-
అద్దం ముందు సమంత చేసిన వీడియో వైరల్
ఫ్యాషన్ ఐకాన్గా గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే, మరోవైపు క్లోతింగ్ బిజినెస్లోనూ సమంత ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. 'సాకి' పేరుతో లాంఛ్ అయిన ఈ క్లోతింగ్ బ్రాండ్ అతి తక్కువ కాలంలోనే బాగా పాపులర్ అయ్యింది. దీంతో ఈ దుస్తులను ప్రపంచవ్యాప్తంగా అమ్మేందుకు సిద్ధమైంది. 'సాకి' ఆన్లైన్ స్టోర్కు విదేశాల నుంచి కూడా ఆర్డర్స్ వస్తున్నాయిని, దీంతో అమెరికా, సింగపూర్, మలేషియా దేశాలకు వీటిని షిప్పింగ్ చేస్తున్నట్లు సమంత తన ఇన్స్టాగ్రామ్లో పేర్కొంది. దీనికి సంబంధించిన ప్రమోషన్ను ఎప్పటిలాగే కొత్తగా ఆవిష్కరించింది. 'సాకి' బ్రాండ్కు చెందిన దుస్తులను అద్దం ముందు నిలబడి ఒక్కొక్కటిగా మార్చుకుంటూ కెమెరాకు ఫోజిచ్చింది. 'ఇన్స్టా' రీల్తో మరింత అందంగా రూపొందించిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తుంది. ఇప్పటికే ఈ వీడియోకు 10 లక్షలకు పైగానే లైక్స్ వచ్చాయి. 'సమంత ఏం చేసినా కొత్తగానే ఉంటుంది..సూపర్భ్ సామ్' అంటూ పలువురు నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో 'శాకుంతలం' అనే సినిమాలో సమంత నటిస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా చిత్రంగా రూపుదిద్దుకుంటోన్న ఈ మూవీ ఇటీవలె గ్రాండ్గా లాంఛ్ అయింది.ఇందులో టైటిల్ రోల్ సమంత పోషిస్తుండగా దుష్యంతుడి పాత్రలో దేవ్ మోహన్ కనిపించనున్నారు. 2022లో ఈ సినిమా విడుదల కానుంది. View this post on Instagram A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) చదవండి :వైరల్: అద్భుతమైన డ్యాన్స్తో అదరగొడుతున్న సమంత ఈ సారి సాయి పల్లవి కాదు మంగ్లీ స్టెప్పులేసింది! -
హవ్వ.. ఇదేం ట్రాక్!
‘సాకి’లో నీటి ప్రవాహానికి అడ్డంగా నిర్మాణం చెరువు ఉనికికే ప్రమాదం జీహెచ్ఎంసీ అధికారుల చోద్యం పటాన్చెరు:లీడర్స్ డెరైక్షన్, అధికారుల యాక్షన్తో చెరువులను కాపాడాల్సిన పాలకులు చెరువు ఉనికినే ప్రశ్నార్థకంగా మారుస్తున్నారు. చెరు వు కింద ఆయక ట్టే లేదు. రైతులు లేరు ఇక చెరువు ఎందుకన్న విధంగా పెద్దలు ప్రవర్తిస్తున్నారు. చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో కొత్త వెంచ ర్లు వేసేందుకు ఉబలాట పడుతున్న వారికి జీహెచ్ఎంసీ అధికారులు, స్థానిక నాయకులు తోడ్పాటు నందిస్తుండటం గమనార్హం. కంచే చేను మేసిన విధంగా సాకి చెరువు పైభాగంలో ఇళ్ల నిర్మాణాలకే అనుమతులివ్వని జీహెచ్ఎంసీ ఇప్పు డు ఏకంగా వాకింగ్ ట్రాక్నే నిర్మిస్తున్నారు. సాకి చెరువులో నీటి ప్రవాహానికి అడ్డుగా వాకింగ్ ట్రాక్ నిర్మాణం సాగిస్తున్నారు. నిబంధనల మేరకు చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఎలాంటి నిర్మాణాలు జరగకూడదు. కాని జీహెచ్ఎంసీ అధికారులే దగ్గరుండి చెరువులో నీటి ప్రవాహానికి అడ్డుగా వాకింగ్ ట్రాక్ నిర్మించేందుకు మట్టి పోస్తున్నారు. సాకి చెరువుపై భాగంలో 30 ఏళ్ల క్రితం శాంతినగర్, శ్రీనగర్కాలనీలు వెలిశాయి. అప్పట్లో వెలసిన ఆ లే అవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన చాలా మందికి జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారులు నేటికీ ఎఫ్టీఎల్ పేరుతో ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం లేదు. మట్టి పోస్తే జైలే.. సాకి చెరువు శివారులో తన పొలంలో స్థానిక రైతు టప్ప కుమార్ అనే వ్యక్తి మట్టితో నింపారు. ఆయనపై స్థానిక రెవెన్యూ అధికారులు కేసులు పెట్టి, జైలుకు తరలించారు. అయితే జీహెచ్ఎంసీ అధికారులు మాత్రం చెరువులోకి వచ్చే నీటి ప్రవాహానికి అడ్డుగా శిఖం పరిధిలో మట్టి పోసి నిర్మాణాలు చేస్తున్నారు. దీని వెనుక స్థానిక లీడర్ల హస్తం ఉందని ఆరోపణలు వినవస్తున్నాయి. వాకింగ్ ట్రాక్ నిర్మిస్తే చెరువుకు హద్దు ఫిక్స్ చేసినట్టు అవుతుందని ఆ తరువాత ఎఫ్టీఎల్ పరిధిలో కొత్తగా వెంచర్ వేసి అమ్ముకోవాలని కొందరు ప్రణాళికలు వేస్తున్నారనే అనుమానాలున్నాయి. స్థానికుల అనుమానాలకు ఊతం ఇచ్చేలా జీహెచ్ఎంసీ అధికారుల సాకి చెరువు ఎఫ్టీఎల్, శిఖం భూమిలో నిర్మాణాలు చేయడం గమనార్హం. కంచే చేను మేసిన విధంగా చెరువును కాపాడాల్సిన అధికారులు చెరువు ఉనికికే ప్రమాదం తెచ్చే విధంగా నిర్మాణాలు సాగించడం విడ్డూరంగా ఉంది. సాకే చెరువు.. కొన్ని వందల ఏళ్ల క్రితం వెలసిన సాకి చెరువుకు అసలు పేరు సాకే చెరువని.. ప్రస్తుతం సాకి చెరువుగా రూపాంతరం చెందిందని చరిత్రకారుడు త్యార్ల మాణయ్య తన పుస్తకంలో లిఖించారు. రానురాను పటాన్చెరులో పంటలు వేయకపోవడంతో చెరువు అన్యాక్రాంతం అవుతూ వచ్చింది. చెరువు అలుగు వద్దే కబ్జాలున్నాయి. వాటిని తొలగించాలని డిమాండ్ ఉంది. 98 ఎకరాల విస్తీర్ణంతో చెరువు శిఖం భూమి ఉంది. దాదాపు 10 ఎకరాల భూమి పరిధిలో కబ్జాలు గతంలోనే జరిగాయి. తాజాగా మరో పది ఎకరాల భూమిలో కొత్త వెంచర్ వేయాలని కొందరు ప్రయత్నిస్తున్నారు. దాని విలువ దాదాపు రూ.30 కోట్లు ఉంటుందని భావిస్తున్నారు. అడ్డేమి లేదు పట్టణ పరిధిలోని సాకి చెరువులో మట్టి నింపుతున్న జీహెచ్ఎంసీ అధికారుల తీరుపై ఆక్షేపణలు వ్యక్తం చేస్తూ పర్యావరణ ఉద్యమకారులు ఫిర్యాదు చేసినా జీహెచ్ఎంసీ అధికారుల నుంచి ఏ మాత్రం స్పందన లేదు. సాకి చెరువలో సాగుతున్న నిర్మాణంపై ‘సాక్షి’ జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ విజయ్కుమార్ వివరణ కోరగా చెరువులో జరగుతున్న పనులతో తమకే సంబంధంలేదని అది జీహెచ్ఎంసీ లేక్స్ విభాగం పరిధిలోకి వస్తాయని వారితో మాట్లాడాలని వివరణ ఇచ్చారు. ఇక ఆ లేక్స్ విభాగం పనులను, సాకి చెరువు నిర్మాణాలను క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించే ఏఈ శేషగిరిరావును వివరణ కోరేందుకు పలకరిస్తే తానేమి మాట్లాడలేనంటూ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్తో వివరణ తీసుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు. ఈ విషయమై ఫోన్లో జీహెచ్ఎంసీ ఈఈ (లేక్స్) శేఖర్రెడ్డి వివరణ కోరగా చెరువులో నిర్మాణాలేవీ నీటి ప్రవాహానికి అడ్డుగా ఎలాంటి నిర్మాణాలు చేపట్టడంలేదని పేర్కొన్నారు. చెరువులో సుందరీకణ పనులు మాత్రమే చేస్తున్నామని చెప్పారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
తప్పక చదవండి
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement