృష్టమేంటంటే మాకు వేరే ఉద్యోగులు లేరు. మేం తప్ప ఎవరూ ఇన్వెస్ట్ చేయలేదు కూడా. అప్పులు కూడా లేవు. ఏడాదిలోపే బండిల్ను మూసేశాం’’ అంటారు స్విగ్గీ ద్వయం.‘బండిల్’ ప్రయాణంలో వారికి కొన్ని విషయాలు తెలిసొచ్చాయి. దేశంలో లాజిస్టిక్ కంపెనీలు దయనీయంగా ఉన్నాయని, వాటికి టెక్నాలజీ ఏమాత్రం అందుబాటులో లేదని తెలిసింది. దీంతో 2014 సెప్టెంబర్లో రెస్టారెంట్లను, వినియోగదార్లను తమ సొంత డెలివరీ యంత్రాంగంతో కలుపుతూ బెంగళూరులో స్విగ్గీని ఆరంభించారు. తరవాత వారికి మరో స్నేహితుడు రాహుల్ జైమిని వారికి తోడయ్యాడు. ఇపుడు దేశంలోని 13 నగరాల్లో సేవలందిస్తున్న స్విగ్గీకి 50 లక్షల మంది కస్టమర్లున్నారు. 25 వేల రెస్టారెంట్లతో ఒప్పందాలున్నాయి. భారీగా నిధులూ వచ్చాయి. సంస్థ విలువ... దాదాపు రూ.17వేల కోట్లు!!. ఫెయిల్యూర్తో... గెలిచారు! కాలేజీ నుంచి స్నేహితులైన అభిరాజ్ భాల్, వరుణ్ ఖైతాన్ ఇద్దరిదీ అమెరికాలోని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్లో ఉద్యోగం. మంచి జీతం. కానీ ఇద్దరిదీ ఒకటే ఆలోచన. ఇండియాకి వెళ్లి ఏదో ఒక వ్యాపారం పెట్టాలని. ఎంత చర్చించుకున్నా ఏం వ్యాపారం పెట్టాలో మాత్రం తేల్చుకోలేకపోయారు. అలా చర్చిస్తుంటే... ఏమీ చెయ్యకుండానే మిగిపోతామని భయమేసి... 2013లో ఉద్యోగాలకు గుడ్బై చెప్పి ఇండియాకు తిరిగి వచ్చేశారు. చాలా ఆలోచించిన మీదట.. బస్సులు, రైళ్లు, విమానాల్లో ఆన్డిమాండ్ సినిమాల్ని ప్రదర్శించే బాక్స్లను తయారు చెయ్యాలనుకుని... ‘సినిమాబాక్స్’ సంస్థను ఏర్పాటుచేశారు. ఆరునెలలు గడిచాయి. ఆ మార్కెట్ చాలా చిన్నదని, దాన్లో విస్తరణకు పెద్ద అవకాశాల్లేవని వారికి అర్థమైంది. అదేమీ జీవితాన్ని మార్చే టెక్నాలజీ కాదని భావించారు. బాధపడ్డా... మూసేశారు. ఇంతలో ‘బగ్గీ.ఇన్’ పేరిట రైడ్షేర్ సంస్థను నడుపుతున్న రాఘవ్చంద్ర కలిశాడు. తనదీ ఇలాంటి కథే. బగ్గీ పెద్దగా సక్సెస్ కాలేదు. దీంతో మూసేశాడు. అప్పుడు వీళ్ల దృష్టి దేశంలో అసంఘటితంగా ఉన్న వృత్తి పని కార్మికులపై పడింది. ప్లంబర్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, యోగా ట్రెయినర్... ఇలా ఎవరు కావాలన్నా సామాన్యులు పడుతున్న బాధలు చూశారు. వారందరినీ ఆన్లైన్లోకి తెద్దామనుకున్నారు. ఈ ఆలోచనను చాలామందితో పంచుకున్నారు. అంతా నవ్వేశారు. అభిరాజ్, వరుణ్, రాఘవ్ మాత్రం ఎవరిమాటా వినలేదు. టెక్నాలజీ తోడుగా వృత్తి పనివాళ్లందరినీ ఒక వేదికపైకి తెస్తూ.. ‘అర్బన్క్లాప్’ను ఏర్పాటు చేశారు. ‘అవసరం నుంచి పుట్టిన ఏ ఆలోచనకైనా తిరుగుండదు’ అనే మాటను నిజం చేస్తూ అర్బన్ క్లాప్ ఇపుడు దేశంలోని ప్రధాన నగరాలన్నిటా విస్తరించింది. వృత్తి నిపుణుల వివరాలు ఇవ్వటానికే పరిమితం కాకుండా... మొదటి నుంచీ దాన్ని తగిన ఆదాయాన్నిచ్చే వ్యాపారంగా మార్చటానికి ప్రయత్నించారు. ఫలితం... రతన్ టాటా దీన్లో పెట్టుబడి పెట్టారు. అంతేకాదు! యాపిల్ సీఈఓ టిమ్కుక్ ఇండియాకు వచ్చినపుడు వీరిని కలిసి అర్బన్క్లాప్ సేవల్ని అడిగి తెలుసుకున్నారు కూడా. కంపెనీ విలువ ఇదమిత్థంగా తెలియకపోయినా... ఇప్పటికే ఇది దాదాపు రూ.40 కోట్ల నిధుల్ని సమీకరించింది. కలెక్టరు గిరీ... కాదనుకున్నాడు!! ఏ యువకుడైనా ఇలా ఉండాలి అని రోమన్ సైనీని చూపించొచ్చు!! ఇలా ఉండకూడదు అని కూడా సైనీని కొందరు చూపిస్తారేమో!! ఎందుకంటే మెడిసిన్ చదివిన వెంటనే... 22 ఏళ్లకే సివిల్స్ రాసి సెలక్టయిపోయాడు. శిక్షణ పూర్తయ్యాక మధ్యప్రదేశ్లోని జబల్పూర్ జిల్లా సహాయ కలెక్టర్గా ఉద్యోగం కూడా వచ్చేసింది. పాతికేళ్లు కూడా రాకుండానే ఇలా సెటిలైపోతే ఇంకేం కావాలి..? సైనీని మాత్రం అసంతృప్తి తొలిచేస్తోంది. ఇంకేదో చెయ్యాలనే తపన కుదురుగా ఉండనివ్వటం లేదు. అంతే!!. ఉద్యోగానికి రాజీనామా చేసేశాడు. ఇంట్లో వాళ్లు వద్దన్నారు. వినలేదు. తనకు మెడిసిన్, సివిల్ సర్వీస్ రాసిన అనుభవం ఉంది కనక వైద్యులు, ప్రోగ్రామర్లు, సివిల్ సర్వెంట్లు కావాలనుకున్న వారికి... పాఠాలు చెప్పి యూట్యూబ్లో పెట్టడం మొదలెట్టాడు. ఈ లెక్చర్లు చాలా మందికి పనికొచ్చాయి. ఓ పది మంది ఐఏఎస్లు తయారయ్యారు. తను ఉద్యోగం చేస్తే... ఒకడే! కానీ పది మంది ఐఏఎస్లను తయారు చేశాడు!! ఆ కిక్కు.. సైనీకి నచ్చింది. స్నేహితుడు గౌరవ్ ముంజల్తో కలిసి 2015 డిసెంబరు 15న లాంఛనంగా అన్అకాడెమీని ఆరంభించాడు. దానిపేరిట వందల వీడియోలు అప్లోడ్ చేశారు. తరవాత విద్యార్థులు, విద్యా నిపుణులు, లెక్చరర్లు తమ సొంత పాఠాల్ని ఎవరికి వారు అప్లోడ్ చేసేలా ఏర్పాట్లు చేశాడు. వీళ్లందరూ అందించే కంటెంట్... మారుమూల గ్రామాలకు చేరాలన్నది రోమన్ సైనీ ఆశయం. నాణ్యమైన విద్యకు దూరంగా ఉన్న పలు గ్రామాల్లోని విద్యార్థులు... నిపుణులైన విద్యావేత్తల తాలూకు పాఠాల్ని ఇలా ఆన్లైన్ ద్వారా అందుకోవచ్చన్నది తన ఆలోచన. ఈ మధ్యే అన్అకాడెమీలో అంతర్జాతీయ సంస్థలు రూ.15 కోట్లు పెట్టుబడి పెట్టాయి. సంస్థ విలువ దాదాపు రూ.75–80 కోట్లు!!. ఏ డాక్టర్నైనా కన్సల్ట్ చేయొచ్చు!! సతీష్ కణ్ణన్, దీనదయాళన్ ఇద్దరూ ఐఐటీ మద్రాస్లో స్నేహితులు. 2012లో ఇంజినీరింగ్ పూర్తయి బయటికొచ్చాక సతీష్ పుణెలోని ఫిలిప్స్ హెల్త్కేర్లో చేరాడు. దీనదయాళన్ మాత్రం ఐఐటీలోని ఇన్నోవేషన్ సెంటర్లో డయాబెటిక్ రెటినోపతిని కనుక్కునే పరికరం తయారీలో మునిగిపోయాడు. ఏడాది ఉద్యోగం చేసిన సతీష్... ఉద్యోగంలో భాగంగా హెల్త్కేర్ సేవల్ని బాగా గమనించాడు. స్పెషలిస్టు వైద్యుల సేవలు సామాన్యులకు అందటం చాలా కష్టమవుతోందని తెలుసుకున్నాడు. దీన్ని టెక్నాలజీ సాయంతో అధిగమించాలని భావించి... దీనదయాళన్తో చెప్పాడు. ఇద్దరూ కలిసి 2013లో పాసర్జ్ టెక్నాలజీస్ను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి తమ ఆలోచనను అమల్లోకి తేవటంపై దృష్టిపెట్టారు.దాదాపు రెండేళ్ల కృషి తరవాత వారిద్దరూ డాక్స్యాప్ను అభివృద్ధి చేయగలిగారు. 2015లో డాక్స్యాప్ను ఆరంభించారు. స్పెషలిస్ట్ వైద్యులు, పేషెంట్లను కలిపే యాప్ ఇది. చాట్ లేదా కాల్ ఆధారంగా ఎవరైనా సరే... దేశంలోని ఏ స్పెషలిస్టు వైద్యుడినైనా 30 నిమిషాల్లోపే సంప్రతించవచ్చు.కన్సల్టేషన్, మందుల డెలివరీ, ఇంటిదగ్గరే ల్యాబ్టెస్టుల వంటి సేవలందిస్తున్న డాక్స్ యాప్లో గైనిక్, సైక్రియాట్రీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ, కార్డియాక్, ఆంకాలజీ, న్యూరో, ఇన్ఫెర్టిలిటీ, పీడియాట్రీ, డెర్మటాలజీ, జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్ వంటి విభాగాల్లో 1500కు పైగా వైద్యులున్నారు. ఇప్పటికే సంస్థలో పలు ఇన్వెస్ట్మెంట్ కంపెనీలు దాదాపు రూ.50 కోట్ల వరకూ పెట్టుబడి పెట్టాయి. లా చదివి... ఆరోగ్య రంగంలోకి!! నయ్యా సగ్గి గురించి ఆమె తల్లికెప్పుడూ ఆందోళనే. ఎందుకంటే స్కూలు స్థాయిలో సగ్గి మార్కులు అంతంత మాత్రంగానే ఉండేవి. ‘పెద్దయ్యాక ఏమవుతావో’ అని తల్లి ఎప్పుడూ బెంగపడుతూనే ఉండేది. ముంబైకి చెందిన సగ్గి... అందరు పిల్లల్లానే ఆ వయసులో ఎలాంటి భవిష్యత్ ప్రణాళికలూ లేకుండానే పెరిగింది. కాకపోతే అప్పుడప్పుడూ నేషనల్ లా స్కూల్లో చదివే తన సోదరి చెప్పే మాటలు మాత్రం ఆమెను ఆకర్షించేవి. ఒక దశలో... తానూ బెంగళూరులోని నేషనల్ లా స్కూల్లో చదవాలని ఫిక్సయిపోయింది. తల్లి ఆందోళన పెరిగిపోయింది. ‘తరవాత బాధ పడతావేమో!’ అని హెచ్చరించింది. సగ్గి తను గనక ఒక నిర్ణయం తీసుకుంటే... ఇక ఎవరి మాటా వినే ప్రసక్తే లేదు. కష్టమైన లా ఎంట్రన్స్ నెగ్గి... ఎన్ఎల్ఎస్లో సీటు సంపాదించింది. అదిగో... అక్కడే ఆమె జీవితం మలుపు తిరిగింది. ‘అదంతా వేరే ప్రపంచం. ఆడుతూ పాడుతూ గడిచిపోయింది. కెజి బాలకృష్ణన్ వంటి న్యాయ మూర్తులతో పాటు విదేశీ న్యాయ నిపుణులనూ కలిసే అవకాశం దక్కింది’ అంటారామె. చదువుతున్నపుడే స్వచ్ఛంద సంస్థ ‘ప్రథమ్’ కోసం పనిచేసింది సగ్గి. అదిగో... ఆ తపనే ఆమెకు ప్రతిష్ఠాత్మక ఫుల్బ్రైట్, హార్వర్డ్ స్కాలర్షిప్లు తెచ్చిపెట్టింది. హార్వర్డ్లో నాలుగేళ్లూ ఇట్టే గడిచిపోయాయి. ఆరోగ్య రంగంలో కొత్త ఆవిష్కరణలు, వాటిని భారీస్థాయికి తీసుకెళ్లటం వంటి అంశాలపై ఆమె ప్రాజెక్టు చేసింది. తరవాత ఇండియాకు తిరిగొచ్చింది. ‘ఏం చేసినా ఒక తరాన్ని ప్రభావితం చేయగలగాలి’ అనుకునే సగ్గి.. తన