breaking news
Rs.1.50 lakhs
-
రూ.1.50 లక్షల విలువైన కలప పట్టివేత
ములుగు : అక్రమంగా తరలిస్తున్న సుమారు రూ.1.50 లక్షల విలువైన టేకు కలపను పోలీసులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై మల్లేశ్యాదవ్ ఉదయం డీఎల్ఆర్ ఫంక్షన్ హాల్ సమీపంలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా జంగాలపల్లి వైపు నుంచి వస్తున్న బొలోరో వాహనం ఆనుమానాస్పదంగా కనిపించింది. వాహనాన్ని ఆపి పరిశీలించగా అందులో 19 టేకు దుంగలు ఉన్నాయి. దీంతో వాహనాన్ని స్టేషన్కు తరలించారు. అందులో ఉన్న నర్సంపేటకు చెందిన దారుగుల సూర్యనారాయణ, గాదె రాజేశ్, మండలంలోని మదనపల్లికి చెందిన జాటోతు ధరమ్సింగ్లపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చనున్నట్లు ఎస్సై తెలిపారు. పెట్రోలింగ్లో కానిస్టేబుళ్లు సునిల్, శ్రీనివాస్, వాసు పాల్గొన్నారు. -
ఇంట్లో చోరీ
పాలకొల్లు అర్బన్ : పాలకొల్లు – భీమవరం రోడ్డులోని పూలపల్లి ఎస్బీఐకు సమీపంలోని ఓ ఇంట్లో గురువారం వేకుజామున చోరీ జరిగింది. వివరాలిలా ఉన్నాయి.. బుచ్చిరాజు రవి అనే వ్యక్తి ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు బీరువా పగలగొట్టి పదిహేనున్నర కాసుల బంగారు ఆభరణాలను అపహరించుకుపోయారు. వీటి విలువ సుమారు రూ.1.50 లక్షలు ఉంటుందని బాధితులు తెలిపారు. సీఐ కోలా రజనీకుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పట్టణ ఎస్సై కె.రామకృష్ణ తెలిపారు.