-
Lok sabha elections 2024: బీజేపీలో చేరిన రోహన్ గుప్తా
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ మాజీ అధికార ప్రతినిధి రోహన్ గుప్తా బీజేపీలో చేరారు. గురువారం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డేల సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. ఐఏఎస్ మాజీ అధికారి పరంపల్ కౌర్, ఆమె భర్త, శిరోమణి అకాలీదళ్ సీనియర్ నేత సికందర్ బీజేపీలో చేరారు. జాతీయవాదం, సనాతన ధర్మం వంటి అంశాలపై సంప్రదాయ వైఖరి నుంచి వైదొలిగిన కాంగ్రెస్ పార్టీ విశ్వసనీయతను కోల్పోయిందని గుప్తా పేర్కొన్నారు. -
సాధారణ వ్యక్తి ప్రేమలో 'పూజా హెగ్డే'.. ఫోటోలు వైరల్
రెండేళ్ల క్రితం వరుస సినిమాలతో అలరించిన హీరోయిన్ పూజా హెగ్డే (33).. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో అగ్ర హీరోలతో నటించి మెప్పించిన ఈ పొడుగు కాళ్ల సుందరి ఇప్పుడు మరోసారి సినిమాలతో బిజీ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఫస్ట్ టైం తన బాయ్ ఫ్రెండ్తో కెమెరా కంటికి చిక్కింది ఈ బ్యూటీ. గతేడాది, పూజా హెగ్డే ఒక క్రికెటర్తో డేటింగ్లో ఉందని, త్వరలో అతనితో పెళ్లి చేసుకోనుందని ఊహాగానాలు వచ్చాయి. కొంత కాలం తర్వాత ఆ ఊహాగానాలు కేవలం పుకార్లు మాత్రమే అని తేలింది. దీంతో ఆమె అభిమానులకు ఉపశమనం కలిగింది. అయితే, పూజా హెగ్డే రొమాంటిక్ లైఫ్ గురించి ఇప్పుడు తాజాగా మళ్లీ పుకార్లు వ్యాపించాయి. సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న ప్రకారం.. బాలీవుడ్ నటుడు రోహన్ మెహ్రాతో (33) ఆమె డేటింగ్ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వారిద్దరూ కలిసి కారులో ప్రయాణిస్తున్న దృశ్యాలతో పాటుగా ముంబైలోని హోటల్లు, రెస్టారెంట్లకు తరచూ వెళ్లడం కనిపించిందని చెబుతున్నారు. రోహన్ మెహ్రా కూడా ఇది వరకే స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 2 ఫేమ్ 'తారా సుతారియా'తో రిలేషన్షిప్లో ఉన్నట్లు తెలిసింది. అయినప్పటికీ వారిద్దరూ విడిపోయినట్లు తెలుస్తోంది. అతను ఇప్పుడు పూజా హెగ్డేతో ప్రేమాయణం సాగిస్తున్నాడని ఆరోపించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వార్త పూజా హెగ్డేను అభిమానించే వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఎవరీ రోహన్ మెహ్రా ఉత్తరాంచల్కు చెందిన రోహన్ మెహ్రా ఇంకా బాలీవుడ్లో చెప్పుకోదగిన సినిమాల్లో నటించలేదు. అతని నటించిన రెండు సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి. కానీ 200 కంటే ఎక్కువ టీవీ వాణిజ్య ప్రకటనలతో పాటు