స్నేహితులు తల్లి కాబోయేటపుడు సరైన సమాచారం, ఉత్పత్తులు దొరక్క పడుతున్న ఇబ్బందులు గమనించింది. న్యూక్లియర్ కుటుంబాల కారణంగా... ఇంటర్నెట్లో టూర్ ప్యాకేజీలు, సినిమా టికెట్లు కూడా బుక్ చేసే తల్లిదండ్రులు... పిల్లల విషయంలో మాత్రం సరైన సలహా పొందలేకపోతున్నారని గ్రహించింది. పాత స్నేహితుడు మొహిత్కుమార్తో అన్నీ చర్చించింది. అదిగో... అక్కడే ‘బేబీ చక్ర’ రూపుదిద్దుకుంది. కాబోయే తల్లిదండ్రుల నుంచి.. బిడ్డను కన్న తల్లిదండ్రుల వరకూ వారికి కావాల్సిన సలహాలు, సూచనలు నిపుణుల ద్వారా ఇప్పిస్తూ... వారికి మార్గ దర్శకత్వం వహించటమే బేబీ చక్ర పని. అంతేకాదు. బేబీ ఉత్పత్తులు, ఇతరత్రా సర్వీసులు అందించేవారు కూడా దీన్లో లిస్టయ్యారు. మొత్తమ్మీద పిల్లల జీవితానికి కావాల్సిన అన్నిటినీ సంస్థ అందిస్తోంది. ఇటీవలే రెండు దశలుగా నిధులు కూడా వచ్చాయి. తొలినాళ్లలోనే ముంబై ఏంజిల్స్ పెట్టుబడి పెట్టగా... తరవాత విదేశీ నిధులొచ్చాయి. కాకపోతే ఇప్పటికీ సగ్గి తల్లికి కుమార్తె విషయంలో ఆందోళనే. వారానికోసారి ఫోన్ చేసి... ‘‘బేబీ చక్రలో కొత్తగా ఏం వచ్చాయి?’’ అని అడుగుతుంటుంది. వ్యాపారానికి ‘పల్స్’ దొరికింది..! శ్రీనుబాబుది శ్రీకాకుళం జిల్లా పాలకొండ. రోజూ స్కూలుకు 15 కిలోమీటర్లు నడిచి వెళ్లాలి. అక్కడే ఇంటర్ పూర్తి చేశాడు. ఏయూలో బీఫార్మ్,. ఎంటెక్ బయోటెక్నాలజీ పూర్తయింది. పీహెచ్డీలో భాగంగా శరీరంలోని ప్రొటీన్లను విÔó్లషించి... మధుమేహ ముప్పును ముందే కనుక్కోవటంపై పరిశోధన చేశారు. 2006లో దక్షిణ కొరియాలోని సియోల్లో అంతర్జాతీయ ప్రొటియం ఆర్గనైజేషన్... ఈ పరిశోధన చేసినందుకు శ్రీనుబాబుకు యంగ్సైంటిస్ట్ అవార్డిచ్చింది. అపుడాయన వయసు 24 ఏళ్లు. ఈ రీసెర్చ్కోసం తాను ఆంధ్రా వర్సిటీతో పాటు వారి సిఫారసుతో హైదరాబాద్లోని ఎన్ఐఎన్, సీసీఎంబీ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థల్లో పలు జర్నల్స్ చదివానని, అలాంటివి ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉందని చెప్పారాయన. చెప్పటమే కాదు! ప్రతి యూనివర్సిటీ ప్రచురించే పరిశోధన పత్రాల్ని అందరికీ అందుబాటులో ఉంచే ‘ఓపెన్ యాక్సెస్ జర్నల్’ను ఆరంభించారు కూడా. దానికి అంతర్జాతీయ సంస్థల అనుమతి పొందారు. అదే ఒమిక్స్ ఇంటర్నేషనల్కు నాంది. ఇక్కడ ఇంకో చిక్కుంది. ఈ జర్నల్స్ను ఎడిట్ చేయటానికి ఏటా ఎడిటోరియల్ బోర్డు సమావేశమవుతుంది. అంతా వివిధ రంగాల్లో నిపుణులే కావటంతో విదేశాల్లో వారికి ఆతిథ్యమివ్వటం... సమావేశం నిర్వహించటం బాగా ఖర్చుతో కూడుకున్న పని. అది ఇంకో వ్యాపారానికి నాంది పలికింది. ఎడిటోరియల్ బోర్డు సమావేశాలప్పుడు దానికి హాజరయ్యే నిపుణులతో అక్కడే సదస్సులు నిర్వహించటం మొదలెట్టారు శ్రీను బాబు. పల్సస్.