breaking news
shivajirao moghe
-
‘సమస్యల పరిష్కారంలో బీజేపీ విఫలం’
సాక్షి,ఎదులాపురం(ఆదిలాబాద్) : సమస్యల పరిష్కారంలో బీజేపీ పూర్తిగా విఫలమైందని మహారాష్ట్ర మాజీ మంత్రి శివాజీ మోగే అన్నారు. ప్రధానమంత్రి మోదీ వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు ఈ నెల 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు నాలుగు రోజులపాటు 81 కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. పాదయాత్రకు మాజీ మంత్రి సి.రాంచంద్రారెడ్డి, ఇతర నాయకులను ఆహ్వానించడానికి సోమవారం ఆయన ఆదిలాబాద్కు వచ్చారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సి.రాంచంద్రరెడ్డి స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మోదీ పాలనలో రైతులకు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించడం లేదన్నారు. అప్పులు ఊబిలో చిక్కుకుని ఆత్మహత్యకు పాల్పడుతున్నారని తెలిపారు. బీజేపీ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి, కుంభకోణాలపై, ప్రభుత్వ తీరును ప్రజలకు తెలిపేందుకే పాదయాత్రను తలపెట్టినట్లు తెలిపారు. పాదయాత్ర ఈ నెల 5న మహారాష్ట్రలోని పాండ్రకోడ హనుమాన్ మందిర్ నుంచి ప్రారంభమైన 8న దాబడీ వద్ద ముగుస్తుందని చెప్పారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి సి.రాంచంద్రరెడ్డి, కాంగ్రెస్ నాయకులు నరేశ్జాదవ్, దిగంబర్రావు పాటిల్, అంబకంటి అశోక్, వసీమొద్దీన్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. -
గరంగరంగా కేబినెట్ భేటీ
ముంబై: లోక్సభ ఎన్నికల్లో అధికార డీఎఫ్ కూటమి దారుణ పరాభవం అనంతరం జరిగిన తొలి రాష్ట్ర కేబినెట్ సమావేశం గరంగరంగా సాగింది. ఈ ఎన్నికల్లో మహా కూటమి అభ్యర్థుల చేతిలో ఓడిపోయిన కాంగ్రెస్, ఎన్సీపీ మంత్రులు తమ తమ నియోజకవర్గాల్లో ముందుకు సాగని అభివృద్ధి పనుల గురించి గళమెత్తారు. ఈ సమావేశానికి ఛగన్ భుజ్బల్, సురేశ్ దాస్, సునీల్ తట్కరే, శివాజీరావ్ మోఘే కూడా హాజరయ్యారు. రాయ్గఢ్ స్థానం నుంచి శివసేన ఎంపీ అనంత్ గీతే చేతిలో ఓడిన తట్కరే మాట్లాడుతూ దిగ్గి పోర్టు అభివృద్ధిలో జాప్యం జరుగుతుండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పనులు చేపట్టిన డెవలపర్కు నోటీసులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. బీడ్లో బీజేపీ నేత గోపీనాథ్ ముండే చేతిలో ఓడిన దాస్ మాట్లాడుతూ మరాఠ్వాడా ప్రాంతంలో నీటి కొరత సమస్యను లేవనెత్తారు. దీనిని పరిష్కరించేందుకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇతర మంత్రులు వివాదాస్పద టోల్ వసూలు గురించి ఘాటుగా మాట్లాడారు. నాగపూర్ లోక్సభ పరిధిలోకి వచ్చే తన నియోజకవర్గంలో ప్రత్యర్థి, బీజేపీ నేత గడ్కారీ 12 వేల ఓట్ల ఆధిక్యత రావడంతో పదవికి రాజీనామా చేసిన ఉపాధి హామీ పథక మంత్రి నితిన్ రౌత్ గరంగరంగానే మాట్లాడారు. రాష్ట్రంలో జాతీయ న్యాయ పాఠశాల ఏర్పాటులో జరుగుతున్న ఆలస్యాన్ని లేవనెత్తారు. అడ్మిషన్ విధానాన్ని ప్రారంభించేందుకు కేబినెట్లో ప్రతిపాదన పెట్టాలని డిమాండ్ చేశారు. ముంబై, నాగపూర్, ఔరంగాబాద్లో ఈ న్యాయ పాఠశాలలు ఏర్పాటుచేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించిన విషయాన్ని గుర్తు చేశారు. బుల్దానా, నాగపూర్, వార్ధా జిల్లా సహకార బ్యాంక్ల ఆర్థిక ఇబ్బందులపై కూడా కేబినెట్ భేటీలో చర్చకు వచ్చింది. రూ.260 కోట్లకు పైగా ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించింది. చేపల్లో వ్యాధులు త్వరితగతిన గుర్తించేందుకు పాల్ఘర్లో ల్యాబోరేటరీ ఏర్పాటుకోసం పది ఎకరాలను కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసే పోలీసు సిబ్బందికి పోస్టింగ్లను ఇవ్వనుంది. ఈ ప్రాంతాల్లో పనిచేసే పోలీసు కానిస్టేబుళ్లకు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్గా పదోన్నతి కల్పించేందుకోసం నాగపూర్ రేంజ్ ఐజీ ఆధ్వర్యంలో ఓ కమిటీని ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. సబ్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ పోలీసు ఇన్స్పెక్టర్ పదోన్నతులను రాష్ట్ర డీజీపీ నేతృత్వంలోని కమిటీ పరిశీలిస్తుంది. రెండు సంవత్సరాల పాటు ఈ ప్రాంతాల్లో పనిచేసిన వారికి ఈ పదోన్నతులు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. అధిష్టానం తీరే కొంపముంచింది: చవాన్ సాక్షి, ముంబై: లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణ పరాభవంతో ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ పదవికి రాజీనామా చేయాలని అటు ప్రతిపక్షంతో పాటు ఇటు అధికార పక్షంలోని నేతల నుంచే డిమాండ్ పెరుగుతోంది. దీంతో తన పదవికి ఎక్కడ ఎసరు వస్తుందో ఏమో అనుకున్నాడో గానీ ఈ ఓటమికి కారణం కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వమేనని తేల్చిచెప్పారు. మంగళవారం ఆయన మీడియాతో ఆఫ్ ది రికార్డ్గా ఈ వ్యాఖ్యలు చేశారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణంగా ఓడిపోవడానికి అధిష్టానమే కారణమని చవాన్ చేతులెత్తేశారు. విపరీతంగా పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు, పెరిగిన అవినీతి, వెలుగులోకి వచ్చిన కుంభకోణాలు ఓటమికి కారణాలయ్యాయని వివరణ ఇచ్చారు. అందుకు కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానిదే బాధ్యత అంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. కాగా, లోక్సభ ఎన్నికల తర్వాత చవాన్ రాజీనామా చేయాలని అయన వ్యతిరేకులతోపాటు అనుకూలురు కూడా పట్టుబట్టారు. శాసనసభ ఎన్నికలు మరో ఐదు నెలల్లో జరగనున్నాయి. చవాన్ రాజీనామా చేస్తే కనీసం ఈ ఐదు నెలల పాటు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగాలని అనేకమంది ప్రముఖులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అయినా చవాన్ ముఖ్యమంత్రి పదవిని వదులుకునేందుకు సిద్ధంగా లేరు. నాయకత్వం మారే అవకాశాలు లేకపోవడంతో సీఎం కూడా ధైర్యంగా ఉన్నారు. చివరకు ఓటమిని కాంగ్రెస్ అధిష్టానంపై నెట్టేసి చేతులెత్తేశారు. ‘లోక్సభ ఎన్నికల్లో జరిగిన ఓటమి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఒక చాలెంజ్గా పరిణమించనుంది. ఇప్పటినుంచే సాధ్యమైనన్ని ప్రజోపయోగ పనులు చేపట్టాలనుకుంటున్నాం. రాష్ట్రవ్యాప్తంగా 240 శాసనసభ నియోజకవర్గాలలో కాంగ్రెస్ నాయకులు వెనకబడడం చింతించాల్సిన విషయమ’ని చవాన్ అంగీకరించారు. ముఖ్యమంత్రిగా తననే కొనసాగించాలా...? లేక మరొకరిని నియమించాలనేది పార్టీ అధిష్టానం చూసుకుంటుంది. ఒకవేళ సీఎం పదవి నుంచి తొలగిస్తే తన రాజకీయ భవిష్యత్పై కూడా నిర్ణయం తీసుకోవాలని పార్టీ అధిష్టానానికి సూచించినట్లు ఆయన వెల్లడించారు. -
త్వరలో విస్తరణ
సాక్షి, ముంబై: త్వరలో రాష్ట్ర మంత్రిమండలిని విస్తరించనున్నట్లు ముఖ్యంత్రి చవాన్ పరోక్షంగా వెల్లడించారు. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన రాష్ట్రమంత్రులు గెలుపొందినట్లయితే ఖాళీ అయిన వారి స్థానాలను భర్తీ చేయాల్సి ఉంటుందని, ఇందుకోసం ఢిల్లీ వెళ్లాలని యోచిస్తున్నట్లు చెప్పారు. దీంతో రాష్ట్ర మంత్రిమండలి విస్తరణ త్వరలో ఉండడం ఖాయమని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నాలుగైదు నెలల సమయం మాత్రమే ఉన్నా కాంగ్రె స్, ఎన్సీపీ నేతల్లో మంత్రిపదవులను దక్కించుకునే పోటీ తీవ్రంగానే కనిపిస్తోంది. కొత్తవారికి అవకాశం దక్కడంతోపాటు ఉన్నవారి శాఖలు కూడా మార్చే అవకాశముందని ఎన్సీపీ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ నుంచి ఇద్దరు, ఎన్సీపీ నుంచి ముగ్గురు రాష్ట్ర మంత్రులు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన విషయం తెలిసిందే. దీంతో వీరి స్థానాలను భర్తీ చేయాల్సి ఉంది. కాంగ్రెస్లో.... లోకసభ ఎన్నికల అనంతరం కాంగ్రెస్లో అయిదుగురికి మంత్రి పదవులు లభించే అవకాశాలు కన్పిస్తున్నాయి. ముఖ్యంగా తమ కోటాలోని మూడు మంత్రి పదవులను భర్తీ చేయాలని కాంగ్రెస్ యోచిస్తోంది. మరోవైపు కాంగ్రెస్కు చెందిన సామాజిక న్యాయశాఖ మంత్రి శివాజీరావ్ మోఘే, పర్యావరణశాఖ మంత్రి సంజయ్ దేవ్తలేలు లోకసభ ఎన్నికల్లో పోటీ చేశారు. వీరిద్దరు విజయం సాధించి నట్టయితే మరో రెండు స్థానాలు ఖాళీ కానున్నాయి. దీంతో ఈ ఐదు స్థానాల్లో కొత్తవారికి అవకాశాలు దక్కనున్నాయని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. మంత్రిపదవుల రేసులో ఎంపీసీసీ అధ్యక్షులు మాణిక్రావ్ ఠాక్రేతోపాటు వసంత్ పురకే తదితర నాయకుల పేర్లు వినిపిస్తున్నాయి. వీరితోపాటు మరికొందరు కూడా మంత్రి పదవిని దక్కించుకునేందుకు ఇప్పటినుంచే ఢిల్లీలో ప్రయత్నాలు ప్రారంభించినట్టు సమాచారం. ఎన్సీపీలో... లోక్సభ ఫలితాల అనంతరం మంత్రి మండలి విస్తరించనున్నట్టు సంకేతాలు వెలువడంతో ఎన్సీపీ నేతల్లో ఆశలో చిగురించాయి. ప్రజాపనులశాఖ మంత్రి ఛగన్ భుజ్బల్, జలవనరులశాఖ మంత్రి సునీల్ తట్కరేలతోపాటు సురేష్ దస్లు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశారు. వీరంతా విజయం సాధించినట్టయితే మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. దీంతో ఖాళీ కానున్న వీరి స్థానాలను కొత్తవారితో భర్తీ చేస్తే మరికొందరికి అవకాశం దక్కుతుంది. ఈ నేపథ్యంలో ఎన్సీపీ నాయకులలో జితేంద్ర అవాడ్కు మంత్రి పదవి దక్కే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఆయనతోపాటు ప్రకాశ్ సోలంకే, ధనంజయ్ ముండే, సమీర్ భుజ్బల్, పంకజ్ భుజ్బల్ తదితరులు కూడా మంత్రిపదవుల రేసులో ఉన్నారని చెబుతున్నారు.