breaking news
SP Atul Saxena
-
హత్యాచారంపై కదిలిన యూపీ సర్కారు
బదౌన్ ఎస్పీ సస్పెన్షన్, కలెక్టర్పై చర్యలు 66 మంది ఐఏఎస్, 42 మంది ఐపీఎస్ల బదిలీలు ఒక బాధితురాలిపై అత్యాచారం జరగలేదు: డీజీపీ లక్నో: ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ సర్కారు ఎట్టకేలకు కదిలింది. గత నెలలో బదౌన్ జిల్లాలో ఇద్దరు దళిత అక్కాచెల్లెళ్లపై జరిగిన అత్యాచారం, హత్యపై దేశమంతటా గగ్గోలు రేగుతున్న నేపథ్యంలో ఆ జిల్లా ఎస్పీ అతుల్ సక్సేనాపై సస్పెన్షన్ వేటు వేసింది. అప్పటి జిల్లా మేజిస్ట్రేట్ (కలెక్టర్) ఉదయ్రాజ్ సింగ్పై కూడా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ప్రభుత్వ ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ శనివారం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఏకంగా 66 మంది ఐఏఎస్, 42 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేశారు. హత్యాచారోదంతంపై ప్రభుత్వ యంత్రాంగం మరింత సజావుగా వ్యవహరించి ఉండాల్సిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అలోక్ రంజన్ అంగీకరించారు. మరోవైపు బాధితుల్లో ఒకరిపై అత్యాచారం జరిగినట్టు నిర్ధారణ కాలేదని, ఆస్తి కోసం ఆమెపై దాడి జరిగి ఉండొచ్చని రాష్ట్ర డీజీపీ ఏఎల్ బెనర్జీ వ్యాఖ్యానించారు. తద్వారా వివాదాన్ని కొత్త మలుపు తిప్పారు. స్థానిక పోలీసులు తక్షణం స్పందించి రంగంలోకి దిగి ఉంటే మరిన్ని సాక్ష్యాధారాలను సేకరించడం వీలయేదన్నారు. -
‘బదౌన్’ దారుణానికి పాల్పడ్డాం
నేరాన్ని అంగీకరించిన ఇద్దరు నిందితులు బాధిత కుటుంబాలకు మాయావతి పరామర్శ బదౌన్(ఉత్తరప్రదేశ్): సంచలనం సృష్టించిన బదౌన్ దళిత బాలికల గ్యాంగ్రేప్, హత్యల కేసులో అరెస్టయిన ఐదుగురు నిందితుల్లో ఇద్దరు తాము ఆ నేరం చేశామని అంగీకరించారు. తమ విచారణలో వీరు నేరం ఒప్పుకున్నారని బదౌన్ జిల్లా ఎస్పీ అతుల్ సక్సేనా ఆదివారం చెప్పారు. అయితే వారిద్దరి పేర్లను వెల్లడించలేదు. చాలా కేసుల్లో నిందితులు కోర్టులో మాట మారుస్తుంటారు కనుక ఈ కేసులో నేరాంగీకారంపై ఆధారపడకుండా గట్టి సాక్ష్యాధారాల కోసం కృషి చేస్తామన్నారు. ఈ కేసులోని ఏడుగురు నిందితుల్లో పప్పూ, అవధేశ్, ఉర్వేశ్ యాదవ్ అనే సోదరులను, ఛత్రపాల్ యాదవ్, సర్వేశ్ యాదవ్ అనే పోలీస్ కానిస్టేబుళ్లను పోలీసులు శుక్ర, శనివారాల్లో అరెస్ట్ చేసి , పప్పూ సోదరులపై హత్య, అత్యాచార కేసులు, కానిస్టేబుళ్లపై నేరపూరిత కుట్ర కేసులను నమోదు చే శారు. కాత్రా షహదత్గంజ్ గ్రామానికి చెందిన వరుసకు అక్కాచెల్లెళ్లయ్యే 14-15 ఏళ్ల వయసున్న ఇద్దరు దళిత బాలికలు గత నెల 27న అదృశ్యమై, మరుసట్రోజు విగత జీవులై చెట్టుకు వేలాడటం తెలిసిందే. యూపీలో ఆటవిక పాలన: మాయావతి బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు రాజకీయ నేతలు క్యూ కట్టారు. బీఎస్పీ చీఫ్ మాయావతి, సమాజ్వాదీ పార్టీకి చెందిన స్థానిక ఎంపీ ధర్మేంద్ర యాదవ్ తదితరలు శనివారం వారిని కలుసుకుని పరామర్శించారు. అఖిలేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో ఆటవిక పాలన సాగిస్తోందని మాయావతి మండిపడ్డారు. ఈ కేసును కప్పిపుచ్చి, నీరుగార్చేందుకు ప్రయత్నిస్తోందని, అందుకే బదౌన్కు వచ్చానని చెప్పారు. బాధిత కుటుంబాలకు బీఎస్పీ నిధి నుంచి రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ పరిహారాన్ని నిరాకరించిన బాధితులు తానేమిచ్చినా తీసుకుంటామన్నారని ఆమె తెలిపారు. స్థానిక ఎంపీ నుంచి పరిహారం తీసుకోవడానికి వారు నిరాకరించారన్నారు. కాగా, ఎంపీ ధర్మేంద్ర యాదవ్పై బాధిత కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. కులం కారణంగానే పోలీసులు తమ ఫిర్యాదుపై సకాలంలో స్పందించలేదన్నాయి. కాత్రాలోని ఇళ్లలో మరుగుదొడ్లు నిర్మిస్తాం: సులభ్ కాత్రా గ్రామానికి చెందిన ఇద్దరు దళిత బాలికలు కాలకృత్యాల కోసం పొలాల్లోకి వెళ్లి అత్యాచారానికి, హత్యకు గురికావడంపై సులభ్ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఆ గ్రామంలోని అన్ని ఇళ్లలో మరుగుదొడ్లను నిర్మిస్తామని, సోమవారమే పనులు ప్రారంభిస్తామని సంస్థ వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాఠక్ లక్నోలో చెప్పారు.