breaking news
satyagiri
-
రెండు నెలల్లో సత్యగిరికి బస్సులు ఏర్పాటు
దేవస్థానం అధికారులకు దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రసాద్ ఆదేశం సాక్షి ఎఫెక్టు... అన్నవరం: దేవస్థానంలోని సత్యగిరిపై ఉన్న ‘హరిహర సదన్’ సత్రానికి భక్తులు చేరుకునేందుకుగాను రత్నగిరి నుంచి రెండు ఉచిత బస్సులను నడపాలని దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జేఎస్వీ ప్రసాద్ దేవస్థానం అధికారులను ఆదేశించారు. ఆ బస్సులు 24 గంటలు తిరుగుతూ రత్నగిరి, సత్యగిరి మీదనున్న అన్ని సత్రాలు, అన్నదానం, బుకింగ్కౌంటర్, ఆలయ మార్గం, రాజగోపురాలు, బస్టాప్ తదితర చోట్ల ఆగేలా చూడాలని ఆదేశించారు. మంగళవారం ఆయన దేవస్థానానికి వచ్చి సత్యగిరిపై పర్యటించారు. ఈ నెల 16న ‘సాక్షి’లో ప్రచురితమైన ‘సత్తెన్నా..సత్రానికి చేరేదెలా...’ కథనానికి ఆయన స్పందించి, సత్యగిరిని సందర్శించారు. సత్యగిరిపై ఉన్న హరిహరసదన్ సత్రంలో భక్తులు ఎక్కువ మంది బస చేయడానికి ఏర్పాట్లు చేయాలి. అలా చేయకుండా కేవలం కార్లు ఉన్నవారికే ఈ సత్రంలో గదులు కేటాయిస్తున్నామని చెప్పడం సరైన సమాధానం కాదని తెలిపారు. ప్రస్తుతం ఆ సత్రంలో 30 శాతం మాత్రమే ఆక్యుపెన్సీ ఉందని, దానిని కనీసం 80 శాతానికి పెంచాలంటే రత్నగిరి, సత్యగిరి మధ్య ఉచిత బస్సులు నడపాలని ఆదేశించారు. ఆ బస్సుల్లో ఒక దాన్ని తిరుమలలో తిరిగే రథం మాదిరిగాను, మరొకటి డబల్డెక్కర్గా ఉండేలా చూడాలని ఆదేశించారు. రెండు నెలల్లో ఈ బస్సులు ఏర్పాటు చేసి, బస్టాప్ల వద్ద షెల్టర్స్, బోర్డులు రూపొందించాలన్నారు. ఈ పనులను మారుతి కన్సల్టెన్సీ అధినేత కృష్ణన్కు ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రసాద్ అప్పగించారు. అలాగే హరిహర సదన్ సత్రంలో బస చేసే భక్తుల సౌకర్యార్థం షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించి ఆ షాపుల్లో అన్ని రకాల వస్తువులు విక్రయించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దేవస్థానం ఈఓ కె.నాగేశ్వరరావు, ఈఈ శ్రీనివాసరాజు, డీఈ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
రూ.2.27 కోట్లతో ఆగమ పాఠశాల
అన్నవరం: అన్నవరం దేవస్థానంలోని సత్యగిరిపై సుమారు ఎకరం స్ధలంలో రూ.2.27 కోట్లు వ్యయంతో స్మార్త, ఆగమ పాఠశాల నిర్మాణం కోసం పిలిచిన టెండర్లను దేవస్థానం ఛైర్మన్, ఈఓలతో కూడిన పాలకవర్గం ఆమోదించింది. గురువారం దేవస్థానం ఛైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ కె.నాగేశ్వరరావు సమావేశమై పలు అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. సమావేశం నిర్ణయాలివీ.. ∙సత్యదేవుని శాశ్వత కల్యాణానికి రూ.పది వేలు రుసుం చెల్లించిన భక్తులకు పది సంవత్సరాలు మాత్రమే వారి పేరు మీద స్వామి, అమ్మవార్లకు కల్యాణం నిర్వహిస్తారు. గతంలోలా మూడేళ్లు పొడగించే పరిస్థితి ఇకపై ఉండదు. ∙విద్యుత్ ఝ్ఛర్జీల ఆదాలో భాగంగా ఐఎస్ఐ స్టార్ రేటింగ్ కలిగిన పంప్సెట్లనే వాడాలని నిర్ణయించారు. పాత విద్యుత్ బల్బులను తొలగించి ఎల్ఈడీ బల్బులనే వాడాలని నిర్ణయించారు. ∙దేవస్థానంలో ఏర్పాటు చే స్తున్న బైక్, చిన్నకార్లు స్టాండ్ల కోసం నిర్వహించిన వేలంలో ఖరారైన నెలకు రూ.61,000 వేలంపాటను సమావేశంలో ఆమోదించారు. ∙అక్టోబర్ 31 నుంచి ప్రారంభం కానున్న కార్తీకమాసంలో స్వామివారి ఆలయానికి వచ్చే భక్తుల కోసం చేపట్టనున్న ఏర్పాట్లను సమావేశంలో సమీక్షించారు. అదే విధంగా నవంబర్ 11వ తేదీన క్షీరాబ్థి ద్వాదశినాడు జరగనున్న సత్యదేవుని తెప్పోత్సవానికి కూడా తగిన ఏర్పాట్లు చేయాలని సమావేశంలో తీర్మానించారు.