breaking news
Sai dedipya
-
సౌజన్య, శ్రావ్య శివాని శుభారంభం
సాక్షి, హైదరాబాద్: ఫెనెస్టా ఓపెన్ జాతీయ టెన్నిస్ టోర్నమెంట్లో తెలంగాణ అమ్మాయిలు భవిశెట్టి సౌజన్య, శ్రావ్య శివాని శుభారంభం చేశారు. న్యూఢిల్లీలోని ఆర్కే ఖన్నా స్టేడియంలో మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో టాప్ సీడ్ సౌజన్య 6–2, 6–1తో అనూషపై గెలుపొందింది. ఎనిమిదో సీడ్ శ్రావ్య శివాని 6–1, 6–1తో రిషిక సుంకరను ఓడించింది. మరో మ్యాచ్లో రెండో సీడ్ భువన కాల్వ (తెలంగాణ) 7–5, 7–5తో సారా యాదవ్పై నెగ్గింది. అండర్–18 బాలికల విభాగంలో తెలంగాణకు చెందిన సంజన సిరిమల్ల, రష్మిక భమిడిపాటి, సంస్కృతి దామెర ముందంజ వేయగా... అదితి ఆరే తొలి రౌండ్లోనే వెనుదిరిగింది. అండర్–18 బాలికల సింగిల్స్ తొలిరౌండ్ మ్యాచ్ల్లో పదో సీడ్ సంజన 6–1, 6–0తో పావని పాథక్పై, ఆరో సీడ్ రష్మిక 6–0, 6–1తో దివ్య భరద్వాజ్పై, తొమ్మిదో సీడ్ సంస్కృతి 7–5, 6–1తో ఇషితా సింగ్పై విజయం సాధించి రెండో రౌండ్కు చేరుకున్నారు. అదితి ఆరే 1–6, 0–6తో రేష్మా మురారి చేతిలో పరాజయం పాలైంది. ఇతర మ్యాచ్ల ఫలితాలు మహిళల సింగిల్స్ తొలి రౌండ్: ప్రేరణ బాంబ్రీ 6–2, 6–3తో సుదీప్త సేన్పై, ఆకాంక్ష నిట్టూరే 6–1, 6–2తో హర్షిత్ చుగ్పై, వన్షిత పథాని 6–2, 6–4తో కశిష్ భాటియాపై, లక్ష్మి వటుకుర్ 4–6, 7–5, 6–3తో లిఖిత కాల్వపై, ఆరతి మునియాన్ 7–5, 6–3తో రమ్య నటరాజన్పై నెగ్గారు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్: టాప్ సీడ్ నిక్కీ పునాచ 7–5, 6–4తో సాయి కార్తీక్పై, నితిన్ కుమార్ 6–4, 6–0తో విష్ణు వర్ధన్పై, చంద్రిల్ 7–4, 6–4తో ధ్రువ్పై, దల్వీందర్ సింగ్ 7–4, 6–3తో రంజీత్ వీర్ మురుగేశన్పై, అద్వైత్ బింద్రే 6–1, 6–3తో యశ్ యాదవ్పై, అభినవ్ సంజీవ్ 6–4, 6–4తో అన్షు కుమార్పై, వియంత్ మల్లిక్ 6–0, 7–2తో యుగల్ బన్సల్పై, ప్రజ్వల్ దేవ్ 6–1, 6–4తో కవిన్పై గెలుపొందారు. అండర్–18 బాలికల సింగిల్స్ తొలిరౌండ్: కశిష్ భాటియా 6–3, 6–2తో రితూ రాణిపై, భక్తి షా 6–1, 6–2తో శాన్వి అçహ్లూవాలియాపై, పూజ ఇంగ్లే 6–3, 6–0తో రెనీ సింగ్పై, ప్రేరణ విచారే 6–0, 6–1తో సియా దియా బాలాజీపై, సందీప్తి సింగ్ రావు 6–1, 6–2తో గౌరిసియా దబ్రాల్పై, బేలా తన్హాంకర్ 6–3, 6–1తో రాజేశ్ బోయర్పై, ఆకాంక్ష నిట్టూరే 6–1, 6–1తో కావ్యపై, జగ్మీత్ కౌర్ 4–6, 6–1, 6–2తో సుదీప్త సేన్పై విజయం సాధించారు. అండర్–18 బాలుర సింగిల్స్ తొలిరౌండ్: ఆర్యన్ భాటియా 7–5, 6–2తో లంకారెడ్డిపై, చిరాగ్ దుహాన్ 7–6(5), 6–2తో కనిష్క్ పాల్పై, ఉదిత్ గొగోయ్ 7–6 (7/4), 6–2తో సిద్ధార్థ్ జాడ్లిపై, రోహన్ మెహ్రా 6–3, 6–1తో దేవ్ జావియాపై, కృష్ణ 5–7, 6–3, 6–1తో అతుల్ చిల్లర్పై, బిక్రమ్జీత్ సింగ్ 6–4, 6–2తో భూపతిపై, అథర్వ్ 6–1, 6–3తో గౌరవ్ గులియాపై, మన్ మలిక్ షా 6–1, 6–0తో బ్రుగెన్పై, మోహిత్ 6–2, 6–1, 6–2తో దివేశ్ గెహ్లాట్పై, కబీర్ 6–4, 6–2తో హీరక్ వోరాపై, సుశాంత్ దబాస్ 10–8, 6–3తో అఖిలేంద్రాయ్ ఇంద్రబాలన్పై, యశ్ చౌరాసియా 6–1, 6–4తో కరన్ సింగ్పై, ధ్రువ్ తాంగ్రి 6–4, 6–2తో నిశాంత్ దబాస్పై గెలిచారు. డబుల్స్ క్వార్టర్స్లో సాయిదేదీప్య జోడీ... మరోవైపు మహిళల డబుల్స్ విభాగంలో హైదరాబాద్ అమ్మాయి వై. సాయిదేదీప్య తన భాగస్వామి సారా యాదవ్ (మధ్యప్రదేశ్)తో కలిసి క్వార్టర్ ఫైనల్కు చేరుకుంది. ప్రిక్వార్టర్స్లో సాయిదేదీప్య–సారా యాదవ్ ద్వయం 6–2, 6–2తో సింధు జనగామ–సంస్కృతి దామెర (తెలంగాణ) జోడీపై విజయం సాధించింది. సింగిల్స్ విభాగంలో ప్రిక్వార్టర్స్ చేరిన సాయిదేదీప్య నేడు జరిగే మ్యాచ్లో శ్రేయ తటవర్తి (తెలంగాణ)తో తలపడుతుంది. -
క్వార్టర్స్లో సాయిదేదీప్య
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) మహిళల టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి వై. సాయిదేదీప్య నిలకడగా రాణిస్తోంది. హరియాణాలో జరుగుతోన్న ఈ టోర్నీలో ఆమె సింగిల్స్ విభాగంలో క్వార్టర్స్కు చేరుకుంది. మంగళవారం ఏకపక్షంగా జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో సాయి దేదీప్య (తెలంగాణ) 6–2, 6–4తో సింధు జనగామ (తెలంగాణ)పై వరుస సెట్లలో గెలుపొందింది. అంతకుముందు తొలి రౌండ్లో 6–3, 6–0తో షాను అగర్వాల్ (ఢిల్లీ)ని ఓడించింది. నేడు జరిగే క్వార్టర్స్ మ్యాచ్లో ఢిల్లీకి చెందిన షెఫాలీ అరోరాతో దేదీప్య ఆడుతుంది. -
క్వార్టర్స్లో సాయిదేదీప్య
ఆసియా ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అమ్మాయి సాయిదేదీప్య ఆసియా ర్యాంకింగ్ అండర్-14 టెన్నిస్ టోర్నీలో మెరిసింది. పుణెలో జరుగుతున్న ఈ టోర్నీలో ఆమె సింగిల్స్లో క్వార్టర్ ఫైనల్కు, డబుల్స్ విభాగంలో సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. సింగిల్స్లో ఓడిన మరో ఏపీ అమ్మాయి శ్రీవల్లి రష్మిక డబుల్స్లో సెమీస్కు చేరింది. గురువారం జరిగిన బాలికల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో మూడో సీడ్ సాయిదేదీప్య 6-3, 6-1తో పాన్య భల్లాపై, రాష్ట్రానికి చెందిన ఐదో సీడ్ అమినేని శివాని 6-3, 6-3తో ఆద్యా చల్లాపై గెలుపొందారు. శ్రీవల్లి 1-6, 2-6తో ఏడో సీడ్ ప్రకృతి భన్వాని చేతిలో ఓడింది. బాలికల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో శ్రీవల్లి-పాన్య భల్లా జోడి 6-1, 7-5తో నేహా గరే- శరణ్య జంటపై విజయం సాధించగా, సాయిదేదీప్య-ఈశ్వరి మాత్రే జంట 6-4, 6-1తో శ్రేయ సగాడే-రుతూజ జాదవ్ ద్వయాన్ని ఓడించింది. అమినేని శివాని-ఇషితా పరేఖ్ జోడి 6-4, 6-0తో నేహ మొకాషి- పరాడే జంటపై గెలిచింది. -
సాయి దేదీప్య గెలుపు
జింఖానా, న్యూస్లై న్: నేషనల్ సీరీస్ (ఎన్ఎస్) టెన్నిస్ టోర్నీ అండర్-14 బాలికల విభాగంలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి సాయి దేదీప్య క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్ళింది. ఢిల్లీలోని ఆర్కే ఖ న్నా స్టేడియంలో జరుగుతున్న ఈ టోర్నీ రెండో రౌండ్లో సాయి దేదీప్య 7-5, 6-1తో రివ్దీ శర్మ (హర్యానా)పై నెగ్గింది. క్వార్టర్ ఫైన ల్లో తను మహారాష్ట్ర క్రీడాకారిణి శివానితో తలపడనుంది. దీంతో పాటుగా డబుల్స్ కేటగిరీలో సాయి దేదీప్య- మెహక్ జైన్ (మహారాష్ట్ర) జోడి సెమీఫైనల్లోకి అడుగు పెట్టంది. ఈ జోడి సెమీస్లో సామా సాత్విక (ఆంధ్రప్రదేశ్)- శివాని (మహారాష్ట్ర) జోడితో పోటీపడనుంది.