breaking news
Routhu surya prakasha rao
-
సంతకాలు చేస్తే అనర్హత వేటు : బొత్స హెచ్చరిక
హైదరాబాద్: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి పోటీపై అసెంబ్లీ ఇన్నర్ లాబీలో ఆసక్తికర సంభాషణలు జరుగుతున్నాయి. రెబెల్ అభ్యర్థి నామినేషన్ పత్రాలపై సంతకాలు ఎందుకు చేశావని ఎంఎల్ఏ రౌతు సూర్యప్రకాష్ను పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అడిగారు. సంతకాలు చేస్తే మీరే ఇబ్బందుల పాలవుతారని, అనర్హత వేటు పడుతుందని హెచ్చరించారు. పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగా రెబెల్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడానికి సరిపడా శాసనసభ్యుల సంతకాలు సేకరించినట్లు మాజీ మంత్రి జెసి దివాకర రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ హైకమాండ్ ఖరారు చేసే అభ్యర్థిని బట్టి తమ వ్యూహాన్ని రూపొందించుకుంటామన్నారు. జేసీ అడిగారు అందుకే సంతకం చేశానని కాంగ్రెస్ ఎంఎల్ఏ బండారు సత్యానందరావు చెప్పారు. తమ జిల్లా ఎంఎల్ఏలు 11 మందిసంతకాలు చేశారని, ఏం జరుగుతుందో చూద్దామని బండారు అన్నారు. దీంతో రాజ్యసభ అభ్యర్థి ఎంపికపై సీమాంధ్ర కాంగ్రెస్లో వివాదం రాజుకుంటున్నయింది. -
వైఎస్సార్ కాంగ్రెస్ నిర్ణం అభినందనీయం: కాంగ్రెస్ ఎమ్మెల్యే రౌతు
సమైక్యాంధ్ర కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం అభినందనీయమని కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు అన్నారు. పార్టీలన్నీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బాటలోనే నడిస్తే రాష్ట్రం ముక్కలు కాదని ఆయన స్పష్టం చేశారు. కాగా, కృష్ణాజిల్లా హనుమాన్ జంక్షన్లో సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు డాక్టర్ రామచంద్రరావు ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 26వ రోజుకు చేరాయి. అలాగే, సమైక్యాంధ్రకు మద్దతుగా నూజివీడులో మాజీ ఎమ్మెల్యే మేకా ప్రతాప్ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు 14వ రోజుకు చేరాయి.