గిల్, అభిషేక్ కాదు.. అత్యధిక ధరకు అమ్ముడుపోయింది ఇతడే
టీమిండియా స్టార్లు శుబ్మన్ గిల్, అభిషేక్ శర్మ, అర్ష్దీప్ సింగ్ షేర్- ఈ- పంజాబ్ టీ20 కప్ 2026 టోర్నీలో భాగం కానున్నారు. పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ టీ20 లీగ్కు సంబంధించి ఆదివారం ఆటగాళ్ల వేలం జరిగింది.ప్రత్యేక ఆకర్షణగా అభిషేక్ శర్మఇందులో టీమిండియా టీ20 సూపర్స్టార్ అభిషేక్ శర్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. అమృత్సర్ సుర్మాస్కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు.. ఆ ఫ్రాంఛైజీ అధికారులతో కలిసి వేలంలో పాల్గొన్నాడు. ఆటగాళ్ల కొనుగోలు విషయంలో సూచనలు, సలహాలు ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఆరు ఫ్రాంఛైజీలుకాగా ఈ లీగ్లో ఆరు ఫ్రాంఛైజీలు ఫజిల్క ఫాల్కన్స్, అమృత్సర్ సుర్మాస్, లుథియానా లయన్స్, భటిండా రాయల్స్, జలంధర్ వారియర్స్, మొహాలీ కింగ్స్ టైటిల్ కోసం రంగంలోకి దిగనున్నాయి.అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ప్లేయర్ ఇతడేఇదిలా ఉంటే.. షేర్-ఈ-పంజాబ్ టీ20 కప్ లీగ్ 2026 సీజన్లో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా సన్వీర్ సింగ్ నిలిచాడు. ఫజిల్క ఫాల్కన్స్ రూ. 13.02 లక్షలకు అతడిని కొనుగోలు చేసింది. ఈ బ్యాటింగ్ ఆల్రౌండర్ గతంలో ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ (2023, 2024)కు ఆడాడు. ఐపీఎల్లో మొత్తంగా ఆరు మ్యాచ్లు ఆడిన 29 ఏళ్ల సన్వీర్ 25 పరుగులు చేశాడు. టీమిండియా ప్లేయర్ల ధర ఎంతంటే?టీమిండియా స్టార్లలో కెప్టెన్ శుబ్మన్ గిల్ను ఫజిల్క ఫాల్కన్స్, అభిషేక్ శర్మను అమృత్సర్ సుర్మాస్, అర్ష్దీప్ సింగ్ను లుథియానా లయన్స్, గుర్నూర్ బ్రార్ను భటిండా రాయల్స్ సొంతం చేసుకున్నాయి.ఇక ప్రభ్సిమ్రన్ సింగ్ను జలంధర్ వారియర్స్, రమణ్దీప్ సింగ్ను మొహాలీ కింగ్స్ కొనుక్కున్నాయి. వీరందరిని ఆయా ఫ్రాంఛైజీలు రూ. 10 లక్షల ధరకు రిజర్వు చేసుకున్నాయి.షేర్-ఈ-పంజాబ్ టీ20 కప్ వేలం-2026లో అత్యధిక ధర పలికిన ఆటగాళ్లు వీరే1. సన్వీర్ సింగ్ (ఫజిల్క ఫాల్కన్స్)- రూ. 13.02 లక్షలు2. నమన్ ధిర్ (అమృత్సర్ సుర్మాస్)- రూ. 10.80 లక్షలు3. రాహుల్ కుమార్ (అమృత్సర్ సుర్మాస్)- రూ. 8.40 లక్షలు4. అన్మోల్ప్రీత్ సింగ్ (మొహాలీ కింగ్స్)- రూ. 8.20 లక్షలు5. సలీల్ అరోరా (లుథియానా లయన్స్)- రూ. 8 లక్షలు6. హర్నూర్ సింగ్ (భటిండా రాయల్స్)- రూ. 7 లక్షలు7. అశ్వనీ కుమార్ (భటిండా రాయల్స్)- రూ. 7 లక్షలు8. అన్మోల్ మల్హోత్రా (జలంధర్ వారియర్స్)- రూ. 6.20 లక్షలు9. సుఖ్దీప్ బజ్వా (జలంధర్ వారియర్స్)- రూ. 6 లక్షలు10. ఆయుశ్ గోయల్ (మొహాలీ కింగ్స్)- రూ. 4.60 లక్షలు. చదవండి: సిరాజ్ సిక్సర్ల జోరు.. భారత్ గెలుపు View this post on Instagram A post shared by Sher-E-Punjab T20 League (@sherepunjabt20)