-
రియల్ ఎస్టేట్ కొత్త పుంతలు - వాటివైపే కొనుగోలుదారుల చూపు!
రియల్ ఎస్టేట్ మార్కెట్ రోజు రోజుకి పెరుగుతోంది. ప్లాట్ల్స్ లేదా అపార్ట్మెంట్ కొనుగోలు చేసే వారి సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. అయితే గత కొంత కాలంగా పెద్ద ఇళ్లకు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో భారతదేశంలో ఏడు ప్రధాన నగరాల్లో సగటు అపార్ట్మెంట్ సైజులు గత ఏడాది 11 శాతం పెరిగాయి. పెద్ద ఇళ్లకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా 2022లో 1175 చదరపు అడుగులు ఉన్న అపార్ట్మెంట్ల పరిమాణం 2023 నాటికి 1300 చదరపు అడుగులకు చేరిందని అనరాక్ రీసెర్చ్ ఒక నివేదికలో వెల్లడించింది. 2020, 2021 కంటే కూడా 2023లో ఢిల్లీ NCR, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్, హైదరాబాద్, కోల్కతా, పూణే, చెన్నై, బెంగళూరు నగరాల్లో ఫ్లాట్స్ పరిమాణం పెరిగినట్లు తెలిసింది. 👉ఢిల్లీ NCRలో ఫ్లాట్ పరిమాణం అత్యధిక వృద్ధిని సాధించింది. అంటే 2022లో 1375 చదరపు అడుగులు ఉన్న ప్లాట్ 2023 నాటికి 1890 చదరపు అడుగులకు చేరింది. దీన్ని బట్టి చూస్తే ఈ నగరంలో పరిమాణం 37 శాతం పెరిగినట్లు తెలుస్తోంది. కొనుగోలుదారుల డిమాండ్ విలాసవంతమైన అపార్ట్మెంట్ల వైపు తిరగడం వల్ల డెవలపర్లు పెద్ద అపార్ట్మెంట్లను నిర్మిస్తున్నారు. 👉హైదరాబాద్లో 2022లో 1775 చదరపు అడుగులున్న ప్లాట్ 2023 నాటికి 2300 చదరపు అడుగులకు చేరింది. అంటే హైదరాబాద్లో ప్లేట్ సైజు 30 శాతం పెరిగింది. 👉బెంగళూరులో, సగటు ఫ్లాట్ పరిమాణం 2023వ సంవత్సరంలో 26% పెరిగింది. 2022లో 1,175 చదరపు అడుగుల నుంచి 2023లో 1,484 చదరపు అడుగులకు పెరిగింది. 👉పూణేలో సగటు ఫ్లాట్ పరిమాణాలు 2022లో 980 చదరపు అడుగుల నుంచి 2023లో 11% పెరిగి 1,086 చదరపు అడుగులకు చేరుకున్నాయి. 👉చెన్నైలో ప్లాట్ పరిమాణం 2022 కంటే 5 శాతం పెరిగింది. 2022లో 1200 చదరపు అడుగులున్ ఫ్లాట్ సైజు 2023 నాటికి 1260 చదరపు అడుగులకు చేరింది. ఇదీ చదవండి: ముందుగానే హింట్ ఇచ్చిన నిర్మలమ్మ - నాలుగు అంశాలు కీలకం -
స్మాల్-ఎల్-ఎక్స్ఎల్.. కొలిక్కి రానున్న మన ‘సైజు’లు
Indian Body Measurements Survey: స్మాల్, మీడియం, ఎల్, ఎక్స్ఎల్.. ఇలా దుస్తులు, చెప్పులు, షూస్ విషయంలో కొలమానాలు ఉంటాయి. అయితే అవి యూకే, యూఎస్, మెక్సికన్ అంటూ విదేశీ కొలతలు ఉండడం తెలుసుకదా!. ఆన్లైన్లో ఈ కొలతలతో పాటుగా సెంటీమీటర్ కొలతలు ఉండడం వల్ల కొనుగోలుదారులు ఓ క్లారిటీకి వస్తుంటారు. కానీ, కోట్ల మంది వస్త్ర వ్యాపారులకు మాత్రం కొన్నేళ్లుగా ఈ కొలతలు ఇబ్బందిగానే పరిణమిస్తున్నాయి. అందుకే ఈ కొలతల్లో మార్పులు తీసుకొచ్చే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. బట్టల దుకాణానికి వెళ్లినప్పుడు ఒక్కోసారి సైజుల విషయంలో తేడాలు కనిపిస్తుంటాయి. రెగ్యులర్గా ‘ఎల్’ సైజ్ ఉపయోగించేవాళ్లకు.. వేరే బ్రాండ్లో ‘ఎక్స్ఎల్’ సరిపోతుంటుంది. అది చూసి బ్రాండ్ను బట్టి తేడాలుంటాయని చాలామంది పొరపడుతుంటారు. కానీ, విషయం అది కాదు. విదేశీ సైజుల కొలమానం ప్రకారం ఉండడం మూలంగానే అందులో తేడాలు వస్తున్నాయి. ప్రత్యేకించి మన దేశానికి ప్రత్యేకించి క్లోతింగ్ మెజర్మెంట్(కొలతల కొలమానం) అంటూ ఒకటి లేకుండా పోయింది. అందుకే ఇంకా యూకే, యూఎస్ అంటూ వస్త్ర, శాండల్స్ తయారీ పరిశ్రమలు విదేశీ కొలతలపైనే ఆధారపడుతున్నాయి. అందదా కొలతలతోనే దుస్తులు కొనుగోలు చేస్తున్నారు ప్రజలు. దీనికి చెక్ పెట్టేందుకు మొదలైందే ‘ఇండియాసైజ్’ సర్వే. సర్వే ఉద్దేశం ‘INDIAsize’.. కేంద్ర వస్త్ర పరిశ్రమ మంత్రిత్వ శాఖ, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(NIFT) సహకారంతో ఈ సర్వేను మొదలుపెట్టింది. కొత్త ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా, హైదరాబాద్, షిల్లాంగ్.. ఇలా ప్రధాన నగరాలను ఆరు జోన్లుగా విభజించి సర్వేను చేస్తున్నారు. సుమారు పాతిక వేలమంది కొలతలను తీసుకుని దుస్తుల కోసం ఒక కొలతల చార్ట్ను రూపొందించే ప్రయత్నం మొదలుపెట్టారు. 15 నుంచి 65 ఏళ్ల వయసు వాళ్ల బాడీ కొలతల ఆధారంగా ఈ సర్వేను కొనసాగించనున్నారు. క్లోతింగ్ మ్యానుఫ్యాక్చర్స్ అసోషియేషన్ ఆఫ్ ఇండియా మద్దతుతో 2019లో అనౌన్స్ అయిన ఈ ప్రాజెక్టు.. కరోనా వల్ల ఆలస్యమైంది. ఎట్టకేలకు గత గురువారం ఢిల్లీలో ఇండియాసైజ్ సర్వే మొదలైంది. తొలి రౌండ్లో 5,700 మంది పాల్గొననున్నారు. 2022 చివరికల్లా సర్వేను ముగించి.. మన సైజులపై ఓ కొలిక్కి రానున్నారు. ఏం ఉపయోగమంటే.. దేశంలోనే ఎక్కువమంది ఉద్యోగులున్న రెండో పరిశ్రమ.. వస్త్ర పరిశ్రమ. ఏటా 140 బిలియన్ల రూపాయలు ఆదాయం వస్తే.. అందులో 100 బిలియన్ల రూపాయలు లోకల్ కన్జూమర్ల నుంచే వస్తోంది. కొలతల గందరగోళం నివారించేందుకు ఈ సర్వే ఉపయోగపడనుంది. ఆఫ్లైన్ షాపింగ్లో ఈ కొలతలు కీలకంగా వ్యవహరించనున్నాయి. రిటర్న్ పాలసీలో భాగంగా స్టాఫ్కానీ, కస్టమర్కానీ తిరగాల్సిన అవసరం లేకుండా చేస్తుంది. తయారీదారులకు సైతం ఈ సర్వే ఉపయోగపడనుంది. సేల్స్ పెంచుకోవడానికి, రిటర్న్ గూడ్స్ లాంటి సమస్యలను అధిగమించడానికి తయారీదారులకు సాయపడనుంది. ఎలా చేస్తారంటే.. ఆంత్రోపోమెట్రిక్ డేటా(శరీరాకృతి కొలతల) ఆధారంగా ఈ సర్వే కొనసాగనుంది. 100 డేటా పాయింట్స్ ఆధారంగా కొలతల్ని నిర్ధారిస్తారు. ఎంపిక చేసినవాళ్లపై ‘హ్యూమన్ సేఫ్ 3డీ వోల్ బాడీ స్కానర్’ టెక్నాలజీ ఉపయోగించి కొలతలను సేకరిస్తామని నిఫ్ట్ డైరెక్టర్ జనరల్ శాంతమను వెల్లడించారు. ఒక్కో వ్యక్తిని స్కాన్ చేయడానికి 15 నిమిషాల టైం పడుతుంది. తద్వారా టైలర్, ఎక్స్పర్ట్ల అవసరం లేకుండానే సర్వే వేగంగా పూర్తి కానుంది. ఈలోపు చెప్పులు, షూలకు సంబంధించిన సర్వే ప్రక్రియను మొదలుపెడతామని ఆయన తెలిపారు. గార్మెంట్స్ పరిశ్రమల చరిత్రలో ఫస్ట్ రికార్డెడ్ ఇన్స్టాన్స్ సైజింగ్ సర్వే.. 1921లో అది కేవలం పురుషుల కోసమే జరిగింది. అయితే అంత్రోపోమెట్రిక్(మనిషి బాడీ కొలతల ప్రకారం) మాత్రం 1939 నుంచి మొదలైంది. ఆ టైంలో పదిహేను వేలమంది అమెరికన్ మహిళల కొలతల ఆధారంగా దుస్తుల్ని రూపొందించారు. ఆ తర్వాత కొన్ని దేశాలు ప్రత్యేకంగా తమ దేశ ప్రజల శరీరాకృతి కొలతల ఆధారంగా దుస్తులు, చెప్పులు రూపొందిస్తూ వస్తున్నాయి. చదవండి: ఆడవాళ్లు.. ఈ యాప్తో జాగ్రత్త! -
ఆవలింత పెద్దదైతే మెదడు కూడా పెద్దదే!
న్యూయార్క్: ఆవలింతలు, మెదడు పరిమాణాల మధ్య ఉన్న సంబంధాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. 29 రకాల క్షీరదాలపై పరిశోధన చేసి వారు ఈ విషయం తేల్చారు. ఒక్కో ఆవలింత సమయం ఎక్కువగా ఉంటే, వాటి మెదడు పెద్దగా ఉన్నట్లట. అమెరికాలోని స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ వారు పరిశోధనలో క్షీరదాల ఆవలింతల సగటు సమయాన్ని నమోదు చేశారు. మెదళ్ల బరువును ముందుగానే తీసుకుని సిద్ధంగా ఉంచుకున్నారు. మెదడు బరువుతోపాటు, వల్కలం అనే భాగంలోని నాడీ కణాల సంఖ్యమీద ఆధారపడి ఆవలింత సమయం ఉంటుందన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రత్నగిరిపై కుండపోత
షెల్టర్ శ్లాబు కూలి యువకుడి మృతి
ఉపాధి కూలీలపై తేనెటీగల దాడి
పిడుగు పడి మేకల కాపరి మృతి
జగన్తోనే సంక్షేమం
కోనసీమలో పలుచోట్ల అకాల వర్షం
హమ్మయ్య చల్లబడింది
IPl 2024: శాంసన్ ఇన్నింగ్స్ వృథా.. రాజస్తాన్పై ఢిల్లీ ఘన విజయం
చాహల్ అరుదైన రికార్డు.. టీ20 క్రికెట్ చరిత్రలోనే
టీ20 వరల్డ్కప్కు ఐర్లాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement