breaking news
Runa
-
మాఫికి టోపి
కలగా మిగిలిన చేనేత రుణమాఫీ ∙ఏళ్లు గడుస్తున్నా నెరవేరని హామీ జిల్లాలో మాఫీ కావాల్సిన రుణాలు రూ.4.75 కోట్లు రూ.110 కోట్లు విడుదల చేశామంటూ ప్రభుత్వం ప్రకటనలు నయాపైసా కూడా మాఫీ కాని వైనం పిఠాపురం : చేనేత రుణమాఫీ చేస్తామంటూ ఎన్నికల వేళ చంద్రబాబు ఇచ్చిన హామీ.. రెండున్నరేళ్లు గడిచినా నెరవేరకపోవడంతో.. తాము నట్టేట మునిగామని నేతన్నలు వాపోతున్నారు. చేనేత రుణమాఫీకి రూ.110 కోట్లు విడుదల చేశామని ప్రభుత్వం ప్రకటించి ఏళ్లు గడుస్తున్నా. మాఫీ కాక, చేసిన అప్పులు తీరక నేతన్నలు ఆందోళనకు గురవుతున్నారు. మాఫీ పేరుతో ప్రభుత్వం తమ నెత్తిన టోపీ పెట్టినట్టుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 50 చేనేత సహకార సంఘాలు ఉన్నాయి. వీటి పరిధిలో 17,062 చేనేత మగ్గాలున్నాయి. 45 వేలకు పైగా నేత కార్మికుల కుటుంబాలున్నాయి. సుమారు 2 లక్షల మంది కార్మికులు చేనేతపై ఆ«ధారపడి జీవిస్తున్నారు. వీరుకాక సంఘాల్లో లేకుండా మరో 30 వేల మంది నేత కార్మికులున్నారు. చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యాన వివిధ బ్యాంకుల ద్వారా 2,177 మంది నేత కార్మికులు రూ.5.6 కోట్లకు పైగా వ్యక్తిగత, సంఘాల రుణాలు తీసుకున్నారు. వీటిలో 2,017 మందికి రూ.4,17,49,326 వ్యక్తిగత రుణాలు, 160 మందికి రూ.22,24,918 మేర గ్రూపు కార్మికుల వ్యక్తిగత రుణాలు, 52 పవర్లూమ్స్కు సంబంధించి రూ.59,66,479 రుణాలు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా రూ.4.75 కోట్ల మేర చేనేత రుణమాఫీ చేయాలని చేనేత, జౌళి శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదికలు పంపించారు. నెలలు గడుస్తున్నా ఒక్క పైసా కూడా మాఫీ జరగలేదని నేతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖాతాలో డబ్బు పడితే ఖతం మరోపక్క రుణాలు తీసుకున్న నేత కార్మికులు కొత్త సమస్యను ఎదుర్కొంటున్నారు. వారి బ్యాంకు ఖాతాల్లో ఎవరు డబ్బులు వేసినా వెంటనే సంబంధిత బ్యాంకు సిబ్బంది ఆయా కార్మికుల అప్పులకు సంబంధించిన వడ్డీల కింద ఆ మొత్తాన్ని జమ చేసుకుంటున్నారు. కొందరు కార్మికుల పిల్లలు ఇతర ప్రాంతాల్లో ఉపాధికి వెళ్లి అక్కడ నుంచి తల్లిదండ్రుల ఖాతాలకు డబ్బు పంపుతున్నారు. ఆ మొత్తాన్ని బ్యాంకులు వడ్డీగా జమ చేసుకోవడంతో పలువురు తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు. చివరకు గ్యాస్ సబ్సిడీ వచ్చినా కూడా వడ్డీ కింద జమ చేసుకుంటున్నారని నేత కార్మికులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం రుణమాఫీ చేయకపోవడంతో బ్యాంకుల ఒత్తిడి ఎక్కువైందని అంటున్నారు. -
లక్షన్నర చేస్తామని చెప్పాం, ఆ విధంగా మాఫీ చేశాం
-
రూనా నవ్వింది!
మూడేళ్ల రూనా నవ్వింది... కానీ, ఆ నవ్వు కోసం కన్నపేగు ఎంతగా కన్నీరుకార్చిందో... డాక్టర్లు ఎన్ని శస్త్రచికిత్స చేశారో తెలిస్తే మీరు కూడా ఆ నవ్వు ఎంత విలువైందో అర్ధం చేసుకుంటారు. త్రిపురకు చెందిన అబ్దుల్లా రెహమన్, ఫాతిమాల గారాలపట్టి రూనా... తను అందరిలాంటి అమ్మాయి కాదు... పుట్టుకతోనే మృత్యవుతో పోరాటం చేసింది... పే...ద్ద తలతో పుట్టి అరుదైన వ్యాధితో మంచమెక్కింది. తమ బిడ్డ ప్రాణాల కోసం ఆ తల్లిదండ్రులు తిరగని ఆసుపత్రి లేదు. చివరకు గతేడాది రూనాను ఢిల్లీ సమీపంలోని గుర్గావ్ వద్ద ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడి డాక్టర్లు పరీక్షించి రూనా హైడ్రోసెఫలాస్తో (మొదడులో నీరు చేరడం) బాధపడుతున్నట్లు తేల్చారు. మామూలుగా కంటే మూడు రెట్లు పెద్దదైన తలతో రూనా ఉన్నట్లు గుర్తించారు. ఇంకా కొన్ని రోజులు మాత్రమే రూనా బతకగలదన్నారు. గత ఏడాది ఏప్రిల్ నుంచి 105 రోజులు ఆసుపత్రిలోనే గడిపిన రూనాకు డాక్టర్లు వందలకొద్ది శస్త్రచికిత్సలు చేశారు. అయినా ఏం లాభం లేదంటూ అదే ఏడాది ఆగస్టులో ఆమెను డి శ్చార్జ్ చేసి ఇంటికి పంపారు. తర్వాత డిసెంబర్లో మరోసారి ఆమెకు సర్జరీ చేసి 37 ఇంచులున్న రూనా తలను 23 ఇంచులకు తగ్గించారు. బతికే ఛాన్సు మాత్రం తక్కేవనంటూ తల్లిదండ్రులను హెచ్చరిం చారు. కానీ, దేవుడు దయ తలిచా డు. రూనా తల్లిదండ్రుల వే దనను అర్ధం చేసుకున్నాడు. ఇప్పుడు రూ నా బతుకుతోంది. కాదుకాదు.. జీవిస్తుంది. అమ్మ ఒడిలో హాయి గా నవ్వుతూ.. గోరుముద్దలు కూడా తింటోంది. డాక్టర్లు చేతులెత్తేసినా తన బిడ్డ ఇప్పుడు ఆరోగ్యంగా ఉండడం ఫాతిమాకు ఎనలేని సంతోషాన్నిస్తుంది. చుట్టుపక్కల వాళ్లు రూనా అంటే నవ్వుతూ తన బిడ్డ బదులిస్తుందంటూ ఫాతిమా ఆనందంగా చెబుతోంది. ఏదో ఒకరోజు తను కూతురు కూడా అందరిలా స్కూల్కు కూడా వెళుతుందని రూనా తండ్రి అబ్దులా నమ్మకంగా చెబతున్నాడు. ఇక డాక్టర్లు వైద్యచరిత్రలో రూనా ఒక అద్భుతం అంటూ తెగపొగిడేస్తున్నారు.