breaking news
sadaran
-
తిరుపతి: కొనసాగుతున్న సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం
-
తిరుపతి: ముగిసిన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం
Updates ►తిరుపతిలో జరిగిన 29వ దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశం ముగిసింది. ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రతినిధులు సమావేశంలో తమ సమస్యలను ప్రస్తావించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి సీఎం వైఎస్ జగన్ ప్రస్తావించిన సమస్యలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సానుకూలంగా స్పందించారు. దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో ఏపీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ.. ► రాష్ట్రాల మధ్య సమస్యలు నిర్దేశిత సమయంలోగా పరిష్కారం కావాలి. దీనికోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలి. ► విభజనతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. రాష్ట్రాన్ని విడగొట్టి ఏడేళ్లు గడిచినా హామీలు అమలు కావడంలేదు. ► సమస్యలన్నీ అపరిష్కృతంగానే ఉన్నాయి. వీటితో రాష్ట్రానికి తీవ్ర నష్టం. ► పోలవరం ప్రాజెక్టు వ్యయ నిర్ధారణలో 2013–14 ధరల సూచీతో రాష్ట్రానికి అన్యాయం. ఇది విభజన చట్టాన్ని ఉల్లంఘించడమే ► రీసోర్స్ గ్యాప్నూ భర్తీచేయలేదు. ప్రత్యేక హోదా హామీని నెరవేర్చలేదు ► తెలంగాణ నుంచి విద్యుత్ బకాయిలను ఇప్పించండి ► తీవ్ర కష్టాల్లో ఉన్న ఏపీ డిస్కంలకు ఊరట నివ్వండి ► రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపిణీ కూడా జరగలేదు ► గత ప్రభుత్వంలో పరిమితి దాటారని రుణాలపై ఇప్పుడు కోత విధిస్తున్నారు. దీనిపై వెంటనే జోక్యం చేసుకోవాలి ► రాష్ట్రాల్లో రేషన్ లబ్ధిదారుల గుర్తింపుకోసం కేంద్ర ప్రభుత్వ ప్రక్రియలో హేతుబద్ధత లేదు. వెంటనే సరవణలు చేయాలి. ► ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ఆతిథ్యం ఇవ్వగా.. సీఎం జగన్ లాంఛనంగా సమావేశాన్ని ప్రారంభించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు స్వాగతం పలికిన తిరుపతి ఎమ్మెల్యే భూమన ►ఈ సమావేశానికి కర్ణాటక సీఎం బొమ్మై, తెలంగాణ నుంచి హోంమంత్రి మహమూద్ అలీ హాజరయ్యారు. ఈ సందర్భంగా సమావేశానికి వచ్చిన అతిథులను సీఎం జగన్ సత్కరించారు. ► కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి (సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం) ప్రారంభమైంది. సౌత్జోనల్ కౌన్సిల్ సమావేశానికి హాజరైనవారు.. ► అమిత్ షా (సౌత్జోనల్ కౌన్సిల్ ఛైర్మన్, కేంద్ర హోంమంత్రి) ► వైఎస్ జగన్మోహన్రెడ్డి (ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, సౌత్జోనల్ కౌన్సిల్ వైస్ ఛైర్మన్) ► బస్వరాజు బొమ్మై (కర్ణాటక ముఖ్యమంత్రి) ► రంగస్వామి (పుదుచ్చేరి ముఖ్యమంత్రి) ► తమిళసై సౌందర్రాజన్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ ► డీకే జోషి (అండమాన్ నికోబార్ లెఫ్టినెంట్ గవర్నర్ అడ్మిరల్) ► ప్రఫుల్ పటేల్ (లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్) ► తెలంగాణ, తమిళనాడు, కేరళల నుంచి మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ► తాజ్ హోటల్కు చేరుకున్న సీఎం జగన్. ► సీఎం జగన్ మధ్యాహ్నం రెండున్నర ప్రాంతంలో రేణిగుంట ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్లో సీఎం జగన్కు మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మేకపాటి గౌతమ్ రెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి, భూమన అభినయ్ రెడ్డి ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి సీఎం జగన్ తాజ్ హోటల్కు బయలుదేరి వెళ్లారు. సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొని ఆయన స్వాగత ఉపన్యాసం ఇవ్వనున్నారు. ► మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో రేణిగుంట విమానాశ్రయం నుంచి తాజ్ హోటల్కు బయలుదేరిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. ► మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతం రేణిగుంట విమానాశ్రయం నుంచి తాజ్ హోటల్కు బయలుదేరిన కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై. ► భారీ వర్షాలు, బాధితులను ఆదుకునేందుకు స్వయంగా సహాయ కార్యక్రమాల పర్యవేక్షణ పనుల్లో నిమగ్నమై ఉన్నందున సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి హాజరుకాలేకపోతున్నానని తమిళనాడు సీఎం స్టాలిన్ తెలిపారు. ► ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో తిరుపతికి బయలుదేరారు. సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొననున్నారు.కేంద్ర హోంమంత్రి అమిత్షా నేతృత్వంలో మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7.30 వరకు సమావేశం జరగనుంది. సదరన్ జోనల్ కౌన్సిల్లో సీఎం జగన్ స్వాగత ఉపన్యాసం ఇవ్వనున్నారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుతో ఉన్న సమస్యలను ప్రస్తావించనున్నారు. సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, తిరుపతి: కేంద్ర ప్రభుత్వంతో పాటు పొరుగు రాష్ట్రాల వద్ద అపరిష్కృతంగా ఉన్న అంశాలను త్వరగా పరిష్కరించాల్సిందిగా ఆదివారం తిరుపతిలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరగనున్న 29వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో కోరాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమావేశంలో ప్రస్తావించాల్సిన అంశాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 3వ తేదీన ఉన్నత స్థాయి సన్నాహక సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ సమావేశంలో ఆరుకు పైగా అంశాలను ప్రస్తావించేందుకు అజెండా రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా, వివిధ పెండింగ్ సమస్యలను ప్రస్తావించి త్వరగా పరిష్కరించాలని సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో సీఎం కోరనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. రాష్రవిభజన చట్టంలోని హమీలతో పాటు అపరిష్కృత అంశాలను, పెండింగ్ బకాయిలను ప్రధానంగా ప్రస్తావించనున్నట్లు పేర్కొన్నాయి. ఈ సమావేశంలో రాష్ట్రానికి మేలు చేకూరేలా ముఖ్యమంత్రి కీలక ప్రసంగం చేయనున్నారని అధికార వర్గాలు తెలిపాయి. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ సహా కేరళ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, పాండిచ్చేరి రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అండమాన్–నికోబార్ లెఫ్టినెంట్ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్, లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ హాజరు కానున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్షా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిలకు శ్రీవారి ప్రసాదం అందజేస్తున్న టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్రెడ్డి, అర్చకులు చక్కటి సంబంధాలే లక్ష్యం ► రాష్ట్రాల మధ్య సహృద్భావ వాతావరణం, కేంద్రం –రాష్ట్రాల మధ్య చక్కటి సంబంధాలను నెలకొల్పే ప్రయత్నంలో భాగంగా జోనల్ కౌన్సిల్స్ను ఏర్పాటు చేశారు. ► భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు తర్వాత.. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం–1956 ప్రకారం ఐదు జోనల్ కౌన్సిల్స్ ఏర్పాటయ్యాయి. దక్షిణాది రాష్ట్రాలతో ఏర్పడ్డ కౌన్సిల్ ఐదోది. ఆ తర్వాత 1972లో రాష్ట్రాల రీ ఆర్గనైజేషన్ కింద ఆరవది నార్త్ ఈస్ట్ జోనల్ ఏర్పాటైంది. ► మొట్టమొదటి సౌత్ జోనల్ కౌన్సిల్ సమావేశం 1957 జులై 11న మద్రాసులో నిర్వహించారు. మొత్తంగా ఇప్పటి వరకూ 28 సార్లు దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండళ్ల సమావేశాలు జరిగాయి. చివరగా 2018 సెప్టెంబరు 18,న సౌత్ జోనల్ కమిటీ సమావేశం బెంగళూరులో జరిగింది. ► ఈ సమావేశాలకు కేంద్ర హోం శాఖ మంత్రి చైర్మన్గా, రొటేషన్ పద్ధతిలో ఒక్కో రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ చైర్మన్గా వ్యవహరిస్తారు. ముఖ్యమంత్రులెవరైనా రాలేకపోతే మంత్రులు హాజరవుతారు. ► మూడేళ్ల తర్వాత మళ్లీ ఈ సమావేశం ఆదివారం తిరుపతిలో జరుగుతోంది. ఈ సమావేశాల్లో ప్రధానంగా ఆర్థిక, సామాజిక పరమైన అంశాలు చర్చిస్తారు. ఈ అంశాల పరిష్కారానికి ప్రణాళికలు రూపొందిస్తారు. రాష్ట్రాల మధ్య పెండింగ్ అంశాలు, సరిహద్దు వివాదాలు, భాషా పరంగా మైనార్టీల అభివృద్ధి, సంక్షేమం, అంతర్ రాష్ట్ర రవాణా, రాష్ట్రాల పునర్ విభజన చట్టంలో పెండింగ్ అంశాలు.. తదితర విషయాలన్నీ ప్రస్తావనకు వస్తాయి. ఏపీ ప్రస్తావించనున్న అంశాలు ► తెలుగు గంగకు సంబంధించి తమిళనాడు నుంచి రావాల్సిన బకాయిలు. ► పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలు. ► తెలంగాణా నుంచి రావాల్సిన రూ.6,300 కోట్ల విద్యుత్ బకాయిలు. ► రాష్ట్ర విభజన జరిగిన ఆర్థిక ఏడాది ఏర్పడిన రెవిన్యూ లోటు కింద రావాల్సిన నిధులు. ► రేషన్ బియ్యంలో హేతు బద్ధతలేని కేంద్రం కేటాయింపులు. ► తెలంగాణ నుంచి రావాల్సిన సివిల్ సప్లైస్ బకాయిల అంశాలు. ► ఎఫ్డి ఖాతాల స్తంభన, ఆస్తుల విభజనలో అపరిష్కృత అంశాలు. ► కేఆర్ఎంబీ పరిధిలోకి జూరాల ప్రాజెక్టును తీసుకురావడం. ►నదుల అనుసంధానంపై కేంద్రం ప్రతిపాదనల ప్రస్తావన. రాష్ట్రానికి మేలు జరిగేలా, వీలైనంత త్వరగా సాకారం అయ్యే ప్రణాళికలు, రాష్ట్రం సూచిస్తున్న ప్రత్యామ్నాయాలు. ► ఇతర రాష్ట్రాలు ప్రస్తావించే అంశాల్లో రాష్ట్రానికి సంబంధించిన విషయాలు ఉంటే.. వాటిపై తగిన రీతిలో స్పందన. ముస్తాబైన తిరుపతి నగరం నేడు 29వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం నిర్వహణకు తిరుపతి నగరం ముస్తాబైంది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు మొదలు కానున్న ఈ సమావేశం కోసం రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. రేణిగుంట విమానాశ్రయం నుంచి సమావేశం జరిగే తాజ్ హోటల్తో పాటు వీవీఐపీలు, వీఐపీల బస, వారు పర్యటించే ప్రదేశాల్లో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేసింది. సమావేశ ప్రాంగణాన్ని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ శనివారం పరిశీలించారు. తాజ్ హోటల్లో ఆయన అధికారులతో సమావేశమయ్యారు. ప్రాంగణం పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, బాడీవార్న్ కమెరాలతో 24 గంటలూ నిఘా ఉంచాలని ఈ సందర్భంగా ఆదేశించారు. జిల్లా సరిహద్దుల్లో ప్రతి చెక్పోస్టులో ముమ్మరంగా తనిఖీలు చేపట్టాలని, ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా సమావేశాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. మొత్తంగా మూడు వేల మంది సిబ్బందితో భద్రత కల్పిస్తున్నారు. ఈ సమావేశంలో అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యన్నార్, ఇంటెలిజెన్స్ ఐజీ శశిధర్రెడ్డి, అనంతపురం రేంజ్ ఐజీ క్రాంతి రాణా టాటా, అర్బన్ జిల్లా ఎస్పీ వెంకట అప్పల నాయుడు, చిత్తూరు ఎస్పీ సెంథిల్ కుమార్, టీటీడీ సీవీఎస్వో గోపీనాథ్జెట్టి, ఏఎస్పీ నిషాంత్రెడ్డి పాల్గొన్నారు. కాగా, కౌన్సిల్ సమావేశం అనంతరం ప్రముఖులందరూ తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లనున్నారు. -
14న సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం
సాక్షి, అమరావతి: తిరుపతిలో వచ్చే నెల 14న 29వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించనున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ, కర్నాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్, లక్షద్వీవులకు చెందిన గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు, ముఖ్యమంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, సలహాదారులు, ఇతర సీనియర్ అధికారులు హాజరవుతారు. ఆయా రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించుకోవడంతో పాటు కేంద్రం నుంచి అందాల్సిన సాయం తదితరాలపై చర్చిస్తారు. ఈ సమావేశాన్ని విజయవంతం చేసేందుకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ ఆదేశించారు. జోనల్ కౌన్సిల్ సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లపై గురువారం సచివాలయం నుంచి వర్చువల్ విధానంలో వివిధ శాఖల కార్యదర్శులు, టీటీడీ ఈవో, చిత్తూరు కలెక్టర్, ఎస్పీ తదితరులతో సమీక్ష నిర్వహించారు. సీఎస్ మాట్లాడుతూ.. ఎలాంటి లోపాలకు ఆస్కారమివ్వకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించి చర్చించాల్సిన అంశాలు, కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాల్సిన అజెండాపై వివిధ శాఖల కార్యదర్శులతో సీఎస్ ప్రత్యేకంగా సమీక్షించారు. ఈ సమావేశంలో ఉన్నతాధికారులు పూనం మాలకొండయ్య, ఎల్. ప్రేమచంద్రారెడ్డి, అనిల్ సింఘాల్, వి.ఉషారాణి, శ్యామల రావు, పి.బాలకృష్ణమాచార్యులు తదితరులు పాల్గొన్నారు. -
రామా.. కనవేమిరా!
కుర్చీలకే పరిమితమైన వారు.. కాలు భూమిపై మోపలేని వారు.. మనిషి సాయంలేనిదే నడవలేనివారు.. వివిధ వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులు, వృద్ధులు.. వీరిని చూస్తే ఎవరికైనా అయ్యోపాపం అనిపిస్తుంది. కానీ సర్వజనాస్పత్రి నిర్వాహకులు మాత్రం కనీస మానవత్వం చూపలేకపోయారు. బుధవారం ఆస్పత్రిలోని మొదటి అంతస్తులో సదరం శిబిరం ఏర్పాటు చేసి దివ్యాంగులకు నరకం చూపించారు. ఒక్కోమెట్టు ఎక్కేందుకు ఒక్కొక్కరు పడిన కష్టం చూసి అక్కడున్న వారే అయ్యో అంటూ తల్లడిల్లిపోయారు. ఆస్పత్రి ఉన్నతాధికారులు మాత్రం ప్రశ్నించిన వారితో వితండవాదం చేయడం గమనార్హం. అనంతపురం న్యూసిటీ: తొమ్మిది రకాల జబ్బులతో బాధపడుతున్న వారికి సామాజిక పింఛన్లు మంజూరు చేస్తామని ఇటీవల ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలని వెల్లడించింది. దీంతో తలసీమియా, హీమోఫీలియా, సికెల్సెల్ అనీమియా, ఎలిఫాంటియాసిస్(బోదకాలు), మూత్రపిండ వ్యాధిగ్రస్తులకు, పక్షవాతం, కండరాల బలహీనత, యాక్సిడెంట్కు గురై(చక్రాల కుర్చీ/మంచానికి పరిమితమైన వారు), కుష్టు రోగులు(బహుళ వైకల్యం), కిడ్నీ, కాలేయం, గుండె మార్పి జరిగిన వారికి మెడికల్ బోర్డు సర్టిఫికెట్ మంజూరు కార్యక్రమం జరిగింది. ప్రొఫెసర్ ఆఫ్ మెడిసిన్ డాక్టర్ వెంకటేశ్వరరావు, చిన్నపిల్లల విభాగం ప్రొఫెసర్ డాక్టర్ మల్లీశ్వరి, తదితరులు దివ్యాంగుల ధృవీకరణ పత్రాలు, పాతరిపోర్టులను పరిశీలించారు. శిబిరానికి జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా రోగులు తరలివచ్చారు. దీంతో వారిని కంట్రోల్ చేయడం ఇబ్బందిగా మారింది. ఆస్పత్రిలోని సూపరింటెండెంట్ చాంబర్ ముందున్న మొదటిఫ్లోర్ వికలాంగులతో కిక్కిరిసిపోయింది. ఎఫ్ఎం, ఎంఎం, ఐసీసీయూ, చిన్నపిల్లల వార్డు, సర్జికల్ వార్డులకు వెళ్లేందుకు వీల్లేకుండా వికలాంగులు బారులు తీరారు. అయినా ఆస్పత్రి యాజమాన్యం కనీస జాగ్రత్తలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమైంది. శిబిరాన్ని మొదటి అంతస్తులో నిర్వహించగా.. దివ్యాంగులు ఫస్ట్ప్లోర్ చేరుకోవడానికి నరకం చూశారు. నడిచేందుకు కూడా వీలులేని స్థితిలో ఉన్నవారు మోకాళ్లతో దోక్కుంటూ మెట్లు ఎక్కడానికి అల్లాడిపోయారు. తీరా సర్టిఫికెట్ల మంజూరు గదికి వచ్చే సరికి వందల సంఖ్యలో దివ్యాంగులు బారులు తీరారు. పసిపిల్లల గావుకేకలు వివిధ వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు సదరం సర్టిఫికెట్ తీసుకోవడం.. ఇప్పటికే ఉన్న సర్టిఫికెట్లను ధ్రువీకరించుకునేందుకు చాలా మంది చంటిబిడ్డలతో వచ్చారు. ఒళ్లో చంటిబిడ్డ.. మరో చేతిలో అనారోగ్యంతో ఉన్న పిల్లలతో వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జనం కిటకిటలాడగా గాలిసైతం వీయక పసిపిల్లల ఏడ్పులతో ఆస్పత్రి మార్మోగింది. చిన్నారుల ఇబ్బందులు చూసి తట్టుకోలేని చాలా మంది వెనక్కివెళ్లిపోయారు. సుదూరప్రాంతాల నుంచి వచ్చిన వారు క్యూలోనే కూర్చుండిపోయారు. అంతలా కష్టపడినా సదరం శిబిరంలో వివరాలు నమోదు చేయించలేకపోయారు. అడుగడుగునా నిర్లక్ష్యం దివ్యాంగులు, వివిధ రోగాలతో బాధపడుతున్న వారు సదరం శిబిరానికి వేలాదిగా తరలివస్తారని తెలిసినా...ఆస్పతి యాజమాన్యం ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలమైంది. సెక్యూరిటీ పూర్తి స్థాయిలో లేకపోవడంతో కంట్రోల్ చేయడానికి వీలుకాలేదు. సర్టిఫికెట్ల కోసం రోగులు తోపులాడుకునే పరిస్థితి ఎదురైంది. తమనంటే తమను ముందు పరీక్షించాలంటూ శిబిరానికి వచ్చిన వారు ఎగబాకారు. ఈ పరిస్థితుల్లో ఔట్పోస్టు ఏఎస్ఐ త్రిలోక్ టూటౌన్ పోలీసులకు సమాచారం అందించగా, వారు స్పెషల్పార్టీ పోలీసులను రంగంలోకి దింపారు. వారొచ్చిన గంటన్నరకు సమస్య సద్దుమణిగింది. క్షేత్రస్థాయిలో విఫలం దివ్యాంగులను ఆస్పత్రికి పంపే విషయంలో క్షేత్రస్థాయిలో పీహెచ్సీ వైద్యులు, తదితర సిబ్బంది విఫలమైనట్లు తెలుస్తోంది. ప్రతి బుధవారం సర్టిఫికెట్ల మంజూరు చేస్తారన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో ఆస్పత్రి యాజమాన్యం, ఆరోగ్యశాఖ, సచివాలయ ఉద్యోగులు విఫలమయ్యారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయ. 9 రకాల సమస్యలతో బాధపడేవారితో పాటు సదరం సర్టిఫికెట్ల కోసం వచ్చే వారు ఆస్పత్రికి రావడం పెద్ద సమస్యగా మారింది. -
సదరం.. నరకం
సాక్షి, కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో సదరం క్యాంపు నిర్వహణ తీరుపై దివ్యాంగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం నిర్వహించిన సదరం క్యాంపులో దివ్యాంగులు, వృద్ధులు, మానసిక వికలాంగులు నరకం చూశారు. ఎండలో గంటల తరబడి భారీ క్యూలలో నిల్చున్నారు. ఎండ వేడిమికి తట్టుకోలేకపోయారు. కనీసం అక్కడ తాగునీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేయలేరు. ప్రతి నెల మూడు, నాల్గో శుక్రవారాల్లో సదరం క్యాంపు నిర్వహిస్తారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న దివ్యాంగులు కానీ ఇతరులు కానీ ఈ శిబిరానికే వచ్చి పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. దీంతో జిల్లాలోని పిట్లం, మద్నూర్, ఎల్లారెడ్డి, బాన్స్వాడ, నస్రుల్లాబాద్ తదితర దూర ప్రాంతాల నుంచి వచ్చి నానా తంటాలు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా కేవలం ఒకే సదరం క్యాంపు ఏరియా ఆస్పత్రిలో నిర్వహించడంతో సమస్య ఏర్పడుతోంది. శుక్రవారం నిర్వహించిన సదరం క్యాంపు కోసం కొందరు ఉదయం 7 గంటలకే వచ్చి ఉన్నారు. ఎండలు తీవ్రంగా ఉన్నా గంటల తరబడి క్యూలో నిల్చున్నారు. కొందరు మహిళలు చంటి పిల్లలను ఎత్తుకుని ఎండలో క్యూలో నిల్చున్నారు. శిబిరం నిర్వహించే అధికారులు సౌకర్యలు ఏర్పాట్లు చేయకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. ఎండ తాకిడికి తట్టుకోలేక విలవిలలాడుతున్నామని, కనీసం తాగునీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేయలేరని కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక మండలాల్లో శిబిరం క్యాంపులను ఏర్పాటు చేస్తే ఇబ్బందులు తొలుగుతాయని, తక్షణమే అధికారులు స్పందించి మండలానికో శిబిరం ఏర్పాటు చేయాలని దివ్యాంగులు కోరుతున్నారు. ఈ విషయమై ఆస్పత్రి సూపరింటెండెంట్ ఆజయ్కుమార్ను వివరణ కోరగా డీఆర్డీఏ పీడీతో మాట్లాడానని తెలిపారు. ఇబ్బందులు రాకుండా చూడాలని తెలిపామన్నారు. అర్హులు మాత్రమే రావాలని, అనర్హులు కూడా వస్తున్నారని ఆయన తెలిపారు. నిర్లక్ష్యంగా క్యాంపు నిర్వహణ నేను పిట్లం నుంచి పొద్దున 7 గంటలకు మా తండ్రితో వచ్చా. ఎండలో చస్తున్నాం. క్యాంపు కనీస సౌకర్యాలు లేవు. తాగే నీరు కూడా లేదు. ప్రతి మండలంలో రెగ్యులర్గా క్యాంపులు నిర్వహిస్తే దివ్యాంగులకు ఇబ్బందులు తప్పుతాయి. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి. –శ్రీనివాస్, పిట్లంవాసి. -
28నుంచి ఎన్టీపీసీ సదరన్ రీజియన్ స్పోర్ట్స్ మీట్
జ్యోతినగర్: ఎన్టీపీసీ సదరన్ రీజియన్ స్పోర్ట్స్ మీట్ ఈనెల 28 నుంచి 30 వరకు ఆంధ్రప్రదేశ్ విశాఖ జిల్లాలోని సింహాద్రి ప్రాజెక్టులో నిర్వహిస్తున్నట్లు రామగుండం స్పోర్ట్స్ కౌన్సిల్ కార్యదర్శి మంగళంపల్లి రాంనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. రామగుండం ఎన్టీపీసీ నుంచి వాలీబాల్, షటిల్, బ్యాడ్మింటన్, బిలియర్డ్స్ పోటీలకు 30 మంది క్రీడాకారులు హాజరవుతున్నట్లు తెలిపారు.