breaking news
Sanitary Inspectors
-
GHMC: యూ ట్యూబ్లో సెర్చ్ చేసి.. ఫెవికాల్+ఎంసీల్= ఫింగర్ ప్రింట్
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ శానిటేషన్ విభాగంలో చోటు చేసుకున్న కృత్రిమ వేలిముద్రల వ్యవహారాన్ని మధ్య మండల టాస్క్ఫోర్స్ పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. ఈ స్కామ్కు సంబంధించిన ఫీల్డ్ అసిస్టెంట్లు, సూపర్వైజర్లుగా పని చేస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఎన్నాళ్లుగా ఈ వ్యవహారం సాగుతోంది? ఇంకా ఎందరి పాత్ర ఉంది? తదితర అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు. గోషామహల్ సహా మరికొన్ని ప్రాంతాలకు చెందిన జీహెచ్ఎంసీ శానిటరీ విభాగం ఉద్యోగులు క్షేత్రస్థాయిలో ఉండే పారిశుద్ధ్య కార్మికుల వద్దకు ప్రతి రోజూ వెళ్లి బయోమెట్రిక్ మిషన్ల ద్వారా వారి హాజరును తీసుకుంటారు. ఔట్ సోర్సింగ్ పద్దతిలో పని చేసే ఒక్కో కార్మికుడికీ నిర్దేశిత పని వేళలు ఉంటాయి. పని ప్రారంభించే ముందు బయోమెట్రిక్ మిషన్లో లాగ్ ఇన్, పూర్తయ్యాక లాగ్ ఔట్ నిర్దేశిస్తూ వీళ్లు వేలిముద్రలు వేయాల్సి ఉంటుంది. దీన్ని గమనించిన కొందరు ఉద్యోగులు భారీ స్కెచ్ వేశారు. కొందరు పరిచయస్తుల్ని శానిటరీ వర్కర్లుగా ఎన్రోల్ చేశారు. వీరిని ప్రతి రోజూ ఫీల్డ్లోకి తీసుకువెళ్లడం, అక్కడే వారితో వేలిముద్రలు వేయించి హాజరు తీసుకోవడం సాధ్యం కాదు. దీంతో కృత్రిమ వేలిముద్రలు తయారు చేయడంపై దృష్టి పెట్టారు. యూ ట్యూబ్లో సెర్చ్ చేయడం ద్వారా ఫెవికాల్, ఎంసీల్ తదితరాలు కలపడం ద్వారా ఓ రకమైన సింథటిక్ పదార్థం తయారు చేయవచ్చని తెలుసుకున్నారు. దీనిపై డమ్మీ కార్మికుల వేలిముద్రల్ని సేకరించారు. ఆ సింథటిక్ పదార్థాన్ని వేలిముద్రల ఆకారంలో కట్ చేశారు. వీటిని తమ జేబులో వేసుకుని ఫీల్డ్కు వెళ్తున్న ఉద్యోగులు అదును చూసుకుని లాగ్ ఇన్, లాగ్ ఔట్ కోసం వీటితో వేలిముద్రలు వేసేస్తున్నారు. కొన్నాళ్లుగా గుట్టుగా సాగుతున్న ఈ వ్యవహారంపై మధ్య మండల టాస్క్ఫోర్స్కు సమాచారం అందింది. దీంతో వలపన్నిన అధికారులు స్కామ్ గుట్టరట్టు చేయడంతో పాటు ముగ్గురిని అదుపులోకి తీసుకుని 21 కృత్రిమ వేలిముద్రలు స్వాధీనం చేసుకున్నారు. ఒకటిరెండు రోజుల్లో ఈ స్కామ్ సూత్రధారులు, పాత్రధారులపై స్పష్టత వస్తుందని, ఆపై అందరినీ అరెస్టు చేస్తామని టాస్క్ఫోర్స్ అధికారులు చెబుతున్నారు. -
రశీదుల్లేవ్.. అంతా జేబులోకే..!
నగర పాలక సంస్థలోని శానిటరీ విభాగంలో మరో దందా రూ.లక్షలు గడిస్తున్న జవాన్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు బల్దియూ ఆదాయూనికి గండి చెత్తపారబోస్తే జరిమానాలు చిరువ్యాపారులపై పెను ప్రభావం హన్మకొండ : వరంగల్ నగర పాలక సంస్థలోని ప్రజారోగ్య విభాగం పాలన గాడి తప్పుతోంది. చెత్తపేరిట జవాన్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు డబ్బులు గుంజుతూ రూ.లక్షలు గడిస్తున్నారు. ఫలితంగా బల్దియూ ఆదాయూనికి గండిపడుతోంది. ఈ అక్రమ దందాపై చర్యలు తీసుకోవడంతో నగరపాలక సంస్థ అధికారులు మిన్నకుండి పోతున్నారు. దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్ జరుగుతోంది. దీనికి సమాంతరంగా రోడ్ల వెంట చెత్తాచెదారం పారబోసే వ్యక్తులు, సంస్థలపై కఠిన చర్యలకు నగరపాలక సంస్థ ఉపక్రమించింది. ఇందులో భాగంగా రోడ్లపై చెత్త వేస్తున్న చిరు వ్యాపారులు, వాణిజ్య సముదాయ నిర్వాహకులకు పేరుకుపోరుున చెత్తను బట్టి రూ.300, రూ.500, రూ.1000 జరిమానా విధిస్తున్నారు. ఈ బాధ్యతలు శానిటరీ విభాగంలో పనిచేసే జవాన్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు చూసుకుంటున్నారు. వచ్చిన డబ్బును నగరపాలక సంస్థ ట్రెజరీలో జమ చేయాలి. అడిగినంత.. పక్షం రోజులగా కొందరు జవాన్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు జరిమానాల పేరిట రశీదులు జారీ చేయకుండా జేబులు నింపుకుంటున్నారు. బయటకు నామామాత్రంగా జరిమానలు విధిస్తూ రశీదులు జారీ చేస్తున్నా.. లోపాయికారీగా చిరువ్యాపారులు, వాణిజ్య సముదాయాలు, దుకాణాదారుల నుంచి రూ.200-రూ.300 చొప్పున వసూలు చేస్తున్నారు. ఇదేమిటని ఎవరైనా ప్రశ్నిస్తే రశీదు కావాలంటే రూ.1000 జరిమానా కట్టండి అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీంతో ఆందోళన చెందుతున్న చిరువ్యాపారులు అడిగినంత ముట్టజెప్పుతున్నారు. అక్రమ వసూళ్లు రెండు రోజుల క్రితం వరంగల్ బీట్జబార్, బట్టలబజార్, ఆర్ఎన్టీ రోడ్డులో పెద్ద ఎత్తున అక్రమ వసూళ్లకు పాల్పడ్డారు. కనీసం రూ.300 ఇవ్వనిదే కుదరదంటూ చిరువ్యాపారులపై తమ ప్రతాపం చూపించారు. దీంతో కొందరు చిరువ్యాపారులు ఎదురు తిరిగారు. ఈ ఘటనతో ఈ నయాదందా మొదటిసారి వెలుగులోకి వచ్చింది. వరంగల్తో పాటు హన్మకొండ, కాజీపేట ప్రాంతాల్లోనూ చిరువ్యాపారులపై ఇదే తరహాలో డబ్బులు వసూలు చేస్తున్నారు. దీనితో క్రమంగా ఆస్పత్రులు, హోటళ్లు, బార్ అండ్ రెస్టారెంట్లు, తినుబండారాల షాపుల నిర్వాహకుల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇక చికెన్, మటన్ సెంటర్లు, చేపల అమ్మకం దార్లు, పండ్ల విక్రయాదారులపై వీరి ఆగడాలు శృతి మించుతున్నారుు. వీరికి రకరకాల నిబంధనలు వివరిస్తూ నెలవారీగా రూ.500 నుంచి రూ.1000 వరకు రశీదుల్లేకుండా డబ్బులను గుంజుతున్నారు. ఇలా అక్రమ మార్గంలో వచ్చిన సొమ్ములను ప్రజారోగ్య విభాగంలో కిందిస్థాయి నుంచి పైస్థాయి అధికారుల వరకు వాటాలు వెళ్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందువల్లే ఈ వ్యవహారంలో తమకేమీ తెలియనట్లుగా వ్యవహరిస్తున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఉన్నతాధికారులు దృష్టిసారిస్తే నిజాలు వెలుగుచూసే అవకాశం ఉంది.