-
తాళాలేసి పని కానిస్తున్నారు...
సాక్షి, కాగజ్నగర్ : పట్టణంలోని కొంత మంది సా మిల్లు (కలప కటింగ్ కేంద్రం) యజమానులు అటవీ శాఖ నుంచి రెన్యూవల్ ప్రక్రియ పూర్తి కాకపోయినా దర్జాగా మిల్లులను నడిస్తున్నారు. ప్రతి సంవత్సరం సా మిల్లు నిర్వాహకులు అటవీ శాఖ నుంచి రెన్యూవల్ (అధికారిక అనుమతి) పొందాలి. ఈ సంవత్సరం 2020 మార్చి 31న సా మిల్లుల కాలపరిమితి ముగిసింది. ఉన్నతాధికారులు రెన్యూవల్ ప్రక్రియను పూర్తి చేయడానికి ఏప్రిల్ 30 వరకు గడువు ఇచ్చారు. గడువు ముగిసి 13 రోజులు గడుస్తున్నప్పటికీ కొంత మంది సా మిల్లు నిర్వాహకులు రెన్యూవల్ ప్రక్రియను ఇప్పటి వరకూ పూర్తి చేయించలేదు. సరికదా నిబంధనలకు నీళ్లొదిలి దర్జాగా మిల్లులను నడిస్తున్నారు. సా మిల్లు ముందు ఉన్న ప్రధాన గేట్లకు తాళాలు వేసి, లోపల కూలీల ద్వారా పనులు చేయిస్తున్నారు. వీరు కొందరు ఫారెస్ట్ అధికారుల ప్రోద్బలంతో ఇష్టారాజ్యంగా పనులు కొనసాగిస్తున్నారని ఆరోపణలు వినవస్తున్నాయి. గత 15 రోజుల నుంచి కొంత మంది యజమానులు సా మిల్లులను నడిస్తున్నప్పటికీ స్థానిక అధికారులు ‘మామూలు’గానే తీసుకుంటన్నారని ఫిర్యాదులున్నాయి. సా మిల్లుల్లో పని చేసే కూలీలకు కనీసం మాస్క్లు, శానిటైజర్లు ఇవ్వకుండా కూలీ పనులు చేయిస్తున్నట్లు సమాచారం. అధికారులు స్పందించి నిబంధనలు అతిక్రమించిన మిల్లుల యజమానులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఈ విషయంపై కాగజ్నగర్ ఎఫ్డీవో విజయ్ కుమార్ను వివరణ కోరగా కొన్ని సా మిల్లులకు అనుమతి లభించలేదని, రెన్యూవల్ ప్రక్రియ పూర్తయిన తర్వాతే పనులు చేయాలని స్పష్టం చేశారు. -
సామిల్ మూసివేత
కొన్ని నెలలుగా అక్రమ నిర్వహణ ఎట్టకేలకు యంత్రాలను స్వాధీనం చేసుకున్న అధికారులు జైనథ్ : మండలంలోని నిరాల గ్రామం వద్ద అంతర్రాష్ట్రీయ రహదారిపై గత కొన్ని నెలలుగా అక్రమంగా నిర్వహిస్తున్న సామిల్ను ఫారెస్ట్ రేంజ్ అధికారి శివకుమార్ శనివారం మూసి వేయించారు. ఫారెస్ట్ సెక్షన్ అధికారి అమర్ సింగ్తో కలిసి ఈ మేరకు దాడి చేశారు. కాగా నిర్వాహకుల వద్ద డీఎఫ్వో ద్వారా జారీ చేయబడి సామిల్ ఎస్టాబ్లిష్మెంట్ సర్టిఫికెట్ లేకపోవడంతో నోటీసులు జారీ చేశారు. అయితే అటవీ శాఖ అధికారుల నుంచి ఏ మాత్రం అనుమతులు తీసుకోకుండా, ఇష్టారాజ్యంగా, నిబందనల విరుద్ధంగా సామిల్ను నిర్వహిస్తున్నందుకు యంత్రాలను తీసివేయించి, వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ రేంజ్ అధికారి శివకుమార్ మాట్లాడుతూ అనుమతులు లేని కారణంగా యంత్రాలను స్వాధీనం చేసుకుని, నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. దీనిపై సమగ్రంగా ఉన్నతాధికారులకు నివేదికలు పంపించి, వారి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని అన్నారు. ఎవరు కూడా అనుమతులు లేనిదే సామిల్స్ను నిర్వహించరాదని లేని పక్షంలో చర్యలు తప్పవని ఆయన అన్నారు. దాడుల్లో బీట్ ఆఫీసర్లు రాందాస్, లక్ష్మయ్యలు ఉన్నారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
యాక్షన్ ఎంటర్టైనర్గా లారీ చాప్టర్-1.. ఆసక్తిగా ఫస్ట్ లుక్ పోస్టర్!
World Hypertension Day 2024 : సైలెంట్ కిల్లర్..పట్టించుకోకపోతే ముప్పే!
విరాట్ కోహ్లి తక్కువ అంచనా వేస్తే.. పాక్కు చుక్కలే: మిస్బా
ఇటలీలో అడుగెట్టిన టీవీఎస్.. విక్రయాలకు ఈ బైకులు
ఐడియా అదిరింది
యాక్టర్స్గా మారిన డైరెక్టర్స్.. ఆ నటరత్నాలు ఎవరంటే!
వంట చేసే రోబో రెడీ
ఫ్యాన్స్లో నిరాశ నింపిన వర్షం.. తడిసిన ఉప్పల్ స్డేడియం (ఫోటోలు)
లవ్ మీ సినిమా స్టోరీ లీక్ చేసిన బ్యూటీ, క్లైమాక్స్ కూడా చెప్పకపోయావా! (ఫోటోలు)
ఒక్కరోజే 10 సినిమాలు స్ట్రీమింగ్.. ఆ రెండు చిత్రాలే స్పెషల్!
తప్పక చదవండి
- Ghost Marriage: ఘోస్ట్ మ్యారేజ్లు గురించి విన్నారా! ఏకంగా మ్యాట్రిమోనియల్ సైట్లో
- కేజ్రీవాల్ బెయిల్ రద్దుపై పిటిషన్.. ఈడీకి షాకిచ్చిన సుప్రీం
- ఢిల్లీ లిక్కర్ కేసు: కవిత బెయిల్ విచారణ.. సీబీఐకి నోటీసులు
- కెప్టెన్ అవుతాననుకోలేదు.. కోహ్లి తర్వాత ఇలా..: రోహిత్ శర్మ
- ముంబై హోర్డింగ్ ఘటన.. కారులోనే నలిగిన దంపతుల ప్రాణాలు
- ‘ఫ్యాన్’దే ప్రభంజనం.. సీఎం జగన్ సరికొత్త రికార్డ్!
- రోడ్డు ప్రమాదం వల్ల పవిత్ర చనిపోలేదు.. అసలు కారణం ఇదే!
- ఐశ్వర్యారాయ్ టోట్ బ్యాగ్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!
- టీడీపీ గుండాల అరాచకం.. ఫ్యాన్కు ఓటేసిందని ట్రాక్టర్తో తొక్కించబోయారు
- ఏపీలో పథకాలకు నిధుల విడుదల ప్రారంభం
Advertisement