-
నేడు ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక గ్రీవెన్స్
అనంతపురం అర్బన్ (అనంతపురం): ఎస్సీ, ఎస్టీ వర్గాల సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్ జి.వీరపాండియన్ ఆధ్వర్యంలో గురువారం ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ డీడీ రోశన్న బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో గ్రీవెన్స్ ప్రారంభమవుతుందన్నారు. దళిత, గిరిజన సంఘాల నాయకులు, ప్రజలు తమ ఫిర్యాదులను, సమస్యలను అర్జీ రూపంలో సమర్పించుకోవాలని ఆయన వెల్లడించారు. -
ఇంతకీ రుణమాఫీ జరిగేనా ?
రుణమాఫీలో ఏపాటి చిన్న సమస్యవున్నా ప్రత్యేక గ్రీవెన్స్లో మరోమారు అన్ని పత్రాలు ఇవ్వాల్సిందే. ఏదేని ఒక్క పత్రం లేకున్నా అన్నీ తెచ్చి ఇచ్చేవరకు దరఖాస్తులను అధికారులు స్వీకరించడంలేదు. రుణమాఫీలో తలెత్తిన సమస్యలను విన్నవించేందుకు జిల్లా వ్యాప్తంగా రైతులు జిల్లా కేంద్రానికి నిత్యం క్యూ కడుతున్నారు. ఇప్పటికి దాదాపు 4500 దరఖాస్తులను అధికారులు ప్రత్యేక ప్రజావాణి ద్వారా స్వీకరించారు. ఈ ప్రత్యేక గ్రీవెన్స్ ఈ నెల 15వ తేదీ వరకు మాత్రమే పనిచేస్తుంది. - మళ్లీ అన్ని పత్రాలు ఇవ్వాల్సిందే - ఏ ఒకటి లేకున్నా దరఖాస్తులు స్వీకరించరు - దరఖాస్తులకు గడువు ఈ నెల 15 వరకే - అర్జీలు ఆన్లైన్ చేయరు..హైదరాబాద్కు పంపుతారు చిత్తూరు (అగ్రికల్చర్) : జిల్లాలో మొత్తం 8,70,321 మం ది రైతులు 2013 డిసెంబర్ 31 నాటికి రూ. 11,180.25 కోట్ల మేరకు వ్యవసాయ రుణాల రూపంలో బ్యాంకర్లకు బకాయిపడ్డారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు 5.63 లక్షల మం దిని మాత్రం రుణమాఫీకి అర్హులని బ్యాంకర్లు ప్రభుత్వానికి నివేదిక పం పారు. ప్రభుత్వం అందులో తొలి, మ లి విడత జాబితాల్లో మొత్తం 4,53,773 మంది రైతులకే మాఫీ పర్తింపజేసింది. మిగిలిన 4,16.548 మంది రైతులకు మొండిచేయి చూపింది. రూ. 11,180. 25 కోట్లకుగాను దాదాపు రూ. 600 కోట్ల మేర మాత్రమే మాఫీ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆ మేరకు కూడా రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ మొత్తాలు అందక తీవ్రస్థాయిలో సమస్యలు తలెత్తాయి. దీంతో ప్రభుత్వం జిల్లా వ్యవసాయశాఖ కార్యాల యంలో ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి సమస్యలు ఉన్న రైతులు తమ ఫిర్యాదులను విన్నవించుకోవాలని తెలి పింది. అన్నీ ఉంటేనే స్వీకరణ రుణమాఫీలో తలెత్తిన సమస్యలను విన్నవించుకునేందుకు విచ్చేసే రైతులు మరోమారు అన్ని పత్రాలను ఇస్తేనే అధికారులు దరాఖాస్తులను స్వీకరిస్తున్నారు. రుణమాఫీలో ఏపాటి చిన్న సమస్య ఉన్నా రైతులు తమ ఫిర్యాదు పత్రంతోపాటు ఏయే బ్యాంకులో ఎంత భూమికి, ఎంత రుణాన్ని పొందారనే విషయాలకు సంబంధించిన వివరాల తోపాటు, ఆన్లైన్లో తీసుకున్న రుణమాఫీ పత్రం, ఆ భూములకు సంబంధించిన పట్టాదారు పాసుపుస్తకాల న కలు, రేషన్కార్డు, ఓటరు గుర్తింపుకా ర్డు, బ్యాంకు పాస్బుక్, కుటుంబంలో ని అందరి ఆధార్ కార్డుల నకలు జతచేయాలి. అధికారులు వాటిని పూర్తిగా పరిశీలించి ఏదేని ఒకపత్రంలో అక్షరం తప్పు ఉన్నట్లు గుర్తించినా దరఖాస్తులను స్వీకరించక తిప్పి పంపేస్తున్నారు. అర్జీలన్నీ హైదరాబాదుకే ప్రభుత్వపాలనా వ్యవహారాలన్నీ ఈ -ఆఫీస్, ఆన్లైన్ పద్ధతిలోనే చక్కబెడుతున్నారు. కానీ రుణమాఫీ సమస్యలపై వచ్చే దరఖాస్తులను మాత్రం ఆన్లైన్ చేయకుండా రిజిస్టర్ పోస్టు ద్వారా ైెహ దరాబాద్లోని రుణమాఫీ కమిటీ ప్రతి నిధి కుటుంబరావుకు పంపుతున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. రుణమాఫీ సమస్యల దరఖాస్తులను గోప్యంగా ఉంచడం పలు అనుమానాలకు తావిస్తోందని రైతులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరిస్తోందేతప్ప ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చెప్పడంలేదు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- 25 కిలోల బంగారం స్మగ్లింగ్.. భారత్లోని అఫ్గనిస్తాన్ దౌత్యవేత్త రాజీనామా
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
Advertisement