-
ఢిల్లీ బడ్జెట్: మహిళలకు కేజ్రీవాల్ మరో కానుక
దేశరాజధాని ఢ్లిలీలో ఉంటున్న మహిళలు ఇకపై ప్రతీనెలా రూ. 1,000 అందుకోకున్నారు. ఢిల్లీ అసెంబ్లీలో సోమవారం అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి అతిషి మర్లెనా పలు కీలక ప్రకటనలు చేశారు. ఢిల్లీలో ఉంటున్న 18 ఏళ్లు నిండిన మహిళలకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం ప్రతి నెలా రూ.1000 అందజేస్తుందని అతిషి ప్రకటించారు. ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన కింద ఈ మొత్తాన్ని అందజేస్తామని తెలిపారు. ఈ ప్రకటన వెలువడిన వెంటనే అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలంతా ‘అరవింద్ కేజ్రీవాల్ జిందాబాద్’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. #WATCH | Delhi Finance Minister Atishi reaches the Vidhan Sabha ahead of the Budget presentation. pic.twitter.com/73fBsKG9a9 — ANI (@ANI) March 4, 2024 అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో అతిషి మర్లెనా మాట్లాడుతూ.. ‘రామరాజ్యంలో తదుపరి అడుగు మహిళల భద్రత. మహిళల అవసరాలను తీర్చడంలో ముందున్నందుకు గర్వపడుతున్నాం. ఉచిత విద్యుత్తు, నీటి బిల్లులు, మొహల్లా క్లినిక్, వృద్ధ మహిళలను తీర్థయాత్రలకు పంపడం మొదలైనవి చేపట్టాం. 2014తో 2024ను పోల్చినప్పుడు మహిళలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి ప్రయత్నించాం’ అని అన్నారు. #DelhiBudget | "In 2014, the per capita income of Delhi was Rs 2.47 lakhs and today the per capita income of Delhi has reached 4.62 lakhs which is two and a half times more than the national average...Today, I am going to present a budget of Rs 76,000 crores," says Delhi Finance… pic.twitter.com/RMjQlA9EMA — The Times Of India (@timesofindia) March 4, 2024 ఈ బడ్జెట్లో విద్యా రంగానికి రూ.16,396 కోట్లు కేటాయించాలని ఆర్థిక మంత్రి అతిషి ప్రతిపాదించారు. అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం పదో బడ్జెట్ను ప్రవేశపెట్టడం గర్వించదగ్గ విషయమని అతిషి అన్నారు. ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుతం 9 లక్షల మంది బాలికలు చదువుతున్నారని, ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 933 మంది బాలికలు నీట్లో ఉత్తీర్ణత సాధించగా, 123 మంది బాలికలు జేఈఈ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారని ఆమె తెలిపారు. -
ఆమె రూ. 6 లక్షలుపెట్టి బొమ్మలను ఎందుకు కొంది? డైపర్లు ఎందుకు మారుస్తుంది?
