breaking news
SN Subrahmanyan
-
ఉద్యోగులకు ఆదివారాలు పని.. వివరణ ఇచ్చిన ఎల్ అండ్ టీ ఛైర్మన్
ఉద్యోగులు ఆదివారాల్లోనూ పనిచేయాలని సూచిస్తూ లార్సెన్ అండ్ టుబ్రో (ఎల్ అండ్ టీ) ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ఎన్ సుబ్రమణ్యన్ కొంతకాలం కిందట చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఇటీవల వివరణ ఇచ్చారు. అప్పుడు ఉన్న పరిస్థితుల కారణంగా మందకొడిగా సాగుతున్న ప్రాజెక్టు పురోగతిపై అంతర్గతంగా చర్చించామన్నారు. అందులో భాగంగా అనధికారిక సంభాషణ సందర్భంగా సుబ్రమణ్యన్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు అంగీకరించారు.‘అప్పుడు ఉన్న పర్థితులు భిన్నంగా ఉన్నాయి. కంపెనీతో బిజినెస్ చేస్తున్న ఐదారుగురు క్లయింట్లతోపాటు కొందరు హైప్రొఫైల్ క్లయింట్లు నాతో వ్యక్తిగతంగా మాట్లాడారు. ఉత్పాదకతకు సంబంధించి ఫోన్ చేశారు. మా పురోగతి గురించి ఈమెయిల్స్ పంపారు. నాతోపాటు టీమ్ ప్రమేయం ఉన్నప్పటికీ ప్రాజెక్టులు ముందుకు వెళ్లలేదు. ఆ సందర్భంలో అనధికారికంగా ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది. కానీ దీన్ని తప్పకుండా పాటించాలనేలా మాత్రం చెప్పలేదు. ఈ అనధికారిక సంభాషణ సమయంలో రికార్డ్ చేయొద్దనే నియమాలున్నాయి’ అని పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఊపిరి పీల్చుకున్న పసిడి ప్రియులు..ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వివరాలు ఆన్లైన్లో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో, ఉద్యోగ వర్గాల్లో విమర్శలు వెల్లువెత్తాయి. తన భార్య కూడా తన పేరుకు భంగం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేసినట్లు సుబ్రమణ్యన్ చెప్పారు. ‘ఈ సంఘటన నా మనసును ఉంతో కలచివేసింది. ఏదేమైనా విషయం జరిగిపోయింది. ఇప్పుడు దాన్ని ఉపసంహరించుకోలేను. ఎల్ అండ్ టీలో పనితీరే కీలకం’ అని అన్నారు. -
అప్పుడు 90 గంటలు.. ఇప్పుడు మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు
''ఇంట్లో కూర్చుని ఎంతసేపని భార్యని చూస్తూ ఉంటారు?.. ఇంట్లో కంటే ఆఫీసులో ఎక్కువ సమయం ఉంటామని మీ భార్యకు చెప్పండి. వారానికి 90 గంటలు పనిచేయండి. నేను ఆదివారాలు కూడా పనిచేస్తున్నా.. ఆరోజు మీతో పని చేయించలేక పోతున్నందుకు బాధపడుతున్నా. అలా చేయించగలిగితే నాకు చాలా హ్యాపీ'' అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన లార్సెన్ & టూబ్రో చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ (SN Subrahmanyan).. మరోమారు కీలక వ్యాఖ్యలు చేశారు.మంగళవారం చెన్నైలో జరిగిన CII మిస్టిక్ సౌత్ గ్లోబల్ లింకేజెస్ సమ్మిట్ 2025లో సుబ్రహ్మణ్యన్ మాట్లాడుతూ.. సౌకర్యాలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల నిర్మాణ పరిశ్రమకు కార్మికుల కొరత ఏర్పడుతోంది. భారతదేశంలో కార్మికులు పనిచేయడానికి ఇష్టపడటం లేదు. ప్రభుత్వం అందించే కొన్ని పథకాల కారణంగా.. కార్మికుల ఆర్ధిక వ్యవస్థ బాగానే ఉందని, బహుశా ఈ కారణంగానే వారు పనిచేయడానికి ఇష్టపడటం లేదని అన్నారు.కార్మికుల కొరత భారతదేశ మౌలిక సదుపాయాల నిర్మాణంపై ప్రభావం చూపుతోంది. ఎల్ అండ్ టీ సంస్థకు 4 లక్షల మంది కార్మికులు అవసరం. కానీ అవసరమైన మేర కార్మికులు లభించడం లేదు. అంతే కాకుండా ద్రవ్యోల్బణం కారణంగా.. కార్మికుల వేతనాలను కూడా సవరించాల్సిన అవసరం ఉందని సుబ్రహ్మణ్యన్ పేర్కొన్నారు.కార్మికులలో మాత్రమే కాకుండా.. ఉద్యోగులలో కూడా అదే ధోరణి ఉందని సుబ్రమణ్యన్ అన్నారు. నేను ఎల్ అండ్ టీ కంపెనీలో ఇంజినీర్గా ఉద్యోగంలో చేరినప్పుడు.. మా బాస్ ఢిల్లీలో పనిచేయాల్సి ఉంటుందని చెప్పారు. దానికి నేను ఒకే చెప్పాను. కానీ ఇప్పుడు ఎవరికైనా ఢిల్లీలో ఉద్యోగం చేయాల్సి ఉంటుందని చెబితే ఉద్యోగాన్నే వదిలేసి వెళ్ళిపోతారు అని అన్నారు.90 గంటల పనిపై చర్చవారానికి 90 గంటలు, ఆదివారాలు కూడా పనిచేయాలని చెప్పిన సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలు గతంలో చర్చకు దారితీశాయి. దీనిపై ఆదార్ పూనవాలా, ఆనంద్ మహీంద్రా, ఐటీసీ సంజీవ్ పూరి వంటి దిగ్గజ పారిశ్రామిక వేత్తలు స్పందిస్తూ.. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి వివరించారు.గరిష్ట పని గంటలను వారానికి 70 లేదా 90 గంటలకు పెంచే ప్రతిపాదనను పార్లమెంటుకు కూడా చేరింది. బడ్జెట్కు ముందు ఆర్థిక సర్వేలో వారానికి 60 గంటలకు పైగా పని చేయడం వల్ల.. ఆరోగ్యం దెబ్బ తింటుందని, ప్రతికూల ప్రభావాలు ఎదురవుతాయని వెల్లడించారు. రోజుకు 12 గంటలు లేదా అంతకంటే ఎక్కువ సేపు పనిచేస్తే.. శారీరక, మానసిక సమస్యలు ఎదురవుతాయని ఒక సర్వేలో కూడా తెలిసింది.