breaking news
Sankararaman murder case
-
నోరు విప్పితే నాశనం చేస్తా
తెరమరుగైపోయిన కంచి శంకర్రామన్ హత్యకేసు మళ్లీ తెరపైకి వచ్చి కలకలం రేపుతోంది. కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి బెదిరింపులకు భయపడి అబద్ధపు సాక్ష్యం చెప్పానని, నేడు కోర్టులో నిజాలు చెప్పి అసలు దోషులను పట్టిస్తానని ఇదే కేసులో అప్రూవర్గా మారిన రవి సుబ్రహ్యణ్యం ముఖ్యమంత్రి జయలలిత, పోలీస్ కమిషనర్కు వినతి పత్రం సమర్పించాడు. అసలు దోషులను పట్టించే ప్రయత్నంలో స్వామి ఇటీవల మళ్లీ బెదిరించారని పేర్కొన్నాడు. చెన్నై, సాక్షి ప్రతినిధి:కంచి మఠం గతంలో అనేక ఆరోపణలకు గురైంది. మఠం అనుబంధ వరదరాజ పెరుమాళ్ ఆల య మేనేజర్ శంకరరామన్ 2004లో హత్యకు గుైరె య్యాడు. ఆడిటర్ రాధాకృష్ణన్పై హత్యాయత్నం జరిగింది. ఈ కేసులో స్వామి జయేంద్రసరస్వతి, అప్పు, కదిరవన్, సుందరేశన్ తదితరులను నిందితులుగా చేర్చి అరెస్ట్ చేశారు. అదే కేసులో మరో నిం దితుడైన రవిసుబ్రహ్మణ్యం అప్రూవర్గా మారి పోయాడు. స్వామి సహా ఇతర నిందితులు బెయిల్పై బైటకు వచ్చారు. ఆ తరువాత కోర్టు అందరినీ నిర్దోషులుగా విడుదల చేసింది. అందరూ నిర్దోషులైనపుడు శంకర్రామన్ను హత్య చేసిందెవరనే విమర్శలు వెల్లువెత్తాయి. కలకలం రేపిన అప్రూవర్ శంకర్రామన్ హత్యకేసులో తన అబ ద్ధపు సాక్ష్యం వల్ల నిందితులు నిర్దోషులుగా బైటకు వచ్చారు, కోర్టులో మళ్లీ నిజాలు చెబుతానంటూ అప్రూవర్ రవి సుబ్రహ్మణ్యం బహిరంగంగా ముందు కు రావడం కలకలం రేపింది. సచివాలయంలోని ముఖ్యమంత్రి గ్రీవెన్స్సెల్, పోలీస్ కమిషనర్ కార్యాలయాల్లో శుక్రవారం సమర్పించిన వినతిపత్రం శనివారం వెలుగులోకి వచ్చింది. అం దులో పేర్కొన్న వివరాలు ఇలా ఉన్నా యి. అబద్ధపు సాక్ష్యం చెప్పి అసలైన దోషులను రక్షించాను, నేడు నిజం చెప్పే ప్రయత్నంలో స్వామి జయేంద్ర సరస్వతి ఇటీవల మళ్లీ బెదిరింపులకు దిగారు. శంకర్రామన్ హత్యకేసు, ఆడిటర్ రాధాకృష్ణన్పై హత్యాయత్నం కేసుల్లో నిందితులను 20014 డిసెంబర్ 26న అరెస్ట్ చేశారు. నేను రెండు కేసుల్లోనూ అప్రూవర్గా మారిపోయాను. దీని వల్ల జయేంద్ర సరస్వతి తదితరులకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. నన్ను, నా కుటుంబాన్ని హతమారుస్తారనే భయంతోనే జైలు జీవితం గడిపాను. అప్పట్లో జైళ్లశాఖ డీఐజీగా ఉన్న రామచంద్రన్ అండదండలతో ఇదే హత్యకేసులో జైలులో ఉన్న అప్పు, కదిరవన్ నన్ను బెదిరించడంతో నిజాలు దాచిపెట్టి అబద్ధపు సాక్ష్యం చెప్పాను. అంతేగాక అనేక కుట్రలు, ధనబలంతో వారంతా నిర్దోషులుగా విడుదలైనారు. గత 9 ఏళ్లుగా జైలు జీవితం గడిపి 2013 డిసెంబర్ బాహ్యప్రపంచంలోకి వచ్చాను. ఆ తరువాత కూడా నిందితులు బెదిరించారు. ఒక దశలో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నా అసలు దోషులను పట్టించాలన్న భావనతో విరమించుకున్నాను. బెదిరింపులకు పాల్పడిన అప్పు, కదిరవన్ చనిపోయినందున ప్రస్తుతం నేను స్వతంత్రుడిని. హత్య కేసు సాక్ష్యంలో అంతరాత్మను చంపుకోలేక ఈనెల 8వ తేదీన ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదిని కలిసి వాస్తవాలు విన్నవించి వినతిపత్రం సమర్పించాను. ఈ సంఘటనను ప్రత్యక్షంగా చూసిన నిందితుడు సుందరేశయ్యర్ ‘పెద్దాయన నిన్ను కలవాలని చెప్పారు. సాయంత్రంలోగా రా’ అంటూ చెప్పారు. అతని సూచనమేరకు జయేంద్ర సరస్వతి స్వామివారిని కలిసాను. ‘మళ్లీ నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెబుతావా, నిన్ను, నీ కుటుంబాన్ని నాశనం చేస్తాను, శంకర్రామన్కు పట్టిన గతే నీకు పడుతుంది’ అని స్వామి బెదిరించారు. ‘పెద్దాయనతో విబేధిస్తే దేశంలో ఏమూలా ప్రాణాలతో ఉండలేవు, స్వామివారు కేంద్రప్రభుత్వ సలహాదారుగా ఉన్న సంగతి తెలియదా. డీఐజీ రామచంద్రన్కు రాష్ట్రంలోని రౌడీలందరూ తెలుసు, కనిపించకుండా పోతావ్’ అంటూ సుందరేశయ్యర్ కూడా బెదిరించాడు. వీరందరి వల్ల నా ప్రాణాలకు ముప్పు ఉంది, నాకేమైనా అయితే స్వామి జయేంద్ర సరస్వతి, సుందరేశయ్యర్ తదితరులే బాధ్యులు అంటూ ఆ వినతి పత్రంలో పేర్కొన్నాడు. -
జయేంద్ర సరస్వతి నిర్దోషి
సాక్షి, చెన్నై: తొమ్మిదేళ్ల కిందట సంచలనం సృష్టించిన శంకరరామన్ హత్య కేసు నుంచి కంచి మఠాధిపతులు జయేంద్ర సరస్వతి, విజయేంద్ర సరస్వతికి ఎట్టకేలకు విముక్తి లభించింది. సరైన సాక్ష్యాలు లేని కారణంగా ఈ కేసులో వీరితోపాటు మిగతా 21 మంది నిందితులను పుదుచ్చేరిలోని ప్రత్యేక కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. బుధవారమిక్కడి సెషన్స్ కోర్టు జడ్జి సీఎస్ మురుగన్ ఈ మేరకు తీర్పు వెలువరించారు. కేసులో ప్రాసిక్యూషన్ సరైన సాక్ష్యాలు చూపించనందున మొత్తం 23 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తున్నట్లు జడ్జి తెలిపారు. చార్జిషీటులో పేర్కొన్న అభియోగాలను నిరూపించడంలో పోలీసులు విఫలమైనందున సంశయ లబ్ధి (బెనిఫిట్ ఆఫ్ డౌట్) కింద నిందితులను విడిచిపెడుతూ కేసును కొట్టివేస్తున్నట్లు పేర్కొన్నారు. 2004, సెప్టెంబర్ 3న కాంచీపురంలోని శ్రీవరదరాజపెరుమాళ్ ఆలయ మేనేజర్ శంకరరామన్ గుడి ప్రాంగణంలోనే హత్యకు గురి కావడం పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ హత్య వెనుక కంచి పీఠాధిపతి ప్రమేయం ఉందన్న ఆరోపణలపై అదే ఏడాది దీపావళి రోజున మహబూబ్నగర్లో జయేంద్ర సరస్వతిని పోలీసులు అరెస్టు చేశారు. కేసులో మొత్తం 24 మంది నిందితులు ఉండగా వారిలో కదివరన్ అనే వ్యక్తి ఈ ఏడాది చెన్నైలో అనూహ్య పరిస్థితుల మధ్య హత్యకు గురయ్యారు. 2004 నుంచి అనేక మలుపులు తిరిగిన ఈ కేసులో చివరికి ఎవ రూ దోషులుగా తేలకపోవడం గమనార్హం. కోర్టు తీర్పుపై శంకరరామన్ కుటుంబీకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. తీర్పుపై అప్పీలు చేసే దిశగా ఆలోచిస్తున్నట్లు శంకరరామన్ తనయుడు ఆనంద్ శర్మ తెలిపారు. ఎవరూ దోషులు కాకుంటే తన తండ్రిని ఎవరు చంపినట్టు అని ఆయన ప్రశ్నించారు. జడ్జి తీర్పు వెలువరిస్తున్న సమయంలో కోర్టు హాలు కిక్కిరిసిపోయింది. కంచి మఠం సిబ్బంది, భక్తులు, నిందితుల బంధుగణం, జాతీయ, రాష్ట్ర మీడియా ప్రతినిధులతో కోర్టు ప్రాంగణం కిటకిటలాడింది. జయేంద్ర సరస్వతి, విజయేంద్ర సరస్వతితోపాటు నిందితులంతా కోర్టు హాలులోనే ఉన్నారు. తీర్పు అనంతరం ఏమీ మాట్లాడకుండానేనే కంచి స్వాములు.. వేంకటేశ్వరస్వామి దర్శనం కోసం తిరుపతికి కారులో బయల్దేరి వెళ్లారు. దర్యాప్తు సరిగ్గా సాగలేదు.. ఉదయం 10.50 గంటలకు జడ్జి మురుగన్ కేసు విచారణను ప్రారంభించి మధ్యాహ్నం 12 గంటలకు తీర్పు వెలువరించారు. శంకరరామన్ హత్య కేసులో దర్యాప్తు ఆసాంతం సరైన మార్గంలో సాగలేదని ఆయన స్పష్టంచేశారు. కేసు దర్యాప్తులో అప్పటి కాంచీపురం ఎస్పీ ప్రేమ్కుమార్ అత్యుత్సాహం ప్రదర్శించారని తప్పుపట్టారు. జయేంద్ర సరస్వతికి బెయిల్ మం జూరు చేసిన సందర్భంగా సుప్రీంకోర్టు కూడా ఇదే విషయాన్ని చెప్పినట్లు గుర్తుచేశారు. ప్రేమ్కుమార్ మితిమీరిన జోక్యం చేసుకోవడంతో దర్యాప్తు గతి తప్పిందని, కేసు దర్యాప్తు ప్రధాన అధికారి(సీఐవో) స్వతంత్రంగా వ్యవహరించలేదని వ్యాఖ్యానించారు. హత్య అని నిరూపించడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని, అంతేగాక శంకరరామన్ భార్య పద్మ, కుమారుడు ఆనంద్శర్మ ప్రాసిక్యూషన్ను బలపరిచే విధంగా వ్యవహరించలేదన్నారు. హత్య కేసులో ప్రధాన కుట్రదారులుగా అభియోగాన్ని ఎదుర్కొన్న అప్పు, కదిరవన్ (ఆ తర్వాత హత్యకు గురయ్యాడు)లు తాము ఆ సమయంలో సంఘటన ప్రదేశంలో లేమని నిరూపించుకున్నారని వివరించారు. ఫిర్యాది గణేశన్తోపాటు కుప్పుస్వామి, దురైకన్ను తదితర సాక్షులు సైతం ప్రాసిక్యూషన్ వాదనను బలపరిచేలా వ్యవహరించలేదని పేర్కొన్నారు. హత్యకు పాల్పడిన వారిని గుర్తించడంలో శంకరరామన్ కుటుంబీకులు విఫలమయ్యారన్నారు. పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టిన డాక్యుమెంట్లు నిందితుల నేరాన్ని రుజువు చేయలేకపోయాయని చెప్పారు. దర్యాప్తు అధికారులు సాక్షులను బెదిరించి సంతకాలు తీసుకోవడం, కన్నయ్య అనే ఎస్సైని బెదిరించి విధులకు దూరంగా ఉంచడం వంటి తప్పిదాలకు పాల్పడ్డారని వ్యాఖ్యానించారు. ఏ కోణంలో చూసినా నిందితులపై మోపిన అభియోగాలపై బలమైన సాక్ష్యాలు లేవని తెలిపారు. అందువల్ల వారిని నిర్దోషులుగా భావిస్తున్నట్లు చెప్పారు. కేసు నేపథ్యం ఇదీ.. కంచి మంఠంలో నిధుల దుర్వినియోగం జరుగుతోందని పేర్కొంటూ ఆ మఠం ఆధీనంలో ఉన్న శ్రీవరదరాజపెరుమాళ్ ఆలయ మేనేజర్ శంకరరామన్ ప్రభుత్వానికి ఉత్తరాలపై ఉత్తరాలు రాశారు. ఈ నేపథ్యంలో 2004లో ఆయన ఆలయ ఆలయ ప్రాంగణంలోనే దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్యకు సంబంధించి పోలీసులు కంచి మఠాధిపతులు జయేంద్ర సరస్వతి, విజయేంద్ర సరస్వతి సహా పలువురిని నిందితులుగా చేర్చి అరెస్టు చేశారు. సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడానికి ముందు జయేంద్ర సరస్వతి 61 రోజులపాటు జైలు జీవితం గడిపారు. పోలీసులు మొత్తం 1873 పేజీల చార్జిషీటును దాఖలు చేసి 712 డాక్యుమెంట్లను కోర్టుకు సమర్పించారు. 370 మందిని సాక్షులుగా చేర్చారు. వీరిలో 187 మందిని కోర్టు విచారించింది. ఎప్పుడేం జరిగింది? 2004, సెప్టెంబర్ 3: కాంచీపురంలోని శ్రీవరదరాజపెరుమాళ్ ఆలయ మేనేజర్ శంకరరామన్ హత్య 2004, నవంబర్ 11: దీపావళి రోజున మహబూబ్నగర్లో జయేంద్ర సరస్వతి అరెస్టు నవంబర్ 12: జయేంద్ర సరస్వతికి జ్యుడిషియల్ కస్టడీ విధించిన కోర్టు 2005, జనవరి 10: జయేంద్ర సరస్వతికి బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు. విజయేంద్ర సరస్వతి అరెస్టు జనవరి 21: నిందితులపై చార్జిషీటు దాఖలు చేసిన తమిళనాడు సిట్ పోలీసులు ఫిబ్రవరి 10: విజయేంద్ర సరస్వతికి బెయిల్ మంజూరు చేసిన మద్రాస్ హైకోర్టు మార్చి 6: కేసు విచారణను వేరే రాష్ట్రానికి మార్చాలంటూ జయేంద్ర సరస్వతి పిటిషన్.. తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు అక్టోబర్ 26: శంకరరామన్ హత్య కేసుపై విచారణను పుదుచ్చేరిలోని కోర్టుకు బదిలీ చేసిన సుప్రీం 2006, మార్చి 28: 24 మంది నిందితులపై అభియోగాలు నమోదు 2009, ఏప్రిల్ 2: పుదుచ్చేరిలోని ప్రధాన సెషన్స్ కోర్టులో విచారణ మొదలు 2010, జనవరి 21: కోర్టులో రవి సుబ్రహ్మణ్యం ఎదురు సాక్ష్యం 2013, మార్చి 21: కేసులో నిందితుడు కదిరవన్ చెన్నైలో హత్య. 23కు చేరిన నిందితుల సంఖ్య నవంబర్ 12: నవంబర్ 27న తీర్పు వెలువరించనున్నట్లు పుదుచ్చేరి లోని కోర్టు వెల్లడి నవంబర్ 27: జయేంద్ర సరస్వతితోపాటు నిందితులందరినీ నిర్దోషులుగా తేల్చిన కోర్టు -
కంచి స్వాములు నిర్దోషులు..
-
శంకర్ రామన్ హత్య కేసులో కంచి పీఠాధిపతులకు ఊరట
చెన్నై : కాంచీపురంలోని వరదారాజ పెరుమాళ్ ఆలయం మేనేజర్ శంకర్రామన్ హత్య కేసులో కంచి కామకోటి పీఠాధిపతులకు ఊరట లభించింది. జయేంద్ర సరస్వతి, విజయేంద్ర సరస్వతి నిర్దోషులని పుదుచ్చేరి జిల్లా కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. ఈ కేసులో స్వాముల ప్రమేయంపై దర్యాప్తు బృందం ఆధారాలు చూపలేకపోయారని కోర్టు అభిప్రాయపడింది. స్వాములతో పాటు మిగిలిన నిందితులపైనా అభియోగాలు నిరూపించడంలో దర్యాప్తు బృందం విఫలమవడంతో అందరినీ నిర్దోషులుగా న్యాయస్థానం ప్రకటించింది. 2004లో సెప్టెంబర్3న కాంచీపురంలోని వరదాజ పెరుమాళ్ ఆలయం మేనేజర్ శంకర్రామన్ ఆలయ ప్రాంగణంలో అత్యంత దారుణంగా హత్యకు గురయ్యాడు. దాంతో ఆ హత్య దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ఆ హత్యలో కంచి పీఠాధిపతులు పాత్ర ఉందని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో కంచి పీఠాధిపతులు జయేంద్ర, విజయేంద్ర సరస్వతులతోపాటు పలువురిపై వివిధ సెక్షన్ల కింద నిందితులుగా కేసులు నమోదుయ్యాయి. ఈ కేసుకు సంబంధించి పుదుచ్చేరి కోర్టు 9 సంవత్సరాల పాటు 189 మంది సాక్షులను విచారించింది.