breaking news
Shawl
-
ఆది పురుష్ కోసం కృతి సనాన్ స్పెషల్ శాలువా దీని ప్రత్యేకతలు తెలిస్తే ఔరా అంటారు..!
-
ఆదిపురుష్ ప్రమోషన్స్: స్పెషల్ శాలువాతో కృతి సనన్, దీని విశేషాలు తెలిస్తే
మోస్ట్ ఎవైటెడ్ , అప్ కమింగ్ మూవీ ఆదిపురుష్ ప్రమోషన్స్లో హీరోయిన్ కృతి సనన్ మరోసారి తన లేటెస్ట్ లుక్స్తో అందర్నీ కట్టిపడేస్తోంది. బ్యూటిఫుల్ లుక్స్తో ఫ్యాన్స్ను మెస్మరైజ్ చేసింది. ముఖ్యంగా ఈ ప్రచార కార్యక్రమంలో కృతి సనన్ అయోధ్య కథలతో రూపొందించిన శాలువను ధరించడం విశేషంగా నిలిచింది. కృతి సనన్ స్టైలిస్ట్, సుకృతి గ్రోవర్ ఇన్స్టా హ్యాండిల్లో దీనికి సంబంధించిన అద్బుత ఫోటోలను షేర్ చేసింది. ఆదిపురుష్ ప్రమోషనల్ ఈవెంట్స్లోని కృతి లేటెస్ట్ లుక్స్తో ఉన్న పిక్స్ను పోస్ట్ చేసింది. ముఖ్యంగా వెడల్పాటి గోల్డెన్ అంచు, లేత గోధుమరంగు అనార్కలిలో బ్యూటిఫుల్గా ఉంది. ప్రత్యేకంగా సుకృతి అండ్ ఆకృతి బ్రాండ్ ప్రత్యేకంగా రూపొందించిన అయోధ్య కథల శాలువా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. రెండేళ్లు శ్రమించి రామ కథలతో శాలువా పురాణ గాథ రామాయణం ప్రేరణగా రూపొందించిన ఈ శాలువా తయారీకి రెండు సంవత్సరాలు పట్టిందట. అంతేకాదు దీన్ని ఇంత అందంగా తీర్చి దిద్దడానికి ఎన్ని వేల గంటలు పట్టిందో తెలిస్తే మరింత ఆశ్చర్యపోతారు. 6000 కంటే ఎక్కువ గంటలే దీనికోసం కృషి చేశారు. రామాయణంలోని పంచవటి, స్వయంవరం, అశోక వనం, రామ్ దర్బార్లోని నాలుగు సన్నివేశాలు ఇందులో కూర్చారు. పాషా, చోకర్స్, కడా లాంటి స్టేట్మెంట్ ఆభరణాలతో పాటు అందమైన హెయిర్ యాక్సెసరీతో అద్భుతమైన అనార్కలిలో దేవకన్యలా మెరిసిపోతోంది. (అపుడు పాల ప్యాకెట్ కొనలేక పాట్లు, ఇపుడు 800 కోట్ల ఆస్తులు!) కాగా ప్రభాస్, కృతి సనన్ జోడిగా రాబోతున్న చిత్రం ఆదిపురుష్. జూన్ 16, 2023న థియేటర్లలోకి రానున్న ఈ మూవీ ప్రమోషన్స్లో టీం బిజీగా ఉంది. ఈ చిత్రంలో ప్రభాస్ 'రాఘవ' కేరెక్టర్లోనే, 'జానకి' పాత్రలో కృతి నటించిన సంగతి తెలిసిందే. -
ఈదుల్ ఫిత్ర్ శుభాకాంక్షలతో... శుభాల పరిమళం..
మానవ జీవితంలో ఆనంద సమయాలు చాలా ఉంటాయి. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వ్యక్తిగతంగానో, సామూహికంగానో ఏదైనా మేలు జరిగినప్పుడు మానవ అంతరంగం ఆనందంతో పులకించడం సహజం. అలాంటి వాటిలో పండుగలు ముఖ్యమైనవి. వాటిలో రంజాన్ ఇంకా ముఖ్యమైనది. ముస్లిం సోదరులు జరుపుకునే ‘ఈద్’కి రంజాన్ మాసంతో సంబంధం ఉండటం వల్ల ఈ పండుగ అదే పేరుతో ప్రసిద్ధికెక్కింది. నిజానికి రమజాన్ అన్నది సంవత్సరంలోని పన్నెండు నెలల్లో తొమ్మిదవ నెల పేరు. దీనికింతటి ప్రత్యేకత రావడానికి కొన్ని కారణాలున్నాయి. సర్వ మానవాళికి మార్గదర్శక గ్రంథమైన పవిత్ర ఖురాన్ రమజాన్ మాసంలోనే అవతరించింది. మానవజాతికి జ్ఞానకాంతిని ప్రసాదించే దివ్యజ్యోతి రమజాన్ మాసంలో అవతరించిన కారణంగానే ఈ మాసానికి ఇంతటి గౌరవం, ఘనత, పవిత్రత ప్రాప్తమయ్యాయి. మానవుల శారీరక, మానసిక, ఆధ్యాత్మిక వికాసానికి అద్భుతంగా ఉపకరించే ‘రోజా’ అనే ఉపవాస వ్రతాన్ని కూడా దైవం ఈ నెలలోనే విధిగా చేశాడు. ఇది జనహృదయాల్లో భయభక్తులు జనింపజేసి, మానవీయ విలువలను, సుగుణాలను పెంపొందిస్తుంది. పాపకార్యాలు, దుర్మార్గాల వైపుకు మనసు పోకుండా కాపాడుతుంది. ఉపవాసం వల్ల సహనశక్తి పెరుగుతుంది. జాలి, దయ, కరుణ, త్యాగం, పరోపకారం లాంటి సద్గుణాలు అలవడతాయి. స్థితిపరులు ఉపవాసం పాటిస్తే, పేదసాదల ఆకలి బాధను వారు అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతారు. ఇలా మరెన్నో మానవీయ, నైతిక సుగుణాలను మానవుల్లో పెంపొందింపజేసే ఏర్పాటును చేసిన విశ్వప్రభువుకు కృతజ్ఞతగా నెల రోజుల ఉపవాసాలను ముగించి షవ్వాల్ మొదటి తేదీన ఈద్ జరుపుకుంటారు. దేవుని మన్నింపు లభించే మహత్తర శుభదినం ఈద్. తప్పులు, పొరపాట్లకు క్షమాపణ కోరుకునే రోజు ఈద్. జరిగిన తప్పుల పట్ల సిగ్గుపడుతూ, ఇకముందు తప్పులు చేయం అని, దైవమార్గంపై స్థిరంగా ఉంటామని సంకల్పం చెప్పుకునే రోజు ఈద్. కనుక దేహంలో ప్రాణం ఉండగానే దైవం ఇచ్చిన సదవకాశాన్ని వినియోగించుకొని సన్మార్గం వైపు మరలాలి. ఒక విషయం సత్యమని తెలిసినా దానికనుగుణంగా తమ జీవితాలను మలచుకోడానికి చాలామంది ముందుకు రారు. ఇదే మానవుల బలహీనత. దీన్ని అధిగమించడంలోనే విజ్ఞత, వివేకం దాగి ఉన్నాయి. పుట్టిన ప్రతి మనిషీ గిట్టక తప్పదన్న విషయం ఎంత సత్యమో, ఈ అశాశ్విత దేహం నుండి ఆత్మ ఎప్పుడు వీడిపోతుందో ఎవరికీ తెలియదన్నదికూడా అంతే సత్యం. అందుకే ఈ ఆత్మజ్యోతి ఆరిపోకముందే జాగృతమై దైవం వైపు మరలాలి. జరిగిపోయిన తప్పుల్ని సవరించుకొని రుజుమార్గం పైకిరావాలి. మనం తెలిసీ తెలియక చేసిన పాపాలను క్షమించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. పవిత్ర రమజాన్ దీనికి చక్కని అవకాశం కల్పించింది. ఈ నెల్లాళ్ళూ ఎంతటి నియమ నిష్టలతో గడిపారో ఇకముందు కూడా ఇదే స్ఫూర్తి కొనసాగిస్తామని ప్రతిన బూనాలి. ఈద్ పర్వదినం సందర్భంగా ఇలాంటి దృఢ సంకల్పం చెప్పుకుంటే అది నిజమైన పండుగ రోజు అవుతుంది. జీవితాల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిసే శుభదినం అవుతుంది. ఒకవేళ ఈవిషయాలపట్ల శ్రద్ధ వహించక పోతే ఈద్ సౌభాగ్యానికి దూరమయ్యే ప్రమాదం కూడా ఉంది. కనుక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దైవానికి కృతజ్ఞతలు చెల్లిస్తూ పవిత్ర జీవితం గడిపే ప్రయత్నం చెయ్యాలి. పండుగ రోజు వేకువ ఝామునే నిద్రలేచి స్నానపానాదులు ముగించుకొని ప్రాతః కాల ఫజర్ నమాజు చేయాలి. ఉన్నంతలో మంచి దుస్తులు ధరించి, అత్తరు లాంటి సువాసన ద్రవ్యాలను వినియోగించాలి. ఈద్గాలో సమావేశమై సామూహికంగా దైవానికి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ ఈద్ నమాజ్ చేయాలి. కరోనా కారణంగా ఈసారి ఈద్ గాహ్లలో కాకుండా మసీదులలోనే మాస్క్ ధరించి, భౌతికదూరం పాటిస్తూ నమాజు ఆచరించవలసి ఉంది. తమ అపరాధాలను మన్నించమని, సన్మార్గాన నడపమని దుఆ చేయాలి. సమస్త మానవాళి సుఖసంతోషాలను కాంక్షిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేయాలి. వ్యాధుల బారినుండి, అప్పుల బారినుండి, శత్రువుల బారినుండి,కరువుకాటకాల నుండి, దారిద్య్రం నుండి తమను, దేశాన్ని, యావత్ భూప్రపంచాన్ని రక్షించమని, ముఖ్యంగా కరోనా మహమ్మారి నుండి మానవాళినంతటినీ కాపాడమని విశ్వప్రభువును వేడుకోవాలి. స్నేహితులు, బంధువులు, ఇరుగు పొరుగు, పరిచితులు, అపరిచితులందరితో సంతోషాన్ని పంచుకోవాలి. ‘ఈద్ ముబారక్’ అంటూ శుభాకాంక్షలు తెలుపుకోవాలి. అన్ని సందర్భాల్లో కోవిడ్ నిబంధనలు పాటించాలి. పండుగ పరమార్థాన్ని అవగాహన చేసుకుంటే రమజాన్ ఆరాధనల ఆశయం నెరవేరుతుంది. భావి జీవితాలు సుఖసంతోషాలతో గడిచిపోతాయి. సమాజంలో శాంతి, సామరస్యాలు వెల్లివిరుస్తాయి. ఒక చక్కని సుందర సమాజం ఆవిష్కృతమవుతుంది. పండుగ పంచిన మంచి మానవ జీవితాల్లో చివరి శ్వాస వరకూ గుబాళించాలని మనసారా కోరుకుందాం. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
చిత్రం చెప్పింది
ప్రేమలో ఉన్నవాళ్లంతా పెళ్లి చేసుకుంటారని చెప్పలేం. లవ్కి బ్రేకప్ చెప్పుకునే జంటలు ఉంటాయి. ఇప్పుడు అందాల తార సుస్మితా సేన్ తన బాయ్ఫ్రెండ్ రోహ్మన్తో లవ్కి కటీఫ్ చెప్పారన్నది కొందరి ఊహ. ఆ ఊహ తప్పని ఇక్కడున్న చిత్రం చెప్పింది. చిత్రం అంటే ఫొటో అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ ఫొటోని స్వయంగా సుస్మితా సేన్ విడుదల చేశారు. రోహ్మన్తో కలసి తాను జిమ్ చేస్తున్న ఫొటోను ఆమె బయటపెట్టారు. ఈ ఫొటో చాలు.. ఈ ఇద్దరూ విడిపోలేదని చెప్పడానికి. మరి పెళ్లెప్పుడూ అంటే.. ఇద్దరూ చేసుకున్నప్పుడు. ఆ విషయం గురించి మౌనం వహిస్తున్న ఈ ఇద్దరూ పార్టీల్లో, రెస్టారెంటుల్లో.. ఇలా చాలా చోట్ల జాయింట్గా కనిపిస్తున్నారు. -
శాలువాను తొడుక్కోండి!
చలికాలంలో భుజాల మీదుగా ఒంటికి హత్తుకుపోయిన శాలువా వెచ్చదనంతో హాయినిస్తుంది. ఏక వస్త్రంగా ఉండే శాలువాను వీలైతే దుపట్టాలా వాడుకోవచ్చు, కప్పుకోవచ్చు. కానీ తొడుక్కోవడం ఏంటి అనుకుంటున్నారా? అయితే చదవండి... ఇక్కడ ఫొటోలో చూపినట్టుగా మార్చేస్తే కోటులా ధరించవచ్చు. శాలువాలా కప్పుకోవచ్చు. గౌనులా డిజైన్ చేసుకోవచ్చు. ఇంకా రకరకాల టాప్స్లాగా డిజైన్ చేసుకోవచ్చు. శాలువాను మధ్యకు మడిచి, చేతుల భాగం మడిచి కుడితే ఇలా ధరించవచ్చు.శాలువాను భుజాల మీదుగా కప్పుకుంటే అంచుభాగం ముందుకు వచ్చేలా సర్ది, నడుము భాగాన సన్నని బెల్ట్ పెడితే, అధునికంగా మారిపోతుంది. శాలువాకి లాంగ్ స్లీవ్స్ జత చేస్తే ఓవర్ కోట్లా ధరించవచ్చు. మందంగా ఉండే చీరను రెండు మడతలుగా వేసి, కుడితే డిజైనరీ శాలువా సిద్ధం. శాలువా మెటీరియల్తో గౌను, కుర్తీ, వంటివీ డిజైన్ చేసుకోవచ్చు. స్టైల్కీ, కంఫర్ట్కీ బోలెడంత అవకాశం ఉండే శాలువాతో ఇలా ఎన్నో డిజైన్స్ మీరూ తయారుచేయవచ్చు.