breaking news
RK Naidu
-
‘ది 100’ మూవీ రివ్యూ
టైటిల్ : ది 100నటీనటులు: ఆర్కే సాగర్, మిషా నారంగ్, ధన్య బాలకృష్ణ, విష్ణు ప్రియ, తారక్ పొన్నప్ప తదితరులునిర్మాణ సంస్థలు : కెఆర్ఐఏ ఫిల్మ్ కార్ప్, ధమ్మ ప్రొడక్షన్స్నిర్మాతలు: రమేష్ కరుటూరి, వెంకీ పూశడపుకథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రాఘవ్ ఓంకార్ శశిధర్సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్విడుదల తేది : జులై 11, 2024‘మొగలి రేకులు’, ‘చక్రవాకం’ సీరియళ్లతో తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరైన నటుడు ఆర్కే సాగర్ అలియాస్ ఆర్కే నాయుడు. సీరియళ్లతో వచ్చిన ఫేమ్తో వెండితెర ఎంట్రీ ఇచ్చాడు. మాన్ అఫ్ ది మ్యాచ్, సిద్ధార్థ, షాది ముబారక్ సినిమాలలో హీరోగా నటించి, నటనపరంగా మంచి మార్కులే సంపాదించుకున్నాడు. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ ‘ది 100’ మూవీ(The 100 Movie Review)తో నేడు( జులై 11) ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.‘ది 100’ కథేంటంటే..విక్రాంత్(ఆర్కే సాగర్).. ఐపీఎస్ ట్రైనింగ్ పూర్తి చేసుకొని ఏసీపీగా బాధ్యతలు చేపట్టిన వెంటనే నగరంలో జరుగుతున్న రాబరీ గ్యాంగ్ హత్య కేసు టేకాప్ చేస్తాడు. అదే సమయంలో తను ఇష్టపడిన యువతి ఆర్తి(మిషా నారంగ్) కూడా వీరి బాధితురాలిగా మారినట్లు తెలుస్తుంది. దీంతో విక్రాంత్ ఈ కేసుని మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకొని.. తనదైన శైలీలో విచారించగా అతనికో సంచలన నిజం తెలుస్తుంది. అదేంటి? ఆ గ్యాంగ్ ఆర్తి(మిషా నారంగ్) ఫ్యామిలీనే ఎందుకు టార్గెట్ చేసింది? సాఫ్ట్వేర్ ఉద్యోగి మధు ( విష్ణు ప్రియ) ఆత్మహత్య వెనుక ఉన్న అసలు నిజం ఏంటి? వ్యాపారవేత్త వల్లభ(తారక్ పొన్నప్ప)తో ఈ కేసు ఉన్న సంబంధం ఏంటి? స్నేహితురాలు విద్యా(ధన్య బాలకృష్ణ) సహాయంతో విక్రాంత్ ఈ కేసుని ఎలా సాల్వ్ చేశాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే(The 100 Movie Review).ఎలా ఉందంటే..విలన్ ఒక క్రైమ్ చేయడం.. పోలీసు అధికారి అయిన హీరో అతన్ని పట్టుకోవడం.. మధ్యలో ఓ ట్విస్ట్, ప్లాష్ బ్యాక్ స్టోరీ.. క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ అన్ని దాదాపు ఇలానే ఉంటాయి. అయితే దీంట్లో క్రైమ్ జరిగిన తీరు.. దాని చుట్టు అల్లుకున్న మైండ్ గేమ్, హీరో ఎంత తెలివిగా విలన్ను పట్టుకున్నాడనే దానిపై సినిమా ఫలితం ఆధారపడి ఉంటుంది. ప్రేక్షకుడి ఊహించని ట్విస్టులు, కట్టుదిట్టమైన స్క్రీన్ప్లే, ఉత్కంఠ కలిగించే సన్నివేశాలతో కథనాన్ని నడిపించాలి. అప్పుడే ప్రేక్షకుడు చూపు తిప్పుకోకుండా కథలో లీనమవుతాడు. ఈ విషయంలో ‘ది 100’ (The 100 Movie Review)కొంతవరకు మాత్రమే సఫలం అయింది. దర్శకుడు రాఘవ్ ఓంకార్ శశిధర్ ఎంచుకున్న కాన్సెప్ట్ బాగున్నప్పటికీ తెరపై దాన్ని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయడంలో కాస్త తడబడ్డాడు. అమ్మాయి ఆత్మహత్య సీన్తో కథను ఆసక్తికరంగా ప్రారంభించాడు. ఆ తర్వాత ఐపీఎస్ అధికారి విక్రాంత్గా హీరో ఎంట్రీ సీన్ని చక్కగా ప్లాన్ చేశాడు. హీరో ఏసీపీగా బాధ్యతలు చేపట్టి రాబరీ గ్యాంగ్ కేసుని టేకాప్ చేసిన తర్వాత కథపై ఆసక్తి పెరుగుతుంది. రాబరీ గ్యాంగ్ని పట్టుకునేందుకు హీరో చేసే ప్రయత్నం.. ఈ క్రమంలో వచ్చే ఓ ట్విస్ట్.. కథనంపై మరింత ఆసక్తిని పెంచుతుంది. రాబరీ గ్యాంగ్ బంగారం మాత్రమే ఎందుకు ఎత్తుకెళ్తడం వెనుక ఉన్న రహస్యం ఏంటనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలుగుతుంది. అయిగే ఆ గ్యాంగ్ దొరికిన తర్వాత వచ్చే ట్విస్ట్ అదిరిపోతుంది. ఇక సెకండాఫ్ కాస్త ఎమోషనల్గా ప్రారంభం అవుతుంది. వ్యాపారవేత్త వల్లభ(తారక్ పొన్నప్ప) ఎంట్రీ తర్వాత కథనం మరో మలుపు తిరుగుతుంది. మధు ప్లాష్బ్యాక్ ఎమోనల్కి గురి చేస్తుంది. అయితే ట్విస్ట్ తెలిసిన తర్వాత కథనం స్లోగా, ఊహకందేలా సాగుతుంది. ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కూడా కొన్ని చోట్ల సినిమాటిక్గా అనిపిస్తుంది. క్లైమాక్స్లో మంచి సందేశం ఇచ్చారు.ఎవరెలా చేశారంటే..మొగలి రేకులు సీరియల్లో పోలీసు పాత్రలో నటించి ఫేమస్ అయిన ఆర్కే సాగర్.. ఈ చిత్రంలోనూ అదే పాత్రే పోషించి మెప్పించాడు. ఐపీఎస్ అధికారి విక్రాంత్ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. ఆయన మాట, నడక, మాట..ప్రతిదీ అచ్చం పోలీసు ఆఫీసర్లాగానే అనిపిస్తుంది. యాక్షన్ సీన్స్లో అదరగొట్టేశాడు. ఇక ఆర్తిగా మిషా నారంగ్ తనదైన నటనతో ఆకట్టుకుంది. ఎమోషనల్ సీన్లలో బాగా నటించింది. సాఫ్ట్వేర్ ఉద్యోగి మధుగా విష్ణు ప్రియ, హీరో స్నేహితురాలు విద్యాగా ధన్య బాలకృష్ణ చక్కగా నటించారు. సెకండాఫ్లో వీరిద్దరి పాత్రల నిడివి ఎక్కువగా ఉంటుంది. తారక్ పొన్నప్ప విలనిజం బాగా పండించాడు. గిరిధర్, ఆనంద్, లక్ష్మీ గోపాల స్వామి, కల్యాణి నటరాజన్తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. హర్షవర్ధన్ రామేశ్వర్ నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ అయింది. పాటలు అంతగా ఆకట్టుకోలేవు. శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ పనితీరు పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
ఆమె పాత్ర చూస్తే కన్నీళ్లు ఆగవు : ఆర్కే నాయుడు
‘‘మొగలి రేకులు’ సీరియల్లో నేను చేసిన ΄పోలీస్ క్యారెక్టర్ ఆర్కే నాయుడు మంచి పేరు తీసుకొచ్చింది. ఆ క్యారెక్టర్కి భిన్నమైన క్యారెక్టర్స్ చేయాలనే ఆలోచనతో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, సిద్ధార్థ, షాదీ ముబారక్’ వంటి సినిమాలు చేశాను. మళ్లీ ఒక పోలీస్ పాత్ర చేయాలంటే బలమైన కథ కుదరాలి. అలాంటి కథ ‘ది 100’(The 100 Movie)లో కుదిరింది. ప్రతి యుగంలో దీనులను కాపాడడానికి ఒక ఆయుధం పుడుతుంది. త్రేతాయుగంలో రామబాణం, ద్వాపరయుగంలో సుదర్శన చక్రం, కలియుగంలో ‘ది 100’. ఈ సినిమాకి అంత పవర్ ఉంది’’ హీరో ఆర్కే సాగర్ తెలిపారు. ఆర్కే సాగర్ హీరోగా నటించిన చిత్రం ‘ది 100 ’. రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మిషా నారంగ్ కథానాయికగా నటించగా, ధన్యా బాలకృష్ణ, విష్ణుప్రియ కీలక పాత్రలు పోషించారు. రమేశ్ కరుటూరి, వెంకీ పుషడపు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఆర్కే సాగర్ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘వెండితెరపై చాలా పోలీస్ క్యారెక్టర్స్ వచ్చాయి. కానీ ‘ది 100’ మాత్రం ప్రతి ΄ోలీస్ ఆఫీసర్ గర్వంగా ఫీల్ అయ్యేలా ఉంటుంది. నేను చేసిన విక్రాంత్ ఐపీఎస్ ΄ాత్రకి ఎంత ్ర΄ాధాన్యం ఉందో మిషా నారంగ్, ధన్యా బాలకృష్ణ, విష్ణు ప్రియ పాత్రలూ సినిమాలో కీలకంగా ఉంటాయి. ప్రత్యేకించి మిషా పాత్ర చూస్తే కన్నీళ్లు ఆగవు... ప్రేక్షకులు అంతలా కనెక్ట్ అవుతారు. రియల్ పోలీస్ ఆఫీసర్ చెప్పిన ఆలోచనతో ‘ది 100’ మొదలైంది. ఓసారి సుకుమార్గారికి ఈ పాయింట్ చెబితే, ఎగ్జైట్ అయ్యారు. ఆ తర్వాత రమేశ్, వెంకీగార్లు ఈ కథపై నమ్మకంతో నిర్మించారు. ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాతో రూ΄÷ందిన ఈ సినిమాని కుటుంబమంతా చూడాలి. ‘ది 100’కి సీక్వెల్ చేసే చాన్స్ ఉంది’’ అని చెప్పారు. -
‘రాజుగారి దొంగలు’ వచ్చేస్తున్నారు
లోహిత్ కల్యాణ్, రాజేష్ కుంచాడా, జోషిత్ రాజ్ కుమార్, కైలాష్ వేలాయుధన్, పూజా విశ్వేశ్వర్, టీవీ రామన్, ఆర్కే నాయుడు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా రాజు గారి దొంగలు. ఈ చిత్రాన్ని నడిమింటి లిఖిత సమర్పణలో హిటాసో ఫిలిం కంపెనీ బ్యానర్ పై నడిమింటి బంగారునాయుడు నిర్మిస్తున్నారు. దర్శకుడు లోకేష్ రనాల్ హిటాసో రూపొందిస్తున్నారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మార్చి 21న ప్రపంచం వ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా దర్శకుడు లోకేష్ రనాల్ హిటాసో మాట్లాడుతూ మంచి వైవిధ్యమైన కథతో సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుందని, ఈ నెల 21న మీ ముందుకు తీసుకొస్తున్నామని తెలుగు ప్రేక్షకులందరు ఆదరించాలని అన్నారు. -
ఆర్కే నాయుడు హీరోగా 'ద 100' సినిమా.. త్వరలో థియేటర్లలో రిలీజ్
'మొగలిరేకులు' సీరియల్లో ఆర్కే నాయుడు పాత్రలో నటించి చాలా ఫేమస్ అయిన నటుడు సాగర్.. హీరోగా మరో సినిమా రెడీ చేశాడు. గతంలో 'సిద్ధార్థ' చిత్రంతో టాలీవుడ్లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత 'షాదీ ముబారక్' సినిమా చేశాడు. ఇప్పుడు క్రేజీ యాక్షన్ మూవీతో రాబోతున్నాడు. 'ద 100' అనే డిఫరెంట్ టైటిల్ నిర్ణయించారు. అలానే పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్.. అవేంటో తెలుసా?) రాఘవ్ ఓంకార్ శశిధర్.. ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ మూవీలో విక్రాంత్ అనే ఐపీఎస్ అధికారిగా ఆర్కే సాగర్ కనిపించబోతున్నాడు. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్తో యాక్షన్ ఎంటర్టైనర్గా ఇది ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అర్జున్ రెడ్డి, యానిమల్ చిత్రాలతో ఆకట్టుకున్న హర్షవర్ధన్ రామేశ్వర్.. ఈ సినిమాకు సంగీతమందిస్తున్నారు. త్వరలో ఈ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన అవార్డు విన్నింగ్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) -
ఈ ‘సిద్ధార్థ’ చాలా పవర్ఫుల్
‘‘బుల్లితెర స్టార్గా పేరున్న ఆర్.కె. నాయుడు వెండితెరపైనా బాగా రాణిస్తాడు. ఈ ‘సిద్ధార్థ’ కథ చాలా పవర్ఫుల్. ఈ సినిమా అందరి కెరీర్నూ మలుపు తిప్పుతుంది’’ అని నిర్మాత దాసరి కిరణ్కుమార్ అన్నారు. ఆర్.కె. నాయుడు, సాక్షి చౌదరి, రాగిణీ నంద్వాని కాంబినేషన్లో దయానంద్రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సిద్ధార్థ’. శనివారం దాసరి కిరణ్ పుట్టినరోజు వేడుకను హైదరాబాద్లో యూనిట్ సభ్యులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ, మణిశర్మ, ఎస్.గోపాలరెడ్డి, లంకాల బుచ్చిరెడ్డి, విస్సు, బి. కాశీవిశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.