Singer ABHIJEET
-
షారూక్ ఖాన్కు ఈగో ఎక్కువ.. అందుకే నచ్చలేదు: సింగర్ అభిజిత్
ప్రముఖ బాలీవుడ్ సింగర్ అభిజీత్ భట్టాచార్య ఆసక్తికర కామెంట్స్ చేశారు. బాలీవుడ్ హీరో షారూక్ ఖాన్ గురించి ఆయన మాట్లాడారు. షారూక్తో వచ్చిన విభేదాలపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ సూపర్స్టార్ క్షమాపణ చెప్పకపోవడం వల్లే మా ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని తెలిపారు. షారూక్ ఖాన్కు ఉన్న అహం వల్లే వృత్తిపరంగా ఆయన సినిమాలకు పనిచేయడం లేదని అన్నారు. తాజాగా ఓ పాడ్కాస్ట్కు హాజరైన ఆయన షారూక్తో విభేదాలపై స్పందించారు. విభేదాలకు అదే కారణం..పాడ్కాస్ట్లో అభిజీత్ మాట్లాడుతూ.. 'షారుఖ్ ఖాన్కు అహం ఎక్కువ. నాకు ఆత్మగౌరవమే ముఖ్యం. అందే మా మధ్య విభేదాలకు కారణమైంది. షారుఖ్ నా కంటే చిన్నవాడు.. అయినా ఫరా ఖాన్ భర్త అతన్ని అంతగా దూషించినప్పుడు కూడా షారుఖ్ అతన్ని కౌగిలించుకున్నాడు. ఆమిర్ ఖాన్ ఒక కుక్కకు షారూఖ్ అని పేరు కూడా పెట్టాడు.. అయినా వారిద్దరూ స్నేహితులుగా ఉన్నారు. అయినా మీరు ఒక్కసారి కూడా క్షమాపణ చెప్పలేకపోవడం నన్ను బాధించింది. మీరు అంత గొప్ప వ్యక్తి అయినప్పటికీ నాకు క్షమాపణ చెప్పలేదు” అని అన్నారు. ఇదే తనపై భావోద్వేగమైన ప్రభావం చూపిందని పేర్కొన్నారు.షారూఖ్ తాను చేసిన తప్పును అంగీకరించకపోవడమే తనను ఎక్కువగా బాధించిందని అభిజిత్ అన్నారు. అందుకే షారూక్ ప్రాజెక్టులకు దూరంగా ఉండాలనే నిర్ణయం తీసుకున్నానని వెల్లడించారు. అయితే తన నిర్ణయం అహంకారంతో కాదని.. వ్యక్తిగత నిరాశతోనే తీసుకున్నానని సింగర్ స్పష్టం చేశారు. ఒకానొక సమయంలో షారూక్ కోసం తాను ఇతర నటుల కోసం కూడా పాడటం మానేశానని అన్నారు. షారుక్ ఖాన్తో సన్నిహితంగా ఉన్నప్పటికీ తనను పట్టించుకోవడం లేదని అనిపించేదని అభిజీత్ భట్టాచార్య అన్నారు. నాకు సరైన గుర్తింపు, క్రెడిట్ లేకపోవడం వల్లే షారూక్తో విభేదాలు తలెత్తాయని గతంలో అభిజీత్ చాలాసార్లు వెల్లడించారు. కాగా.. సింగర్ అభిజిత్ 'బాద్షా', 'మై హూ నా' వంటి చిత్రాలలోని పాటలకు తన గాత్రం అందించారు. మై హూ నా మూవీ టైమ్లో తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని అన్నారు. అభిజిత్ చివరిసారిగా షారూక్ బిల్లు చిత్రానికి పనిచేశారు. -
ఆయన అభిప్రాయాలను తప్పుపట్టను
‘‘సింగర్ అభిజీత్ అంటే నాకెంతో అభిమానం. నాపై ఎన్ని విమర్శలు చేసినా ఆయన్ను గౌరవిస్తూనే ఉంటాను. ఆయన అభిప్రాయాలను తప్పుపట్టను. ఒక్కొక్కరికీ ఒక్కో అభి్ప్రాయం ఉంటుంది. నా పని తీరుపై ఆయనకు ఉన్న అభిప్రాయాన్ని ఆ విధంగా బయటపెట్టారు’’ అని పేర్కొన్నారు ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్. విషయం ఏంటంటే... ఏఆర్ రెహమాన్ డిజిటల్ టూల్స్పై ఎక్కువగా ఆధారపడుతున్నారని, దీంతో సంప్రదాయ సంగీత వాద్యకారులకు ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయని అభిజీత్ పేర్కొన్నారు. ఈ విషయంపై రెహమాన్ ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ...‘‘దుబాయ్ వేదికగా 60మంది మహిళలతో ఓ ఆర్కెస్ట్రా బృందాన్ని ఏర్పాటు చేసి, వారికి ఉద్యోగాలు కల్పించి, ప్రతి నెలా జీతాలు ఇస్తున్నాను. వారికి ఆరోగ్య, జీవిత బీమా సౌకర్యాలనూ కల్పించాను. అది ‘ఛావా’ కావొచ్చు... ‘΄పొన్నియిన్ సెల్వన్’ కావొచ్చు... నా ప్రతి సినిమాలో 200 నుంచి 300 మంది వరకు మ్యూజీషియన్స్ ఇన్వాల్వ్ అవుతారు. కొన్ని పాటలపై 1000 మంది మ్యూజీషియన్స్ వర్క్ చేసిన సందర్భాలూ ఉన్నాయి. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయను. సో... నా వర్కింగ్ స్టైల్పై అందరికీ అవగాహన ఉండకపోవచ్చు’’ అన్నారు. అందుకే ‘వండర్మెంట్’ అని పెట్టా: రెహమాన్, ఆయన భార్య సైరా భాను విడి విడిగా ఉండటం, అలాగే ఇటీవల అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరడం వంటి విషయాలు చర్చనీయాంశం కావడం పట్ల ఆ ఇంటర్వ్యూలో రెహమాన్ స్పందిస్తూ... ‘‘ఇది అమానవీయం. నా జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. ప్రతి ఒక్కరిలోనూ ఓ ప్రత్యేకమైన గుణం ఉంటుంది. వాళ్ల ఇంట్లో వారే సూపర్హీరో. కానీ.. నేను సూపర్ హీరో అయ్యేలా చేసింది మాత్రం నా అభిమానులే. నేను ఆస్పత్రిలో చేరాననగానే ఎంతో ప్రేమతో సందేశాలు పంపారు. ఇంతమంది అభిమానం సొంతం చేసుకోవడం నాకు ‘వండర్’గా అనిపించింది. అందుకే నా తర్వాతి మ్యూజికల్ టూర్కి ‘వండర్మెంట్’ అని పేరు పెట్టుకున్నాను’’ అన్నారు. -
ఫుట్ పాత్ లు ఉన్నది పడుకోవడానికా?
ముంబై: సల్మాన్ ఖాన్ కు జైలు శిక్ష విధించిన నేపథ్యంలో డిజైనర్ ఫరా అలీఖాన్, గాయకుడు అభిజిత్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఫుట్ పాత్ లు ఉన్నది జనాలు నిద్రించడానికి కాదని అభిజిత్ ట్వీట్ చేశాడు. ఫుట్ పాత్ లపై ఏదైనా ప్రమాదం జరిగితే అందుకు బాధ్యత డ్రైవర్లు లేదా మద్యానికి కాదని పేర్కొన్నాడు. ఆత్మహత్య నేరం, మరి ఫుట్ పాత్ లపై పడుకోవడం నేరం కాదా అని ప్రశ్నించాడు. 80 శాతం మంది నిరాశ్రయులు ఎంతో కష్టపడి బాలీవుడ్ లో స్టార్ డమ్ సాధించారని వారెప్పుడూ ఫుట్ పాత్ లపై నిద్రించలేదని వ్యాఖ్యానించాడు. 'హిట్ అండ్ రన్'కు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిజైనర్ ఫరా అలీఖాన్ ట్వీట్ చేశారు. పేదలను నిరాశ్రయులను చేయడం వల్లే వారు ఫుట్ పాత్ లపై పడుకుంటున్నారని తెలిపారు. నిరాశ్రయులు ఫుట్ పాత్ పై నిద్రించకుండా ఉంటే సల్మాన్ వారిపై కారు ఎక్కించేవాడు కాదని పేర్కొన్నారు. పట్టాలు దాటుతున్న వ్యక్తిపై రైలు పోనిచ్చినందుకు రైలు డ్రైవర్ ను శిక్షించిన చందంగా సల్మాన్ ఖాన్ కు శిక్ష విధించారని అన్నారు. రోడ్డు లేదా ఫుట్ పాత్ లపై ఎవరూ నిద్రించరాదని... ఇది రైలు పట్టాలు దాటడం లాంటిదని ఆమె వర్ణించారు. అయితే తన వ్యాఖ్యలపై వివాదం రేగడంతో ఆమె వివరణ ఇచ్చారు. పేదలను అవమానించడం తన ఉద్దేశం కాదని, పాలకుల చేతగాని తనాన్ని ఎద్దేవా చేశానని చెప్పారు. పేదలకు ఇళ్లు నిర్మించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. అభిజిత్ కూడా తన వ్యాఖ్యలను సమర్థించుకున్నాడు. మనుషులు కుక్కల్లా ఫుట్ పాత్ లపై పడుకోరాదన్నదే తన ఉద్దేశమని వివరణయిచ్చాడు. తన దృష్టిల్లో ప్రతి మనిషి గౌరవింపదగిన వాడేనని చెప్పాడు.


