breaking news
Shankaravam
-
లోకేష్ సభలో తన్నుకున్న తమ్ముళ్లు
-
మెదక్ నుంచే ప్రగతి శంఖారావం
మెదక్: రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు కొత్త పథకాలకు బుధవారం మెదక్ నుంచి శ్రీకారం చుట్టనుందని ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి టి.హరీశ్రావు వెల్లడించారు. మంగళవారం ఎమ్మె ల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బీడీ ప్యాకర్లకు, టేకేదార్లకు ఆసరా పింఛన్లు, దివ్యాంగులకు రూ.4,016 పింఛన్ పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తారని తెలిపారు. మెదక్ నుంచే ప్రగతి శంఖారావం పూరిస్తారని చెప్పారు. బీఆర్ఎస్ను మూడోసారి అధికారంలోకి తెచ్చేలా ఇక్కడ బహిరంగసభ ఉంటుందని, ఉమ్మడి జిల్లాలో పదికి పది సీట్లు గెలిచి కేసీఆర్కు బహుమానంగా ఇస్తామని అన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా విడుదలతో తమ ఆత్మవిశ్వాసం పెరిగిందని, విపక్షాలు మాత్రం విలవిల్లాడుతున్నాయని పేర్కొన్నారు. టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నవారి నుంచి కాంగ్రెస్ నేతలు డబ్బులు వసూలు చేస్తున్నారని హరీశ్ ఆరోపించారు. తెలంగాణ పథకాలను కేంద్రంసహా వివిధ రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయని, బీసీ కుల వృత్తిదారులకు రూ.లక్ష అందిస్తుండగా, దీనిని కేంద్రం కాపీ కొట్టి విశ్వకర్మలకు రూ.లక్ష అప్పు ఇస్తామని ప్రకటించిందని పేర్కొన్నారు. కేసీఆర్ అంటేనే కాలువలు, చెరువులు, రిజర్వాయర్లు అని, బీఆర్ఎస్ అంటే భారత రైతు సమితి అని కొత్త అర్థం చెప్పారు. సమావేశంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సీఎం పర్యటన వివరాలు ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి గుమ్మడిదల, నర్సాపూర్, కౌడిపల్లి మీదుగా మెదక్ పట్టణానికి చేరుకుంటారు. అక్కడ మధ్యాహ్నం ఒంటి గంటకు బీఆర్ఎస్ కార్యాలయం, 1.20 గంటలకు ఎస్పీ కార్యాలయం, 1.40 గంటలకు కలెక్టరేట్ను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 3.30 గంటలకు జరిగే బహి రంగ సభలో మాట్లాడతారు. ఏర్పాట్లను మంత్రి హరీశ్ పర్యవేక్షించారు. ప్రారంభానికి ముస్తాబైన జిల్లా పోలీసు కార్యాలయ సముదాయం విద్యుత్ కాంతుల్లో మెరిసిపోతోంది. కలెక్టరేట్ భవనం, లోపలి చాంబర్లను రంగు రంగుల పూలు, విద్యుత్ దీపాలతో సిబ్బంది అలంకరించారు. -
'ఎస్టీల్లోంచి మమ్మల్ని తొలగించడం ఎవరి తరమూ కాదు'
సాక్షి, హైదరాబాద్ : ‘‘లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించడం ఎవరి తరమూ కాదు. రాజ్యాంగం కల్పించిన హక్కును ఎవరూ మార్చలేరు. అలా చేస్తే తిరగబడతాం. ప్రాణాలను పణంగా పెట్టి ఉద్యమిస్తాం..’’అని లంబాడీ ప్రజాప్రతినిధులు, నేతలు పేర్కొన్నారు. కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం గిరిజన కులాల మధ్య అగ్గిరాజేశారని, దాన్ని ఏమాత్రం సహించబోమని స్పష్టం చేశారు. లంబాడీలు, ఆదివాసీలు, గోండులు, కోయ తదితర గిరిజన కులాలన్నీ కలసిమెలసి ఉండాలని.. ఎస్టీలకు రావాల్సిన వాటాను పూర్తిస్థాయిలో దక్కించుకునేందుకు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. బుధవారం లంబాడీ ఐక్య వేదిక ఆధ్వర్యంలో హైదరాబాద్లోని సరూర్నగర్ మైదానంలో ‘లంబాడీల శంఖారావం’సభ జరిగింది. ఇందులో ఎంపీ సీతారాం నాయక్, ఎమ్మెల్సీ రాములు నాయక్, ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, శంకర్నాయక్, రవికుమార్, రేఖానాయక్, కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్, పలువురు మాజీ ప్రజాప్రతినిధులు, లంబాడీ ఐక్య వేదికలోని సంఘాల నాయకులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో లంబాడీలు హాజరై శంఖారావానికి మద్దతు తెలిపారు. అనవసర తగాదాలు వద్దు! నలభై రెండేళ్ల నుంచి ఎస్టీలుగా ఉన్నామని, అలాంటి లంబాడీలను వలసవాదులని ఎలా అంటారని ఎంపీ సీతారాంనాయక్ ప్రశ్నించారు. ‘‘క్రీమీలేయర్ ద్వారా గిరిజన యాక్టును తీసుకొచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల మంది లంబాడీలు ఎస్టీలుగా ఉన్నారు. షెడ్యూల్డ్ తెగల్లో లంబాడీలు 70శాతం ఉంటే.. కేవలం రెండు శాతం లేని వాళ్లు మమ్మల్ని శాసిస్తున్నారు. కొందరు రాజకీయ ప్రయోజనాలను కాంక్షిస్తూ ఆదివాసీలు, లంబాడీల మధ్య చిచ్చు పెట్టి అంతరాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి ఎత్తులను సాగనివ్వం. అందరం ఐక్యంగా ఉంటాం. సమస్యలుంటే కూర్చొని పరిష్కరించుకోవాలి. అనవసర తగాదాలతో రాద్దాంతం చేయొద్దు..’’అని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో రిజర్వేషన్లకు ప్రమాదం వచ్చే అవకాశముందని, ఐక్యంగా ఉంటేనే సమాజంలో మనగలుగుతామని వ్యాఖ్యానించారు. గత పాలకుల నిర్లక్ష్యంతోనే ఎస్టీలు అభివృద్ధికి నోచుకోలేదన్నారు. తగాదా పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వల్లే లంబాడీలు ఎస్టీ జాబితాలో చేరారని కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్ పేర్కొన్నారు. రిజర్వేషన్లతోనే గిరిజన కులాలు ఈ మాత్రం అభివృద్ధి చెందాయన్నారు. గిరిజన కులాల మధ్య తగాదాలు పెట్టేందుకు ప్రభుత్వంలోని కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. లంబాడీలకు, ఆదివాసీలకు ఎలాంటి శత్రుత్వం లేదని, సోదరుల్లా కలసి ఉంటామని ఎమ్మెల్సీ రాములునాయక్, రవికుమార్ పేర్కొన్నారు. స్వాతంత్య్రం వచ్చి డెబ్బై ఏళ్లయినా ఎస్టీలు అభివృద్ధికి దూరంగా ఉన్నారని.. ఇప్పుడిప్పుడే అభివృద్ధి బాట పడుతున్న ఎస్టీలను దారి మళ్లించేందుకు కొందరు కలహాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఫలాలు అందరికీ అందుతున్నాయి ఎస్టీ రిజర్వేషన్ల ద్వారా వచ్చిన ప్రయోజనాలను లంబాడీలే అనుభవించడం లేదని.. ఎస్టీ కులాలందరికీ అందుతున్నాయని ఎమ్మెల్యే రేఖానాయక్ పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎస్టీ రిజర్వేషన్లను ఎక్కువగా ఆంధ్రా గిరిజనులే వినియోగించుకున్నారని ఆరోపించారు. లంబాడీల్లో ఇంకా వెనుకబాటుతనం ఉందని, గిరిజన తండాలను పరిశీలిస్తే సమస్యలు తెలుస్తాయని చెప్పారు. ఆదివాసీల వెనుకబాటుతనానికి, లంబాడీలకు ఎలాంటి సంబంధం లేదని గిరిజన సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు గుగులోత్ శంకర్నాయక్ అన్నారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సోయం బాబూరావు ఇలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వేదికపై ‘రాజకీయ’వివాదం లంబాడీల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటోందని ఎమ్మెల్సీ రాములునాయక్ తదితరులు ప్రసంగంలో పేర్కొనడంతో సభికుల నుంచి నిరసన వ్యక్తమైంది. వేదికపై పలువురు లంబాడీ సంఘాల నేతలు మైకు తీసుకుని.. ‘ఇది టీఆర్ఎస్ పార్టీ సభ కాదు. గిరిజనుల సమస్యలనే ప్రస్తావించాలి..’అని పేర్కొనడంతో గందరగోళం మొదలైంది. వేదికపైనే రెండు వర్గాలుగా విడిపోయి విమర్శలు చేసుకోవడంతో కార్యక్రమం దాదాపు అరగంట సేపు స్తంభించిపోయింది. కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్ జోక్యం చేసుకుని సముదాయించడంతో చివరికి పరిస్థితి అదుపులోకి వచ్చింది. అయితే అప్పటికే పలువురు నాయకులు, సభకు హాజరైన లంబాడీలు వెనుదిరగడం కనిపించింది. కిక్కిరిసిన సభా ప్రాంగణం.. ట్రాఫిక్ జామ్ లంబాడీల శంఖారావం సభకు పెద్ద సంఖ్యలో లంబాడీలు హాజరయ్యారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన లంబాడీలు ఉదయం నుంచే సభా ప్రాంగణానికి చేరుకున్నారు. గతవారం ఇక్కడే జరిగిన ఆదివాసీల సదస్సుకు భారీగా స్పందన రావడం, పోలీసులు పెద్దగా ఏర్పాట్లు చేయకపోవడంతో ఇబ్బందులు తలెత్తిన నేపథ్యంలో... తాజాగా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. పలుచోట్ల ట్రాఫిక్ను మళ్లించారు. సభకు వచ్చే వాహనాలను ఎల్బీనగర్ రింగ్రోడ్డుకు మూడు కిలోమీటర్ల దూరంలోనే నిలిపివేశారు. అయితే లంబాడీలు పాదయాత్రగా సభాప్రాంగణానికి రావడంతో.. ట్రాఫిక్ స్తంభించిపోయింది. వాహనదారులు గంటల తరబడి ఇబ్బంది పడ్డారు. దిల్సుఖ్నగర్కు వెళ్లే వాహనాలు, అటువైపు నుంచి వచ్చే వాహనాలైతే గంటల తరబడి రోడ్లపైనే నిలిచిపోయాయి. -
జన సంద్రం
-
షర్మిల యాత్రను విజయవంతం చేయండి
ఆళ్లగడ్డ, న్యూస్లైన్: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల చేపడుతున్న సమైక్య శంఖారావం బస్సు యాత్రను విజయవంతం చేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి పిలుపునిచ్చారు. పట్టణంలోని తన నివాస గృహంలో రుద్రవరం, చాగలమర్రి మండలాల కార్యకర్తలతో మంగళవారం ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్రకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. సీమాంధ్ర ప్రజల్లో ఉద్యమ చైతన్యం నింపడానికి షర్మిల బస్సుయాత్ర ప్రారంభించారన్నారు. ఆళ్లగడ్డ ప్రాంతానికి యాత్ర వచ్చినపుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సమైక్యాంధ్ర ఉద్యమకారులు పెద్దఎత్తున హాజరు కావాలని కోరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే చిత్తశుద్ధితో సమైక్యాంధ్రను కోరుకుంటోందన్నారు. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రాంతానికో మాట మాట్లాడుతున్నారని ఆరోపించారు. రెండు నాల్కల బాబును ప్రజలు నమ్మబోరన్నారు. రాష్ట్ర విభజన ప్రకటనకు కారణమైన కాంగ్రెస్, టీడీపీ నాయకులను నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు బీవీ రామిరెడ్డి, నిజాముద్దిన్, రంగనాయకులు, యర్రం ప్రతాపరెడ్డి, సత్యనారయణ, రాంగుర్విరెడ్డి, లక్ష్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 6న ఆళ్లగడ్డలో బస్సు యాత్ర షర్మిల బస్సు యాత్ర ఈనెల 6వతేదీ శుక్రవారం మధ్యాహ్నం 3గంటలకు ఆళ్లగడ్డకు చేరుకుంటుందని ఎమ్మెల్యే శోభానాగిరెడ్డ తెలిపారు. ఆళ్లగడ్డ పట్టణంలోని నాలుగు రోడ్ల కూడలిలలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తారన్నారు. ఆళ్లగడ్డలో బహిరంగ సభ ఉండబోదని స్పష్టం చేశారు. రోడ్దు వెంట ప్రజలకు అభివాదం చేస్తూ షర్మిల ముందుకు సాగుతారన్నారు.