కామ్ ద్వారా తాము ప్రచురించే జర్నల్స్ను చదివే 5 కోట్ల మంది పాఠకులకు ఆ సమాచారాన్ని చేరవేశారు. కావాల్సిన వారు ఆ సదస్సులకు హాజరు కావొచ్చన్నారు. అది ఊహించని విజయాన్నిచ్చింది. ఇపుడు ఏటా 3వేలకు పైగా సదస్సులు నిర్వహించే స్థాయికెళ్లారు. ‘ఒమిక్స్’కు ఇవన్నీ భారీ ఆదాయ మార్గాలుగా మారాయి. పరిశోధక జర్నల్స్ను జర్మన్, చైనీస్ తదిరత భాషల్లోకి అనువాదం చేస్తుండటంతో రెవెన్యూ బాగా పెరిగింది. టర్నోవర్ రూ.1,300 కోట్ల స్థాయికి చేరింది. ఉద్యోగుల సంఖ్య 4,800కి పెరిగింది. తాజాగా భారతీయ భాషల్లోకి ఈ జర్నల్స్ను అనువదించే ప్రాజెక్టుకూ శ్రీకారం చుట్టింది పల్సస్. ‘‘మన చుట్టూ వ్యాపారావకాశాలు ఉంటాయి. వాటిని చూడాలి. జనం సమస్యలకు పరిష్కారంగా ఏదైనా వ్యాపారాన్ని ఆరంభిస్తే... దానికి తిరుగుండదు’’ అంటారు శ్రీనుబాబు గేదెల. ఇవన్నీ ‘అగ్ర’గేటర్లు... అమెజాన్ ఒక్కవస్తువూ తయారు చెయ్యదు. ఏ వస్తువూ నేరుగా అమ్మదు. కానీ అమ్మేవారంతా ఈ సైట్లోనే ఉంటారు కనక ప్రపంచమంతా కొనేది అమెజాన్లోనే!! రైడ్ షేరింగ్ సంస్థ ఉబెర్దీ ఇలాంటి కథే. సొంతగా ఒక్క ట్యాక్సీ లేదు. కానీ ప్రపంచంలో అతిపెద్ద ట్యాక్సీ సర్వీస్ ఇదే! ఇటీవలే ఇది ప్రపంచ వ్యాప్తంగా 10వేల కోట్ల ట్రిప్పులను పూర్తిచేసుకుంది. ఇక సొంతగా ఒక్క హోటలూ లేని ‘ఎయిర్ బీఎన్బీ’... ప్రపంచంలోనే అతిపెద్ద హాస్పిటాలిటీ సంస్థ. ఇంటర్నెట్ దిగ్గజం, నెంబర్ వన్ వీడియో ఛానెల్ యూట్యూబ్కు సొంత వీడియో ఒక్కటీ ఉండదు. ఇదే అగ్రిగేటింగ్ కంపెనీల మహత్యం. అవసరం ఉన్నవారిని– ఆ అవసరాన్ని తీర్చేవారిని ఒకే వేదికపైకి తేవటమే ఇవి చేసే పని. ఇక్కడ ఇంకో గమ్మత్తు కూడా ఉంది. ఇంటర్నెట్ సాయంతో యావత్తు ప్రపంచాన్నీ ఏలుతున్న ఈ టాప్ అగ్రిగేటర్లన్నీ... అగ్రరాజ్యం అమెరికాలో పురుడు పోసుకున్నవే. అమెరికన్ కంపెనీలే!వీటి స్ఫూర్తితో భారతీయ యువత మరింత ముందుకు వెళుతోంది. ఇక్కడి స్థానిక సమస్యలకు వినూత్నమైన పరిష్కారాలు వెదుకుతోంది. చేతిలో సొమ్ము లేకున్నా వీరికి దమ్ము పుష్కలంగా ఉంది. అమ్మానాన్నలు అంబానీలు కాకున్నా... ఉన్న ఉద్యోగానికి సైతం గుడ్బై కొట్టేసేంత తెంపరితనమూ ఉంది. ఫ్లిప్కార్ట్, ఓలా వంటి యూనికార్న్లే కాదు. విద్యారంగంలో ఎడ్యుటర్, లెర్న్ సోషల్... రైడ్షేర్ రంగంలో జుగ్నూ, డ్రైవర్జ్... ట్రావెల్స్లో అభిబస్, రెడ్బస్... ఫుడ్ డెలివరీలో జొమాటో, హోలాషెఫ్... హెల్త్కేర్లో ప్రాక్టో, లైబ్రేట్... ఆతిథ్య రంగంలో నెస్ట్ ఎవే... గృహాలంకరణకు సంబంధించి లివ్ స్పేస్... లాజిస్టిక్స్లో లింక్, పోర్టర్... వినోద రంగంలో బుక్ మైషో... ఇవన్నీ ఆయా రంగాల్లో దేశీయంగా విజయం సాధించిన అగ్రిగేటర్లని చెప్పాలి. వీటిలో దాదాపు అన్ని కంపెనీల్లోకీ భారీగానే పెట్టుబడులొచ్చాయి. – మంథా రమణమూర్తి -
