breaking news
shekar babu
-
శేఖర్బాబును ఆదర్శంగా తీసుకోవాలి
స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య రెండో రోజుకు చేరిన తెలంగాణ రాష్ట్రస్థాయి పద్యనాటక సప్తాహం అలరించిన వీరపాండ్య కట్టబ్రహ్మన నాటకం హన్మకొండ కల్చరల్ : పద్యనాటకం కోసం పందిళ్ల శేఖర్బాబు ఎన్నో త్యాగాలు చేశారని, తెలంగాణ కళాకారులందరూ ఆయనను ఆదర్శం గా తీసుకోవాలని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. తెలంగాణ రాష్ట్రభాషా సాంస్కృతికశాఖ సౌజన్యంతో పం దిళ్ల శేఖర్బాబు స్మారక పద్యనాటక సప్తాహ కమిటీ ఆధ్వర్యంలో హ న్మకొండ పబ్లిక్గార్డెన్లోని నేరేళ్ల వేణుమాధవ్ కళాప్రాంగణంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి పద్యనాటక సప్తాహం శనివారం రెండో రో జుకు చేరింది. ఈ సందర్భంగా సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ ప్రధాన కార్యదర్శి గన్నమరాజు గిరిజామనోహర్బాబు అధ్యక్షతన జరిగిన ప్రదర్శనను ఎమ్మెల్యే రాజయ్య ప్రారంభించి మాట్లాడా రు. శేఖర్బాబు స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గానికి చెందిన వారు కా వడం తమకు గర్వకారణమన్నారు. గ్రామీణ కళాకారులకు తెలంగా ణ ప్రభుత్వం చేయూతనందిస్తుందన్నారు. పోలీస్ కమిషనర్ సుధీర్బాబు మాట్లాడుతూ పౌరాణిక నాటక ప్రదర్శనలను చూడడం ద్వా రా నాయకత్వ లక్షణాలు పెరుగుతాయన్నారు. టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు కారం రవీందర్రెడ్డి మాట్లాడుతూ మలిదశ తెలంగాణ ఉద్యమంలో శేఖర్బాబు తమతో కలిసి పనిచేశారని తెలిపారు. శేఖర్బా బు కళారంగానికి ఎనలేని సేవలు అందించారన్నారు. అనంతరం సా మాజిక చైతన్య కళాకారుడు, వల్లంపట్ల ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షుడు వల్లంపట్ల నాగేశ్వర్రావును.. ఎమ్మెల్యే, సీపీ శాలువా, పూలమాలతో సత్కరించారు. కార్యక్రమంలో కాళోజీ ఫౌండేషన్ అధ్యక్షుడు నాగిళ్ల రామశాస్త్రి, బోయినపల్లి పురుషోత్తమరావు(పంథిని), పందిళ్ల అశోక్కుమార్, వనం లక్ష్మీకాంతారావు, డాక్టర్ ఇందారపు కిషన్రావు,బూరవిద్యాసాగర్, జ్యోతి జయకర్రావు, ఆకుల సదానందం, బిటవరం శ్రీధర స్వామి, ఎం.సదానందచారి, ఎ.శ్యామ్సుందర్ పాల్గొన్నారు. అలరించిన నాటక ప్రదర్శన.. శౌర్య పరాక్రమాలకు మారుపేరుగా, స్వాతంత్య్రయోధుడిగా కీర్తిగాం చిన వీరపాండ్య కట్టబ్రహ్మన చరిత్రను ఆర్.గుండయ్య సమర్పణ లో, కె.విశ్వనాథశాస్త్రి, డాక్టర్ నర్సయ్య దర్శకత్వంలో ధర్మపురి శ్రీలక్ష్మీ నరసింహæనాట్యమండలి కళాకారులు అద్భుతంగా ప్రదర్శిం చారు. ఇందులో కె. నరహరి, డాక్టర్ సంగనభట్ల నర్సయ్య, బి. కిశో ర్, ఎస్. రామకిష్టయ్య, ఎస్. కిషన్, పి. బాలకృష్ణ, కె. అనిల్కుమార్, కె. అమ ర్. బి. నరహరి, ఎస్. విజయ్కుమార్, వి. పురుషోత్తం, కె. శివప్రసా ద్, ఎం. శ్రీనివాస్ తదితరులు నటించారు. కె.దత్తాత్రేయశర్మ సంగీ తం, కె.దత్తాత్రి, కె.వి.రమణ నిర్వహణ సహకారం అందజేశారు. కా గా, ఆదివారం సాయంత్రం నగరంలోని కాకతీయ నాటక కళాపరిష త్ సభ్యులు మకుటాయమానం భావించే గయేపాఖ్యాన ం నాటకం ప్రదర్శించనున్నారు. -
బండపై బాదుడు
అరవిందనగర్లో నివాసముంటున్న శేఖర్బాబు గ్యాస్ బుక్ చేశాడు. రూ.719 చెల్లించాలని మెసేజ్ వచ్చింది. బాయ్ సిలిండర్ డెలివరీ చేసి రూ.750 ఇవ్వాలన్నాడు. ఇదేమిటని శేఖర్ ప్రశ్నించాడు. రూ.30 ఎక్కువ ఇవ్వాల్సిందే అని ఖచ్చితంగా అడగడంతో తప్పదన్నట్లు రూ.750 ఇచ్చి పంపించాడు శేఖర్. ఇది ఒక్క శేఖర్ అనుభవమే కాదు. నగరంలో ప్రతి గ్యాస్ వినియోగదారుడు సిలిండర్ ధరపై అదనంగా ఇచ్చుకోవాల్సిందే. అనంతపురం అర్బన్: గ్యాస్ సిలిండర్ల డెలివరీ సమయంలో ‘బాయ్స్’ చేతి వాటం ప్రదర్శిస్తున్నారు. నిర్ణీత ధరపై రూ.30 అదనంగా వసూలు చేస్తున్నా రు. ఇవ్వకపోతే ఒక తంటా... ఈసారి సిలిండర్ బుక్ చేసినా సమాయానికి ఇవ్వరనే భయం. దీంతో ఎందుకొచ్చిన గొడవలే అనుకుంటూ అదనంగా ఇచ్చేందుకు ప్రజలు అలవాటు పడ్డారు. ఇది ఎంతగా ఉందంటే నెలకు 60 వేల సిలిండర్లు డెలివరీ అవుతున్న ఒక్క అనంతపురంలోనే రూ.18 లక్షలుగా ఉంది. ఈ లెక్కన నగరంలోనే వినియోగదారుల నుంచి ఏడాదికి రూ.2.16 కోట్లు బాయ్స్ నొక్కేస్తున్నారనేది స్పష్టమవుతోంది. ఇలా జిల్లావ్యాప్తంగా ఎంత ఉంటుందో ఉహించుకుంటే నొరెళ్లబెట్టక తప్పదు. జిల్లాలో 64 ఏజెన్సీలు ఉన్నాయి. వీటిలో డబుల్ సిలిండర్, సింగిల్ సిలిండర్, దీపం గ్యాస్ కనెక్షన్లు 7.52 లక్షలు ఉన్నాయి. ఇందులో ఐఓసీ 3.54 లక్షలు, హెచ్పీసీ 2.10 లక్షలు, బీపీసీ 1.88 లక్షలు ఉన్నాయి. వీటిలో ఒక్క అనంతపురం నగరంలోనే అత్యధికంగా 1.75 లక్షల మేర ఉన్నాయి. అధికారిక లెక్కల ప్రకారం జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజు 7 వేల సిలిండర్ల వరకు డెలివరీ అవుతుంటాయి. సింగిల్ సిలిండర్పై మరింత రేటు జిల్లాలో సింగిల్ సిలిండర్ కలిగిన వినియోగదారులు 3.23 లక్షలు ఉన్నా రు. అనంతపురం నగరంలో దాదాపు 20 వేలకు పైగానే ఉన్నాయి. ఈ వినియోగదారులు గ్యాస్ బుక్ చేసుకుంటే బాయ్స్కి మరింత అదనపు ఆదాయమే వస్తుంది. సింగిల్ సిలిండర్ కాబట్టి తప్పని సరిగా తీసుకోవాలి. లేకపోతే పని జరగదు. దీన్ని ఆసరాగా చేసుకుని డెలివరీ బాయ్స్ సిలిండర్పై అదనంగా రూ.40 నుంచి రూ.వంద వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వినియోగదారుడి అవసరాన్ని బట్టి వసూలు చేసే మొత్తం ఉంటుంది.