breaking news
Sky routes
-
మేధో వలసలను ఇస్రో ఆపేదెలా?
అంతరిక్ష రంగం ఈమధ్య సముచిత, అనుచిత కారణాలు రెండింటితోనూ వార్తలకెక్కుతోంది. స్కైరూట్ అనే భారతీయ ప్రైవేటు స్పేస్ కంపెనీ తానే అన్నీ అయి చూసుకున్న ఒక అంతరిక్ష ప్రయోగాన్ని తొలి ప్రయత్నంలోనే విజయవంతంగా నిర్వహించింది. భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు చెందిన ఇద్దరు మాజీ ఇంజినీర్లు ఆ కంపెనీని నెల కొల్పారు. ఈ కంపెనీ విక్రమ్–1 రాకెట్ను ప్రయోగించి తన సత్తా చాటుకుంది. ఇదే తరహా రాకెట్ను మరింత ఉన్నతపరచి విక్రమ్–2 పేరుతో వచ్చే ఏడాది ప్రయోగించాలని భావిస్తోంది. తక్కువ ఎత్తులోనున్న భూకక్ష్య (ఎల్.ఇ.ఓ.)లో ఉపగ్రహాలను నిలిపే కోట్లాది డాలర్ల మార్కెట్లోకి ప్రవేశించాలని స్కైరూట్ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రైవేటు ఆకర్షణీయంమరోపక్క ఇస్రో నుంచి టాప్ సైంటిస్టులు, ఇంజినీర్లు పెద్ద యెత్తున వైదొలగుతున్నారనే వార్త గుబులు పుట్టిస్తోంది. యు.ఆర్. రావు స్పేస్ సెంటర్, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్, జాతీయ అంతరిక్ష సంస్థకు చెందిన ఇతర కీలక విభాగాల్లో పనిచేస్తున్న డజన్లకొద్దీ సీనియర్ సైంటిస్టులు రాజీనామా చేయడమో లేదా ముందుగానే రిటైర్మెంట్ తీసుకోవడమో చేశారని వార్తలు సూచిస్తున్నాయి. వారిలో చాలామంది భారత్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న గగన్యాన్ (మానవుడిని స్పయంగా అంతరిక్షంలోకి పంపడం), తదుపరి తరం వాహక నౌక (ఎన్జీఎల్వీ), భారతీయ అంతరిక్ష స్టేషన్ (బ్యాస్) వంటి ప్రముఖ కార్యక్రమాల్లో పనిచేస్తున్నారు. ఈ వలస ఎంత ఆందోళనకరంగా పరిణమించిందంటే, అలాంటి ప్రాజెక్టులు పూర్తయ్యేంత వరకు వాటిలో పనిచేస్తున్నవారు సంస్థను విడిచి వెళ్ళడానికి వీలులేకుండా అంతరిక్ష శాఖ ఆంక్షలు విధించాలని నిర్ణయించుకుంది. ఈ రెండు పరిణామాలు– మొదటి ప్రైవేటు రాకెట్ ప్రయోగం, ఇస్రోకు ఉద్యోగులు వీడ్కోలు పలకడం– పైకి ఒకదానితో ఒకటి సంబంధం లేనివిగా కనిపించవచ్చు. కానీ, అవి పరస్పరం ముడిపడి ఉన్నవని గ్రహించాలి. ఇస్రో యూనిట్ల నుంచి ఉద్యోగులు రాజీనామాలు చేయడానికి ప్రధాన కారణం, గత కొద్ది ఏళ్ళలో ప్రైవేట్ రంగ స్పేస్ కంపెనీలు కనబరుస్తున్న ఎదుగుదలేనని స్పష్టమవుతోంది. అంతరిక్ష రంగంలోకి ప్రైవేట్ సంస్థల ప్రవేశానికి పచ్చజెండా ఊపడమే కాకుండా, ఉపగ్రహ వాహక నౌకల ప్రయోగానికి ఇస్రో సదుపాయాలను వినియోగించుకునేందుకు కూడా ప్రభుత్వం అను మతించింది. ఇస్రోలో పనిచేస్తున్న ప్రతిభావంతులైనవారిని తమ వైపు లాక్కునేందుకు ప్రైవేట్ కంపెనీలకు ఇది అనువైన వాతావర ణాన్ని కల్పించింది. ప్రభుత్వ సంస్థల నుంచి ప్రైవేటుకు ఇలా ప్రతిభావంతులు తరలిపోవడం ఇస్రోకు ఇది కొత్తా కాదు, అంతరిక్ష రంగానికి మాత్రమే పరిమితమైన ధోరణి అంతకన్నా కాదు. అమెరికాలో కూడా ప్రైవేట్ అంతరిక్ష రంగం మూడు పూవులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) తీర్చిదిద్ది, అభివృద్ధి చేసిన మానవ వనరులే అక్కడి ప్రైవేట్ రంగానికి ప్రధాన ఆలంబన. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరిశ్రమ కూడా మొగ్గ తొడుగుతున్న దశలో ఆ రంగానికి చెందిన ప్రైవేట్ సంస్థలు తమ పరిశోధన–అభివృద్ధి విభాగాలలోకి ఈసీఐఎల్, సీఎంసీ వంటి ప్రభుత్వ రంగ కంపెనీల నుంచే సిబ్బందిని తీసుకున్నాయి. హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వంటి ప్రభుత్వ రంగ కంపెనీల విషయంలోనూ అదే జరిగింది. డీఆర్డీఓ ల్యాబొరేటరీలలో కూడా ఇస్రో తరహా పరిస్థితే నెలకొంది. రక్షణ, ఏరోస్పేస్ పరికరాల ఉత్పత్తిలో ప్రైవేట్ రంగాన్ని అనుమతించిన ఫలితమే ఇది. అందని నిధులు– అందితే కోతలుఇస్రో, డీఆర్డీఓ వంటి మన వైజ్ఞానిక సంస్థలు తాము ఎదుర్కొంటున్న పరిస్థితికి కారణాలను నిశితంగా అన్వేషించుకోవాలి. ఇస్రోకు చెందిన వివిధ యూనిట్లలో 2,800లకు పైగా ఖాళీలున్నాయనీ, మంజూరైనవి సుమారు 1800 పోస్టులు మాత్రమేననీ అంతరిక్ష శాఖ పనితీరును అధ్యయనం చేసిన పార్లమెంటరీ కమిటీకి 2026 మార్చిలో వెల్లడించారు. ఎన్జీఎల్వీ తయారు చేసే ముఖ్య పనిలో ఉన్న విక్రమ్ సారాభాయ్ కేంద్రంలో దాదాపు 500 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఒకవైపు ప్రైవేట్ కంపెనీలు అనుభవజ్ఞులైన సైంటిస్టులను ఎరవేసి పట్టుకుంటున్నాయి. మరోవైపు, ఇస్రో ప్రాజెక్టులకు ప్రభుత్వం నుంచి నిధులు అందడం లేదు. ఉదాహరణకు, ఎన్జీఎల్వీని నిర్మించి, ప్రయోగించే ప్రాజెక్టునకు 96 నెలల సమయమిస్తూ క్యాబినెట్ 2024లో ఆమోదం తెలిపింది. ఆమోదించిన తేదీ నుంచి 84 నెలల లోపల మొదటి పరీక్షకు వాహక నౌకను సిద్ధం చేయాలని కూడా ఆదేశించింది. కానీ, 2024–25 బడ్జెట్లో దీనికి కేటాయింపులు ఏమీ లేకపోవడం వల్ల ఆమోదం పొందిన అనేక నెలల తర్వాత కూడా ఈ ప్రాజెక్టు కాగితాలకు మాత్రమే పరిమితమైంది. సవరించిన అంచనాలలో నామ మాత్రంగా రూ. 3 కోట్లు కేటాయిస్తే, దానిలో ఇస్రో రూ. 85 లక్షలను మాత్రమే వెచ్చించగలిగింది. 2025–26 బడ్జెట్లో రూ. 158 కోట్లు కేటాయించారుగానీ, సవరించిన అంచనాల దగ్గరకొచ్చేసరికి దాన్ని రూ. 39.76 కోట్లకు తగ్గించారు. ఇందులో ఇస్రో 2026 జన వరి 31 వరకు రూ. 7.93 కోట్లను మాత్రమే వెచ్చించగలిగింది.వ్యయంలో నత్తనడక, కేటాయించిన నిధులను కూడా పూర్తిగా వినియోగించుకోలేకపోవడం, తదుపరి బడ్జెట్లలో కేటాయింపులను తగ్గిస్తూపోవడం, ఖాళీలను భర్తీ చేయడంలో జాప్యం, ప్రైవేట్ రంగ ప్రవేశం వంటివన్నీ ఇస్రోలో నేటి స్థితికి కారణమయ్యాయి. వీటన్నింటికి తోడు ఇస్రోకు నమ్మిన బంటుగా పనిచేస్తూ వచ్చిన పీఎస్ఎల్వీ వరుసగా వైఫల్యాలను చవిచూసింది. నిర్ణాయక వ్యవస్థ కేంద్రీకృతం కావడం, అధికారుల, రాజకీయ జోక్యం పెరగడం వంటివి భారీ ప్రాజెక్టులను తలకెత్తుకున్న సైంటిఫిక్ ఏజెన్సీ పని తీరుకు మేలు చేయవు. మారాల్సిన విధానాలుసైంటిస్టులను రాజీనామా చేయవద్దని కోరడం, వారు వైదొలగకుండా అడ్డు పెట్టడం సరైన స్పందన అనిపించుకోదు. ప్రైవేట్ రంగ ప్రవేశానికి ప్రోద్బలం ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం, దానికి వీలు కల్పించిన ఇస్రో తమ వైఖరి పర్యవసానాన్ని, అది జాతీయ కార్యక్రమాలపై చూపగల ప్రభావాన్ని ముందే ఊహించి ఉండాల్సింది. దాంతోపాటు, మిషన్ వైఫల్యాలు, జాప్యాల ఫలితంగా నీరసపడ్డ సైంటిస్టులలో స్థైర్యాన్ని పెంపొందించే చర్యలను ఇస్రో నాయకత్వం చేపట్టాలి. ఇస్రో దీర్ఘకాలంలో చేపట్టవలసిన సరికొత్త యంత్రాంగాలపై యోచించాలి. ఉదాహరణకు, సిబ్బంది ఇస్రోలో తమ ఉద్యోగాలను నిలబెట్టుకుంటూనే ఒక పరిమిత కాలానికి ప్రైవేట్ రంగంలో పని చేసేందుకు అనుమతించవచ్చు. కీలకేతర రంగాల్లో సొంత కంపెనీలను స్థాపించుకునేందుకు అంగీకరించవచ్చు. వీటికి తోడుగా, జీతభత్యాలు, ప్రోత్సాహకాలు, ప్రమోషన్ల విధానాలను సవరించు కోవాలి. ప్రభుత్వం తన వంతుగా వైజ్ఞానిక సంస్థల ప్రతిపత్తిని పున రుద్ధరించాలి. స్పేస్ మార్కెట్ ప్రపంచవ్యాప్తంగా వృద్ధి చెందుతోంది. దాన్ని వినియోగించుకునేందుకు జాతీయ ఏజెన్సీలతో పాటు ప్రైవేట్ కంపెనీలకు కూడా కావలసినంత అవకాశం ఉంది. బ్రెయిన్ డ్రెయిన్ను బ్రెయిన్ సర్క్యులేషన్గా మలచుకోవచ్చు. దినేశ్ సి. శర్మవ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత -
స్కైరూట్ టాలెంట్ ను ముందే గుర్తించిన సాక్షి
-
స్కై రూట్ ఏరో స్పేస్ కార్యక్రమంలో సీఎం రేవంత్
హైదరాబాద్: శంషాబాద్లోని జీఎంఆర్ ఏరోస్పేస్ పార్క్లో స్కైరూట్ ఏరోస్పేస్ కంపెనీకి చెందిన విక్రం-1 రాకెట్ ఫ్లాగ్ ఆఫ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్రెడ్డి, మంత్రి శ్రీధర్బాబు పాల్గొన్నారు. దీనిలో భాగంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ‘ఆనంద్ మహీంద్రా బోర్డు చైర్మన్గా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నాం. ఏరో స్పేస్ విభాగం లో కూడా స్కిల్ యూనివర్సిటీ సేవలను వినియోగించుకోవాలి. ఏరో స్పేస్ రంగానికి కావాల్సిన మనవరులను యూనివర్సిటీ ద్వారా అందిస్తాం. స్కిల్స్ కు సంబంధించిన అన్ని విభాగాలను స్కిల్స్ యూనివర్సిటీ పరిధి లోకి తీసుకువస్తాం. స్కిల్స్ యూనివర్సిటీ ని అద్భుతం గా తీసుకువస్తున్నాం. మల్లేపల్లి ఏటీసీ సెంటర్ ని సందర్శించాలి. ఐటీఐలను టాటా గ్రూప్ సహకారం తో ఏటీసీలు గా మారుస్తున్నాం. సిలబస్ను కూడా ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మారుస్తున్నాం. విద్యా వ్యవస్థను సమూలం గా మారుస్తున్నాం. విద్యా ప్రమాణాలతో పాటు మహులిక సదుపాయాలు పెంచబోతున్నాం. ప్రతి విద్యార్థి పైన లక్షా 8 వేల రూపాయలను ప్రభుత్వం ఖర్చు పెడుతోంది’ అని పేర్కొన్నారు. -
అంతరిక్షమే హద్దుగా..
-
ఆకాశ వీధిలో...