పరిశోధనల ‘పల్స్’.. పట్టేశారు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఒక ఆలోచన... ఒక వ్యాపారాన్ని పుట్టించింది. అందులో వచ్చిన కష్టాలు... మరో రెండు వ్యాపారాల్ని సృష్టించాయి. సంస్థను రూ.1,300 కోట్ల టర్నోవర్ స్థాయికి తీసుకెళ్లి... 4,800 మందికి ఉపాధినిస్తున్నాయి. అదే ఒమిక్స్ ఇంటర్నేషనల్. శాస్త్ర, సాంకేతిక పత్రాల్ని ఆన్లైన్లో ప్రచురించే ఈ సంస్థకు... హైదరాబాదే ప్రధాన కేంద్రం. దీని సారథి డాక్టర్ గేదెల శ్రీనుబాబు.. ఫ్రమ్ శ్రీకాకుళం. పీహెచ్డీ చేయాలన్నా... పరిశోధన పత్రాలు రాయాలన్నా అంత తేలికకాదు. ఎంతో చదివి... ఎన్నో విషయాలు తెలుసుకోవాలి. మరి చదవటానికి మెటీరియల్ ఎలా..? ఇదిగో... ఈ ఒక్క ఆలోచనే ‘ఒమిక్స్ ఇంటర్నేషనల్’కు పునాది. శ్రీకాకుళానికి చెందిన శ్రీనుబాబు... 2006లో సియోల్లో తనకు యంగ్ సైంటిస్ట్ అవార్డు ఇచ్చినపుడు... హ్యూమన్ ప్రొటీయం ఆర్గనైజేషన్ (హూపో) సదస్సులో ఈ అంశాన్ని లేవనెత్తారు. వారికీ విషయం అర్థమైంది. ప్రచురితమైన మెటీరియల్ను అందరికీ అందుబాటులో (ఓపెన్ యాక్సెస్) ఉంచడానికి వారు అనుమతించారు. అది... ఓపెన్ యాక్సెస్ జర్నల్ను పుట్టించింది. ఈ జర్నల్లో పరిశోధన పత్రాలను ప్రచురించటానికి డబ్లు్యహెచ్ఓ, ఎన్ఐహెచ్ వంటి అంతర్జాతీయ సంస్థలు తప్పనిసరి చేయటంతో... ఫీజు రూపంలో కొంత ఆదాయమూ మొదలైంది. ఇంతలోనే ఓపెన్ యాక్సెస్కు తోడుగా... ప్రొటీన్ల అంశంపై ప్రొటీయం జర్నల్ తెచ్చారు. తాను చదివిన స్టాన్ఫోర్డ్ పూర్వ విద్యార్థుల సాయంతో వివిధ అంశాలపై శాస్త్రీయ జర్నల్స్ను ఆన్లైన్లో ప్రచురించటం మొదలెట్టారు. అంతా ఈ వెబ్ను ఆశ్రయించటంతో... ర్యాంకింగ్తో పాటు పబ్లిష్ చేసేవారూ పెరిగారు. అలా... ఒమిక్స్ ఎదుగుదల మొదలైంది. ఇదే రంగంలోని పల్సస్ కూడా ఒమిక్స్తో జతకట్టింది. ప్రస్తుతం పల్సస్కు సీఈఓగానూ శ్రీనుబాబు వ్యవహరిస్తున్నారు. ఒక కష్టం... మరో వ్యాపారం ఇపుడు ఆన్లైన్లో ఒమిక్స్ జర్నల్స్కు దాదాపు 5 కోట్ల మంది పాఠకులున్నారు. కాకపోతే ఈ జర్నల్స్ను ఏటా ఆయా రంగాల్లో ప్రముఖులు సమీక్షించాలి. దీనికి ఎడిటోరియల్ బోర్డు సమావేశమవ్వాలి. వివిధ దేశాల్లోని నిపుణుల్ని దీనికోసం ఒకచోటికి చేర్చటం చాలా కష్టంగా ఉండేది. వారి విమాన ఖర్చులు... హోటల్ వసతి... ఆర్థికంగా భారమయ్యేవి. మరెలా..? బాగా ఆలోచించిన శ్రీనుబాబు... ఆ ప్రముఖులు వచ్చేచోట వారికి సంబంధించిన రంగాలపై సదస్సులు నిర్వహించటం మొదలెట్టారు. వీటికి నిర్ణీత ఫీజు చెల్లించి హాజరయ్యేందుకు యూజర్లు విపరీతమైన ఆసక్తి చూపించేవారు. దీంతో ‘సదస్సుల నిర్వహణ’ అనేది కొత్త వ్యాపారంగా మారింది. 2010లో తొలి సదస్సు జరగ్గా... తరవాత సీఎంఈ, సీపీడీ అక్రిడేషన్లు కూడా రావటంతో ఇపుడు ఏటా 3,000కు పైగా సదస్సులను నిర్వహిస్తోంది ఒమిక్స్. తమ విదేశీ ఆదాయంలో ఈ సదస్సుల వాటాయే ఎక్కువని, దీన్లో మార్జిన్లు 10–15 శాతం మధ్య ఉంటాయని శ్రీనుబాబు ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. ‘‘మా జిల్లాలో కిడ్నీ బాధితులెక్కువైన ఉద్ధానంలో వారికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుగులో కరపత్రం ఇస్తే తప్ప అర్థం కావటం లేదు. ఇది చూశాక పరిశోధన పత్రాల్ని వివిధ భాషల్లోకి అనువాదం చేయాల్సిన అవసరం తెలిసింది. రష్యన్, చైనీస్, జర్మన్తో మొదలెట్టాం. ఆదాయం పెరిగింది. దేశీయంగా తెలుగు, తమిళం, హిందీల్లో అనువాదానికి ప్రయత్నాలు చేస్తున్నాం’’ అన్నారు శ్రీనుబాబు. హిందీకి సంబంధించి యూపీ సర్కారుతో ఒప్పందం కుదరగా... కేంద్రం సైతం ఓకే చేసి విశాఖలో ఏర్పాటు చేస్తున్న కేంద్రానికి రూ.20 కోట్ల ప్రోత్సాహకాలిచ్చింది. ‘‘మా దగ్గర వ్యవసాయం, ఆరోగ్యం, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి 2.5 కోట్ల పేజీల సమాచారం ఉంది. వీటి అనువాదం వల్ల 10వేల ఉద్యోగాలొస్తాయి’’ అన్నారాయన. మూడేళ్లలో ఐపీఓకు! ప్రస్తుతం ఒమిక్స్లో 4,800 మంది పనిచేస్తున్నారు. హైదరాబాద్ నానక్రామ్గూడ సెజ్లో ఏర్పాటుచేసిన కార్యాలయంలో 3,700 మంది పనిచేస్తుండగా, చెన్నైలో 400, గుర్గావ్లో 300 మంది పనిచేస్తున్నారు. విశాఖలో 25వేల చదరపుటడుగుల్లో ఏర్పాటు చేస్తున్న కార్యాలయంలో 1,000 ఉద్యోగాలు రానున్నట్లు చెప్పారాయన. ‘‘వార్షికంగా విదేశాల్లో రూ.900 కోట్లు, దేశీయంగా రూ.400 కోట్ల టర్నోవర్ నమోదు చేస్తున్నాం. మరో మూడేళ్ల తరవాత 2021లో ఐపీఓకు వెళ్లే ఆలోచన ఉంది. అప్పటికి 10వేల ఉద్యోగుల స్థాయికి చేరుకుంటాం’’ అని వివరించారు. శ్రీను ఫ్రమ్ శ్రీకాకుళం.. శ్రీనుబాబు కథ తెలుసుకుంటే ఆశ్చర్యమనిపించకమానదు. శ్రీకాకుళంలోని బూర్జ మండలంలో దిగువ మధ్య తరగతి కుటుంబంలో పుట్టి... అక్కడే హైస్కూలు చదువు పూర్తిచేశారు. ఇంటర్ పాలకొండలో చదివాక... టాపర్గా ఆంధ్రాయూనివర్సిటీలో బీఫార్మ్లో అడుగుపెట్టారు. అక్కడే ఎంటెక్ బయో టెక్నాలజీ చేసి... ‘అప్లికేషన్ ఆఫ్ మేథమెటికల్ మోడల్స్ టు డిటెక్ట్ డయాబెటిక్ ఎర్లీ’ అనే అంశంపై పీహెచ్డీ చేశారు. అంటే ప్రొటీన్ల విశ్లేషణతో మధుమేహ ముప్పును ముందే తెలుసుకోవటం అన్నమాట. దీనికి సియోల్లోని హ్యూమన్ ప్రొటీయం ఆర్గనైజేషన్ ‘యంగ్ సైంటిస్ట్’ అవార్డునిచ్చింది. అదే మేథమెటికల్ మోడల్స్ను వర్తింపజేస్తూ ప్రొస్టేట్ క్యాన్సర్పై పరిశోధనకు స్టాన్ఫోర్డ్ నుంచి పిలుపొచ్చింది. ఈ పరిశోధనలకు తగిన మెటీరియల్ కోసం తరచూ హైదరాబాద్లోని సీసీఎంబీ, ఐఐసీటీకి తిరిగేవాడినని, ఈ కష్టాలే ఓపెన్ యాక్సెస్ జర్నల్కు.. ఒమిక్స్ ఇంటర్నేషనల్కు పునాది వేశాయని చెబుతారు శ్రీనుబాబు. -
