breaking news
sajja
-
ప్రపంచంలోనే తొలి త్రీవే హైబ్రీడ్ సజ్జ
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో ఉన్న అం ర్జాతీయ పరిశోధన సంస్థ ఇక్రిసాట్ ప్రపంచం కోనే మొట్టమొదటి త్రీవే హైబ్రీడ్ సజ్జ రకం. రాచీ 273ని అభివృద్ధి చేసింది. ఈ చిరు కాన్యం కరువు పీడిత ప్రాంతాల్లో 400 ఏ.మీ.ల లోటు వర్షపాతాన్ని సైతం తట్టుకుని అధిక దిగుబడి ఇస్తుంది. అత్యంత కరువు పరిస్థి టలుండే ఉష్ణ మండలాల్లో పంటలు సాగు చేసే తులకు ఇలాంటి హైబ్రీడ్ రకం ఎంతో ప్రయో నకరంగా ఉంటుందని ఇక్రిసాట్ మంగళ కారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపిం ). ఐసీఏఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రిక రల్ రీసెర్చ్). ఆర్ఎఏఆర్ ఐ (రాజస్థాన్ వ్యవసాయ పరిశోధన సంస్థ)ల సహకారంతో ఈ సజ్జ విత్తనాలను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. సాధారణంగా ద్విముఖ సంకర జాతితో రూపొందే సజ్జల కంటే భిన్నంగా, త్రిముఖ జాతి లక్షణాలను కలబోసిన సంకర జాతి కావ డం దీని ప్రత్యేకత. అధిక దిగుబడి, ఎండ సహనశక్తి, మంచి మేత నాణ్యత వంటి లక్ష ణాలు ఒకేసారి లభిస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇటీవల విడుదల చేసినట్లు ప్రక టించిన వాటిల్లో ఆరోచీ 273 ఒకటి. రాజ స్థాన్, గుజరాత్, హరియాణా రాష్ట్రాల్లోని అత్యంత లోటు వర్షపాతాలు ఉండే 30 ప్రదే శాల్లో 3 సంవత్సరాలుగా ఈ రకాన్ని పరీక్షలు చేసింది. ఇది హెక్టారుకు 2,230 కిలోల దిగు బడిని ఇచ్చినట్లు తెలిపింది. ప్రాంతీయ రకాల కంటే సుమారు 13 నుంచి 27% అధిక దిగుబడి ఇచ్చినట్లు గుర్తించింది. డౌనీ బూజు, బ్లాస్ట్, స్మట్ వంటి కీలక వ్యాధి నిరోధకత కూడా ఈ రకం అందిపుచ్చుకున్నట్లు తెలిపింది. పశు గ్రాసం కొరతకు కూడా ఈ రకం పరిష్కారం చూపుతుందని భావిస్తున్నారు. ఆసియా, ఆఫ్రి కాల్లోని కరువు పీడిత ప్రాంతాలకు చిరుధా న్యాలు ప్రధాన జీవనాధారం. ముఖ్యంగా సజ్జలు అధిక ఉష్ణోగ్రతలను, తక్కువ నీటి లభ్య తను తట్టుకోగల సామర్ధ్యానికి ప్రసిద్ధి చెం దాయని ఐక్రిశాట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ హిమాన్షు పాఠక్ పేర్కొన్నారు. ప్రపంచంలోనే తొలి త్రీ వే సజ్జ రకం ఇక్రిసాట్ పరిశోధనల్లో మరో మెలురాయిగా నిలుస్తుందని అన్నారు. -
Hanuman Movie: హనుమాన్ ఫస్ట్ రివ్యూ.. గూస్బంప్స్ ఖాయం!
టాలీవుడ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో హనుమాన్ ఒకటి. టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ లీడ్ రోల్లో.. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 11 భాషల్లో భారీ బడ్జెట్తో రూపొందిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలోకి రానుంది. అదే రోజు మహేశ్ బాబు గుంటూరు కారం సినిమా కూడా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ మూవీకి అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. (ఇది చదవండి: 'హనుమాన్'కు అడ్డంకులు.. ప్రభాస్ సాయం కోరుతున్న చిత్ర యూనిట్) ఈ నేపథ్యంలో ఇప్పటికే హనుమాన్ మూవీకి సంబంధించిన ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ప్రముఖ సినీ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ ఈ చిత్రాన్ని చూసి తన రివ్యూను వెల్లడించారు. ప్రశాంత్ వర్మ ప్రేక్షకులను ఫుల్ ఎంటర్టైనర్ను అందించాడని అన్నారు. కథ, భావోద్వేగాలు, విజువల్ ఎఫెక్ట్స్ చూస్తే గూస్బంప్స్ ఖాయమంటున్నారు. ఈ చిత్రంలో క్లైమాక్స్ సీన్స్ అద్భుతంగా ఉన్నాయని పేర్కొన్నారు. హనుమాన్ చిత్రంలో విఎఫ్ఎక్స్ కీలక పాత్ర పోషించిందని తరణ్ ఆదర్శ్ తెలిపారు. అంతే కాకుండా ఈ చిత్రానికి ఆయన 3.5 రేటింగ్ ఇస్తున్నట్లు ట్వీట్ చేశారు. అయితే ఈ మూవీని హిందీలో చూసిన ఆయన తన రివ్యూను సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. #OneWordReview...#HanuMan: FASCINATING. Rating: ⭐️⭐️⭐️½ Director #PrasanthVarma crafts a solid entertainer… #HanuMan is ambitious and exciting - packs drama, emotions, VFX and mythology skilfully… Loaded with goosebump moments + extraordinary finale… Recommended!… pic.twitter.com/7M2RKk2zkd — taran adarsh (@taran_adarsh) January 11, 2024 -
సజ్జలో బీవీ 04 కొత్త రకాన్ని కనిపెట్టిన శాస్త్రవేత్తలు
-
ఖరీఫ్లో చిరుపంట సజ్జ
అనంతపురం అగ్రికల్చర్ : వర్షాధారంగా ఖరీఫ్లో చిరుధాన్యపు పంటగా సజ్జ వేసుకోవచచ్చని కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) కో ఆర్డినేటర్ డాక్టర్ ఎం.జాన్సుధీర్ తెలిపారు. ఆరోగ్య పరంగా ఆహార పరంగా చల్లని పంటగా పేరొందిన సజ్జలో సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటిస్తే రైతులకు లాభదాయకమన్నారు. జూన్ 15 నుంచి జూలై 15వ తేదీ వరకు విత్తుకునేందుకు అనుకూలమంటున్నారు. సజ్జ గురించి.. : సజ్జ పంటకు జిల్లా భూములు అనువైనవి. భూసారం తక్కువగా ఉన్న భూములు, నీటి నిల్వశక్తి తక్కువగా ఉన్న భూముల్లో కూడా సజ్జ వేసుకోవచ్చు. సజ్జల నుంచి తయారు చేసిన జావ, గంజి వంటి వాటిని తాగటం వల్ల శరీరంలోని వేడి తగ్గుతుంది. ఇందులో మంచి పోషకాలు ఉన్నాయి. 100 గ్రాముల గింజల నుంచి 361 కిలో కాలరీల శక్తి లభిస్తుంది. ఇనుము ధాతువును అధికంగా కలిగి ఉండటం వల్ల దీని వాడకం రక్తహీనతతో బాధపడేవారికి, స్త్రీలు, పసిపిల్లలకు, వృద్ధులకు చాలా అవసరం. సజ్జ గింజల్లో కెరోటిన్ (100 గ్రాములలో 131 మి.గ్రా) అనే పదార్థము పుష్కలంగా లభించడం వల్ల కంటి చూపునకు చాలా మంచిది. ఆహారం ఆరోగ్యం ఆర్థికపరంగా ఇటీవల సజ్జ పంటకు ప్రాముఖ్యత పెరిగింది. సాగు యాజమాన్యం : సజ్జలో అధిక దిగుబడినిచ్చే సూటి లేదా కాంపోజిట్ రకాలు ఇసీటీపీ 8203, ఇసీయంవి 221, రాజ్ – 171. అలాగే హైబ్రిడ్ రకాలు హెచ్హెచ్బి 67, ఇసీయంహెచ్ 356, ఆర్హెచ్బి 121, జీహెచ్బి 538, పిహెచ్బి 3, ఎబిహెచ్ 1 అనువైనవి. తేలిక నుంచి మధ్యరకం ఎర్రనేలలు, నీరు ఇంకే భూముల్లో విత్తుకోవాలి. ఎకరాకు 4 టన్నుల పశువుల ఎరువును ఆఖరి దుక్కిలో వేసి బాగా కలియదున్నాలి. ఎకరాకు 1.6 కిలోల విత్తనాన్ని తీసుకుని విత్తే ముందు లీటరు నీటికి 20 గ్రాములు ఉప్పు ద్రావణంలో ఉంచాలి. దీనివల్ల ‘ఎర్గాట్’’ అనే శిలీంధ్ర అవశేషాలను వేరుచేయగలము. ఆరిన తర్వాత కిలో విత్తనానికి 3 గ్రాముల థైరామ్ లేదా ఆప్రాన్ 35 ఎస్డి లేదా కాప్టాన్ మందును కలిపి విత్తనశుద్ధి చేసుకుని సాళ్ల మధ్య 45 సెం.మీ, మొక్కల మధ్య 12–15 సెం.మీ దూరం ఉండేలా గొర్రుతో విత్తుకోవాలి. వర్షధారపు పంటకైతే ఎకరాకు 50 కేజీల యూరియా, 75 కేజీల సింగల్ సూపర్ పాస్ఫేటు, 15 కేజీల మ్యూరేట్ ఆఫ్ పోటాష్ (ఎంవోపీ) వేయాలి. యూరియా రెండు భాగాలుగా చేసి విత్తేటప్పుడు సగభాగము, మిగతా సగభాగము పైరు మోకాలు, ఎత్తుదశలో ఉన్నప్పుడు అంటే 25–35 రోజుల పంటకాలంలో నేలలో తగిన తేమ చూసి వేయాలి. విత్తిన రెండు వారాల్లోగా ఒత్తు మొక్కలను తీసివేయాలి. విత్తిన 25–30 రోజులపుడు గుంటక లేదా దంతితో అంతరకృషి చేయాలి. సజ్జ పంటను వెర్రితెగులు, తేనెబంక తెగులు ఆశించుటకు అవకాశాలు ఉన్నాయి. తేనెబంక తెగులు నివారణకు పూత దశలో 2.5 గ్రాములు మాంకోజెట్ లేదా 1 గ్రాము కార్బొండిజమ్ లీటర్ నీటికి కలిపి వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. పంటకోతకి వచ్చినప్పుడు కంకుల్లోని సజ్జగింజ కింద భాగాన్ని గమనిస్తే ఒక చిన్న నల్లని చుక్క కనిపిస్తుంది. మొక్కల్లోని అధిక భాగం ఆకులు పసుపు వర్ణంలోకి మారి ఎండిపోయినట్లు కనిపిస్తాయి. రెండు మూడు దశల్లో కంకులను కోసి నూర్పిడి చేసుకోవాలి. ఏకపంటగా వీలుకాకపోతే వేరుశనగ, ఇతర పంటల ప్రధాన పొలం చుట్టూ కనీసం నాలుగైదు వరుసలు వేసుకున్నా ప్రధాన పంటకు ఆశించే తెగుళ్లు, పురుగులను అరికట్టడమే కాకుండా అదనపు ఆదాయం పొందవచ్చు.


