breaking news
Southern Indian Ocean
-
ఒడ్డుకు చేరిన సముద్రంలో చిక్కుకున్న నావికుడు
-
దక్షిణ హిందూ మహాసముద్రంలో భూకంపం
హాంగ్కాంగ్ : దక్షిణ హిందూ మహాసముద్రంలో శనివారం భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 7.1గా నమోదు అయిందని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. మెక్ డోనాల్డ్, హెయిర్డ్ ఐలాండ్స్కి ఈశాన్యంగా ఈ భూకంపం సంభవించిందని తెలిపింది. ఈ భూకంపం దాటికి చాలా తక్కువ నష్టం సంభవించినట్లు ఆ సంస్థ పేర్కొంది. భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. -
సముద్రంపై చమురుతెట్టు - ఎం హెచ్ 370 పై కొత్త ఆశలు
దక్షిణ హిందూ మహాసముద్రంలో మలేషియన్ విమానం కుప్పకూలినట్టుగా భావిస్తున్న చోట భారీ మొత్తంలో చమురు తెట్టు ఉన్నట్టు వెల్లడైంది. కుప్పకూలిన విమానం అన్వేషణలో ఈ చమురు తెట్టు ఉపయోగపడే అవకాశం ఉందని విమానం కోసం అన్వేషణ జరుపుతున్న నిపుణులు చెబుతున్నారు. వారు ఈ చమురు తెట్టు సాంపిల్స్ సేకరించారు. మరో వైపు సముద్ర గర్భంలో విమానం శకలాలు, బ్లాక్ బాక్సును కనుగొనేందుకు ప్రత్యేక సోనార్ సెన్సర్లున్న బ్లూఫిన్ 21 జలాంతర్గామిని కూడా ప్రవేశపెట్టారు. ఇది సముద్ర గర్భంలో ఉన్న వస్తువుల వివరాలను సోనార్ మ్యాప్ సాయంతో సేకరిస్తుంది. రిమోట్ పరికరాల ద్వారా దీనిని నడిపించడానికి వీలుంటుంది. దీని ద్వారా పొందిన మ్యాపుల సాయంతో బ్లాక్ బాక్సు ఉందా లేదా అన్న విషయాన్ని కనుగొనవచ్చు. గత ఏప్రిల్ 8 నుంచి సముద్ర గర్భం నుంచి ఎలాంటి సిగ్నల్స్ రాలేదు. దీనితో బ్లాక్ బాక్స్ బ్యాటరీ పూర్తిగా డిశ్చార్జి అయి ఉంటుందని నిపుణులు అనుమానిస్తున్నారు. మార్చి 8 న మలేషియా రాజధాని కౌలాలంపుర్ నుంచి 239 మందితో బయలుదేరిన విమానం కొద్ది సేపటికే జాడ తెలియకుండా పోయింది. దీనితో నె లరోజుల నుంచి దీని కోసం పలు దేశాలు సంయుక్తంగా అన్వేషణ కొనసాగిస్తున్నాయి. -
ఆ విమానం సముద్రంలో కూలింది
-
ఆ విమానం సముద్రంలో కూలింది
దక్షిణ హిందూ మహాసముద్రంలో పడిపోయిందన్న మలేసియా ప్రధాని నజీబ్ శాటిలైట్ సమాచారంతో నిర్ధారణకు వచ్చాం కౌలాలంపూర్: అనుమానం నిజమైంది.. మిణుకుమిణుకుమంటున్న ఆశాదీపం ఆరిపోయింది! 17 రోజుల కిందట గల్లంతైన మలేసియా విమానం కథ నడిసముద్రంలో ముగిసింది. ఐదుగురు భారతీయులు సహా 239 మంది ఉన్న ఈ విమానం దక్షిణ హిందూ మహాసముద్రంలో మారుమూల కూలిపోయిందని, అందులోని వారెవరూ బతికి బయటపడలేదని మలేసియా ప్రధాని నజీబ్ రజాక్ విషణ్ణ వదనంతో ప్రకటించారు. ఆయన సోమవారం కౌలాలంపూర్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. విషాదానికి చిహ్నంగా ఆయన నల్లదుస్తులతో సమావేశానికి వచ్చారు. పెర్త్కు పశ్చిమంగా.. : ‘ఫ్లైట్ ఎంహెచ్370 విమానం దక్షిణ హిందూ మహాసముద్రంలో కూలిందని తీవ్ర విచారం, బాధ తో చెబుతున్నా. బ్రిటన్కు చెందిన ఎయిర్ యాక్సిడెంట్స్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్(ఏఏఐబీ) తాజా విశ్లేషణ, బ్రిటిష్ శాటిలైట్ కంపెనీ ఇన్మార్సాత్ అందించిన ఉపగ్రహ సమాచారం ప్రకారం విమానం దక్షిణ కారిడార్ మీదుగా ఎగిరి, ఆస్ట్రేలియాలోని పెర్త్కు పశ్చిమంగా దక్షిణ హిందూమహాసముద్రం నట్టనడుమ చివరిసారిగా కనిపించినట్లు నిర్ధారణకు వచ్చాం. ఇది ఇప్పటికే బాధలో ఉన్న కుటుంబాలకు నిజంగా గుండెలు పగిలే వార్తే’ అని రజాక్ చెప్పారు. విమానం కూలిన ప్రాంతం ల్యాండింగ్ స్థలాలకు చాలా దూరంగా మూరుమూల ఉందన్నారు. బాధ్యత ప్రకారం ఈ సమాచారాన్ని మలేసియా ఎయిర్లైన్స్ అధికారులు.. ప్రయాణికులు, సిబ్బంది కుటుంబాలకు తెలిపారన్నారు. మంగళవారమూ విలేకర్ల సమాచారాన్ని నిర్వహిస్తాన న్న ఆయన.. ఈ ఉదంతంపై మరింత సమాచారాన్ని వెల్లడించనున్నట్లు సంకేతమిచ్చారు. దక్షిణ హిందూమహాసముద్రంలో ఐదురోజులుగా సాగుతున్న గాలింపులో.. గల్లంతైన విమానానివిగా భావిస్తున్న శకలాలను గుర్తించిన నేపథ్యంలో నజీబ్ ఈ వివరాలు తెలిపారు. గల్లంతైన విమానంలోని వారి కుటుంబాలకు మలేసియా ఎయిర్లైన్స్ ఓ ప్రకటనలో ప్రగాఢ సానుభూతి తెలియజేసింది. విమానం సముద్రంలో కూలిందన్న వార్త తెలిసి బీజింగ్లోని ఓ హోటల్లో ఉన్న ప్రయాణికుల బంధుమిత్రులు ఒకరినొకరు పట్టుకుని గుండెలవిసేలా రోదించారు. మలేసియా ఎయిర్లైన్స్కు చెందిన బోయింగ్ విమానం ఈ నెల 8న మలేసియా రాజధాని కౌలాలంపూర్ నుంచి చైనా రాజధాని బీజింగ్ వెళ్తూ.. బయల్దేరిన గంటసేపటికే అదృశ్యమవడం తెలిసిందే. ఇది సముద్రంలో కూలినట్లు భావిస్తున్నా కచ్చితంగా ఎక్కడ, ఎందువల్ల కూలిందో స్పష్టత రావడం లేదు. దీని కోపైలట్ ఫరీక్ తొలిసారిగా చెక్-కోపైలట్ లేకుండానే విమానం ఎక్కినట్లు సమాచారం. శకలాల కోసం గాలింపు..: పెర్త్ నగరానికి 2,300 కి.మీ దూరంలో సముద్రంలో తేలియాడుతున్న విమాన శకలాలుగా భావిస్తున్న రెండు వస్తువులను స్వాధీనం చేసుకోవడానికి ఆస్ట్రేలియా నౌక సోమవారం ప్రయత్నించింది. వీటిలో ఒకటి బూడిద లేదా ఆకుపచ్చ రంగులో గుండ్రం గా, మరొకటి నారింజ రంగులో ఉందని, అయితే ఇవి మలేసియా విమానానివో కావో చెప్పలేమని ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబ్బాట్ చెప్పారు. అదే ప్రాంతంలో తెల్లగా చతురస్రాకారంలో ఉన్న వస్తువులు తమ విమానానికి కనిపించాయని చైనా తెలిపింది. ఎంహెచ్370లో చెక్కబల్లలు ఉన్నాయని, అయితే సముద్రంలో కనిపించిన చెక్కబల్ల ఆ విమానంలోనిదే అని చెప్పలేమని మలేసియా మంత్రి హుసేన్ అన్నారు. విమాన బ్లాక్బాక్సులు సముద్రంలో 20 వేల అడుగుల కింద ఉన్నా పసిగట్టే ‘టోవ్డ్ పింగర్ లొకేటర్ 25’ పరికరాన్ని పంపుతున్నట్లు అమెరికా తెలిపింది.