గుడిసెలు దగ్దం: 15 లక్షల ఆస్తి నష్టం
మచిలీపట్నం : కృష్ణాజిల్లా అవనిగడ్డ మండలం సింహ్రది నగర్లో 15 గుడిసెలు శనివారం అగ్నికి ఆహుతి అయ్యాయి. దాంతో గుడిసె వాసులంతా నిరాశ్రయులయ్యారు. దాదాపు రూ. 15 లక్షల మేర ఆస్తి నష్టం జరిగిందని బాధితులు వెల్లడించారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని బాధితులు పోలీసులకు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.