-
బతికున్నట్లుగా సెల్ఫీ అప్లోడ్ చేస్తేనే పింఛను!
బోధన్ మున్సిపాలిటీకి చెందిన ఓ వ్యక్తికి ప్రతీ నెలా వృద్ధాప్య పింఛను మంజూరవుతోంది. పింఛన్ డబ్బులు నేరుగా బ్యాంకు ఖాతాలోనే జమవుతున్నాయి. వాస్తవానికి ఆ వ్యక్తి చనిపోయి చాలా నెలలవుతోంది. అయితే ఇటీవల సదరు వ్యక్తి భార్య వితంతు పింఛన్ కోసం అధికారులకు దరఖాస్తు చేసుకుంది. డీఆర్డీఏ పింఛన్ విభాగంలో అధికారులు ఈ దరఖాస్తును పరిశీలించారు. చనిపోయిన భర్త పేరు తెలుసుకుని మంజూరువుతున్న పింఛన్ జాబితాలో ఉందో లేదో చూశారు. ఇప్పటికీ ఆమె చని పోయిన తన భర్త పేరుపై వృద్ధాప్య పింఛ న్ ప్రభుత్వం నుంచి మంజూరు అవుతోందని తెలిసి షాక్ అయ్యారు. ఇలా మున్సిపా లిటీ ల్లో చనిపోయిన వారి పేరుతో బోగస్ పింఛన్లు డ్రా అవుతున్నాయి. సాక్షి, నిజామాబాద్: మున్సిపాలిటీ ప్రాంతాల్లోని బోగస్ పింఛన్లకు త్వరలో చెక్ పడనుంది. చనిపోయిన వ్యక్తుల పేరిట మంజూరువుతున్న పింఛన్లను గుర్తించి తొలగించడానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్త సాంకేతిక విధానాన్ని అమలుల్లోకి తేనుంది. అదే ‘లైవ్యాప్’ సిస్టం. ఈ మొబైల్ యాప్ను ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని లబ్ధిదారులు సెల్ఫోన్లో ఒక సెల్ఫీ ఫొటో దిగి అందులో అప్లోడ్ చేస్తేనే ఇకపై పింఛన్ మంజూరు కానుంది. అయితే ప్రస్తుతం ఉన్న విధానం ప్రకారం ప్రభుత్వం నుంచి ప్రతీ నెలా పింఛన్ డబ్బులు పొందుతున్న లబ్ధిదారులు మూడు, ఆరు నెలలకోసారి వారు బతికున్నట్లుగా మున్సిపాలిటీల నుంచి లైవ్ సర్టిఫికెట్లు పొంది ప్రభుత్వానికి చూపాల్సి ఉంటుంది. ఈ విధానం అమలవుతున్నా లైవ్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరగడం లేదు. దీంతో పింఛన్లు పొందే లబ్ధిదారులు బతికున్నారో, చనిపోయారో తెలియడం లేదు. పింఛన్ డబ్బులు మాత్రం నెలనెలా వారి ఖాతాల్లో జమ అవుతుండగా, కుటుంబ సభ్యులు వాటిని డ్రా చేసుకుంటున్నారు. ప్రభుత్వం నిధులు దుర్వినియోగం అవుతున్నాయి. అదే గ్రామాల్లోని లబ్ధిదారుల విషయానికి వస్తే ప్రతీ నెలా లబ్ధిదారులే పోస్టాఫీసుకు వెళ్లి పింఛన్ డబ్బులు తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో లబ్ధిదారులు బతికున్నట్లుగా తెలిసిపోతుంది. కానీ మున్సిపాలిటీ ప్రాంతాల్లో అలా కాకుండా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే డబ్బులు జమ అవుతున్నాయి. లబ్ధిదారులు బతికున్నారో, లేదో తెలుసుకోవడానికి వీలు పడదు. ప్రస్తుతం జిల్లాలో అన్ని రకాల పింఛన్లు కలిపి 2లక్షల 60వేలకు పైగా ఉన్నాయి. వికలాంగులకు రూ.3016 కాగా మిగతా అందరికీ రూ.2,016 పింఛన్ అందుతోంది. వచ్చే నెలాఖరు వరకు అమలయ్యే ఛాన్స్.. లైవ్ మొబైల్ యాప్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా సంగారెడ్డిలో అమలు చేసి విజయవంతమైంది. వచ్చే నెలాఖరు వరకు రాష్ట్రం అంతటా ఈ విధానాన్ని అమలు చేయడానికి కసరత్తు చేస్తోంది. మున్సిపాలిటీ ప్రాంతాల వారే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోని లబ్ధిదారులు కూడా మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని సెల్ఫీ దిగి ఫొటోను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నిరక్ష్యరాసులు, వృద్ధులకు ఇది సాధ్యం కాని పని అయినప్పటికీ తెలిసిన వారితో ఫోన్లో సెల్ఫీ ఫొటో దిగి యాప్లో అప్లోడ్ చేయాల్సిందే. ఇలా ప్రతీఒక్కరూ ప్రతీ మూడు నెలలకు ఒకసారి చేస్తేనే పింఛన్ ప్రభుత్వం నుంచి మంజూరు కానుంది. కొత్త విధానం వల్ల మున్సిపాలిటీ ప్రాంతాల్లో చనిపోయిన వ్యక్తులు సెల్ఫీ ఫొటో దిగే అవకాశం ఉండదు కాబట్టి ఇకపై ఆ వ్యక్తికి పింఛన్ మంజూరు కాబోదు. దీంతో జిల్లాలో చాలా బోగస్ పింఛన్లు తొలగిపోయే అవకాశం ఉంది. -
సెల్ఫీల కోసం 'చచ్చి' పోతున్నారు!
ఫొటోలలో ఇప్పుడు సెల్ఫీల హవా కొనసాగుతోందన్నది వాస్తవం. కొందరు చాలా సురక్షితమైన ప్రదేశాల్లో తీసుకుంటుండగా, మరికొందరు ప్రమాదకర పరిస్థితులలో కూడా సెల్ఫీలు తీసుకుని తమ సరదాను తీర్చుకుంటున్నారు. ఈ సెల్ఫీలకు సామాన్యుడా.. అధ్యక్షుడా.. అనే తేడాలు లేవు. కానీ సెల్ఫీల ఊబిలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఫ్రంట్ కెమెరా మరింత అభివృద్ధి చెందిన తర్వాత ఈ సెల్ఫీ క్రేజు రోజురోజుకూ పెరిగిపోతోంది. బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 నుంచి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ప్రధాని మోదీ వరకూ అందరూ సెల్ఫీలు తీసుకుని సామాజిక వెబ్ సైట్లలో పోస్ట్ చేస్తుండటంతో వారిని సామాన్య ప్రజానికం అనుసరిస్తున్నారు. టెక్సాస్ లో గన్ పట్టుకుని సెల్ఫీ తీసుకునే యత్నంలో ఓ తండ్రి సహా ముగ్గురు వ్యక్తులు ప్రమాదవశాత్తూ మృతి చెందారు. ఈఫిల్ టవర్ లాంటి ఎత్తైన నిర్మాణాలు, ప్రదేశాలలో సెల్ఫీలు తీసుకుంటే నేరంగా పరిగణించాలని యూరోపియన్ యూనియన్ చట్టాన్ని తీసుకొచ్చిందంటే పరిస్థితి ఎలా ఉందన్నది అర్థం చేసుకోవచ్చు. ఈ జూన్ లోనే ఓ గ్రనేడ్ పిన్ లాగుతున్నట్లుగా ఫోజు ఇస్తూ యూరల్ పర్వతాలపై సెల్ఫీ తీసుకునే యత్నంలో ఇద్దరు మరణించారు. సెల్ఫీలు తీసుకోవడం అనే అంశం వచ్చేసరికి.. మనం సాధారణ ప్రవర్తనకు భిన్నంగా ప్రవర్తిస్తామని ఓహియో వర్సిటీ ప్రొఫెసర్ జెస్సీ ఫాక్స్ పేర్కొన్నారు. తాజాగా అమెరికాలో ఓ యువకుడు గన్తో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించగా బుల్లెట్ ...స్మిత్ గొంతులోకి దూసుకెళ్లి అక్కడిక్కడే కుప్పకూలిపోయి మరణించాడు. మహిళలూ అంతే క్రేజీగా.. రష్యా రాజధాని మాస్కోలో బ్రిడ్జి పట్టుకుని వేలాడుతున్నట్లు సెల్ఫీ తీసుకునే యత్నంలో ఓ యూనివర్సిటీ విద్యార్థిని చనిపోయిన విషయం విదితమే. రైలుపై నిల్చుని కరెంటు తీగలును పట్టుకుంటున్నట్లుగా ఫొజిస్తూ సెల్ఫీ తీసుకునే యత్నంలో ఓ విద్యార్థిని ఆహుతయిన విషయాన్ని అంత త్వరగా మరిచిపోలేం. సెల్ఫీ కేంద్రాలు.. సెల్ఫీ పిచ్చి అధికంగా వారి కోసం ఆస్ట్రేలియా వాళ్లు ఏకంగా ఓ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. సెల్ఫీ కోసం వాళ్లు ఏకంగా ఓ యాప్ ప్రారంభించారు. దీంతో వినూత్నంగా సెల్ఫీలు తీసుకోవాలనేవాళ్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని దేశాల్లో సెల్ఫీలపై నిషేధం విధిస్తూంటే.. మరికొన్ని దేశాలు ఇలా కొత్త ప్రయోగాలు చేస్తుండటం వింతగా అనిపిస్తోంది. కొన్ని దేశాల శాస్త్రవేత్తలు ఈ సెల్ఫీల గురించి ప్రస్తావిస్తూ.. సెల్ఫీలు తీసుకోవడం అనేది ఓ మానసిక రుగ్మత అని కుండబద్దలుకొట్టి చెబుతున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాయ్బరేలీలో రాహుల్కు దినేష్ పోటీనివ్వగలరా?
తెలివైన కోతి : శాస్త్రవేత్తలు సైతం ఫిదా
రాజకీయ ఎంట్రీ? జ్యోతిక సమాధానమిదే!
వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి
అనకాపల్లిలో కలకలం.. బూడి ముత్యాలనాయుడు హత్యకు కుట్ర!
కాంగ్రెస్కు షాక్.. ‘ప్లీజ్ పోటీ చేయలేను’
ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్
రోహిత్ శర్మకు వెన్నునొప్పి.. ఆందోళనలో ఫ్యాన్స్!
ఢిల్లీలో కుమారి ఆంటీ తరహా ఎపిసోడ్
సరైన సమయంలో సరైన పుస్తకం 'మూడు దారులు’!
తప్పక చదవండి
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- ఆ రాష్ట్రంలో రెండు రోజులు డ్రై డే!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
- భారీ ఆఫర్ను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం ఇదేనట
- Happy Birthday Trisha : 25 ఏళ్ల కెరియర్లో వివాదాలతో పాటు కోట్లలో ఆస్తులు
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- మీసాలున్నాయని 80 మందిని తొలగించిన కంపెనీ!
- అగ్ని ప్రమాదం.. చిన్నపాటి ఖర్చుతో మరింత భద్రం!
- స్టార్క్ దెబ్బకు ఇషాన్ బౌల్డ్.. రితిక రియాక్షన్ వైరల్
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
Advertisement