ప్రింట్ యాడ్స్ చేశాడు. హిందీ బిగ్ బాస్ 10వ సీజన్లో సెలబ్రిటీ కంటెస్టెంట్గా ప్రవేశించిన రోహన్ 5వ స్థానంలో నిలిచాడు. ఆయన ఎక్కువగా టీవీ షోల వరకే పరిమితం అయ్యాడు. అలా బాలీవుడ్లో మంచి గుర్తింపు పొందాడు. అంతటి సాధారణ వ్యక్తిని పూజా హెగ్డే ప్రేమించడం జరగదని ఆమె అభిమానులు తెలుపుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై పూజా హెగ్డే స్పందించలేదు. మరి అతను నిజంగానే బుట్టబొమ్మ బాయ్ ఫ్రెండా? లేక వారిద్దరూ జస్ట్ ఫ్రెండ్సా అనేది పూజా రివీల్ చేస్తే కానీ ఎవరికీ తెలియదు. సల్మాన్తో రిలేషన్.. అప్పుడు పూజా రియాక్షన్ ఇదే బాలీవుడ్ బడా హీరో సల్మాన్ఖాన్తో పూజా హెగ్డే ప్రేమలో ఉందంటూ ఎన్నో వార్తలు వచ్చాయి.. వాటిపై గతేడాది ఆమె ఇలా రియాక్ట్ అయింది. 'నా గురించి తరచూ ఎన్నో వార్తలు వస్తుంటాయి. వాటన్నింటినీ నేను చదువుతూనే ఉంటాను. వాటిని పెద్దగా పట్టించుకోను. ప్రస్తుతానికి నేను సింగిల్నే. నాకు సింగిల్గా ఉండటమే ఇష్టం. అలాగే, నా ఫోకస్ మొత్తం సినిమాలపైనే ఉంది. వేర్వేరు భాషల్లో మరెన్నో చిత్రాల్లో నటించాలని ఉంది. అదే నా లక్ష్యం. ఇలాంటి వదంతులపై స్పందించే సమయం కూడా నాకు లేదు. ఎవరు ఏమనుకున్నా పట్టించుకోను.' అని ఆమె స్పష్టం చేశారు. #Poojahegde with her boy friend 💔pic.twitter.com/JhtUYaISm8 — Kolly Censor (@KollyCensor) March 31, 2024 -
యువ ఇంజనీర్ సక్సెస్ స్టోరీ: ఎప్పుడూ అవే పాటలా.. పాకెట్ ప్రపంచంలోకి
ప్రయాణంలో, తీరిక వేళల్లో ఎఫ్ఎంలో పాటలు వినడం సహజమే. ‘ఎప్పుడూ అవే పాటలు, అవే మాటలేనా’ అనుకుంటారు కొద్దిమంది. వారిలో రోహన్ నాయక్ ఒకరు. ఈ యువ ఇంజనీర్ తన స్నేహితులతో కలిసి బెంగళూరు కేంద్రంగా ప్రారంభించిన ‘పాకెట్ ఎఫ్ఎం’ వివిధ జానర్స్, వివిధ భాషలలో ఆకట్టుకునే ఆడియో సిరీస్లతో దూసుకుపోతుంది... కొన్నిసార్లు ఐడియాల కోసం వెదుక్కుంటూ వెళ్లనక్కర్లేకుండానే... అవే మనల్ని వెదుక్కుంటూ వస్తాయి. రోహన్ నాయక్ విషయంలోనూ అలాగే జరిగింది. ఇంటి నుంచి ఆఫీసుకు చేరుకోవడానికి చాలా టైమ్ పట్టేది. టైమ్పాస్ కోసం ఎఫ్ఎంలలో మ్యూజిక్ వినేవాడు. అయితే ఆ మ్యూజిక్ అదేపనిగా రిపీట్ కావడంతో బోర్గా ఉండేది. ‘భారతీయ భాషల్లో ఆడియో స్టోరీ టెల్లింగ్ ప్లాట్ఫామ్ ఉంటే బాగుండేది’ అనుకునేవాడు. ‘మనం కావాలనుకుంటున్నది కాలమే మన చేత చేయిస్తుంది’ అన్నట్లుగా ఆ ప్రయత్నానికి తానే శ్రీకారం చుట్టాడు రోహన్ నాయక్. ఐఐటీ–ఖరగ్పూర్ ఫ్రెండ్స్ ప్రతీక్ దీక్షిత్, నిశాంత్ కేఎస్లతో కలిసి ‘పాకెట్ ఎఫ్.ఎం’కు శ్రీకారం చుట్టాడు. మ్యూజిక్ కాకుండా ‘ఆడియో ఎంటర్టైన్మెంట్’ లక్ష్యంగా మొదలైన ఈ ఆడియో సిరీస్ ప్లాట్ఫామ్ అన్యూవలైజ్డ్ రెవెన్యూ రన్రేట్(ఏఆర్ఆర్)తో దూసుకుపోవడానికి ఎంతో కాలం పట్టలేదు. ‘ప్రస్తుతం శ్రోతలు సగటున రోజుకు వంద నిమిషాల సమయాన్ని వినడానికి వెచ్చిస్తున్నారు. మా యాప్ టోటల్ మంత్లీ ఆడియో స్ట్రీమింగ్లో ఎప్పటికప్పుడు వృద్ధి కనిపిస్తోంది’ అంటున్నాడు పాకెట్ ఎఫ్.ఎం. ఫౌండర్లలో ఒకరైన నిశాంత్. రొమాన్స్, హారర్, థ్రిల్లర్, ఫిక్షన్, సైన్స్ ఫిక్షన్...అనేవి పాకెట్ ఎఫ్.ఎం.లో టాప్ జానర్లుగా ఉన్నాయి. ఎపిసోడ్లు 10–15 నుంచి 25–30 నిమిషాల వరకు ఉంటాయి. ‘పాకెట్ ఎఫ్.ఎం’ ఆడియో సెగ్మెంట్ సిరీస్లో కొన్ని హిట్ టైటిల్స్... యే రిష్తా కైసా హై(400 మిలియన్), లవ్ కాంట్రాక్ట్(200 మిలియన్), యక్షిణీ (195 మిలియన్), షూర్వీర్(129 మిలియన్)...మొదలైనవి. ‘పాకెట్ఎఫ్ఎం’లో 733 ఆడియో సిరీస్లతో పాటు ఆడియో బుక్స్ కూడా ఉన్నాయి. గత అక్టోబర్లో ఆన్లైన్ రీడింగ్ ప్లాట్ఫామ్ ‘పాకెట్ నావెల్’కు శ్రీకారం చుట్టారు. ఇక శ్రోతల విషయానికి వస్తే 15 నుంచి 35 ఏళ్ల లోపు ఉన్నవారు ఎక్కువగా ఉన్నారు. బెంగళూరు, ముంబై, దిల్లీ, పుణె, హైదరాబాద్లు టాప్ 5 సిటీస్గా ఉన్నాయి. మరోవైపు చిన్న పట్టణాలలో కూడా ‘పాకెట్ఎఫ్ఎం’ పాపులర్ అవుతుంది. లాంగ్ ఫార్మట్ ఆడియో ఎంటర్టైన్మెంట్ సిరీస్ ద్వారా ఒటీటీ స్పేస్ను పునర్నిర్వచించే ప్రయత్నం చేస్తున్న ‘పాకెట్ ఎఫ్ఎం’ యాడ్–టెక్ ప్లాట్ఫామ్ ‘రియల్ టైమ్ యాడ్స్’ను తీసుకువచ్చింది. ‘పాకెట్ ఎఫ్ఎం విజయవంతం కావడంలో ఎఐ, ఎంఎల్ సాంకేతికత కీలక పాత్ర పోషించింది. శ్రోతల నాడి పసిగట్టడం, సంక్లిష్టమైన విషయాలను సరళం చేయడం, ఖర్చులు తగ్గించుకోవడం... ఇలా ఎన్నో విషయాల్లో సాంకేతికత ఉపయోగపడింది’ అంటున్నాడు కంపెనీ సీటీవో ప్రతీక్ దీక్షిత్. కంపెనీకి లైట్స్పీడ్, టెన్సెంట్, టైమ్స్ ఇంటర్నెట్లాంటి కీ ఇన్వెస్టర్లు ఉన్నారు. ఇప్పుడు పాకెట్ ఎఫ్.ఎం. యూఎస్ మార్కెట్లోకి కూడా విస్తరించే ప్రయత్నం చేస్తోంది. ‘టీమ్ మెంబర్స్కు అద్భుతమైన శక్తి,సామర్థ్యాలు, అంకితభావం ఉన్నాయి’ అంటున్నాడు టాంగ్లిన్ వెంచర్ పార్ట్నర్స్కు చెందిన సంకల్ప్ గుప్తా. పాకెట్ ఎఫ్.ఎం.ను ‘నెట్ఫ్లిక్స్ ఆఫ్ ఆడియో వోటీటీ ప్లాట్ఫామ్స్’ గా తీర్చిదిద్దాలనేది ముగ్గురు విజేతల లక్ష్యం. పాకెట్ ఎఫ్.ఎం. విజయవంతం కావడంలో ఎఐ, ఎంఎల్ సాంకేతికత కీలక పాత్ర పోషించింది. శ్రోతల నాడి పసిగట్టడం, సంక్లిష్టమైన విషయాలను సరళం చేయడం, ఖర్చులు తగ్గించుకోవడం... ఇలా ఎన్నో విషయాల్లో సాంకేతికత ఉపయోగపడింది. – ప్రతీక్ దీక్షిత్ -
టాప్ సింగర్స్ జంట.. విడాకుల బాట పట్టనుందా?
బాలీవుడ్ టాప్ సింగర్ లిస్ట్లో నేహా కక్కడ్ కూడా ఉంటుంది. ఆమె పాడిన ప్రతి పాట సూపర్ హిట్టే! తన గాత్రంతో తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ను ఏర్పాటు చేసుకుందీ సింగర్. అక్టోబర్ 24, 2020న బాలీవుడ్ సింగర్ రోహన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇండియన్ ఐడల్ సీజన్ 12 షోకు జడ్జీలుగా ఉన్న సమయంలో వీరద్దరి మధ్య ప్రేమ చిగురించిందని, ఆ తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నామని అప్పట్లోనే తెలిపారు. తాజాగా నేహా కక్కడ్ తన 35వ పుట్టినరోజు బాష్ వేడుకలను సెలబ్రేట్ చేసుకుంది. బర్త్డే పార్టీలో స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఫుల్ ఎంజాయ్ చేసింది. ఆ ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేసుకుంది. (ఇదీ చదవండి: ప్రభాస్పై సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నటి) తన తల్లిదండ్రులతో పాటు స్నేహితులతో కలిసి శాండ్విచ్లు తింటూ పోజులిచ్చిన ఫోటోలు మాత్రమే అక్కడ కనిపించాయి. కానీ ఏ ఫోటోలోనూ నేహా భర్త రోహన్ కనిపించలేదు. దీంతో అభిమానుల్లో సందేహాలు మొదలయ్యాయి. రోహన్ క్షేమంగానే ఉన్నాడా? అని ఒకరు అడిగితే, మీ ఇద్దరి మధ్య ఏమైనా విభేదాలు ఉన్నాయా? అని మరొకరు ప్రశ్నించారు. భర్త లేకుండా పార్టీలు చేసుకుందంటే గొడవలు ఉన్నట్లే కదా! అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కొసమెరుపు ఏమిటంటే.. ఈ విషయంపై నేహ కక్కడ్తో పాటు రోహన్ కూడా నోరు మెదపక పోవడంతో బాలీవుడ్లో మరో జంట కూడా విడాకుల బాట పడుతుందేమో అనే రూమర్స్ స్టార్ట్ అయ్యాయి. (ఇదీ చదవండి: తండ్రికి రెండో పెళ్లి చేస్తున్న బుల్లితెర నటి.. వధువుకు కూడా రెండోదే!) -
రన్నరప్ సిక్కి రెడ్డి జోడీ
Sikki Reddy: స్లొవేనియా ఓపెన్ ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నీ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో తెలంగాణ అమ్మాయి సిక్కి రెడ్డి రన్నరప్గా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో టాప్ సీడ్ సిక్కి రెడ్డి–రోహన్ కపూర్ (భారత్) జోడీ 12–21, 13–21తో మూడో సీడ్ జెస్పర్ టాఫ్ట్–క్లారా గావర్సన్ (డెన్మార్క్) ద్వయం చేతిలో ఓడిపోయింది. సెమీఫైనల్లో సిక్కి–రోహన్ 21–15, 21–19తో మాడ్స్ వెస్టర్గార్డ్–క్రిస్టిన్ బుష్ (డెన్మార్క్)లపై గెలిచారు. ఇది కూడా చదవండి: ‘డ్రా’తో గట్టెక్కిన భారత్ అడిలైడ్: ఆస్ట్రేలియా మహిళల జట్టుతో మూడు మ్యాచ్ల సిరీస్ ను భారత జట్టు ‘డ్రా’తో ముగించింది. తొలి రెండు మ్యాచ్ల్లో ఓడిపోయి సిరీస్ను కోల్పోయిన భార త్ ఆదివారం జరిగిన మూడో మ్యాచ్ను 1–1తో ‘డ్రా’ చేసుకుంది. మాడిసన్ బ్రూక్స్ (25వ ని. లో) చేసిన గోల్తో ఆస్ట్రేలియా 1–0తో ఆధిక్యంలోకి వెళ్లగా... దీప్ గ్రేస్ ఎక్కా (42వ ని.లో) గోల్తో భారత్ స్కోరును సమంచేసింది. ఈ మ్యాచ్తో భారత కెప్టెన్ సవితా పూనియా, డిఫెండర్ నిక్కీ ప్రధాన్ తమ కెరీర్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్మన్ గిల్కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement