-
అమెజాన్తో దోస్తీ?
న్యూఢిల్లీ: రిటైల్ వెంచర్లో పెట్టుబడులు సమీకరించడం ప్రారంభించిన పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజాగా ఈ–కామర్స్లో పోటీ సంస్థ అమెజాన్డాట్కామ్తో కూడా చేతులు కలిపే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. రిలయన్స్ రిటైల్ వెంచర్స్ (ఆర్ఆర్వీఎల్)లో 40 శాతం దాకా వాటాలను అమెజాన్కు విక్రయించేందుకు సుముఖంగా ఉన్నట్లు వార్తా కథనాలు వచ్చాయి. ఈ డీల్ విలువ సుమారు 20 బిలియన్ డాలర్ల మేర ఉండొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆర్ఆర్వీఎల్లో ఇన్వెస్ట్ చేయడంపై అమెజాన్ ఆసక్తిగా ఉందని, దీనిపై చర్చలు కూడా జరిపిందని పేర్కొన్నాయి. కుదిరితే ఇది దేశంలోనే అత్యంత భారీ డీల్ కాగలదని తెలిపాయి. అయితే, అమెజాన్ ఇంకా పెట్టుబడుల పరిమాణంపై తుది నిర్ణయం తీసుకోలేదని, చర్చలు ఫలవంతం కాకపోయే అవకాశాలు కూడా ఉన్నాయని పేర్కొన్నాయి. మరోవైపు, ఈ కథనాలపై వ్యాఖ్యానించేందుకు రిలయన్స్, అమెజాన్ నిరాకరించాయి. మీడియా ఊహాగానాలపై తాము వ్యాఖ్యానించలేమని స్టాక్ ఎక్సే్చంజీలకు రిలయన్స్ తెలియజేసింది. పరిస్థితులను బట్టి వివిధ వ్యాపార అవకాశాలు పరిశీలిస్తూ ఉంటామని పేర్కొంది. పాఠకులు.. ఇన్వెస్టర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఊహాగానాల ఆధారంగా నిరాధార/తప్పుడు వార్తలను ప్రచురించవద్దని ఒక ప్రకటనలో మీడియాకు విజ్ఞప్తి చేసింది. రిలయన్స్ రిటైల్లో అమెరికాకు సంస్థ సిల్వర్ లేక్ పార్ట్నర్స్ 1.75% వాటా కోసం రూ. 7,500 కోట్లు ఇన్వెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అమెజాన్కి వాటాల విక్రయం తెరపైకి వచ్చింది. రిలయన్స్ ఇటీవలే ఫ్యూచర్ గ్రూప్ రిటైల్ వ్యాపారాన్ని రూ. 24,713 కోట్లకు కొనుగోలు చేసింది. ఫ్యూచర్ రిటైల్ వ్యాపారంలో అమెజాన్ ఇన్వెస్టరుగా ఉంది. రిలయన్స్ రిటైల్లో వాటాలు విక్రయించడం ద్వారా 21–29 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు సమీకరించవచ్చని క్రెడిట్ సూసీ పేర్కొంది. ‘రిలయన్స్’ లాభాలు ► బ్లూచిప్ షేర్లలో జోరుగా కొనుగోళ్లు ►స్వల్పంగా పుంజుకున్న రూపాయి ►రెండు రోజుల నష్టాలకు బ్రేక్ ►646 పాయింట్లు ఎగసి 38,840కు సెన్సెక్స్ ►171 పాయింట్లు ఎగసి 11,449కు నిఫ్టీ ►ఇన్వెస్టర్ల సంపద రూ.2.2 లక్షల కోట్లు అప్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభాల జోరుతో గురువారం స్టాక్ మార్కెట్ భారీగా లాభపడింది. అంతర్జాతీయ సంకేతా లు సానుకూలంగా ఉండటం కలసివచ్చింది. భారత్–చైనా మధ్య సరిహద్దు ఉద్రిక్తతల సమస్యను ప్రస్తుతానికి పక్కనబెట్టిన ఇన్వెస్టర్లు జోరుగా కొనుగోళ్లు జరిపారు. సెన్సెక్స్ 646 పాయింట్లు లాభపడి 38,840 పాయింట్ల వద్ద, నిఫ్టీ 171 పాయింట్లు ఎగసి 11,449 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్ 1.69%, నిఫ్టీ 1.52% చొప్పున లాభపడ్డాయి. దీంతో రెండు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది. డాలర్తో రూపాయి మారకం విలువ 9 పైసలు పుంజుకొని 73.46 కు చేరడం సానుకూల ప్రభావం చూపించింది. రోజంతా లాభాలు... ఆసియా మార్కెట్లు బలహీనంగా ఉన్నా, మన మార్కెట్ లాభాల్లోనే ఆరంభమైంది. నిఫ్టీ వీక్లీ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగింపు రోజు కావడంతో ఒడిదుడుకులకు లోనైనా రోజం తా లాభాల్లోనే కొనసాగింది. మధ్యాహ్నం తర్వాత లాభాలు మరింతగా పుంజుకున్నాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్684 పాయింట్లు, నిఫ్టీ 186 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. యూరప్ కేంద్ర బ్యాంక్ సమావేశం నేపథ్యంలో యూరప్ మార్కెట్లు పరిమిత శ్రేణి రేంజ్లో ట్రేడయి మిశ్రమంగా ముగిశాయి. ►రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ 7 శాతం లాభంతో రూ.2,315 వద్ద ముగిసింది. సెన్సెక్స్లో అత్యధికంగా పెరిగిన షేర్ ఇదే. సెన్సెక్స్ మొత్తం 646 పాయింట్లు లాభపడితే, దీంట్లో రిలయన్స్ షేర్ వాటాయే 558 పాయింట్ల మేర ఉంది. ►స్టాక్ మార్కెట్ భారీ లాభాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద గురువారం ఒక్కరోజులోనే రూ.2.20 లక్షల కోట్లు పెరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టయిన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.2,20,928 కోట్లు ఎగసి రూ.155.21 లక్షల కోట్లకు చేరింది. ఈ పెరుగుదలలో మెజారిటీ వాటా రిలయన్స్దే కావడం విశేషం. ►మార్కెట్ జోరు నేపథ్యంలో దాదాపు వందకు పైగా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలకు చేరాయి. కార్పొరేట్ ‘బాహుబలి’ ►ఆల్టైమ్ హైకి ఎగసిన రిలయన్స్ షేరు.. ►20,000 కోట్ల డాలర్లకు మార్కెట్ క్యాప్ ►ఈ స్థాయికి చేరిన తొలి భారతీయ కంపెనీ ►అమెజాన్ పెట్టుబడి వార్తలతో పరుగులు పెట్టిన షేరు భారతీయ కార్పొరేట్ ‘బాహుబలి’ రిలయన్స్ ఆకాశమే హద్దుగా దూసుకెళ్తోంది. అనుబంధ విభాగం రిలయన్స్ రిటైల్లో 40 శాతం వరకూ వాటాను అంతర్జాతీయ ఆన్లైన్ దిగ్గజం అమెజాన్కు విక్రయించనున్నదన్న వార్తల కారణంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ దూసుకెళ్లింది. దీంతో తొలిసారిగా కంపెనీ మార్కెట్ విలువ 20,000 కోట్ల డాలర్ల మైలురాయిని అధిగమించింది. దేశంలో ఈ స్థాయిని చేరిన మొట్టమొదటి కంపెనీగా రికార్డు సృష్టించింది. రిలయన్స్ షేర్ ఇంట్రాడేలో 8.4 శాతం లాభంతో జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.2,344ను తాకింది. చివరకు 7 శాతం లాభంతో రూ.2,315 వద్ద ముగిసింది. 20,000 కోట్ల డాలర్లకు మార్కెట్ క్యాప్... కాగా కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.14.91 లక్షల కోట్లకు(20,000 కోట్ల డాలర్లు) ఎగసింది. ఈ స్థాయి మార్కెట్ క్యాప్ సాధించిన తొలి భారత కంపెనీ ఇదే. ఇంట్రాడేలో ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.15,84,908 కోట్లకు చేరింది. ఒక్క గురువారం రోజే రూ.97,000 కోట్ల మేర మార్కెట్క్యాప్ పెరిగింది. ఆ 13 సంస్థలకు అంబానీ ఆఫర్...! రిలయన్స్ రిటైల్లో 1.75 శాతం వాటాను అమెరికా ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం సిల్వర్ లేక్ పార్ట్నర్స్ రూ.7,500 కోట్లకు కొనుగోలు చేయనున్నదని బుధవారమే రిలయన్స్ ఇండస్ట్రీస్ వెల్లడించిన విషయం తెలిసిందే. కాగా ఇటీవలే రిలయన్స్ జియోలో 13 విదేశీ సంస్థలు భారీగా ఇన్వెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ సంస్థలన్నింటికీ, రిలయన్స్ రిటైల్లో కూడా ఇన్వెస్ట్ చేసే ఆఫర్ లభించిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇక అమెజాన్ తర్వాత కేకేఆర్ సంస్థ పెట్టుబడి వార్తలు వస్తాయని అంచనా. రిలయన్స్ రిటైల్లో వాటా విక్రయం ద్వారా రూ.60,000–రూ.1.5 లక్షల కోట్ల మేర సమీకరించే అవకాశాలున్నాయని సమాచారం. -
స్కూల్నెట్ ఇండియా విక్రయానికి ఓకే..
న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో చిక్కుకున్న ఐఎల్అండ్ఎఫ్ఎస్ గ్రూప్లోని విద్యా రంగ సంస్థ విక్రయానికి జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) అనుమతినిచ్చింది. స్కూల్నెట్ ఇండియా (గతంలో ఐఎల్అండ్ఎఫ్ఎస్ ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ సర్వీసెస్)లో ఐఎల్అండ్ఎఫ్ఎస్కున్న 73.69% వాటాలను ఫలాఫల్ టెక్నాలజీకి విక్రయించేందుకు ఆమోదం తెలిపింది. ఫలాఫల్ మాతృసంస్థ లెక్సింగ్టన్ ఈక్విటీ హోల్డింగ్స్ (ఎల్ఈహెచ్ఎల్)కు ఇప్పటికే స్కూల్నెట్లో 26.13 శాతం వాటా ఉంది. స్కూల్నెట్కు ఐఎల్అండ్ఎఫ్ఎస్ క్లస్టర్ డెవలప్మెంట్ ఇనీషియేటివ్ (ఐసీడీఐ), స్కిల్ ట్రెయినింగ్ అసెస్మెంట్ మేనేజ్మెంట్ పార్ట్నర్స్ (ఎస్టీఏఎంపీ) అనే రెండు అనుబంధ సంస్థలు ఉన్నాయి. అలాగే ఐఎల్అండ్ఎఫ్ఎస్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఐఎస్డీసీ)లో కూడా 80% వాటాలు ఉన్నాయి. తాజా ఫలాఫల్ టెక్నాలజీ దాఖలు చేసిన బిడ్ ప్రకారం స్కూల్నెట్లో సుమారు 73 శాతం వాటాలను రూ. 7.39 కోట్లకు కొనుగోలు చేయడంతో పాటు ఆ సంస్థ రుణాలను కూడా తీర్చేందుకు సంస్థ అంగీకరించింది. దీంతో డీల్కు మార్గం సుగమమైంది. ఈ లావాదేవీ పూర్తయితే ఐఎల్అండ్ఎఫ్ఎస్ గ్రూప్ మొత్తం రుణభారం సుమారు రూ. 600 కోట్లు తగ్గుతుందని సంబంధిత వర్గాలు తెలపాయి. -
బ్లూచిప్ షేర్ల దన్ను
ట్రేడింగ్ చివర్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లలో కొనుగోళ్లు జోరుగా సాగడంతో బుధవారం స్టాక్ మార్కెట్ లాభపడింది. అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా ఉండటం, వివిధ దేశాల తయారీ రంగ గణాంకాలు ఆర్థిక ‘రికవరీ’ సంకేతాలిస్తుండటం, అమెరికా అదనంగా ఉద్దీపన ప్యాకేజీని ఇవ్వనున్నదన్న అంచనాలు కలసివచ్చాయి. అయితే చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు, డాలర్తో రూపాయి మారకం విలువ బలహీనపడటం ప్రతికూల ప్రభావం చూపడంతో లాభాలకు కళ్లెం పడింది. సెన్సెక్స్ 185 పాయింట్ల లాభంతో 39,086 పాయింట్ల వద్ద, నిఫ్టీ 65 పాయింట్లు పెరిగి 11,535 పాయింట్ల వద్ద ముగిశాయి. స్టాక్ సూచీలు వరుసగా రెండో రోజూ లాభపడ్డాయి. అన్ని రంగాల షేర్లు లాభపడ్డాయి. డాలర్తో రూపాయి మారకం విలువ 18 పైసలు క్షీణించి 73.03 వద్దకు చేరింది. 5 సార్లు నష్టాల్లోంచి లాభాల్లోకి... సెనెక్స్ నష్టాల్లోనే ఆరంభమైంది. మధ్యాహ్నం వరకూ పరిమిత శ్రేణిలో తీవ్ర హెచ్చుతగ్గులకు లోనైంది. నష్టాల్లోంచి ఐదుసార్లు లాభాల్లోకి వచ్చిందంటే ఒడిదుడుకులు ఏ రేంజ్లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఒక దశలో 165 పాయింట్లు పతనమైన సెన్సెక్స్ మరో దశలో 245 పాయింట్లు లాభపడింది. మొత్తం మీద రోజంతా 406 పాయింట్ల రేంజ్లో కదలాడింది. చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు ముదురుతుండటంతో ఒడుదుడుకులు చోటు చేసుకుంటున్నాయని, ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ► మహీంద్రా అండ్ మహీంద్రా షేర్ 5.7 శాతం లాభంతో రూ. 642.75 వద్ద ముగిసింది. సెన్సెక్స్లో బాగా లాభపడిన షేర్ ఇదే. సూచిస్తున్నారు. ► రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ 2 శాతం లాభంతోరూ. 2,128 వద్దకు చేరింది. సెన్సెక్స్ మొత్తం లాభాల్లో ఈ షేర్ వాటాయే మూడింట రెండు వంతులు ఉండటం విశేషం. సెన్సెక్స్ మొత్తం 185 పాయింట్ల లాభంలో రిలయన్స్ వాటాయే 120 పాయింట్ల మేర ఉంది. సూచిస్తున్నారు. ► జీ ప్లెక్స్ పేరుతో సినిమా–టు–హోమ్ సర్వీస్ను అందించనుండటంతో జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ షేర్ ధర 8 శాతం వృద్ధితో రూ.217 వద్ద ముగిసింది. సూచిస్తున్నారు. ► ఆగస్టులో వాహన విక్రయాలు పుంజుకోవడంతో వాహన షేర్లు లాభపడ్డాయి. సూచిస్తున్నారు. ► దాదాపు వంద షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలకు చేరాయి. వీఎస్టీ టిల్లర్స్, అదానీ గ్రీన్, జుబిలంట్ ఫుడ్వర్క్స్, గోద్రెజ్ ఇండస్ట్రీస్, ఎస్కార్ట్స్ షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. సూచిస్తున్నారు. ► నిధుల సమీకరణ వార్తల కారణంగా వొడాఫోన్ ఐడియా షేర్ 11 శాతం లాభంతో రూ.9.91కు చేరింది. సూచిస్తున్నారు. ► ఫ్యూచర్ గ్రూప్ షేర్లతో సహా మొత్తం 300కు పైగా షేర్లు లోయర్ సర్క్యూట్లను తాకాయి. మరోవైపు 256 షేర్లు అప్పర్ సర్క్యూట్లను తాకాయి. -
ఐఆర్సీటీసీలో మరింత వాటా విక్రయం
న్యూఢిల్లీ: ఐఆర్సీటీసీలో మరికొంత వాటాను కేంద్ర ప్రభుత్వం విక్రయించనున్నది. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజమ్ కార్పొరేషన్(ఐఆర్సీటీసీ)లో కొంత వాటాను ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) విధానంలో విక్రయిస్తామని పేర్కొంది. ఈ విక్రయ ప్రక్రియను నిర్వహించడానికి మర్చంట్ బ్యాంకర్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. మర్చంట్ బ్యాంకర్లు తమ దరఖాస్తులను వచ్చే నెల 10లోపు సమర్పించాల్సి ఉంటుంది. ఐఆర్సీటీసీలో కేంద్రానికి ప్రస్తుతం 87.40 శాతం వాటా ఉంది. సెబీ నిర్దేశించిన కనీస పబ్లిక్ హోల్డింగ్ నిబంధనల ప్రకారం ఈ వాటాను 75 శాతానికి తగ్గించుకోవలసి ఉంది. గతేడాది ఈ కంపెనీలో కొంత వాటాను ఐపీఓ ద్వారా కేంద్రం విక్రయించి రూ.690 కోట్లు సమీకరించింది. కాగా ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటా విక్రయం ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.2.10 లక్షల కోట్లు సమీకరిం చాలని కేంద్రం లక్ష్యంగా నిర్దేశించుకుంది. దీంట్లో భాగంగా ఎల్ఐసీలో కొంత వాటాను ఐపీఓ ద్వారా విక్రయించనున్నది. వాటా విక్రయ వార్తలతో ఐఆర్సీటీసీ 1% నష్టంతో రూ.1,347 వద్ద ముగిసింది. -
అమెజాన్ కార్ట్లో ఎయిర్టెల్!!
న్యూఢిల్లీ: దేశీ టెలికం దిగ్గజం భారతి ఎయిర్టెల్లో వాటాలు కొనుగోలు చేసే దిశగా అమెరికా ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ కసరత్తు చేస్తోంది. సుమారు 5 శాతం వాటాలు కొనుగోలు చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించి ప్రాథమిక స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ డీల్ విలువ సుమారు 2 బిలియన్ డాలర్లు ఉండొచ్చని వివరించాయి. రిలయన్స్ జియోకు దీటైన పోటీ ఇవ్వడానికి ఎయిర్టెల్కు ఈ పెట్టుబడులు ఉపయోగపడనున్నాయని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. మొబైల్ ఆపరేటర్ కార్యకలాపాల నుంచి డిజిటల్ టెక్నాలజీ దిగ్గజంగా జియో రూపాంతరం చెందిందని, ఎయిర్టెల్ కూడా అదే విధంగా వృద్ధి చెందవచ్చని తెలిపాయి. 8–10% దాకా వాటాలపై దృష్టి.. ఎయిర్టెల్లో పెట్టుబడులకు సంబంధించి అమెజాన్ పలు అవకాశాలు పరిశీలిస్తోంది. సుమారు 8–10 దాకా కూడా వాటాలు కొనే అంశం కూడా ఇందులో ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతానికైతే రెండు కంపెనీల మధ్య ప్రాథమిక స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని, డీల్ నిబంధనలు మారొచ్చని, ఒప్పందం కుదరవచ్చని లేదా కుదరకపోనూ వచ్చని వివరించాయి. ఒకవేళ వాటాల కొనుగోలు ప్రతిపాదన విఫలమైనా ఇరు కంపెనీలు కలిసి పనిచేసేందుకు ఇతరత్రా మార్గాలు కూడా పరిశీలించవచ్చని పేర్కొన్నాయి. అమెజాన్ ఉత్పత్తులను భారతి కస్టమర్లకు చౌకగా అందించే విధమైన డీల్ సైతం వీటిలో ఉండవచ్చని వివరించాయి. దేశీ టెల్కోలపై టెక్ దిగ్గజాల దృష్టి.. గడిచిన కొన్నాళ్లుగా దేశీ టెలికం కంపెనీలపై అంతర్జాతీయ టెక్ దిగ్గజాల ఆసక్తి గణనీయంగా పెరిగింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ డిజిటల్ వ్యాపార విభాగమైన జియో ప్లాట్ఫామ్స్తో ఫేస్బుక్ తదితర దిగ్గజ సంస్థలు గత ఆరు వారాల్లో సుమారు 10 బిలియన్ డాలర్ల దాకా ఇన్వెస్ట్ చేశాయి. టెలికం సేవల సంస్థ జియో ఇందులో భాగంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక మరో టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియాలో పెట్టుబడులు పెట్టే అంశాన్ని టెక్నాలజీ దిగ్గజం గూగుల్ పరిశీలిస్తోందంటూ కూడా వార్తలు వచ్చాయి. దేశీ టెలికం రంగంలో జియో అగ్రస్థానంలో ఉండగా, వొడాఫోన్ ఐడియా రెండో స్థానంలో ఉంది. ఇక మూడో స్థానంలో ఉన్న ఎయిర్టెల్లో తాజాగా అమెజాన్ ఇన్వెస్ట్ చేయనుండటం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. వ్యాపార విస్తరణకు ఊతం.. భారత మార్కెట్ను అమెజాన్ కీలకమైనదిగా భావిస్తోంది. ఈ–కామర్స్ వ్యాపార కార్యకలాపాలను భారీగా విస్తరించేందుకు 6.5 బిలియన్ డాలర్లు పైగా ఇన్వెస్ట్ చేసే ప్రణాళికల్లో ఉంది. ఇప్పటికే వాయిస్–యాక్టివేటెడ్ స్పీకర్లు, వీడియో స్ట్రీమింగ్, క్లౌడ్ స్టోరేజీ మొదలైన సొంత ఉత్పత్తులు, సేవలు అందిస్తోంది. భారతి ఎయిర్టెల్తో డీల్ కుదిరిన పక్షంలో ఆ సంస్థ నెట్వర్క్ ద్వారా కూడా అమెజాన్ తన వ్యాపార కార్యకలాపాలు విస్తరించుకోవడానికి వీలు పడుతుంది. భారతికి ఉన్న విస్తృతమైన టెలికం ఫైబర్ నెట్వర్క్ ఊతం లభిస్తే తక్కువ ఖర్చుల్లోనే క్లౌడ్ వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు. రిలయన్స్ జియో ఇదే తరహాలో అజూర్ క్లౌడ్ ప్లాట్ఫాంను ఉపయోగించుకునేందుకు టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్తో ఒప్పందం కుదుర్చుకోవడం గమనార్హం. ఆఫ్లైన్ రిటైల్లో పాగా... ‘మా కస్టమర్లకు మరిన్ని కొత్త ఉత్పత్తులు, కంటెంట్, సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు వివిధ డిజిటల్, ఓటీటీ సంస్థలతో సాధారణంగానే సంప్రతింపులు జరుపుతుంటాం. అంతకుమించి ఇతరత్రా చర్చలేమీ జరపడం లేదు‘ అంటూ ఎయిర్టెల్ ప్రతినిధి స్పందించారు. అటు భవిష్యత్ ప్రణాళికల గురించి ఊహాగానాలపై తాము స్పందించబోమని అమెజాన్ ఇండియా ప్రతినిధి తెలిపారు. 2017లో అమెజాన్ నుంచి షాపర్స్ స్టాప్ రూ. 179 కోట్లు సమీకరించింది. ఇక 2018 సెప్టెంబర్లో ఆదిత్య బిర్లా రిటైల్కి చెందిన మోర్ స్టోర్స్లో విట్జిగ్ అడ్వైజరీ సర్వీసెస్ ద్వారా అమెజాన్ ఇన్వెస్ట్ చేసింది. గతేడాది ఫ్యూచర్ రిటైల్లో కూడా వాటాలు కొనుగోలు చేసింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘నీట్’ మాల్ ప్రాక్టీస్కు చెక్!
నేతన్నల బాధలు సీఎంకు కనిపించలేదా..?
ఎమ్మెల్యే నివాసంలో కార్పొరేటర్లు, ముఖ్య నాయకులతో సమావేశం
ఓటుహక్కుపై ‘ఉపాధి’ కూలీలకు చైతన్యం
శ్రీమద్రామాయణ మహాక్రతువుకు అంకురార్పణ
విద్యార్థులకు అభినందన
వేసవి పూట.. జలకాలాట
రోహిత్ కేసును పునర్విచారించాలి
సంజయ్ ఓ పొలిటికల్ టూరిస్ట్
లోఓల్టేజీ నియంత్రణకు డీటీఆర్ ఏర్పాటు
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement