breaking news
showkat
-
వైఎస్సార్సీపీలో చేరిన గుంటూరు టీడీపీ నేత షేక్ షౌకత్
-
‘గల్లా జయదేవ్ మాట తప్పారు’
సాక్షి, హైదరాబాద్: ఎంపీ గల్లా జయదేవ్ తనకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇప్పిస్తానని మాట ఇచ్చి తప్పారని గుంటూరు ఈస్ట్ టీడీపీ నాయకుడు షేక్ షౌకత్ ఆరోపించారు. గురువారం లోటస్పాండ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. గత ఐదేళ్లుగా టీడీపీలో క్రియాశీలకంగా పనిచేశానని వెల్లడించారు. గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే టిక్కెట్ ఇప్పిస్తానని గల్లా జయదేవ్ మీడియా ముఖంగా చెప్పారని తెలిపారు. మద్దాల గిరి, గల్లా అరుణ కూడా తనకు హామీయిచ్చారని చెప్పారు. వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలో చేరిన నాయకుడికి రాయపాటి సాంబశివరావు రెండు రోజుల్లోనే టిక్కెట్ ఇప్పించారని, తనకు మాత్రం మొండిచేయి చూపారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు మాట ఇచ్చి మోసం చేసినందుకు నిరసనగా టీడీపీ నుంచి బయటకు వచ్చానని అన్నారు. గుంటూరులో వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించేందుకు, మైనార్టీలను ఒక తాటిపై తీసుకొచ్చేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని చెప్పారు. వైఎస్ జగన్ను ముఖ్యమంత్రి చేసేందుకు ప్రచారం సాగిస్తానని షౌకత్ స్పష్టం చేశారు. -
నిశ్చితార్థం మధ్యలోనే ఉడాయించాడు
హైదరాబాద్ : నిశ్చితార్థం మధ్యలోనే పెళ్లికొడుకు ఉడాయించాడు. బంజారాహిల్స్ పోలీసుస్టేషన్ పరిధిలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం... టోలిచౌక్ నివాసి మహ్మద్ అబ్దుల్ రవూఫ్ తన కూతురుకు మలక్పేటకు చెందిన షౌకత్తో జూన్ 15న స్థానిక నజీర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేశాడు. వేడుక జరుగుతుండగానే షౌకత్కు ఎవరి నుంచో ఫోన్ కాల్ వచ్చింది. దీంతో ఎవరికీ చెప్పకుండానే నిశ్చితార్థం మధ్యలోంచి షౌకత్ వెళ్లిపోయాడు. అప్పటి నుంచి పెళ్లికి నిరాకరిస్తున్నాడు. దీంతో తమ పరువు ప్రతిష్టలకు భంగం కల్గించడంతో పాటు నిశ్చితార్థం పేరుతో తమతో భారీగా ఖర్చు చేయించిన షౌకత్పై చర్యలు తీసుకోవాలని అబ్దుల్వ్రూఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బంజారాహిల్స్ పోలీసులు షౌకత్పై చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.