-
క్వార్టర్స్లో మరో నలుగురు భారత బాక్సర్లు
ఇప్పటివరకు తొమ్మిదిసార్లు ప్రపంచ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్షిప్ జరిగింది. 2006లో స్వదేశంలో జరిగిన ఈవెంట్లో భారత్ అత్యధికంగా ఎనిమిది పతకాలు సాధించి తమ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. అనంతరం జరిగిన ఐదు ప్రపంచ చాంపియన్షిప్లలో భారత్ ఈ తరహా ప్రదర్శన పునరావృతం చేయలేకపోయింది. పుష్కర కాలం తర్వాత మళ్లీ సొంతగడ్డపై భారత బాక్సర్లకు తమ ఉత్తమ ప్రదర్శనను సమం చేసే అవకాశం లభించింది. ఇలా జరగాలంటే నేడు జరిగే ఎనిమిది క్వార్టర్ ఫైనల్స్లోనూ భారత బాక్సర్లు తమ పంచ్ పవర్తో ప్రత్యర్థుల పని పట్టాల్సి ఉంటుంది. బరిలో దిగిన అందరూ గెలిస్తే భారత్ ఖాతాలోఎనిమిది పతకాలు ఖాయమవుతాయి. న్యూఢిల్లీ: ప్రత్యర్థి ఎవరైనా... నేపథ్యం ఎంత ఘనంగా ఉన్నా... అవేవీ లెక్క చేయకుండా భారత మహిళా బాక్సర్లు దూసుకుపోతున్నారు. పంచ్ల వర్షం కురిపిస్తూ ప్రత్యర్థుల ఆట కట్టిస్తూ ముందంజ వేస్తున్నారు.ఆదివారం నలుగురు బాక్సర్లు క్వార్టర్ ఫైనల్ బెర్త్లు ఖరారు చేసుకోగా... సోమవారం మరో నలుగురు క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. ఇక్కడి కేడీ జాదవ్ స్టేడియంలో జరుగుతున్న ప్రపంచ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్షిప్లో ఐదో రోజు సోనియా చహల్ (57 కేజీలు), పింకీ రాణి (51 కేజీలు), సిమ్రన్జిత్ కౌర్ (64 కేజీలు) తమ ప్రత్యర్థులపై విజయం సాధించగా... ప్లస్ 81 కేజీల విభాగంలో సీమా పూనియాకు నేరుగా క్వార్టర్ ఫైనల్కు ‘బై’ లభించింది. అయితే 75 కేజీల విభాగంలో మాత్రం భారత బాక్సర్ సవీటి బూరా పరాజయం పాలై ప్రిక్వార్టర్ ఫైనల్లోనే నిష్క్రమించింది. ఈ మెగా ఈవెంట్లో మొత్తం 10 వెయిట్ కేటగిరీలలో పోటీలు జరుగుతుండగా... భారత్ నుంచి సరితా దేవి (60 కేజీలు), సవీటి బూరా (75 కేజీలు) మినహా మిగతా ఎనిమిది మంది క్వార్టర్ ఫైనల్కు చేరుకున్నారు. విజయం... వివాదం హరియాణాకు చెందిన 21 ఏళ్ల సోనియా చహల్ పాల్గొన్న 57 కేజీల ప్రిక్వార్టర్ ఫైనల్ బౌట్ ఫలితం వివాదాస్పదమైంది. ఈ బౌట్లో సోనియా 3–2తో 2014 ప్రపంచ చాంపియన్షిప్ స్వర్ణ పతక విజేత స్టానిమిరా పెట్రోవా (బల్గేరియా)ను ఓడించింది. రెండో రౌండ్ వరకు వెనుకబడి ఉన్న సోనియా చివరి రౌండ్లో పుంజుకొని గెలిచింది. అయితే తుది ఫలితంపై సోనియా ప్రత్యర్థి స్టానిమిరా అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆతిథ్య దేశం బాక్సర్లకు బౌట్ జడ్జిలు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, వారు అవినీతికి పాల్పడ్డారని ఆమె ఆరోపించింది. సోనియాను రిఫరీ విజేతగా ప్రకటించే సందర్భంలో నిర్వేదంగా నవ్వుతూ, చూపుడు వేలును ఊపుతూ ఆమె నిరసన ప్రకటించింది. స్టానిమిరా కోచ్ పీటర్ యొసిఫవ్ లెసోవ్ ఏకంగా రింగ్లోకి నీళ్ల సీసాను విసిరేశాడు. దీంతో అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఏఐబీఏ) అతడి అక్రిడిటేషన్ను రద్దు చేసి పోటీల ప్రాంతం నుంచి బహిష్కరించింది. ఇతర బౌట్లలో పింకీ 5–0తో ఇంగ్లండ్కు చెందిన ఎలిస్ ఎబొని జోన్స్పై,సిమ్రన్జిత్ 5–0తో మెగన్ రీడ్ (స్కాట్లాండ్)పై ఏకపక్ష విజయాలు సాధించారు. 75 కేజీల విభాగంలో భారత్కు నిరాశే మిగిలింది. ఇందులో సవీటి బూరా 0–5తో ఎల్జిబీటా వొజిక్ (పోలండ్) చేతిలో ఓడిపోయింది. క్వార్టర్స్లో ఎవరితో ఎవరు ►54 కేజీలు మనీషా గీ స్టొయికా (బల్గేరియా) ►69 కేజీలు లవ్లీనా గీ స్కాట్ కయి (ఆస్ట్రేలియా) ►81 కేజీలు భాగ్యవతి గీ జెస్సికా (కొలంబియా) ►48 కేజీలు మేరీకోమ్ గీ వు యు (చైనా) ►57 కేజీలు సోనియా గీ కాస్టెనాడ (కొలంబియా) ►ప్లస్ 81 కేజీలుసీమా గీ జియోలి యాంగ్ (చైనా) ►51 కేజీలు పింకీ రాణి గీ చోల్ మి పాంగ్ (కొరియా) ►64 కేజీలు సిమ్రన్జిత్ గీ అమీ సారా (ఐర్లాండ్) మధ్యాహ్నం గం.1.00 నుంచి స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్–1లో ప్రత్యక్ష ప్రసారం -
పరిశుద్ధులైన నేతలు కావాలి
న్యూఢిల్లీ: కొత్త నెత్తురు, తొలిసారి ఓటర్లు, భవిష్య భారత్కు ప్రతినిధులు ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఉరకలెత్తే ఉత్సాహంతో పాల్గొన్నారు. మంచి భవి ష్యత్కు భరోసా ఇచ్చే పాలన రావాలని కోరుకుంటున్నారు. డిసెంబర్ 16 నిర్భయ మీద సామూహిక అత్యాచారం నేపథ్యంలో మహిళా భద్రత ముఖ్యం, ఇది కచ్చితంగా అమలు జరగాలంటే చిత్తశుద్ధి ఉన్న నాయకులు అవసరం అంటున్నారు. ఈసారి శాసనసభ ఎన్నికల్లో తొలిసారి ఓటు వేస్తున్న యువతరం ప్రతినిధులు నాలుగు లక్షలకు పై మాటే. ‘‘ఈసారి ఢిల్లీ పాలనలో మార్పు రావాలి. బాధ్యత కలిగిన, పరిశుద్ధులైన నాయకులను కోరుకుంటున్నా’’ అని 23 ఏళ్ల సహీర్ సేథ్ అన్నాడు. 19 ఏళ్ల అంకిత మెహరా అతని అభిప్రాయాన్ని ఆమోదిస్తూ ‘‘మహిళలకు భద్రత కలిగిన ఢిల్లీ కావాలి’’ అని నొక్కి చెప్పింది. మయూర్ విహా ర్కు చెందిన 21 ఏళ్ల లవ్లీన్ శర్మ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తంచేసింది.‘నాతోపాటు నా స్నేహితులు అనేక మంది సురక్షితమైన, భద్రత కలిగిన పరిస్థితులు ఏర్పడాలని కోరుకుంటున్నారు. బాధ్యతాయుతమైన వ్యక్తులుగా ఎదగడానికి భద్రత కలిగిన వాతావరణం కావాలి’ అని తెలిపిం ది. ఆమె స్నేహితురాలు సిమ్రాన్ కౌర్ మాట్లాడుతూ ‘‘యువత భవిష్యత్ కోసం పనిచేసే ప్రభుత్వం ఏర్పడాలి. ప్రజల జీవితాలను అభివృద్ధి చేసే విధంగా ప్రభుత్వ పనివిధానం ఉండాలి’’ అని కోరింది. యువతరంలోనూ కొందరు ఇంకా పాత ప్రభుత్వమే కొనసాగాలని కోరుతున్నవారూ ఉన్నారు. ‘‘నాకు కాంగ్రెస్ పట్ల విశ్వాసం. అభివృద్ధిపనులు కొనసాగించడానికి మరోసారి అధికారం అప్పగించాల్సిందే’’ అని కహ్కాషాన్ నూర్ అభిప్రాయపడ్డారు. యువతరం ప్రతినిధుల మధ్య రాజకీయ పరమైన భిన్నాభిప్రాయాలున్నా తొలిసారిగా ఓటు చేయనున్నందుకు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాజౌరీగార్డెన్కు చెందిన తితిక్షజైన్ మాట్లాడుతూ‘వయోజన ఓటు హక్కును ఓ గౌరవంగా భావిస్తున్నాను. తొలిసారి ఓటు చేసిన అనుభవం జీవితాంతం మరవలేనిది’ అని ఆనందం వ్యక్తం చేశాడు. అంతరిక్ అన్వేషణ్ అనే 22 ఏళ్ల యువకుడు మాట్లాడుతూ‘‘ ఓటు హక్కు కోసం చిన్ననాటి నుంచి ఎదురు చూస్తున్నాను. పోలింగ్ కేంద్రానికి వెళ్లడం, వేలి మీద సిరా గుర్తు, ఓటింగ్ మిషన్ మీద నచ్చిన అభ్యర్థికి ఎదురుగా నొక్కడం, నిజంగా ఒక వింత అనుభూతి. నేను ఇప్పుడు ఈ ప్రజాస్వామ్యంలో భాగస్వామిని’ అని వివరించాడు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉమ్మడి మేనిఫెస్టోకు బీజేపీ దూరం.. బాబు కుట్రకు పురంధేశ్వరి బలి
టీ20 వరల్డ్కప్కు నేపాల్ జట్టు ప్రకటన..
ఈసీ నిషేధంపై స్పందించిన కేసీఆర్
చిన్న విషయానికి చిల్లర గొడవ.. కొట్టుకున్న టీడీపీ కార్యకర్తలు
వీళ్లే మన ఏలూరు అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి..
గత ఎన్నికల్లో నాకు ఓటు వేయని వారికి నా విజ్ఞప్తి: సీఎం జగన్
కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్ విషాద మరణాలు (ఫొటోలు)
గెలుపు ధీమా.. జోరుగా హుషారుగా ఎన్నికల ప్రచారం
రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కేకు స్టార్ ప్లేయర్స్ దూరం
తప్పక చదవండి
- రిజర్వేషన్లను రద్దు చేయాలన్నదే ఆర్ఆర్ఎస్ మూల సిద్ధాంతం: రేవంత్
- హీరో నవీన్ చంద్రకు ప్రతిష్టాత్మక పురస్కారం
- నా కుమారుడు వరల్డ్కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
- సుల్తాన్పూర్ లోక్సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు
- ‘దిశ’ ఎన్కౌంటర్ కేసు.. సిర్పూర్ కర్ కమిషన్ రిపోర్ట్పై స్టే
- జనసేన నేతలకు అవమానం.. టీడీపీ ప్రచార రథంపై నుంచి గెంటేసి..
- ప్రపంచంలోనే అత్యంత ధనిక ఖైదీ..!
- రాయ్బరేలీ, అమేథి స్థానాలపై 24 గంటల్లో తుది నిర్ణయం
- సీఐ, ఎస్ఐ వేధిస్తున్నారు.. సూసైడ్ లేఖ రాసి..
- ‘జగన్ను ప్రజలే రక్షించుకుంటారు’: బొబ్బిలి రోడ్షోలో సీఎం జగన్
Advertisement