-
గ్రామీణ ప్రాంతాల్లో మ్యుటేషన్ ఫీజు ఖరారు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని గ్రామీణ ప్రాం తాల్లో వ్యవసాయేతర స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లకు ప్రభుత్వం మ్యుటేషన్ ఫీజును ఖరారుచేసింది. ఫీజు కింద సదరు ఆస్తి విలువలో 0.1 శాతం లేదంటే రూ.800 (రెండింటిలో ఏది ఎక్కువైతే అది) వసూలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా మంగళవారం జీవో నంబర్–46 విడుదల చేశారు. దీని ప్రకారం రాష్ట్రమంతటా గ్రామ పంచాయతీల పరిధిలోని వ్యవసాయేతర స్థిరాస్తులపై హక్కుల బదిలీ కోసం ఒకేరకమైన ఫీజు వసూలు చేస్తారు. గతంలో గ్రామ పంచాయతీల తీర్మానం మేరకు ఆయా గ్రామాల్లో మ్యుటేషన్ ఫీజు నిర్ధారించే ఆనవాయితీ ఉంది. దీంతో మ్యుటేషన్ ఫీజు ఒక్కో గ్రామంలో ఒక్కోలా ఉండేది. తాజా ఉత్తర్వులతో మ్యుటేషన్ ఫీజు ఖరారు అధికారం గ్రామ పంచాయతీలకు ఉండదు. ధరణి ద్వారా గ్రామాల్లోనూ ఏకరూప రుసుము అమలవుతుంది. క్రయవిక్రయాలు, వారసత్వ హక్కుల బదిలీ, గిఫ్ట్ రిజిస్ట్రేషన్ల వంటి లావాదేవీలకు ఇది వర్తి స్తుంది. ఈ మేరకు పంచాయతీరాజ్, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. -
ఖాళీలు బోలెడు..భర్తీ బెత్తెడు!
విశాఖ రూరల్, న్యూస్లైన్ : మాటలు ఓరకం.. చేతలు మరో విధం.. ప్రభుత్వం వ్యవహార సరళి సర్వదా సమస్యాత్మకం.. పొంతనలేని ఈ వ్యవహారం వల్లే గ్రామీణాభివృద్ధి కుంటుపడుతోందన్నది విస్పష్టం. ఓవైపు గ్రామీణాభివృద్ధి శాఖల్లో సిబ్బంది లేక పనులు కుంటుపడుతూ ఉంటే, మరోవైపున ఖాళీల భర్తీలు కుంటుపడుతున్నాయి. దాంతో అటు నిరుద్యోగులు ఉసూరంటున్నారు.. ఇటు ప్రజలూ ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పూర్తిగా పోస్టులను భర్తీ చేయాల్సిన ప్రభుత్వం మళ్లీ అరకొరగానే నియామకాలు చేపడుతూ ఉండడమే విచి త్రం. వందల సంఖ్యలో ఖాళీలు ఉంటే ప దుల సంఖ్యలో పోస్టులను నింపడానికి సి ద్ధమైంది. పంచాయతీ కార్యదర్శుల పోస్టు ల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీపీఎస్సీ ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ను జారీ చేయనుంది. అయితే జిల్లాలో 920 గ్రామ పంచాయతీలు ఉన్నా యి. ఇందులో 660 పంచాయతీలకు కార్యదర్శుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి అధ్వాన్నంగా మారింది. ఒక్కో కార్యదర్శికి అయిదారు పంచాయతీల బాధ్యతలను అప్పగించారు. దీంతో సిబ్బంది తీవ్ర పని ఒత్తిడితో అవస్థలు పడుతున్నారు. ఇటువంటి తరుణంలో పూర్తి స్థాయిలో నియామక ప్రక్రియను చేపట్టకుండా కేవలం 155 పోస్టులను మాత్రమే భర్తీ చేయాలని నిర్ణయించారు. క్లస్టర్స్కు ముందు కార్యదర్శులను నియమించి వారికి మూడు, నాలుగు పంచాయతీల బాధ్యతలను అప్పగించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో ఇంకా 505 కార్యదర్శుల పోస్టులు ఖాళీగా ఉండిపోనున్నాయి. పోస్టుల భర్తీ తర్వాత కూడా గ్రామ పంచాయతీల పరిస్థితిలో పెద్దగా మార్పు వచ్చే అవకాశం లేదు. పూర్తి స్థాయిలో పోస్టులను భర్తీ చేస్తే సిబ్బంది కొరత తీరడంతో పాటు నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మూకుమ్మడిగా సెలవు పెట్టిన ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ఉద్యోగులు
Yashika Aannand: అందాలతో మైండ్ బ్లాక్ చేస్తున్న యాషిక ఆనంద్ (ఫొటోలు)
Paris Olympics 2024: భారత రెజ్లర్లకు ఆఖరి అవకాశం
65 ఏళ్లలో 7.8 శాతం తగ్గిన హిందూ జనాభా
కాసేపట్లో కర్నూలులో సీఎం జగన్ ప్రచారం
Mayawati: మేనత్త నిర్ణయంపై పెదవి విప్పిన ఆకాష్ ఆనంద్
ఎన్నికల ప్రచారంలో మంత్రి రోజాకు అపూర్వ స్వాగతం
జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై వెనక్కితగ్గిన టీడీపీ
పచ్చ మద్యం స్వాధీనం..
SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
తప్పక చదవండి
- జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై వెనక్కితగ్గిన టీడీపీ
- SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
- PK: 'పులుసు కారుతోంది'..!
- ప్రచారంలో సీనియర్ హీరో స్టెప్పులు!
- SRH: వాళ్లిద్దరు పిచ్ను మార్చేశారు.. అతడొక అద్భుతం!
- సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
- మా గురించి మాట్లాడేందుకు మీరెవరు?: వరలక్ష్మి శరత్కుమార్
- బాబు, పవన్, బాలయ్య, కిరణ్.. కూటమి ప్రముఖుల ఎదురీత
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
Advertisement