breaking news
Shoojit sarkar
-
తాప్సీ పిచ్చ హ్యాపీ
ముంబై: బాలీవుడ్ సినిమా ‘పింక్’ ట్రైలర్ కు ప్రశంసలు దక్కడం పట్ల హీరోయిన్ తాప్సీ సంతోషం వ్యక్తం చేసింది. ఆగస్టు 9 విడుదల చేసిన ‘పింక్’ ట్రైలర్ ను యూట్యూబ్ లో 61 లక్షల మందిపైగా చూశారు. 'నేను ప్రస్తుతం విదేశాల్లో ఉన్నాను. పింక్ సినిమా ట్రైలర్ కు అనూహ్య స్పందన రావడం ఎంతో సంతోషం కలిగించింది. ట్రైలర్ ను చూసి ఈ సినిమాను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. మా ప్రయత్నం విజయవంతం కాబోతుంద'ని తాప్సీ ఆశాభావం వ్యక్తం చేసింది. క్రిమినల్ కేసులో ఇరుక్కున్న ముగ్గురు యువతులు చేసిన న్యాయపోరాటం నేపథ్యంలో 'పింక్' సినిమా తెరెకెక్కింది. సుజిత్ సర్కార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, తాప్సీ, కీర్తి కుల్హరి, ఆండ్రియా తారింగ్ ముఖ్యపాత్రల్లో నటించారు. సెప్టెంబర్ 16న ఈ సినిమా విడుదలకానుంది. -
‘మద్రాస్కేఫ్ లో జాన్, నర్గిస్ల నటన అద్భుతం’
ముంబై:. శ్రీలంక పౌరయుద్ధం ఆధారంగా తీసిన మద్రాస్కేఫ్ సినిమా జాన్ అబ్రహం, నర్గిస్ ఫక్రికి మంచి పేరు తెస్తుందని షూజిత్ సర్కార్ ఘంటాపథంగా చెబుతున్నాడు. తన కొత్త సినిమా మద్రాస్ కేఫ్ ఫలితంపై దర్శకుడు ఎంతో ధీమాగా ఉన్నాడు. నటుల్లోని రక్తం పీల్చి అయినా వారి నుంచి ఫలితం రాబట్టడం తనకు తెలుసన్నాడు. మద్రాస్కేఫ్లో వీళ్లద్దరూ అద్భుతంగా నటించారని కితాబిచ్చాడు. పదేళ్లుగా బాలీవుడ్లో ఉంటూ ధూమ్, దోస్తానా, హౌస్ఫుల్ 2, రేస్ 2, షూటౌట్ ఎట్ వాడాలా వంటి పెద్ద చిత్రాల్లో నటించినా జాన్కు ఇప్పటికీ పెద్దనటుడిగా గుర్తింపు లేదు. రాక్స్టార్తో హిందీ సినిమాల్లోకి వచ్చిన నర్గిస్ ఫక్రి నటన ఏమీ బాగాలేదని విమర్శలు రావడంతో ఈ బ్యూటీ కెరీర్ కూడా ప్రమాదంలో పడింది. శుక్రవారం విడుదలవుతున్న మద్రాస్కేఫ్ చూసిన తరువాత ప్రేక్షకులు జాన్, నర్గిస్పై ఇది వరకు ఉన్న అభిప్రాయాన్ని మార్చుకుంటారని సర్కార్ అంటున్నాడు.