ఏటా లక్ష మందికి గర్భాశయ కేన్సర్
ఒమిక్స్ గ్రూప్ ఎండీ డాక్టర్ శ్రీనుబాబు వెల్లడి గ్లోబల్ కేన్సర్ అండ్ మెడికేర్పై అంతర్జాతీయ సదస్సు హైదరాబాద్: ‘‘దేశంలో ఏటా లక్ష మందికి పైగా మహిళలు గర్భాశయ సంబంధ కేన్సర్ బారిన పడుతున్నారు. పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే ఇలాంటి కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. శారీరక సంబంధాలే ఇందుకు ప్రధాన కారణమైనప్పటికీ, వ్యాధి పట్ల ప్రజలకు విస్తృతమైన అవగాహన కల్పించడమే సరైన పరిష్కారం’’ అని ప్రపంచ యువ శాస్త్రవేత్త పురస్కార గ్రహీత, ఒమిక్స్ గ్రూప్ మేనేజింగ్ డెరైక్టర్ డాక్టర్ జి.శ్రీనుబాబు పేర్కొన్నారు. ఒమిక్స్ గ్రూప్ ఆధ్వర్యంలో సోమవారమిక్కడి హెచ్ఐసీసీలో ‘గ్లోబల్ కేన్సర్ అండ్ మెడికేర్ సమ్మిట్-2014’ పేరిట అంతర్జాతీయ సదస్సు ప్రారంభమైంది. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనుబాబు మాట్లాడుతూ.. సెర్వికల్ కేన్సర్తో పాటు మహిళల్లో బ్రెస్ట్, ఓరల్ క్యావిటీ, ఓవరీ, ల్యూకేమియా, థైరాయిడ్, లింపోమా, ఫర్నిక్స్.. పురుషుల్లో నోటి, గొంతు, కాలేయం, మెదడు తదితర కేన్సర్ కేసులు తరచుగా నమోదవుతున్నాయని వెల్లడించారు. నిమ్స్ మాజీ డెరైక్టర్ డాక్టర్ కాకర్ల సుబ్బారావు మాట్లాడుతూ.. కేన్సర్ పట్ల ప్రజలకు అవగాహన కార్యక్రమాలు, వ్యాధి నివారణలో ఆధునిక ఆవిష్కరణల కోసం ఇటువంటి సదస్సులు ఎంతగానో దోహదపడతాయని అభిప్రాయపడ్డారు. -
దానికి ఎంతో ధైర్యం కావాలి
‘‘ప్రస్తుత ట్రెండ్లో హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు తీయాలంటే ఎంతో ధైర్యం కావాలి. అందుకే ‘చండీ’ నిర్మాతలను కచ్చితంగా మెచ్చుకోవాలి’’ అని కృష్ణంరాజు అభినందించారు. ప్రియమణి టైటిల్ రోల్ పోషించిన ‘చండీ’లో కృష్ణంరాజు శక్తిమంతమైన పాత్ర చేశారు. సముద్ర దర్శకత్వంలో డాక్టర్ శ్రీనుబాబు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 8న విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్లో జరిగిన ప్రెస్మీట్లో కృష్ణంరాజు మాట్లాడుతూ -‘‘ఈ కథతో పాటు, నా పాత్ర బాగా నచ్చింది కాబట్టే చేయడానికి అంగీకరించాను. ఇందులో నాపై చిత్రీకరించిన అల్లూరి సీతారామరాజు పాట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది’’ అని తెలిపారు. అల్లూరి సీతారామరాజు పాత్ర పోషించాలన్న కృష్ణంరాజు ఆశయం మా చిత్రం ద్వారా నెరవేరినందుకు ఆనందంగా ఉందని సముద్ర చెప్పారు. ఇంకా ఈ సమావేశంలో జీవీ, శంకర్, వాసు, శ్రీనుబాబు తదితరులు మాట్లాడారు.