breaking news
Shivaji YALAMANCHILI
-
బాబు వైఖరే గ్రేటర్ ఓటమికి కారణం
మాజీ ఎంపీ యలమంచిలి శివాజీ గుంటూరు : ముఖ్యమంత్రి చంద్రబాబు అనుసరించిన వైఖరి గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ ఓటమికి కారణమని రాజ్యసభ మాజీ సభ్యుడు యలమంచిలి శివాజీ అన్నారు. శనివారం రాత్రి ఆయన ఫోన్లో మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో ఏపీ సీఎం శాంతి యుత సహజీవనం సాగించడం వల్ల ప్రచార కార్యక్రమాల్లో టీఆర్ఎస్ ఫ్రభుత్వంపై ఘాటైన విమర్శలు చేయలేకపోయారని తెలిపారు. ఈ విధానం వల్ల టీడీపీ కేడర్కు ఆయన ధైర్యాన్ని ఇవ్వలేకపోవడంతోపాటు టీఆర్ఎస్ అభ్యర్థులకు దీటుగా ప్రచారం చేయలేకపోయారని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రులు ఇద్దరూ స్నేహంగా ఉన్న సమయంలో మనం స్థానికులతో ఎందుకు వివాదాలకు పోవాలని భావించి అక్కడి ఏపీ ఓటర్లు పార్టీని దృష్టిలో ఉంచుకోకుండా స్థాని క పరిస్థితులకు అనుగుణంగా టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించారని యలమంచిలి అభిప్రాయపడ్డారు. ఈ ఫలితాలు ఊహించి నవేనని, ఒక ప్రాంతీయపార్టీ మరో రాష్ట్రం స్థానిక ఎన్నికల్లో గెలిచిన దాఖలాలు లేవని, చరిత్ర ఇది చెబుతోందని తెలిపారు. ఉత్తర్ప్రదేశ్లో ములాయంసింగ్, బీహార్లో లాలూప్రసాద్యాదవ్లు ఆయా రాష్ట్రాల్లో బలంగా ఉన్నప్పటికీ, పక్క రాష్ట్రాల్లో పార్టీని విస్తరింప చేయలేకపోయారని తెలిపారు. సీఎం చంద్రబాబు కొత్తగా ఏర్పాటైన రాష్ట్రంలోని పరిస్థితులను చక్కదిద్దుకునే ప్రయత్నం చేయకుండా పక్క రాష్టంలో పార్టీని బలపరిచే దిశగా ప్రయత్నాలు చేయడం ఇప్పుడు అభిలషణీయం కాదని తెలిపారు. -
లక్ష ఎకరాలు బిల్లీరావు, ఎమ్మార్ కోసమేనా?
మండిపడ్డ మాజీ ఎంపీ, రైతు నేత యలమంచిలి శివాజీ విజయవాడ బ్యూరో: రాజధాని నిర్మాణంపై స్పష్టతలేని ప్రభుత్వం లక్ష ఎకరాలు సేకరించి బిల్లీరావు, ఎమ్మార్లకు కట్టబెడుతుందా? పరిపాలన చేయాల్సిన ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందా? అంటూ రాజ్యసభ మాజీ సభ్యుడు, రైతు నేత యలమంచిలి శివాజీ మండిపడ్డారు. జాతీయ భూ సేకరణ చట్టం- రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన డ్రాఫ్ట్, నియమ నిబంధనలపై భూమి ఉపాధి హక్కుల వేదిక, దళిత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్క్లబ్లో సోమవారం రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న శివాజీ మాట్లాడుతూ... రాజధాని పేరుతో వ్యాపారం చేయాలనుకునే కొందరు సీఎంను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. సీఎం చంద్రబాబు మేల్కొనకపోతే రాజధాని నిర్మాణం మాటున భూ స్కామ్లకు అవకాశం ఇచ్చిన కళంకితుడవుతారని హెచ్చరించారు.ప్రైవేటు భూములను లాక్కుని రాజధాని నిర్మిస్తామని చెప్పడం సరికాదన్నారు. కృష్ణా-గుంటూరు జిల్లాల్లో 23వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, రాజధానిని వాటిలో నిర్మించుకోవచ్చని సూచించారు. హైదరాబాద్లోని సెక్రటేరియేట్ 22ఎకరాల్లో ఉందని, న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితి కార్యాలయం 20 ఎకరాల్లో ఉందని ప్రస్తావించారు. ఈ లెక్కన చూస్తే రాజధానికి లక్షల ఎకరాలు అవసరంలేదనే విషయం అవగతమవుతుందన్నారు. రాజధానికి 5 వేల నుంచి 10 వేల ఎకరాలు అవసరమని, తొలిదశలో 1,500 ఎకరాలు కావాలని కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చిందని శివాజీ గుర్తు చేశారు.ప్రైవేటు భూములే కావాలనుకుంటే మంత్రులు, ఎంపీలు, వారి బంధువులు ఇక్కడ కొనుగోలు చేసిన వందలాది ఎకరాలను తొలుత సేకరించాలని డిమాండ్ చేశారు.