ఓ మహిళకు సంబంధించిన విచిత్ర ఉదంతం వెలుగులోకి వచ్చింది. జేస్ ఎల్లీస్ అనే మహిళ ఒకటో, రెండు కాదు ఏకంగా 13 బొమ్మలను తన పిల్లల మాదిరిగా సాకుతుంది. ఆమె ప్రతిరోజూ ఆ బొమ్మల డైపర్లను మారుస్తుంది. ఆ బొమ్మలను బయటకు తీసుకెళ్లి ఆడిస్తుంది. ఆమె చేస్తున్న ఈ పనిలో ఆమెకు కాబోయే భర్త కూడా సహాయం చేయడం మరింత విచిత్రం. తూర్పు లండన్లోని ప్లాస్టోలో ఉంటున్న ఆ మహిళ పేరు జేస్ ఎల్లీస్. ఆమె వయస్సు 27 ఏళ్లు. ఆమె వృత్తిరీత్యా హెచ్ఆర్ బిజినెస్ పార్టనర్. ది సన్ నివేదిక ప్రకారం కోవిడ్ మహమ్మారి సమయంలో జేస్ ఎల్లీస్ ఒంటరితనానికి గురయ్యింది. ఈ నేపధ్యంలో ఆమె ఆన్లైన్లో కొన్ని రీబోర్న్ బొమ్మలను చూసింది. అవి అచ్చం పిల్లల్లాగే ఆమెకు కనిపించాయి. 2020, మే నెలలో ఆమె అలాంటి అనేక బొమ్మలను సేకరించడం మొదలుపెట్టింది. ఇలా ఆమె 13 బేబీ డాల్స్కి తల్లిగా మారింది. ఈ విధంగా బొమ్మలను కొనుగోలు చేయడం తనను పేరెంట్హుడ్కి సిద్ధం చేస్తుందని జేస్ తెలిపింది. జేస్ తొలుత రెబెక్కా అనే బొమ్మను కొనుగోలు చేసింది. ఇది ఒక నెల వయసు కలిగిన రీబోర్న్ బొమ్మ. ఆమె దానిని 250 యూరోలకు కొనుగోలు చేసింది. అనంతరం ఆమె షామ్, బ్రూక్లిన్, జాన్, లిల్లీ, అన్నలీస్, అరియా, కుకీ, చార్లీ, పిప్పా, జూన్తో సహా మరో రెండు బేబీ బొమ్మలను కొనుగోలు చేసింది. ఈ బొమ్మలను కొనుగోలు చేసేందుకు ఆమె £6,000 (రూ. 6 లక్షల 18 వేలకు పైగా) వెచ్చించింది. ఆమె దగ్గరున్న అత్యంత ఖరీదైన బొమ్మ కుకీ, ఆమె దానిని £1,700కి కొనుగోలు చేసింది. ఆమెకు కాబోయే భర్త అవేరీ రాసెన్ పేస్ట్రీ చెఫ్ ఆమె అభిరుచికి సాయం అందిస్తున్నారు. ఆమె దగ్గరున్న బేబీ బొమ్మలకు దుస్తులు ధరింపజేయడంలో, వాటి డైపర్లను మార్చడంలో ఆమెకు సహాయం చేస్తుంటాడు. ఇది కూడా చదవండి: డబ్బున్న భర్త దొరకాలన్న ఆమె కోరిక ఎలా తీరింది? అందుకోసం ఏం చేసింది? -
హృదయాల్ని కదిలించే ఘటన: మళ్లీ ఆడబిడ్డే! రూ.800 తీసుకుని..
ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలో హృదయాలను కలచివేసే ఉదంతం చోటుచేసుకుంది. రెండవసారి కూడా కూతురు పుట్టడంతో ఆ తల్లి ఆ నవజాత శిశువుకు రూ.800కు అమ్మేసింది. ఈ విషయం ఆ నవజాత శిశువు తండ్రికి తెలియగానే, అతను ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఆ శిశువును స్వాధీనం చేసుకున్నారు. నవజాత శిశువును విక్రయించిన ఉదంతంలో పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ ఘటన మయూర్భంజ్ జిల్లా ఖూటా పోలీస్ స్టేషన్ పరిధిలోని మహులియా గ్రామంలో చోటుచేసుకుంది. పేదరికంలో మగ్గిపోతున్న ఆ తల్లి రెండవసారి కూడా తనకు కుమార్తెనే పుట్టడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యింది. దీంతో ఆమె రూ.800కు ఆ శిశువును ఒక దంపతులకు విక్రయించింది. ఈ విషయం తమిళనాడులో ఉంటున్న ఆమె భర్తకు తొలుత తెలియలేదు. తనకు రెండవసారీ కుమార్తెనే పుట్టడంతో ఆ తల్లి ఈ విషయమై ముర్ము అనే వ్యక్తితో చర్చించింది. అతను ఆ నవజాత శిశువును రూ. 800కు విక్రయించేందుకు ఒక దంపతులతో మాట్లాడాడు. ఇంతలో ఈ విషయం ఆమె భర్తకు తెలిసింది. అతను దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాను తమిళనాడు నుంచి వచ్చే సరికి తన చిన్న కుమార్తె ఇంటిలో లేదని పోలీసులకు తెలిపాడు. దీంతో తన భార్యను ప్రశ్నించగా జరిగిన సంగతంతా తెలిపిందన్నాడు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు ప్రారంభించి, ఈ ఉదంతంతో సంబంధం ఉన్న ముగ్గురిని అరెస్టు చేశారు. వీరిలో శిశువును విక్రయించినవారు, కొనుగోలు చేసినవారు కూడా ఉన్నారు. కేసు దర్యాప్తులో ఉంది. ఇది కూడా చదవండి: హనీమూన్లో భర్తకు షాక్.. సినిమా మధ్యలో భార్య పరార్! -
షాప్లో వృద్ధుడి నుంచి రూ.లక్ష దోచుకెళ్లిన కేటుగాళ్లు.. వీడియో వైరల్..
ఢిల్లీ: దేశ రాజధానిలో దొంగలు రెచ్చిపోతున్నారు. పట్టపగలే నడిరోడ్డుపై కేటుగాళ్లు విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడుతున్నారు. ప్రజలను మభ్యపెట్టి, ఏమార్చి అందినకాడికి దోచుకుంటున్నారు. ప్రగతి మైదాన్ టన్నెల్లో కారును అడ్డగించి రూ.2 లక్షలను ఎత్తుకుపోయిన ఉదంతం మరవకముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. తన దుకాణం ముందే ఓ వృద్ధుడిని గన్తో బెదిరించి రూ.లక్ష దోచుకెళ్లారు. ఢిల్లీలోని విహార్ హర్ష ప్రాంతంలో ఓ షాప్ ఓనర్(70) రాత్రి 9 గంటల సమయంలో ఇంటికి వెళ్లడానికి దుకాణాన్ని మూసేశారు. షాప్లో ఆ రోజు వచ్చిన లక్ష రూపాయల కలెక్షన్ను బ్యాగులో పెట్టుకుని చేతిలో పట్టుకున్నారు. షాప్ ముందే బైక్ మీద కూర్చున్న అతనిపై ఇద్దరు దొంగలు గన్తో బెదిరించి దాడి చేశారు. బ్యాగు లాక్కుని అక్కడి నుంచి పారిపోయారు. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. Video: 70-Year-Old Delhi Man Robbed Of ₹ 1 Lakh At Gunpoint https://t.co/FAi8GKfL0P pic.twitter.com/2EIPqvClY5 — NDTV (@ndtv) June 27, 2023 ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. దోషులకు కఠిన శిక్షలు విధిస్తామని తెలిపారు. ఇదీ చదవండి: దొంగలకు ఊహించని అనుభవం.. పైసలు దొరక్క.. తిరిగి రూ. 100 చేతిలో పెట్టి -
ఈ దీవుల్లో హాయిగా ఉండండి.. రూ. 70 లక్షల అందుకోండి!
ఎవరైనా మీకు ఉచితంగా వసతి సదుపాయం కల్పిస్తూ, వ్యాపారం చేసుకునేందుకు భారీ మొత్తంలో సొమ్ము ఇస్తామంటే కాదంటారా? నిజంగా ఇటువంటి అవకాశం ఎక్కడైనా ఉంటుందా అని ఆలోచిస్తున్నారా? అవును మీరు విన్నది నిజమే. అటువంటి అద్భుత అవకాశం ఇప్పుడు మీ ముందు ఉంది. ఐర్లాండ్ ప్రభుత్వం అక్కడి ప్రజలకు సుదూరతీరంలో ఉన్న ఐలాండ్లలో నివసించేందుకు అద్భుత అవకాశం కల్పిస్తోంది. అక్కడి నివసించేందుకు ఆసక్తి చూపేవారికి భారీ మొత్తంలో సొమ్ము అందిస్తోంది. జూలై 1 నుంచి జనాభా అధికంగా ఉన్న ప్రాంతాలను వీడి రిమోట్ ఐలాండ్లో ఉండాలనుకునేవారికి రూ. 70 లక్షల రూపాయలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. రద్దీ ప్రాంతాలను వీడి గ్రామీణ ప్రాంతాలలో నివాసం ఉండాలనుకునేవారికి ఇది నిజంగా బంపర్ ఆఫర్. ఐర్లాండ్ ప్రభుత్వం ప్రకటించిన ఈ పథకానికి ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఈ ఫథకానికి ఐర్లాండ్ ప్రభుత్వం ‘అవర్ లివింగ్ ఐలాండ్ పాలసీ’ అని పేరు పెట్టింది. మెట్రో యూకే రిపోర్టును అనుసరించి ఇప్పటి వరకూ మొత్తం 23 ఐలాండ్లను ఇందుకోసం సెలెక్ట్ చేశారు. ఆయా ఐలాండ్లలో ఉండేందుకు జనం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఐలాండ్లు రద్దీ ప్రాంతాలకు దూరంగా కొండలు, నదులు, అడవుల మధ్య ఉన్నాయి. ఇక్కడ ఉండేవారి కోసం ప్రభుత్వం ఇళ్లు, భూములు ఇవ్వడంతోపాటు వ్యవసాయం లేదా వ్యాపారం చేసుకునేందుకు లక్షల రూపాయలు అందజేస్తోంది. ప్రభుత్వ ఉద్దేశ్యం ఏమిటంటే.. నిజానికి గ్రామీణ ప్రాంతాల్లోని వారు వివిధ కారణాలతో పట్టణాలకు వలస వెళుతున్నారు. ఫలితంగా గ్రామాలు ఖాళీ అవుతున్నాయి. అక్కడి ఇళ్లు, రోడ్లు వృథాగా మిగులుతున్నాయి. ఇటువంటి పరిస్థితులను నివారించేందుకు ప్రభుత్వం ఈ ఆఫర్ అందజేస్తోంది. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని ఐలాండ్లకు వెళ్లేందుకు సుముఖత చూపిస్తారని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకునేవారు కొన్ని నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. 1993కు ముందు నిర్మించిన ప్రాపర్టీ కొనుగోలు చేయాల్సివుంటుంది. ప్రభుత్వం అందించే సొమ్మును ఇంటి నిర్మాణం లేదా రెనోవేషన్ కోసం మాత్రమే వినియోగించాలి. ప్రతీ ఐలాండ్లో నివసించేందుకు ప్రత్యేక నిబంధనలున్నాయి. వాటిని అక్కడ ఉండాలనుకునేవారు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. కొన్ని ఐలాండ్లలో నివసించేందుకు విదేశీయులకు ఏమాత్రం అనుమతి లేదు. కాగా ఈ విధానం ప్రస్తుతం ఐర్లాండ్ ప్రభుత్వం మాత్రమే అమలు చేయడం లేదు. పలు అభివృద్ధి చెందిన దేశాలు ఇటువంటి అద్భుత ఆఫర్లను అందిస్తున్నాయి. ఈ జాబితాలో స్పెయిన్, ఇటలీ, చిలీ, మారిషస్, గ్రీస్, క్రొయేషియా మొదలైన దేశాలున్నాయి. ఈ దేశాలు శివారు ప్రాంతాల్లో ఉండేందుకు ఇష్టపడేవారికి వ్యాపారం చేసుకునేందుకు ఆర్థిక మద్దతు అందిస్తున్నాయి. ఇది కూడా చదవండి: బంగారు నగరంలో చీకటి సామ్రాజ్యం..
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
తప్పక చదవండి
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement