breaking news
series tennis tournment
-
ఏడేళ్ల తర్వాత...
పారిస్: అమెరికా టెన్నిస్ ప్లేయర్ జాక్ సోక్ ఒకే విజయంతో ఎన్నో ఘనతలు సాధించాడు. ఆదివారం ముగిసిన పారిస్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టోర్నీ ఫైనల్లో ప్రపంచ 22వ ర్యాంకర్ జాక్ సోక్ 5–7, 6–4, 6–1తో క్వాలిఫయర్ క్రాజినోవిచ్ (సెర్బియా)పై గెలిచి విజేతగా నిలిచాడు. తద్వారా తన కెరీర్లో తొలిసారి మాస్టర్స్ సిరీస్ టైటిల్ను సొంతం చేసుకున్నాడు. 8,53,430 యూరోల (రూ. 6 కోట్ల 39 లక్షలు) ప్రైజ్మనీ సంపాదించాడు. ఏడేళ్ల తర్వాత (2010లో రాడిక్–మయామి ఓపెన్) ఓ మాస్టర్స్ సిరీస్ టైటిల్ను నెగ్గిన తొలి అమెరికా ప్లేయర్గా జాక్ సోక్ గుర్తింపు పొందాడు. యూరోప్ ఆటగాళ్ల 69 మాస్టర్స్ సిరీస్ వరుస టైటిల్స్ విజయాలకు బ్రేక్ వేశాడు. లండన్లో సోమవారం మొదలయ్యే సీజన్ ముగింపు టోర్నీ వరల్డ్ టూర్ ఫైనల్స్కు కూడా జాక్ సోక్ అర్హత పొందాడు. 1999లో అగస్సీ తర్వాత పారిస్ మాస్టర్స్ టెటిల్ నెగ్గిన తొలి అమెరికా ప్లేయర్గా... 2011లో మార్డీ ఫిష్ తర్వాత వరల్డ్ టూర్ ఫైనల్స్కు అర్హత పొందిన తొలి అమెరికా ప్లేయర్గా కూడా జాక్ సోక్ నిలిచాడు. -
క్వార్టర్స్లో పేస్ జోడి
ఇండియన్ వెల్స్ (అమెరికా): బీఎన్పీ పారిబా ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్లో లియాండర్ పేస్ (భారత్)-రాడెక్ స్టెపానెక్ (చెక్ రిపబ్లిక్) ద్వయం క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. భారత కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి దాటాక జరిగిన రెండో రౌండ్లో పేస్-స్టెపానెక్ జంట 6-3, 7-5తో ఎల్రిచ్ (ఇజ్రాయెల్)-రిచర్డ్ గాస్కే (ఫ్రాన్స్) జోడిపై నెగ్గింది. తదుపరి రౌండ్లో ఈ ఇండో-చెక్ జోడి రోజర్ ఫెడరర్-స్టానిస్లాస్ వావ్రింకా (స్విట్జర్లాండ్) జంటతో తలపడుతుంది.