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ చుట్టూ ఆకాశ మార్గాల దిశగా (ఎలివేటెడ్ కారిడార్లు) మరో అడుగు పడింది. ఆధునిక హంగులతో మూడు ప్రధాన మార్గాల్లో ప్రతిపాదించిన ఎలివేటెడ్ కారిడార్లపై అధ్యయనానికి ప్రభుత్వం కన్సల్టెన్సీలను నియమించింది. ప్యారెడైజ్ నుంచి కంటోన్మెంట్ మీదుగా శామీర్పేట్ ఔటర్ రింగ్ రోడ్డు వరకు... బాలానగర్ నుంచి జీడిమెట్ల మీదుగా నర్సాపూర్ ఔటర్ వరకు... ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి ఘట్కేసర్ ఔటర్ వరకు నిర్మించదలచిన ఆకాశమార్గాలపై అన్ని కోణాల్లో అధ్యయనం చేసి 6 నెలల్లో నివేదిక అందించాలని కన్సల్టెన్సీలకు ప్రభుత్వం సూచించింది. ప్యారెడైజ్-శామీర్పేట్, బాలానగర్-నర్సాపూర్ మార్గాల అధ్యయనాన్ని ఆర్ వీ అసోసియేట్స్ దక్కించుకోగా, ఉప్పల్-ఘట్కేసర్ మార్గాన్ని వాడియా కన్సల్టెన్సీ కైవసం చేసుకుంది. ఐదు కన్సల్టెన్సీలు పోటీ పడగా చివరకు రెండింటికి అవకాశం దక్కినట్టు జాతీయ రహదారుల సంస్థ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు. గత అనుభవం, తక్కువ మొత్తంతో అధ్యయనానికి సంసిద్ధతను వ్యక్తం చేయడం, తదితర అంశాల ఆధారంగా వీటిని ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. ఒక్కో మార్గంలో అధ్యయనానికి రూ.3 కోట్ల చొప్పున వెచ్చిస్తున్నట్లు పేర్కొన్నారు. పక్కాగా ప్రణాళికలు... ప్రస్తుత ప్రతిపాదనల మేరకు మూడువైపులా ఔటర్ను అనుసంధానిస్తూ ఎలివేటెడ్ మార్గాలు నిర్మించనున్నారు. ఈ కారిడార్లలో ప్రస్తుతం ఉన్న రహదారులను విస్తరిస్తూనే... ఇరుకు ప్రాంతాల్లో ఆకాశమార్గాలను (ఎలివేటెడ్ కారిడార్లను) నిర్మిస్తారు. ఒక్కో కిలోమీటర్కు రూ.వంద కోట్ల వంతున ఖర్చవుతుందని అంచనా. ఉప్పల్- ఘట్కేసర్ మధ్య 10 కిలోమీటర్ల వరకు ఎలివేటెడ్ హైవే వచ్చే అవకాశం ఉంది. ప్యారెడైజ్- శామీర్పేట్ మార్గంలో కంటోన్మెంట్ నుంచి తూంకుంట వరకు 12 కిలోమీటర్లు ఎలివేటెడ్ కారిడార్ రానుంది. బాలానగర్-నర్సాపూర్ కారిడార్లో ఇరుకు రహదారులు పెద్దగా లేకపోవడంతో ఎలివేటెడ్ మార్గం తక్కువగానే ఉంటుంది. వీటిపై సమగ్ర సర్వేతో పాటు డిజైన్ల రూపకల్పన, నిర్మాణ అంచనాలు, ఆ మార్గాల్లో రాకపోకలు సాగించే వాహనాల సంఖ్య, తదితర అంశాలతో కన్సల్టెన్సీలు నివేదిక లను రూపొందిస్తాయి. రద్దీకి చెక్... ఎన్హెచ్-163లో ఉన్న ఉప్పల్-ఘట్కేసర్ మధ్య వాహనాల రద్దీలో వెళ్లడం నరకప్రాయంగా మారింది. వరంగల్, హన్మకొండల నుంచి వచ్చే వాహనాలు ట్రాఫిక్లో చిక్కుకుంటున్నాయి. ఉప్పల్ నల్లచెరువు నుంచి రింగ్రోడ్డు వరకు ఇరుకైన రహదారి వల్ల, మెట్రో నిర్మాణ పనుల దృష్ట్యా గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించిపోతోంది. ఎలివేటెడ్ మార్గం వస్తే ఘట్కేసర్ ఔటర్ నుంచి నేరుగా ఉప్పల్ రింగు రోడ్డుకు చేరుకోవచ్చు. ఇక నిత్యం రద్దీగా ఉండే రాజీవ్ రహదారి, నర్సాపూర్ మార్గంలోనూ ఔటర్కు అనుసంధానం చేస్తూ ఎలివేటెడ్ హైవేలు నిర్మిస్తే మెదక్, సిద్ధిపేట్, కరీంనగర్ నుంచి వచ్చే వాహనాలు నేరుగా నగరంలోకి ప్రవేశించే అవకాశం లభిస్తుంది. అవసరమైన చోట జంక్షన్లను ఏర్పాటు చేస్తారు. తద్వారా నాలుగు వైపులా రద్దీ లేకుండా (ఫ్రీ ఫ్లో) వాహనాలు సాగిపోతాయి.


