breaking news
RPF jawans
-
CPR-Viral Video: నోటితో ఊపిరి అందించి భర్త ప్రాణాలు కాపాడిన భార్య
లక్నో: గుండెపోటుతో ఆచేతన స్థితిలోకి వెళ్లిన భర్తకు నోటితో ఊపిరి ఊది ప్రాణం పోసింది ఓ భార్య. ఈ సంఘటన ఉత్తర్ప్రదేశ్లోని మథురా నగరంలో జరిగింది. రైలులో ప్రయాణం చేస్తుండగా ఓ వ్యక్తికి గుండపోటు వచ్చింది. మథురా స్టేషన్కు ట్రైన్ వచ్చి ఆగిన వెంటనే బాధితుడిని ప్లాట్ఫామ్పైకి తీసుకొచ్చారు. అయితే, అప్పటికే బాధితుడు ఊపిరి తీసుకునేందుకు ఇబ్బంది పడుతున్నాడు. సమాచారం అందుకున్న ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ అశోక్ కుమార్ హుటాహుటిన అక్కడికి చేరుకున్నాడు. బాధితుడి పరిస్థితిని గమనించి.. నోటితో ఊపిరి అందించటం (సీపీఆర్) చేయాలని అతడి భార్యకు సూచించారు. సుమారు 33 సెకన్ల పాటు భార్య ఊపిరి అందించటంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు ఆమె భర్త. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. మథురా రైల్వే స్టేషన్లో బాధితుడు కేశవన్తో అతడి భార్య దయా, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ నిజామొద్దిన్ నుంచి కోజికోడ్ వెళ్తుండగా.. కేరళలోని కాసరగోడ్కు చెందిన బాధితుడు కేశవన్(67) తన భార్య దయాతో కలిసి రెండు వారాల క్రితం ఉత్తరాఖండ్లోని చార్ ధామ్ యాత్రకు వెళ్లారు. వారితో మొత్తం 80 మంది బృందం వెళ్లింది. తిరుగు ప్రయాణంలో.. కోయంబత్తూర్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో ఢిల్లీ నుంచి కోజికోడ్ వెళ్తున్నారు భార్యాభర్తలు. బీ4 కోచ్ 67-68 సీట్లలో ప్రయాణం చేస్తున్న కేశవన్.. కొద్ది దూరం వెళ్లగానే అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో మథురా స్టేషన్లో దించి ఆర్పీఎఫ్ సిబ్బందికి సమాచారం అందించారు. బాధితుడు కేశవన్ ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నిస్తున్న కానిస్టేబుల్ ఆసుపత్రికి తరలింపు.. ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ అశోక్ కుమార్, నీరంజన్ సింగ్లు కంట్రోల్ రూమ్కు సమాచారం అందించి అంబులెన్స్ను పంపాలను సూచించారు. సీపీఆర్ చేసిన తర్వాత అంబులెన్స్లో రైల్వే ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రైవేటు ఆసుపత్రికి తరలించాలని అక్కడి వైద్యులు తెలిపారు. గుండె, ఊపరితిత్తులకు సంబంధించిన చికిత్స పొందుతున్నట్లు డాక్టర్ దిలీప్ కుమార్ కౌశిక్ తెలిపారు. సీపీఆర్ చేసేలా ప్రోత్సహించిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్కు కృతజ్ఞతలు తెలిపారు కేశవన్ భార్య దయా. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు కేశవన్ ఇదీ చదవండి: వైరల్ వీడియో: చలనం లేని బిడ్డకు ఊపిరి ఊది ప్రాణం పోసిన డాక్టరమ్మ 30 सेकेंड में पत्नी ने मौत के मुंह से खीच लाई जान, CPR देकर पति को बचाया, मौत भी इस महिला के सामने हार गई #CPR #Health #ViralVideo pic.twitter.com/rzqwsZCqCr — Zee News (@ZeeNews) October 2, 2022 -
రైల్వేపోలీసులు ఈవ్ టీజర్మ మధ్య ఘర్షణ
-
జవాన్లనుంచీ లంచం డిమాండ్.. రేప్ బాధిత అరెస్ట్...
థానెః ఆర్పీఎఫ్ జవాన్లు తనపై ఆఘాయిత్యానికి పాల్పడ్డారంటూ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ.. డబ్బుకోసం కక్కుర్దిపడి అడ్డంగా బుక్కైంది. నిందితులైన జవాన్లనుంచి లంచం డిమాండ్ చేస్తూ పోలీసులకు చిక్కింది. నలుగురు ఆర్పీఎఫ్ జవాన్లు తనపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ దివాకు చెందిన మహిళ గతవారం పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కేసు విచారణలో ఉండగానే సదరు బాధితురాలు.. కేసును వెనక్కు తీసుకునేందుకు నిందితులతో బేరసారాలకు దిగింది. అందులో భాగంగా నిందితుల్లోని ఓ జవాన్ ను.. మధ్యవర్తితోపాటు చాటుగా ఓ హోటల్ లో కలసి లంచం డిమాండ్ చేస్తూ పోలీసులకు చిక్కడంతో కథ అడ్డం తిరిగింది. రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ప్రదీప్ సింగ్ (57) వద్ద 90,000 లంచం తీసుకునేందుకు సిద్ధపడిన బాధిత మహిళ పోలీసుల కంటపడింది. స్థానిక దొంబివిలి లోని ద్వారకా హోటల్లో నిందితురాలు జవాన్లతో జరిపిన సంభాషణ రికార్డు చేసినట్లు పోలీస్ పీఆర్వో సుఖద నర్కర్ తెలిపారు. అనంతరం మహిళను అరెస్టు చేశామని, ఆమె జవాన్ల నుంచీ 1,11,000 రూపాయలు డిమాండ్ చేసిందని, ఈ వ్యవహారంలో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ తో బేరం కుదిర్చేందుకు మధ్యవర్తులుగా మోహన్ బిట్లా అనే వ్యక్తితోపాటు, స్థానికంగా పేరొందిన ఓ పత్రికలో పనిచేసే విలేకరి కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మహిళతో సహా బిట్లాను కూడా అరెస్ట్ చేసినట్లు పోలీసులు వివరించారు. దివాకు చెందిన నిందితురాలు దొంబివిలిలోని ఓ బొటిక్ లో పనిచేస్తోంది. సెంట్రల్ రైల్వేకు చెందిన నలుగురు ఆర్పీఎఫ్ జవాన్లు తనపై ఆత్యాచారానికి పాల్పడినట్లు ఆమె గతవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. జవాన్లపై ఐపీసీ 376-డి, 326 ఆర్/డబ్ల్యూ 34 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.