బంపర్ ఆఫర్: టీవీ కొంటే స్మార్ట్ఫోన్ ఫ్రీ
సాక్షి, న్యూఢిల్లీ: కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ పండుగ సందర్భంగా వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. శాంసంగ్ ఉత్పత్తుల కొనుగోలుపై వి నియోగదారులకు భారీ ఆఫర్లు, డిస్కౌంట్లను అందిస్తోంది. టీవీలు, రిఫ్రిజిరేటర్లు సహా ఇతర ఎలక్ట్రానిక్స్ ఈ ఆఫర్లు వర్తిస్తాయి. శామ్సంగ్ స్మార్ట్ ఉత్సవ్ పేరుతో నేటి (బుధవారం) నుంచే ప్రారంభమవుతాయని శాంసంగ్ ప్రకటించింది. అక్టోబర్ 22 వరకు ఈ డిస్కౌంట్లు, ఆఫర్ల వెల్లువ సాగనుంది.
కచ్చితమైన బహుమతులు, వారంటీ స్కీం, సులభమైన ఈఎంఐలు , ఎంపిక చేసిన ఉత్పత్తులపై జీరో డౌన్ పేమెంట్ (ఎస్బీఐ క్రెడిట్ కార్డు ద్వారా) అందిస్తోంది. ఎస్బీఐ డెబిట్ ద్వారా జరిపిన కొనుగోళ్లపై 5 శాతం క్యాష్బ్యాక్ ఆఫర్ ఉంది. వీటన్నింటికి మించి ఓ ఆసక్తికరమైన ఆఫర్ కూడా ఉంది.
ఎంపిక చేసిన శాంసంగ్ క్యూఎల్ఈడీ టీవీ కొన్న వారికి 128 జీబీ స్టోరేజ్ , రూ.70,900 ఖరీదు చేసే ప్రీమియం శాంసంగ్ గెలాక్స్ ఎస్ 8 ప్లస్ను ఉచితంగా ఆఫర్ చేస్తోంది. అలాగే 10 సంవత్సరాల నో స్క్రీన్ బర్న్ వారంటీ తోపాటు, రూ.10వేల విలువ చేసే నో గ్యాప్ వాల్ మౌంట్ ఉచితం.
యూహెచ్డీ టీవీ లేదా కర్వ్డ్ టీవీ కొంటే.. రూ. 23,990 విలువే చేసే సౌండ్ బార్ పూర్తిగా ఉచితం.
శాంసంగ్ సైడ్ బై సైడ్ ఫ్రిజ్ కొంటే గెలాక్సీ జే 5 ప్రైమ్(ధర రూ.13,490, లేదా గెలాక్సీ జే 2 ప్రొ (రూ.9.090) ఉచితం.